Reviewing TS 10th Class Telugu Model Papers Set 5 can help students identify areas where they need improvement.
TS SSC Telugu Model Paper Set 5 with Solutions
‘సమయం: 3 గం.
మార్కులు : 80
విద్యార్థులకు సూచనలు :
- జవాబులు రాయడానికి 2 గంటల 30 నిముషాలు ఉపయోగించాలి.
- పార్ట్ ‘బి’ చివరి 30 నిమిషాలలో పూర్తిచేసి, పార్ట్ ‘ఎ’ జవాబు పత్రానికి జతచేయాలి.
పార్ట్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. (5 × 1 = 5)
పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడివున్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్ధించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు.
వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలరిుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీమామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.
పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామలక్ష్మణులు కౌసల్యా సుమిత్రా కైకేయీ వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. ‘ భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున జేర్చుకున్నాడు శ్రీరాముడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముని అభ్యర్ధించినది ………….
అ) శివుడు
ఆ) విభీషణుడు
ఇ) గుహుడు
జవాబు:
ఆ) విభీషణుడు
ప్రశ్న 2.
భరద్వాజ ఆశ్రమాన్ని చూసినవారు
అ) శ్రీరాముడు
ఆ) సీతారాములు
ఇ) సీత
జవాబు:
ఆ) సీతారాములు
ప్రశ్న 3.
వానరులను బతికించినది ………….
అ) భరద్వాజుడు
ఆ) ఇంద్రుడు
ఇ) శ్రీరాముడు
జవాబు:
ఆ) ఇంద్రుడు
ప్రశ్న 4.
శ్రీరాముడు సంహరించినది ………..
అ) శిష్టులను
ఆ) ఇష్టులను
ఇ) దుష్టులను
జవాబు:
ఇ) దుష్టులను
ప్రశ్న 5.
శ్రీరాముని రాకను ముందుగా భరతునికి తెలియజేసింది …………..
అ) హనుమంతుడు
అ) గుహుడు
అ) విభీషణుడు
జవాబు:
అ) హనుమంతుడు
ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా రాసి భావం రాయండి. (1 × 5 = 5 మా.)
ప్రశ్న 6.
తెలగాణమ్మున ………………. సయ్యాటలాడెన్ దివిన్
జవాబు:
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగ రాకన్ ! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటటాడెన్ దివిన్
భావం : ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తిబట్టి ఎదిరించింది. గొప్ప రాజునని అనుకునేవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.
(లేదా)
భండరభీముఁ డార్తజన ……………. కరుణా పయోనిధీ !!
జవాబు:
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!
భావం : దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరునివని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువుని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండవం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !
ఇ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)
20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను చెడుమాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపు నిచ్చారు. అమెరికా ప్రభుత్వ వత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలస వెళ్ళి 1916 లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పారు. నాడు సాంగర్ చేసిన సేవ నేడు జనాభా నియంత్రణకు మార్గం వేసింది. నవంబర్ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది. కుటుంబ నియంత్రణనే అమలు చేయకపోతే జనాభా ఎంత పెరిగి ఉండేదో ఊహించడం కూడా సాధ్యం కాదు. కుటుంబ నియంత్రణ అముల చేయడం వల్ల పర్యావరణాన్ని రక్షించాము. కాలుష్యం తగ్గింది. అడవుల నరికివేత నిదానించింది. అయితే చేసింది చాలదు ఇంకా చాలా ఉంది.
ప్రశ్నలు :
ప్రశ్న 7.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
జవాబు:
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ మార్గరేట్ సాంగర్.
ప్రశ్న 8.
ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
జవాబు:
ఆమె 1914లో “ఉమన్ రెబల్” అనే వ్యాసంలో కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు.
ప్రశ్న 9.
మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళింది ?
జవాబు:
1914 నుండి 1916 మధ్య కాలంలో మార్గరేట్ సాంగర్ యూరప్కు వలస వెళ్ళింది.
ప్రశ్న 10.
జనాభా 8 బిలియన్ల సంఖ్యకు ఎప్పుడు చేరింది ?
జవాబు:
నవంబర్ 15, 2022
ప్రశ్న 11.
కుటుంబ నియంత్రణ అమలు చేయకపోతే ఎదురయ్యే ఏవైనా రెండు సవాళ్ళు రాయండి.
జవాబు:
పర్యావరణ కాలుష్యం, అడవులన నిర్యూలన అనే సమస్యలు వచ్చేవి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (4 × 3 = 12 మా.)
అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 12.
‘భాగ్యోదయం’ పాఠ్య రచయిత గురించి రాయండి.
జవాబు:
‘భాగ్యోదయం’ పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫై ఏండ్ల అవసరాలకనుగుణంగా ‘మాస్టర్గాన్’ తయారుచేసిన దార్శనికుడు కృష్ణస్వామి ముదిరాజ్. ‘దక్కనార్’ అనే ఆంగ్లవారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. హైదారాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడుతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు.
ప్రశ్న 13.
హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
హిమగిరి అంటే హిమాలయ పర్వతాలు. అవి మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ పర్వతాల శిఖరాలు సూర్యుడి వేడికి కరిగి నీరై కిందికి ప్రవహిస్తాయి. ఆ చిన్న చిన్న ప్రవాహాలే గంగ, సింధు, బ్రహ్మపుత్ర అనే మహానదులుగా ఏర్పడి మానవాళికి తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.
ప్రశ్న 14.
అక్కా ఇన్నాళ్ళకు మసూరికి పట్టిన “మిత్తిదొర్సాని” అనే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సకపోయిందని’ ఎందుకన్నాడు ?
జవాబు:
ఊరి ప్రజల్లో చైతన్యమెచ్చింది. వడ్డీ పైసలతో ఇళ్ళు కట్టిన రంగనాయుడు అనే శ్రీమంతునికి ఊరి ప్రజలు ఎదురుతిరిగి పంగనామం పెట్టారు. చెప్పుకోవడానికి సిగ్గేసి, చుట్టాలింటికి వెళ్ళొస్తానని రంగాపురం వెళ్ళాడు. ఊరిలో అప్పులు ఇచ్చి వడ్డీలు గుంజే దోపిడీదారు పీడ విరగడయిందని తమ్ముడు అన్నాడు.
ప్రశ్న 15.
హైదరాబాద్ నిర్మాణం వల్ల గోలకొండ ప్రాధాన్యం తగ్గింది. ఎందుకు ?
జవాబు:
గోలకొండ పాత నిర్మాణం. గోలకొండలో జనసాంద్రత ఎక్కువ కావడం, సౌకర్యాలు చాలకపోవడంతో హైదరాబాద్లో ఆధునిక వసతులు కల్పించుకుంటూ గృహనిర్మాణాలు చేపట్టారు. చాలామంది విశాలమైన, సౌకర్యవంతమైన ఇండ్లలో హాయిగా నివసించడం అందరికీ తృప్తినిచ్చింది. పైగా రాచరికపు వత్తిళ్ళు, అనవసరమైన వసూళ్ళ బెడద హైదరాబాద్లో లేదు. నగరంలోకి రాకపోకల విషయంలో ఎటువంటి ఆంక్షలూ లేవు. దాంతో అందరూ హైదరాబాద్లో నివసించడానికి ఇష్టపడ్డారు. గోలకొండ నుండి కూడా చాలామంది హైదరాబాదుకు తరలివెళ్ళారు. ఈ విధంగా క్రమంగా గోలకొండకు ప్రాధాన్యం తగ్గింది.
ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)
ప్రశ్న 16.
దానశీలం పాఠం ఆధారంగా బలి చక్రవర్తి గుణగణాలను వివరించండి.
జవాబు:
బలిచవ్రర్తి, శిబిచక్రవర్తి, కర్ణుడు, రంతిదేవుడు మొదలగు దాతలు ‘ఆడిన మాట తప్పకపోవడం’, దాన గుణం కలిగి ఉండడం వంటి మంచి గుణాల ద్వారా చరిత్రలో నిలిచిపోయారు.
ఇచ్చిన మాట కోసం తన గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినకుండా వామనుడికి మూడడుగుల నేలను దానం చేసిన గొప్ప దాత బలిచక్రవర్తి.
ధనము, కీర్త, కామం, జీవనాధారాలలో ఏది అడిగినా ఇస్తానని చెప్పినవాడు, ధనం మీద దురాశతో వచ్చిన అతిథిని తిప్పి పంపనివాడు, ఆడిన మాట తప్పినవాడిని భూదేవి మోయలేదని బ్రహ్మతో చెప్పిన విషయాన్ని గుర్తించినవాడు, దాతకు కావలసింది తగినంత ధనం, దానిని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి దొరకటం అదృష్టంగా భావించనవాడు బలిచక్రవర్తి.
పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, వారకి రాజ్యాలున్నాయి, వారు గర్వంతో విర్రవీగారు కానీ వారు సిరిసంపదలను. మూటగట్టుక పోలేదని, చివరికి వారి పేర్లు కూడా భూమిపైన మిగులలేదని, శిబిచవ్రర్తి వంటివారు ప్రీతితో ప్రజల కోర్కెలను తీర్చారని, వారిని ఈ కాలంలో కూడా మరచిపోలేదని గుర్తించినవాడు బలిచక్రవర్తి.
నరకం వచ్చినా, బంధనాలు ప్రాప్తించినా, రాజ్యం పోయినా, వంశం నశించినా చివరకు మరణం సంభవించినా సరే, మాట తప్పని గుణం కలవాడు బలి. చక్రవర్తి.
అశాశ్వతమైన ధనం, రాజ్యం, వంశం గురించి కాకుండా శాశ్వతమైన కీర్తి కోసం ఎవరైతే పాటుపడతారో వారు. చరిత్రలో నిలిచిపోతారు.
(లేదా)
కాశీ అన్నపూర్ణాదేవి వేదవ్యాసుణ్ణి పరీక్షించడానికి కారణాలు ఏమై ఉంటాయి ? దీని ద్వారా మీరు గ్రహించిన విషయాలేవి ?
జవాబు:
మన సమాజంలో నీతులు చెప్పేవారు చాలామంది కనబడతారు. కోపం తగ్గించుకోవాలని, ఇతరులు బాధపడేటట్లు మాట్లాడకూడదని, ఎవరినీ దూషించకూడదని నీతులు చెబుతూ ఉంటారు. కానీ, ఈ నీతులు చెప్పేవారు వాటిని ఆచరించరు. ఎదుటివానికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనే ధోరణిలో ఉంటారు. మహాత్ములు ఇలా ఉండరు. వారు ఏ మంచి మాటలు ఇతరులకు చెబుతారో వాటిని మొదట తాము ఆచరిస్తారు. మామూలు మనుషుల్ని పరీక్షిస్తే వారి లోగుట్టు బయటపడుతుంది. మహాత్ములు పరీక్షలకు నిలబడతారు. నెగ్గుతారు.
వ్యాసుడు బ్రహ్మజ్ఞాని. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి పూర్వమే లేచేవాడు. ఆయాకాలాలలో చేయాల్సిన విధులను చాలా కచ్చితంగా చేసేవాడు. అంతటి గొప్ప వ్యక్తి ఇతరులకు ఆదర్శంగా జీవితాన్ని సాగించాలి. శాంతంతో, ఓర్పుతో, కోపాన్ని అదుపులో పెట్టుకొని జీవించాలి. వ్యాసుడు ఈ లక్షణాలు తన జీవితంలో అమలుచేస్తున్నాడో లేదో. పరీక్షించదలిచి ఉంటుంది కాశీ అన్నపూర్ణ.
ఆకలిబాధకు తాళలేక, వ్యాసుడంతటి బ్రహ్మజ్ఞాని కాశీని శపించబోయాడు. కడివెడు పాలలో ఒక్క విషపు చుక్క పడితే, ఆ పాలన్నీ వృథా అయిపోతాయి. అలానే ఎంత తపస్సు చేసి, జ్ఞానం సంపాదించినా కోపం అనే చెడు లక్షణం ఎంత గొప్ప వ్యక్తినైనా తగ్గించి వేస్తుందనీ, కోపం ఎంతటి మనిషినైనా విచక్షణా జ్ఞానం నశింప చేస్తుందని, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని నేను గ్రహించాను.
ప్రశ్న 17.
యుగాంతం కథ గురించి రాయండి.
జవాబు:
నెల్లూరు కేశవస్వామి కథల్లో ‘యుగాంతం’ కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని ‘తమస్’ నవలలో చిత్రించారు. అదీ దూరదర్శన్లో టీవీ సీరియల్గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-50 ల మధ్య కొనసాగాయని చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతనదశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు ‘యుగాంతం’ అనే పేరు సార్థకతను చేకూర్చింది.
(లేదా)
భాగ్యరెడ్డి వర్మ పాల్గొన్న మతసాంఘిక సభల గురించి రాయండి.
జవాబు:
ప్రతి ఏటా జరిగే మత సాంఘికసభలకు భాగ్యరెడ్డివర్మ హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్రమహాసభ, ఆదిహిందూ మహాసభ, అఖిలభారత అంటరానివర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జన జీవితంలో కాలు పెట్టినదాదిగా మొత్తం 3,348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. ఆయన అణగారిన వర్గాలలో చైతన్నాన్ని తేవడానికి కృషి చేసినాడు.
ప్రశ్న 18.
వాలి – శ్రీరాముని మధ్య జరిగిన సంవాదం సారాంశం రాయండి.
జవాబు:
రాముడు విసిరిన బాణం పక్షస్థలంలో నాటుకొని వాలి నేల మీదకి వాలిపోయాడు. ఉత్తముడైన రాముడు అధర్మయుద్ధం చేయడాన్ని వాలి ప్రశ్నిండాడు. రామునికి, అతని దేవానికి అపకారం చేయని తనపై బాణం వేయడాన్ని ప్రశ్నించాడు. ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు దొంగదెబ్బ తీయడాన్ని ప్రశ్నించాడు. సీతాన్వేషణలో సుగ్రీవునికన్నా తననాశ్రయిస్తే బాగుండేదన్నాడు.
ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పే వాడినన్నాడు. రావణుని యుద్ధంలో బంధించి తెచ్చేవాడినన్నాడు వాలి. అందుకు శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసిపుచ్చాడు. తమ్ముని భార్యను చెరపట్టడం వంటి అధర్మానికి శిక్ష విధించానన్నాడు. వానరుణ్ణి చాటుగా చంపడంలో దోషం లేదన్నాడు. వాలి తన తప్పును తెలుసుకొని మన్నించమని వేడుకొన్నాడు.
మరణవేదనతో కింద పడివున్న వాలి సుగ్రీవునకు తార, అంగదుల బాధ్యతను అప్పజెప్తాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకూ అధికమై ప్రాణాలను వదిలాడు. వాలి జీవితాధ్యాయం ముగిసింది.
(లేదా)
‘సీత ఆదర్శనారి’ – వివరించండి.
జవాబు:
సీత జనక మహారాజు కుమార్తె. సకల సద్గుణవతి, శ్రీరాముని అర్ధాంగి. భర్తను సేవిస్తూ నీడలా అనుసరించడమే ధర్మంగా భావించింది. అత్తవారింట ఎంతో అనుకూలవతిగా మెలగింది.
శ్రీరాముడు తండ్రి ఆజ్ఞమేరకు అడవులకు బయలుదేరినప్పుడు ‘వనవాస కష్టాలు భరించలేవు’ అని ఎంతమంది వారించినా వినకుండా రాముని వెంట అడవులకు వెళ్ళింది. 14 ఏళ్ళు వనవాస కష్టాలన్నీ అనుభవించింది. పతియే ప్రత్యక్షదైవం అని ప్రపంచానికి చాటిన ఆదర్శనారి సీత.
రావణుని చెరలో ఉన్న పదినెలలూ అశోకవనంలో భర్తనే తలచుకుంటూ గడిపింది. రావణుడు ఎన్ని ఆశలు చూపినా, ఎంత భయపెట్టినా, ఎన్ని మాయలు పన్నినా వేటికీ లొంగలేదు. ఎంతో ధైర్యంగా భర్త రాకకోసం ఎదురు చూసింది.
హనుమంతుడు సీతను రాముని చెంతకు చేరుస్తానన్నాడు. దాని వల్ల తన భర్త పరాక్రమానికి మచ్చవస్తుందని, శ్రీరాముడు రావణుని జయించి తనను తీసుకు వెళ్ళడమే ఉచితమని చెప్పి తిరస్కరించింది.
ఈ విధంగా సీత ఆదర్శనారి అని చెప్పవచ్చు.
ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)
ప్రశ్న 19.
మూఢనమ్మకాలను పారద్రోలిన సంస్కర్త మీ పాఠశాలకు వస్తే మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారో ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
- మూఢనమ్మకాలు అంటే ఏమిటి ?
- కొన్ని మూఢనమ్మకాలు తెల్పండి..
- మూఢనమ్మకాలు ప్రజల్లో ఎలా వ్యాప్తి చెందుతాయి ?
- మూఢనమ్మకాలు ఆచరిస్తే కలిగే అనర్థాలు ఏమిటి ?
- మూఢనమ్మకాలు నమ్మకాలు ఉండాలంటే, మనం ఏం చేయాలి ?
- మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఎలాంటి ప్రచారం చేయాలి ?
- సంస్కర్త అంటే ఎవరు ?
- మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఎలా కృషిచేస్తారు ?
- ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటి ?
- మా విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి ?
(లేదా)
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పై ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ రాయండి.
జవాబు:
రమణ: మా పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బాగా జరిగింది.
భాషా : ఆజాదీ కా ‘అమృత్ మహోత్సవ్ అంటే ?
రమణ : మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ ఉద్యమాన్ని తలచుకుంటూ చేసుకునే పండగ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.
భాషా : ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమాన్ని గుర్తుంచుకోవాలా ? పండగ చేసుకోవాలా ?
రమణ : ఆనాడు మనదేవం ఎలాంటి దీనస్థితుల్లో ఉందో, పరాయిదేశం వారిని మనదేశం నుండి పంపివేయడానికి మన నాయకులు ఎన్ని త్యాగాలు చేశారో తెలిసే అలా మాట్లాడావా. ఎంతోమంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేయడంవల్లే ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం.
భాషా : నిజమే. మన నాయకుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చిందని మా పెద్దలు అనుకుంటూ ఉంటే విన్నాను. ఈ ఉత్సవంలో భాగంగా ఏమి చేశారు ?
రమణ : ‘జాతీయ జెండా ఎగురవేశాము. జాతీయగీతం పాడాము. స్వాతంత్ర్య చరిత్రలోని ఘట్టాలను పెద్దలు చెబితే విన్నాము. 2047 సంవత్సరం నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు అవుతాయి. 2047 నాటికి మనదేశం సాధించాల్సిన లక్ష్యాలు గురించి చెప్పారు.
భాషా : ఈ కార్యక్రమాన్ని దేశభక్తిని పెంచుతాయి. మన బలాన్ని, బలగాన్ని తెలుసుకునేట్లు చేస్తాయి. దేశ రక్షణకు, – అభివృద్ధికి ఐకమత్యంగా అందరం నడవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
రమణ : ఇంత గొప్ప కార్యక్రమంలో మనమూ భాగస్వాములు కావడం మన అదృష్టం. మనందరికీ గర్వకారణం.
భాషా : జైహింద్ ! భారతదేశం జిందాబాద్.
పార్ట్ – B
సమయం : 30 ని.లు
మార్కులు : 20
సూచనలు :
- విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
- పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.
I. భాషాంశాలు
అ) పదజాలం :
కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ప్రశ్న 1.
పలికి లేదను : …………………………………….
జవాబు:
పలికి లేదను : మానవంతులు పలికి లేదన లేరు.
ప్రశ్న 2.
ప్రాణం పోయు : ………………………………….
జవాబు:
ప్రాణం పోయు : బాపు గీసే బొమ్మలకు ప్రాణం పోస్తాడు. అందుకే అవి సజీవంగా కనబడతాయి.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)
ప్రశ్న 3.
ధాత్రిని కాపాడటం మన ధర్మం. (గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.)
A) బూమి
B) గాలి
C) భూమి
D) అగ్ని
జవాబు:
C) భూమి
ప్రశ్న 4.
ప్రకృతి అందానికి ప్రసాద్ అబ్బురపడ్డాడు. (గీత గీసిన పదానికి సరైన అర్థం)
A) పొంగిపోయాడు
B) కృంగిపోయాడు
C) పరుగెత్తాడు
D) ఆశ్చర్యపోయాడు
జవాబు:
D) ఆశ్చర్యపోయాడు
ప్రశ్న 5.
వయసు పెరిగినా, వాంఛ తరుగలేదు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.).
A) ఎత్తు, బరువు
B) ఆస్తి, సంపద
C) కోరిక, తృష్ట
D) అంచు, అంగుళులు
జవాబు:
C) కోరిక, తృష్ట
ప్రశ్న 6.
తరగతి గదిలో చిత్తమును లగ్నం చేయాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.).
A) మనసు, హృదయం
B) ఫ్యాన్లు, బల్బు
C) చాక్పీస్, డస్టర్
D) సరే అనడం, కోరిక
జవాబు:
A) మనసు, హృదయం
ప్రశ్న 7.
చరణము – (ఈ పదానికి సరియగు నానార్థాలు గుర్తించుము.)
A) శరణు, కరుణ
B) పాదం, పద్యపంక్తి
C) గద్యం, పద్యం
D) కాంక్ష, కోరిక
జవాబు:
B) పాదం, పద్యపంక్తి
ప్రశ్న 8.
రవి గాంచనిచో కవి గాంచును. (గీత గీసిన పదానికి సరియగు నానార్థాలు గుర్తించుము.)
A) పండితుడు, సూర్యుడు
B) పండితుడు, జలపక్షి
C) పండితుడు, బ్రహ్మ
D) పక్షి, గాయకుడు
జవాబు:
B) పండితుడు, జలపక్షి
ప్రశ్న 9.
దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు బాస చాలా ప్రాచీనమైంది. (ప్రకృతి – వికృతులు గుర్తించండి.).
A) తెలుగు, భాష
B) భాష, బాస
C) ప్రాచీన, బాస
D) దేశ, దేష
జవాబు:
B) భాష, బాస
ప్రశ్న 10.
విష్ణువు – (సరైన వ్యుత్పత్తిని గుర్తించండి.)
A) నల్లనివాడు
B) విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు
C) దేవుడు
D) తెల్లని కనులు కలవాడు
జవాబు:
B) విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు
ఆ) వ్యాకరణాంశాలు :
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)
ప్రశ్న 11.
ఇక్కాలము (విడదీసి రాస్తే)
A) ఇ + క్కాలము
B) ఈకా + లము
C) ఈ + కాలము
D) ఇక్కా + లము
జవాబు:
C) ఈ + కాలము
ప్రశ్న 12.
ఇత్వసంధికి ఉదాహరణ
A) ఊరూరు
B) ఆనతిచ్చితి
C) ఇట్లనియె
D) రామాలయం
జవాబు:
B) ఆనతిచ్చితి
ప్రశ్న 13.
‘దనుజలోకమునకు నాథుడు’ – ఈ విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందినది ?
A) ప్రథమాతత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) బహువ్రీహి
D) ద్వంద్వ
జవాబు:
B) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 14.
‘యువతీయువకులు’ – ఏ సమాసం?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీతత్పురుష సమాసం
D) నఞత్పురుష సమాసం
జవాబు:
B) ద్వంద్వ సమాసం
ప్రశ్న 15.
మసజసతతగ అనే గణాలు వరుసగా వచ్చే పద్యం ఏది?
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
C) శార్దూలం
ప్రశ్న 16.
కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం బొందరే ? అనునది ………… కు చెందిన పద్యపాదం.
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభం
ప్రశ్న 17.
నా కవిత, నా కవిత కోసమే. ఇందులోని అలంకారం గుర్తించండి.
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) ఛేకానుప్రాస
D) రూపకం
జవాబు:
C) ఛేకానుప్రాస
ప్రశ్న 18.
“నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే” అని కవి అన్నాడు – పరోక్షవాక్యం గుర్తించండి.
A) మేము మాట్లాడుతున్నది సామాన్యులతోనేనని కవి చెప్పాడు.
B) తాము మాట్లాడేది సామాన్య ప్రజలతో అని కవి చెప్తున్నాడు..
C) తాను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనేనని కవి అన్నాడు.
D) నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని కవి చెప్పాడు.
జవాబు:
C) తాను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనేనని కవి అన్నాడు.
ప్రశ్న 19.
నా చేత నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడబడ్డాయి. – కర్తరి వాక్యం గుర్తించండి.
A) నా వలన నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడబడ్డాయి.
B) నా కొరకు నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడబడ్డాయి.
C) నా యొక్క నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడబడ్డాయి.
D) నేను నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడాను.
జవాబు:
D) నేను నాలుగు ఉర్దూ మాటలు మాట్లాడాను.
ప్రశ్న 20.
పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉండడం ఏ అలంకార లక్షణం.
A) యమకం
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) వృత్త్యనుప్రాస
జవాబు:
A) యమకం