TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. క్షమ కవచంబు, ………… లేటికిన్.
జవాబు:
చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుందు,
మిత్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య
విత్త, ముచితలజ్జ భూషణముదాత్తకవిత్వము రాజ్యమీ క్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్.

భావము : క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

2. ఎన్న ……… నరుగుటయును.
జవాబు:
ఆ. ఎన్నఁ క్రొత్తులైన యిట్టి సంపదలు నా
కబ్బుటెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి
కర్థి నగుచు నేను నరుగుటయును.

భావము : ఆలోచించి చూస్తే ఈ నూతన సమస్త సంపదలూ, శ్రీహరి కృపాకటాక్షం వలనే నాకు ప్రాప్తించాయి. సంపద కోరుతూ కృష్ణుని వద్దకు నేనే వెళ్ళుట.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి ?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం- ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

ప్రశ్న 2.
అహింస ఆవస్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి ?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.

“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.

వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణిని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తిఅహింసకున్నది. రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గనికున్నది.

“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.

హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్త్రా లను అఘాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవస్యం కావలసిన నీతి.

III ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావిప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదామరణం.

సుఖదాః ఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపాఠవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.

అలంకరణ : బతుకమ్మను అలంకరించటమే ఒక కల. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూలు చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.

పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా లేదా తల్లి బతుక్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపం చేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుక్మను సాగనంపుతారు.

పాట – నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.

నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు

అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ `ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే ! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అదులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.

బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్ర నియమాలుండవు. అవి చతరస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.

స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మకగీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుంటుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.

“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో – గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో – వచ్చేరి సతిగూడి ఉయ్యాలో”

వారు పనిచేసే పనిలోని శ్రమను మరచిపోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. ఫనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్యనాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

ప్రశ్న 2.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డి పంట : ఎండుగడ్డి అంటిందే తడవుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. “మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉన్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లులు లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కిన పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని
వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు : ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చిటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

4. చుక్కతెగి పడ్డట్లు : ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్తాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు.

మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్కతెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామచక్కని చక్కదనం అంటే అందం. రాముని చక్కగా అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగపడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా !

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఫాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక నిదర్శంగా నిలుస్తుంది.

ఫాతిమా సుబానీ తల్లి, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది.

రాంరెండ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా! పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల పానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికి పానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది.

మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ – రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా ! ఒకలకు ఆపతొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.

సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అన్నది ఫాతిమా !
“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్లా తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.

అప్పుడు రాంరెడ్డి ఫాతిమా !” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా ! నీకు చేతులెత్తి మొక్కుత ! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.

ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.

“మర్దీ ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె ? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె ! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయతుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా !

ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ ఉంటుంది.

ప్రశ్న 2.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది.

తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత.

పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను. నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.”

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను.

నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి. ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 3.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం.

ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది. ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా! టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన.

ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడివెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా” “అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా… బద్మాష్ లుచ్చ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్….మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబాయాడు.

ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా ! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్ల నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ వడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు”ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను. నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది.

ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏడో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ||లు డోర్నక్అ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 4.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజాకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది.

అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో, ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్’ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది.

వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.
సందర్భము : మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.

ప్రశ్న 2.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము : ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.

ప్రశ్న 3.
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.
జవాబు:
కవి పరిచయం : భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము : తనను దర్శించడానికి వచ్చిన కుచేలుని చూసి అతిధి సత్కారాలు చేసి కుచేలునితో చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్న సందర్భంలోనిది.
వివరణ : కుచేలుని అదృష్టానికి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ కలిసి గురుకులవాసం చేసిన రోజులలోని విశేషాలను కొన్నింటిని శ్రీకృష్ణుడు గుర్తుచేసుకున్నాడు అని భావం.

ప్రశ్న 4.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం : శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన పద్యభాగం.
సందర్భము : క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము : భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

VI ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
కవిరాజుముర్తి దృక్పథాన్ని తెలపండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజుమూర్తి’ చే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. మూర్తిగారు నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో నివేదించటం జరిగింది. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ విశ్వాసం కోల్పోకుండా విప్లవాత్మక ధోరణిలో ఊతాన్నివ్వాలని చూశాడు. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజాన్ని కోరుకున్నాడు.

ఈ ‘మహైక’ కావ్యాన్ని చూసిన్పుడు ‘ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది’ అన్న బెల్లంకొండరామదాసు, రెంటాల గోపాల కృష్ణ మాటలను బట్టి కవి నూతన దృష్టి ఎంతటిదో మనకు అర్థమౌతుంది. ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు “సర్దార్జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి అభ్యుదయ విప్లవాత్మక దృక్పధాలు మనకు తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు ?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

ప్రశ్న 3.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు.

ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.

మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను.

ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ఘల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను; ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

ప్రశ్న 4.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు ?
జవాబు:
అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

VII ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి ?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది. బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీమూర్తిగా భావించి అర్చింటమే ! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులుగా వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్య జాతాయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి ?
జవాబు:
తెలంకాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నీకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా.! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది. పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 3.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి ?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన ‘వ్యాసగుళుచ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.

మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దూవానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు వలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్ధతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా”.
ఉదా :: లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్డిను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ గాను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను
ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

ప్రశ్న 4.
‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల దృష్టి తెలుపండి ?
జవాబు:
రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహింపబడింది. వీరు తన బలమును, ధనమును అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు. హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృస్యతా నివారణను పెద్ద దోషము గా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లలను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు. బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలందుకున్నారు.

VIII ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
నన్నయ గురించి తెలుపండి.
జవాబు:
‘నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు. నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు.

వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి’ అనిపించుకున్నాడు.

ప్రశ్న 2.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
‘భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 3.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లగు కావ్యం, సాంబశిం శతకం, నిరీక్షణము, అంబపాలి, సరవ్స్య దానము, విశ్వామిత్ర మొదలగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువార పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవాదాయలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

ప్రశ్న 4.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి ?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ. జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితుడయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్రమహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో, ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు.

మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

IX ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి.
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.

ప్రశ్న 2.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి ?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 3.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి ?
జవాబు:
మంచి మాటలు

ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు ?
జవాబు:
ద్రోణుడు.

ప్రశ్న 5.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి ?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.

ప్రశ్న 6.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు ?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు..

ప్రశ్న 7.
‘మిత్ర ధర్మం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమధాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 8.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది ?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.

X ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 2.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి ?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

ప్రశ్న 3.
సోమన గురువులెవరు ?
జవాబు:
సోమనకు నలుగురు గురువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 4.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది ?
జవాబు:
జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’ గా మారింది.

ప్రశ్న 5.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు ?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

ప్రశ్న 6.
స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపిందెవరు ?
జవాబు:
కీ॥శే॥ సీతమ్మగారు

ప్రశ్న 7.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది ?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది.

ప్రశ్న 8.
ఆచార్య రవ్వా శ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు:
తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహోపాధ్యాయ బిరుదును ఇచ్చింది.

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

XI ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
ఇటీవల మీ కళాశాలలో ఎన్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరం గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయండి.
జవాబు:
స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2023.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు..

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేస్తారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ಇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా
ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం – 500067.

ప్రశ్న 2.
పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్స్టేషన్కు లేఖ వ్రాయండి.
జవాబు:
అధికారికి లేఖ

దిలావర్పర్,
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా’ సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పూర నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయ్యింది.
దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

XII ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1. ముత్యమట్లు
జవాబు:
ముత్యమట్లు – ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

2. చేతులెత్తి
జవాబు:
చేతులెత్తి – చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తన కచ్చు పరంబగునపుడు సంథియగు.

3. సొమ్మయా
జవాబు:
సొమ్మయా – సొమ్ము + అయా – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

4. దారిద్ర్యాంధకార
జవాబు:
దారిద్ర్యాంధకార – దారిద్ర్య + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం – అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5. క్షణమాగాలి
జవాబు:
క్షణమాగాలి – క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.

6. రెండంచులు
జవాబు:
రెండంచులు రెండు+ అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.

7. పదాబ్జాతంబు
జవాబు:
పదాబ్జాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

8. భాగ్యంబెంత
జవాబు:
భాగ్యంబెంత – భాగ్యంబు + ఎంత = ఉకారసంధి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

XIII ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 3 = 12)

1. మైత్రే బంధము
జవాబు:
మైత్రే బంధము – మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

2. దారాసుతాదులు
జవాబు:
దారాసుతాదులు – భార్య మరియు పిల్లలు – ద్వంద్వ సమాసం

3. ప్రియభాషలు
జవాబు:
ప్రియభాషలు – ప్రియమైన భాషలు – విశేషణ పూర్వపద కరధాయ సమాసం

4. ఇష్టసఖుడు
జవాబు:
ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు- విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

5. శిథిలవస్త్రంబు
జవాబు:
శిథిలవస్త్రంబు – శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

6. భరతభూమి
జవాబు:
భరతభూమి – భర్తత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము

7. గరుగృహం
జవాబు:
గరుగృహం – గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమానము

8. ధనుర్విద్యాకౌశలం
జవాబు:
ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం

XIV.
ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

1. యువత – జీవన నైపుణ్యాలు
జవాబు:
యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ.అభివృద్ధి ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం.

ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి .

తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ – ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness): ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య.. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy) : పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహామభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill): మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి గానికి, అవకాశాలను వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions); యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill): సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ `ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making): సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking): ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking): యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

2. జాతీయ విపత్తులు
జవాబు:
జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.
విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు, లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు.

దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ. సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

3. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని. ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి.

తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల ‘పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం. తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.

నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్టు మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి.

శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- – 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి.

పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు. వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి.

శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి. పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, ‘దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి.

బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే.’ చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, ‘శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు. తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

TS Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. What time is our meeting on Wednesday?
జవాబు:
బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు ?

2. Don’t judge book by its cover.
జవాబు:
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యద్దు.

3. What you do is more important than what you say.
జవాబు:
నువ్వు చెప్పే మాటలకంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి.

4. Don’t stop when you’re tired stop when you are done.
జవాబు:
అలసిపోయినప్పుడు కాదు, పనిపూర్తయినప్పుడే విశ్రమించాలి.

5. By failing to prepare you are preparing to fail.
జవాబు:
మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే, విఫలమవ్వటానికి సిద్ధపడుతున్నారని అర్థం.

XVI ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది.

వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు. వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు.

అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరి లిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది.

భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.

ప్రశ్నలు :

వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్టా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి ?
జవాబు:
ప్రహ్లాద కవిత

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు’ ఎవరు ?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది ?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లాఉమాహేశ్వరరావు

Leave a Comment