AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 1st Lesson Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో భేదాలను గుర్తించండి. (AS 1)
A) వృక్ష కణం మరియు జంతు కణం
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
జవాబు:
A) వృక్ష కణం మరియు జంతు కణం :

వృక్ష కణము జంతు కణము
1. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. 1. సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది.
2. కణకవచము ఉంటుంది. 2. కణకవచము ఉండదు.
3. ప్లాస్టిడ్లు (క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు) ఉంటాయి. 3. ప్లాస్టిడ్లు ఉండవు.
4. సెంట్రియోల్స్ ఉండవు. 4. సెంట్రియోల్స్ ఉంటాయి.
5. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. 5. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి.

B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం

కేంద్రక పూర్వకణం నిజకేంద్రక కణం
1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు. 1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది.
2. త్వచముతో కూడిన కణాంగాలు ఉండవు. 2. త్వచముతో కూడిన కణాంగాలు ఉంటాయి.
3. కేంద్రక పూర్వకణాలు ఎక్కువగా ఏకకణజీవులలో ఉంటాయి. 3. నిజకేంద్రక కణాలు బహుకణజీవులలో ఉంటాయి.
4. దీనిలో ఒకే క్రోమోసోము ఉంటుంది. 4. దీనిలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి.
5. కేంద్రకాంశము ఉండదు. 5. కేంద్రకాంశము ఉంటుంది.
6. కణవిభజన సమవిభజన ద్వారా జరుగుతుంది. 6. కణవిభజన సమవిభజన మరియు క్షయకరణ విభజనల ద్వారా జరుగుతుంది.
7. కణపరిమాణము చిన్నగా ఉంటుంది. 7. కణ పరిమాణము పెద్దగా ఉంటుంది.
8. కేంద్రక పూర్వకణాలు బాక్టీరియా మరియు సయానో బాక్టీరియాలలో ఉంటాయి. 8. నిజకేంద్రక కణాలు శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతు కణాలలో ఉంటాయి.

ప్రశ్న 2.
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను బలోపేతం చేయడానికి రెండు కారణాలు రాయండి. (AS 1)
జవాబు:

  1. కణాంగాలలో కేంద్రకము అతిముఖ్యమైనది.
  2. కేంద్రకము కణవిధులను అన్నింటిని నియంత్రిస్తుంది.
  3. కేంద్రకము అన్ని కణాంగాలను మరియు కేంద్రకాంశమును కూడా నియంత్రిస్తుంది.
  4. కణ మెదడు అయిన కేంద్రకమును తొలగించినట్లయితే కణము ఆ వెంటనే చనిపోతుంది.
  5. కనుక కేంద్రకమును తొలగించినట్లయితే కేంద్రక నియంత్రణలో పనిచేసే కణాంగాలు చనిపోతాయి. తద్వారా ఆ జీవి చనిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. లైసోజోములు విచ్ఛిన్నకర ఎంజైములను కలిగి ఉంటాయి.
  2. విచ్ఛిన్నం చేయవలసిన పదార్థములు లైసోజోమ్ నకు రవాణా చేయబడతాయి.
  3. కొన్ని సందర్భాలలో లైసోజోముల విచ్ఛిన్నం ద్వారా విడుదలైన ఎంజైములు కణమును జీర్ణం చేస్తాయి.
  4. అందువలన లైసోజోమ్ ను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 4.
వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి? (AS 1)
జవాబు:

  1. మొక్కల రిక్తికలు నీటి నిలువకు, ద్రవాభిసరణ క్రమతకు, వ్యర్థ పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడుట ద్వారా ఆకులు, రక్షకపత్రాల కణముల యొక్క నిర్మాణాత్మక రూపమును నియంత్రిస్తాయి.
  2. కణము మధ్యన గల రిక్తిక, కణకవచముపై కలిగించే ఒత్తిడి ద్వారా కణము యొక్క ఆకారము స్థిరంగా ఉంచబడుతుంది.
  3. నియంత్రిత పెరుగుదలలో భాగంగా మొక్కలు కణము పొడవుగా అగుటకు కణము అంతర్గతశక్తిని ఉపయోగించుకుంటాయి.
  4. జంతువుల రిక్తిక కంటె వృక్షము యందు ఉండు రిక్తిక క్లిష్టమైన విధులను నిర్వహిస్తుంది.
  5. అందువలన వృక్ష కణములలో పెద్ద రిక్తికలు ఉంటాయి.

ప్రశ్న 5.
“జీవుల మౌళిక ప్రమాణం కణం” వివరించండి. (AS 1)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం, జీవులు కణ నిర్మితాలు మరియు కణములన్నీ ముందుతరం కణం నుంచి ఏర్పడతాయి.
  2. జీవి జీవించడానికి అవసరమయ్యే జీవక్రియలన్నీ కణస్థాయిలోనే జరుగుతాయి.
  3. అందువలన కణమును జీవుల మౌళిక ప్రమాణం అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి? (AS 1)
జవాబు:
ప్రతిపాదించినవారు :
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును

ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు :

  1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
  2. కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి.
  3. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి.
  4. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 7.
ప్లాస్మా పొర పగిలిపోతే/ విరిగితే కణానికి ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే :

  1. విసరణ లేదా ద్రవాభిసరణ ద్వారా కణము లోపలకు, బయటకు జరిగే పదార్థాల రవాణాను ప్లాస్మా పొర నియంత్రిస్తుంది.
  2. అందువలన ప్లాస్మాపొర పగిలిపోతే కణము, దాని లోపలి అంశములను బయటకు విడుదల చేయవచ్చు.
  3. అందువలన కణము చనిపోతుంది.

ప్రశ్న 8.
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే కణానికి ఏమవుతుంది? (AS 2)
జవాబు:
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే :

  1. వీటి ద్వారా జరుగవలసిన కార్యకలాపాలు జరుగవు.
  2. వివిధ రకాల పదార్థములను మార్పుచేయడం కణము నందు జరుగదు.
  3. గాల్జీ సంక్లిష్టము నుండి పదార్థాలన్నీ ప్లాస్మాపొర వైపు కాని లేదా మరొక కణాంగమైన లైసోజోమ్స్ వైపు కాని పంపబడవు.
  4. రైబోజోములచే తయారుచేయబడిన ప్రోటీనులు మరియు ఇతర పదార్థములు లైసోజోమ్ లకు రవాణా చేయబడవు.
  5. పదార్ధముల రవాణా జరుగకపోయినట్లయితే ప్లాస్మా పొరకు మరమ్మత్తులు జరుగక కణం చనిపోతుంది.
  6. గాల్జీ సంక్లిష్టము నుండి విషపదార్థములు లైసోజోమ్స్ నకు పంపబడనట్లయితే విషపదార్ధములు కణము నందు నిల్వచేయబడి కణము చనిపోతుంది.

ప్రశ్న 9.
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు? (AS 3)
జవాబు:
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి ప్రయోగశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకూడదు. ఎక్కువగా గీకితే గాయమయ్యే అవకాశం ఉంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే దానిని తొలగించవలెను.

ప్రశ్న 10.
ప్రస్తుత పాఠాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా చదివి వివిధ రకాల కణాంగాల విధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమసంఖ్య, కణాంగాలు, విధులు అనే అంశాలను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసేటపుడు నూతన ప్రత్యేక అంశాలు ఉన్నట్లయితే పట్టిక క్రింద నమోదు చేయండి. (AS 4)
జవాబు:

కణాంగము విధులు
1. కేంద్రకము కణవిధుల క్రమబద్దీకరణ మరియు నియంత్రణ, జీవుల లక్షణాల నిర్ధారణ.
2. అంతర్జీవ ద్రవ్యజాలము కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా, జీవరసాయన చర్యలకు వేదిక.
3. గాల్జీ సంక్లిష్టము ప్రోటీనుల రూపమును మార్చుట, అనేక పదార్థములను ఒకటిగా చేయుట.
4. లైసోజోములు కణాంతర జీర్ణక్రియ, కణభాగములను నాశనం చేయుట.
5. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ ద్వారా కణమునందు శక్తి ఉత్పాదన.
6. ప్లాస్టిడ్లు మొక్కల కణాలకు రంగులను ఇస్తుంది.
A) క్రోమోప్లాస్టులు రకరకాల పూలు, పండ్లకు రంగునిచ్చుట.
B) క్లోరోప్లాస్టులు కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చుట.
C) ల్యూకోప్లాస్టులు రంగులేని ప్లాస్టిడ్లు, పిండిపదార్ధాలు, నూనెలు మరియు ప్రోటీనుల నిల్వ.

ప్రత్యేక అంశాలు :

  1. కేంద్రకము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
  2. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది.
  3. గాల్టీ సంక్లిష్టము రైబోజోములు తయారు చేసిన ప్రోటీనులను ఒకటిగా చేర్చుటకు సహాయం చేస్తుంది.
  4. కణ వినాశమునకు కారణమగుట వలన లైసోజోములను స్వయంవిచ్చిత్తి సంచులు అంటారు.
  5. కణ శ్వాసక్రియ ద్వారా కణము శక్తిని ఉత్పాదన చేయుట వలన మైటోకాండ్రియాలను కణ శక్త్యా గారాలు అంటారు.
  6. క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు.

ప్రశ్న 11.
వృక్ష కణం లేదా జంతు కణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి. (AS 15)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

ప్రశ్న 12.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లెడను తయారుచేసి పత్రరంధ్రాలను పరిశీలించి పటమును గీయండి. వాటి గురించి రాయండి. (AS 5)
జవాబు:
పెద్దదిగా చూపబడిన పత్రరంధ్రము ఈ క్రింది కణాలను చూపిస్తుంది.
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

  1. పత్రరంధ్రము రెండు రక్షక కణములచే ఆవరించబడినది.
  2. రక్షక కణములు మూత్రపిండాకారములో ఉన్నాయి.
  3. రక్షక కణమందు కేంద్రకము, క్లోరోప్లాస్టులు కలవు.
  4. రెండు రక్షక కణముల మధ్య చిన్న పత్రరంధ్రము కలదు.
  5. ఆకునందలి పత్రరంధ్రముల ద్వారా వాయువుల మార్పిడి జరుగును.
  6. ఆకు వైశాల్యం నందు పత్రరంధ్రములు సుమారు 1 నుండి 2 శాతం ఆక్రమించి ఉన్నాయి.

ప్రశ్న 13.
నమూనా జంతు కణం పటము గీచి భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

ప్రశ్న 14.
కింది కార్టూనును చూడండి. కణాంగాల విధులను గురించి రాయండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు అనగా అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టీ సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, – ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు.

కణాంగాలు, విధులు :
1) అంతర్జీవ ద్రవ్యజాలం :
కణ ద్రవ్యంలో వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి కేంద్రకానికి రవాణా మార్గంగా పని చేస్తుంది. క్రొవ్వు మరియు లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

2) గాల్జీ సంక్లిష్టాలు :
ఇవి వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు పంపే ముందు, తమలో నిల్వ చేసుకుని, అక్కడ నుండి ప్లాస్మాపొర వైపు లేదా లైసోసోమ్స్ వైపు పంపిస్తాయి.

3) లైసోజోములు :
వినాశకర పదార్థాలను ఇవి ఎంజైముల ద్వారా వినాశనం చేస్తాయి.

4) మైటోకాండ్రియా :
కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణ శ్వాసక్రియను జరుపుతాయి.

5) ప్లాస్టిడ్లు :
కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చటమే వీటి యొక్క ముఖ్య

6) రిక్తికలు :
రిక్తికలు కార్బోహైడ్రేటులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీనులు, వర్ణద్రవ్యాలు విసర్జన పదార్థాలను నిల్వ చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 15.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. జీవులలో ఐదు రకాల స్థాయిలను గమనిస్తాను. కణము-కణజాలము-అవయవము-అవయవ వ్యవస్థ – జీవి.
  2. జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైంది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
  3. మౌలికమైన మరియు ప్రాథమికమైన కణము ఏకకణ జీవులను, బహుకణ జీవులను ఏర్పరుస్తుంది.
  4. జీవులు తరువాత క్రమంలో జనాభాలను, సంఘాలను, ఆవరణ వ్యవస్థలను మరియు జీవావరణంగాను వ్యవస్థీకృతమైనవి.

ప్రశ్న 16.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది? (AS 6)
జవాబు:

  1. జీవమునకు ప్రమాణమైన కణము, జీవక్రియలన్నింటిని నిర్వహించగల సామర్యము కలిగినది.
  2. భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణవ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 17.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నియూ కణనిర్మితాలు.
  2. జీవమునకు ప్రమాణమైన చిన్నకణము అన్ని జీవక్రియలను నిర్వహించగల సామర్థ్యం గలది.
  3. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి.
  4. కణములు జీవనిర్మాణ సౌధములు.
  5. అందువలన కణములను జీవమునకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అంటారు.
  6. కణములు ఆకారములోను, పరిమాణములోను మరియు క్రియలపరంగా వేరుగా ఉంటాయి.
  7. ఒక కణము యొక్క పరిమాణము కచ్చితంగా ఆ కణము నిర్వహించే పని మీద ఆధారపడి ఉంటుంది.
  8. జీవిలోని కణములు సక్రమముగా విధులను నిర్వహించినట్లయితే జీవి శరీరము విధులను సక్రమముగా నిర్వహిస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 1

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే, బుగ్గ కణాలు గుండ్రంగా ఉంటాయని తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు గుర్తించిన మరికొన్ని ముఖ్యాంశాలు రాయండి.
జవాబు:

  1. జీవులన్నిటికి కణం ప్రధానమైన మూలం.
  2. కణాలలో కేంద్రకం ఉంటుంది.
  3. వృక్ష కణాలలో కణకవచం ఉంటుంది. కానీ జంతు కణాలలో కణకవచం ఉండదు.
  4. కణమును నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు.
  5. బహుకణజీవులలో ఈ కణాల ఆకారంలో వైవిధ్యం కనపడుతుంది.

9th Class Biology Textbook Page No. 2

ప్రశ్న 2.
ఈ క్రింది కణాలను పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

a) పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు ఏవి?
జవాబు:
పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు : పై రెండు కణాలు మైటోకాండ్రియా, గాల్టీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం అనే కణాంగాలను కలిగి ఉన్నాయి.

b) వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలేవి?
జవాబు:
వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు : రిక్తికలు, ప్లాస్టిడ్లు, కణకవచం మొదలగునవి.

c) వృక్ష కణంలోని రిక్తకలు జంతుకణంలోని రిక్తికలను పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలను రాయండి.
జవాబు:
వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయి. జంతుకణంలో రిక్తికలు ఉండవు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:

  1. కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.
  2. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను జంతుకణం కంటే వృక్షకణం తట్టుకునే అవకాశం ఎక్కువ.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. ప్లాస్మా పొర పరిశీలన :
a) సూక్ష్మదర్శినితో పత్రంనందలి ప్లాస్మా పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ పరిశీలనలు రాయుము.
జవాబు:

  1. రియో పత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా మధ్యకు చించాలి.
  2. చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించాలి. పత్రంలోని లేతరంగులో ఉన్న భాగాన్ని తీసుకొని స్లెడ్ పైన పెట్టాలి.
  3. నీటి చుక్కను వేసి కవర్ స్లితో కప్పాలి. తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
పరిశీలనలు :

  1. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  2. ప్లాస్మా పొర స్పష్టముగా కనిపిస్తుంది.
  3. కణము నందు కేంద్రకము కలదు.

b) రియో పత్రపు పొరపై 1 లేదా 2 చుక్కల సజల ఉప్పు ద్రావణము వేసిన ఏమి జరుగుతుంది? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి బొమ్మను గీయుము. కేంద్రకముతో కూడిన జీవపదార్థము కుదించుకుపోవడానికి కారణములు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
పరిశీలనలు :

  1. రియో పత్రపు పొరపై జల ఉప్పు ద్రావణము వేసినప్పుడు రియో పత్రము నందలి కణముల నుండి నీరు బయటకు ప్లాస్మాపొర వచ్చును.
  2. నీరు బయటకు రావడము వలన కణద్రవ్యం, కణత్వచంతో పాటు కుదించబడుతుంది.
  3. మనకు కనబడే రంగుభాగపు బాహ్య అంచును కణత్వచం అంటారు. ఆ భాగం కణకవచం నుంచి వేరైపోతుంది.

2. కేంద్రక పరిశీలన :
జవాబు:
ఉద్దేశ్యం : చెంప (బు) కణంలో కేంద్రకం పరిశీలించుట.

కావాల్సిన పదార్థాలు :
టూత్ పిక్, స్లెడ్, కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలీన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని మొదలైనవి.

విధానం :

  1. ముందుగా నోటిని శుభ్రంగా కడగవలెను. టూత్ పిక్ తో గాని లేదా ఐస్ క్రీమ్ చెంచాతో గాని నోటిలోపలి చెంప (బుగ్గ)లోని భాగాన్ని కొద్దిగా గీకవలెను.
  2. గీకిన భాగాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టవలెను. (పదార్థం ఉప్పు ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి).
  3. తరువాత స్లెడ్ పైన పెట్టవలెను.
  4. ఒక చుక్క మిథిలీన్ బ్లూ ద్రావణాన్ని వేసి రెండు నిమిషాల సేపు కదపకుండా ఉండవలెను.
  5. అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించవలెను.
  6. ఒక చుక్క గ్లిజరిన్ వేయవలెను.
  7. కవర్ స్లితో కప్పి నీడిల్ లో కవర్ స్లిప్ ని కొద్దిగా తట్టవలెను. దాని వలన కణాలన్నీ వ్యాపిస్తాయి.

జాగ్రత్తలు:

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకవద్దు. గాయమయ్యే అవకాశముంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే తొలగించవలెను.

ఈ విధముగా తయారుచేసిన తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని ఎక్కువ, తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించవలెను.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7
పరిశీలనలు:

  1. కణాల ఆకారంను పరిశీలించగా కణాలు వివిధ ఆకారాలలో ఉన్నవి.
  2. కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుంది. అదే కణ కేంద్రకం.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 2

3. మైటోకాండ్రియా పరిశీలన :
ఉల్లిపొర కణాలతో మైటోకాండ్రియాను నీవు ఏ విధంగా పరిశీలిస్తావు?
(లేదా)
నిర్మల ఉల్లిపొరలోని కణాలను పరిశీలించాలనుకుంటుంది. అందుకు కావలసిన పరికరాలను, ప్రయోగ విధానాన్ని ఆమెకు వివరించండి.
జవాబు:
పరికరాలు :
ఉల్లిపొర, బ్లేడ్, జానస్ గ్రీన్ – B ద్రావణం కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, సూక్ష్మదర్శిని

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8
మైటోకాండ్రియా పరిశీలన :

  1. బీకరులో జానస్ గ్రీన్-బి ద్రావణాన్ని తయారుచేయాలి.
  2. 200 మి.గ్రా. జానస్ గ్రీన్-‘బి’ ను 100 మి.లీ. నీటిలో కలపాలి.
  3. ఒక వాచ్ గ్లాలో ఈ ద్రావణం కొంత తీసుకుని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంటసేపు ఉంచాలి.
  4. ఉల్లిపొరను వాచ్ గ్లాస్ నుండి తీసి స్లెడ్ పైన పెట్టి నెమ్మదిగా నీటితో కడగాలి.
  5. కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో (ఎక్కువ మాగ్నిఫికేషన్) పరిశీలించాలి.
  6. పరిశీలించిన అంశాన్ని బొమ్మ గీయాలి.

పరిశీలనలు :
ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కాని పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాలు మైటోకాండ్రియా.

కృత్యం – 3

4. రియో పత్రంలో హరితరేణువులను (Chloroplast) పరిశీలిద్దాం.
సూక్ష్మదర్శిని సహాయముతో రియో పత్రమునందలి క్లోరోప్లాస్టు (హరితరేణువులు)లను పరిశీలించుము. బొమ్మను గీచి, పరిశీలనలు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
క్లోరోప్లాస్టులను పరిశీలించుట :

  1. రియో పత్రం పొరను తీసుకొని స్లెడ్ పైన ఉంచి నీటి చుక్క వేయాలి.
  2. ఎక్కువ మాగ్నిఫికేషన్ గల సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. స్లెడ్ రియో పత్రమునందు ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయి. వీటిని హరితరేణువులు అంటారు.
  2. హరితరేణువులు పత్రహరిత వర్ణద్రవ్యమును కలిగి ఉంటాయి.

కృత్యం – 4

5. శైవలాలలో హరితరేణువులు పరిశీలిదాం :
శైవలములందలి హరితరేణువులను నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తావు ? పరిశీలించిన బొమ్మను గీచి, నీవు కనుగొనిన విషయమును రాయుము.
జవాబు:
శైవల హరితరేణువులను పరిశీలించుట :

  1. నీటి కొలను నుండి ఆకుపచ్చని శైవలాలను సేకరించాలి.
  2. వాటి సన్నని తంతువులను వేరుచేయాలి.
  3. కొన్ని తంతువులను స్లెడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10

పరిశీలనలు:

  1. శైవలాలలో హరితరేణువులు నిచ్చెన ఆకారంలో గాని, నక్షత్ర ఆకారంలో గాని, సర్పిలాకారంలో గాని, జాలాకారంలో గాని ఉంటాయి.
  2. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా హరితరేణువులు మార్చుతాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 5

6. రిక్తికలను పరిశీలిద్దాం :
కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినితో పరిశీలిస్తావు?
జవాబు:
రిక్తికల పరిశీలన చేయు విధం :

  1. కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోవాలి.
  2. కాండం నుండి పల్చటి భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాగ్లాలో ఉంచాలి.
  3. స్లెడ్ మీద ఉంచి సజల సాఫ్రనిలో రంజనం చేయాలి.
  4. స్లెడు సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని రిక్తికలు అంటారు.
  2. ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

AP State Syllabus 9th Class Biology Solutions 5th Lesson Diversity in Living Organism

9th Class Biology 5th Lesson Diversity in Living Organism Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
Variations in organisms lead to diversity in living organisms. State reasons. (AS 1)
Answer:

  • The presence of differences between organisms of the same species is called variation.
  • Variation between different species is always greater than the animals within a species.
  • The uniqueness of individual is the basis of the diversity that is shown by the living organisms.
  • In our daily life, we see a variety of plants and animals in our locality.
  • But if we go to some other places such as hills, forests or sea we entirely find different types of animals and plants.
  • In fact, different parts of the world have their own typical kinds of living beings.
  • Thus-we can say that variations in organisms lead to diversity in living organisms.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 2.
What was the basis for early classifications? (AS 1)
Answer:

  • Living things are classified on the basis of their body structures.
  • Living things are classified on the basis of dissimilarities and similarities.
  • Charaka and Sushrut had classified plants on the basis of their medical importants.
  • Parasar classified plants basing on the structure of flowers.
  • Aristotle classified animals according to whether they lived on land, in water, or in the air.

Question 3.
What are the advantages of classifying organisms? (AS 1)
Answer:
Advantages of classifying organisms :

  1. Classification makes the study of various organisms easy.
  2. Classification helps to understand the inter relationships among different groups of organisms.
  3. Classification helps in exploring the diversity of life forms.
  4. Classification reveals evolution trends by showing simple body structures to complex body structures.
  5. Geographical distribution of plants and animals is entirely dependent on the information given by classification.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 4.
What is the need of classification? What questions will you ask? (AS 2)
Answer:
Need of classification :

  1. Classification gives better knowledge and better understanding of organisms that are studied.
  2. It helps to study the organisms in a proper and systematic manner.
  3. Classification helps to make comparison in an easier way.
  4. It helps in understanding relationship among the organisms and their interdependence.
  5. Classification makes our study more focused and helps us to handle huge population of organisms.
  6. Classification gives us an idea of evolution.

Questions:
1. Who made the classification?
2. What are the advantages of classification?
3. What are the recent developments being done?

Question 5.
How do monocots differ from dicots? (AS 1)
Answer:

Monocotyledons Dicotyledons
1. In the seed embryo bears a single cotyledon. In the seed, embryo bears two cotyledons.
2. Monocots have parallel venation. Dicots have reticulate venation.
3. Monocotyledons have fibrous root system. Dicotyledons have Tap root system.
4. Examples are wheat, paddy etc. Examples are Mango, Apple, Neem, etc.

Question 6.
One day Kavita soaked seeds of green grams, wheat, maize, peas, and tamarind. After they became tender, she tried to split the seed. Name which would split, which would not, and identify them according to the characters. (AS 4)
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 3

Question 7.
Make a flow chart of invertebrates in the kingdom Animalia, based upon their characteristic features. (AS 4)
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 4

Question 8.
Write some common characters of Pisces, Reptilia, and Aves. (AS 1)
Answer:

  1. Pisces, Reptilia, and Aves belong to vertebrate.
  2. All these animals lay eggs.
  3. All these animals possess vertebral column.

Question 9.
Name the kingdom to which these organisms belong according to Whittaker. (AS 1)
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 1
Answer:
a) Protista
b) Animalia
c) Fungi
d) Monera

Question 10.
Explain how animals in vertebrata are classified into further subgroups. (AS 1)
Answer:

  • Vertebrata can be further classified into sub groups on the basis of simple to complex body structures and their functions.
  • For example, fishes have two chambered hearts, amphibians have three chambered hearts while in birds and mammals have four chambered hearts to keep the oxygenated and deoxygenated blood separate.
  • The following characteristic features are considered for classifying vertebrate into the further sub groups.
Class pisces: Characteristics: Exoskeleton of scale, endoskeleton of bone, cartilage, breaths through gills.
Class Amphibia Gills in larva, lungs in most adults, slimyskin.
Class Reptilia Exoskeleton of scales, laying eggs on land only.
Class Aves Exoskeleton of feathers, lay eggs outside water, flight possible.
Class Mammals Exoskeleton of hair, external ears, mostly giving birth to live young ones.

Question 11.
Platypus or Echidna is a group that forms a link between reptiles and mammals. Think and write about some characteristic features that these would have. (AS 4)
Answer:

  • The platypus and echidna both belong to the group of animals known as monotremes.
  • These two are characterised by the feature of egg laying mammals. Yet they are not birds or reptiles.
  • Both creatures hatch their young from eggs, yet the mother of each species feeds her babies with milk from milk glands.
  • These two are found in Australia and Tasmania.
  • One of the characteristics of platypus is that it has an unusual duck like bill and does not have teeth an unusual characteristic for a mammal.
  • Echidna, the spiny ant eater also does not have teeth. Tongue helps in feeding.
  • Echidna and platypus young stay in burrow after they are hatched. Echidna develops a rudimentary pouch during breeding season.
  • Both creatures have sharp claws for burrowing.
  • Both the platypus and echidna like the water. Platypus hunt food in the water. Echidna regulates its temperature through swimming.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 12.
Sujata says Bat is not a bird but a mammal. How can you support Sujata’s statement?
Answer:

  • Sujata’s statement that bat is not a bird but mammal is correct
  • Like other mammals, including ourselves bats have hair or fur on their bodies.
  • They are warm blooded animals.
  • A baby bat that feed on its mother milk after it is born.
  • Bats are the only mammals that can fly.

Question 13.
Which Phylum do I belong to? (AS 1)
a) My body is made of pores. I live in water. I do not have backbone also ……………….. .
b) I am an insect. 1 have jointed legs …………………. .
c) I am a marine living animal with spiny skin. My body is radially symmetrical ……………….. .
Answer:
a) Porifera
b) Arthropoda
c) Echinodermata

Question 14.
How can you appreciate the effort of scientists in classifying a wide range of organisms? (AS 6)
Answer:

  • Classification makes the study of wide variety of organisms easy.
  • It is essential to understand the inter-relationships among different groups of animals and plants.
  • Classification gave us an idea of evolution of organisms from simple to complex ones.

9th Class Biology 5th Lesson Diversity in Living Organism InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 59

Question 1.
Why do you think classification system has undergone changes over the years?
Answer:
Classification system has gone changes over the years due to the new discovered organisms, advancement in genetic science invention of powerful microscope.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 2.
If you were asked to classify organisms what would be your basis of classification?
Answer:
Our basis of classification would be whether the organism.

  1. Has a prokaryotic or eukaryotic cell
  2. Is unicellular or multicellular
  3. Is autotrophic or heterotrophic
  4. Mode of reproduction.
    Like that, I classify the organism in an orderly manner.

9th Class Biology 5th Lesson Diversity in Living Organism Tissues Activities

Question 1.
Collect leaves from different plants, observe them carefully and fill the table.
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 5

a) Could you find any two leaves which are similar with respect to any of the characters, size, shape, colour or any other as mentioned in the table?
Answer:
No. Every leaf has its size, shape and colour are same in many of the leaves.

b) Note down the differences you observed in the sample of leaves collected by you.
Write two such characters that differed most.
Answer:
1. Length and breadth of the leaves are different for each leaf.
2. Most of the leaves have reticulate venation but only in plantain parallel venation is present.

Question 2.
Collect 5 different plants from your surroundings and observe them carefully. Write your observations in the table given below.
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 6
a) Which characters given above varied most?
Answer:
Length of stem, Inter nodal distance, venation in leaves, and in type of root system.

b) Select a character mentioned above which shows minimum diversity.
Answer:
Flower shows least diversity arrangement of flowers in bunches.

c) Did you find any similarities? What were they?
Answer:
Yes. Similarity in venation, number of sepals and petals, and in type of root system.

d) Did you find patterns like plants with fibrous roots had flowers borne in groups? Note the other patterns that you observed.
Answer:
Yes. The flowers are borne in groups, reticulate venation.

e) Carefully observe the plants collected by you and note down some other characters not mentioned in the table.
Answer:
Spine are present in rose plants whereas they are absent in other plants.

f) Did you notice any two plants which were alike with regard to the above characteristics? If not, note down what differences you found?
Answer:
No. Venation, root system are the differences.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 3.
How do you observe the number of cotyledons in different seeds? Write your findings in the table.
Answer:
Observing cotyledons in seeds :

  1. Collect seeds of plants from green gram, red gram, bengal gram, wheat, paddy, groundnut, maize and soak them for a day.
  2. Take a maize seed and press it between fingers.
  3. A small whitish structure come out of the maize seed.
  4. Whitish structure is known as embryo/baby plant.
  5. The portion left in our hand within the seed coat has a single cotyledon.
  6. Repeat the activity with soaked seeds by pressing them with fingers.
  7. Observe the pressed seeds with the help of a hand lens and fill the table.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 7

Activity – 4

Question 4.
Collect the plants or pictures of the plants to complete the following table.
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 8

Activity – 5

Question 5.
Collect housefly, mosquito, ant, dung beetle, butterfly, moth and cockroach from your surroundings. Observe them with magnifying glass and fill the table.
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 9

a) What differences did you observe with regard to legs?
Answer:
In some insects legs are large in size whereas in some like Cockroach, Butterfly the legs are big in size.

b) What differences did you observe with regard to wings?
Answer:
In ant, housefly, mosquito and in dungbeetle a pair of wings are present whereas in butterfly, moth and cockroach 2 pairs of legs are present. In some like ant, housefly, mosquito the wings are small whereas in others they are big in size.

c) Is there any relationship between the number of wings and legs?
Answer:
As the size of the wings increases the length of legs decreased. The number of legs in all the insects are 3 pairs whereas the wings are one or two pairs.

Activity – 6

Question 6.
In order to observe diversity in animals select 10 children from your class and fill the following table with their data.
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 10

a) Which character helps you to make a group with maximum individuals?
Answer:
Height helps us to a group with maximum individuals.

b) Which character helps you to have just a single individual in a group?
Answer:
Thumb impression.

c) Compare your group table with that of other groups and note down the differences you found.
Answer:
Student’s activity.

d) Did you find same observations of any two students in your class?
Answer:
No.

Activity – 7

Question 7.
Collect two small almost equal sized neem plants from your surroundings observe them and fill the table.
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 11

a) What differences did you find in the similar neem plants?
Answer:
The differences are in length of the stem and number of leaves.

b) Why do such differences present in nature?
Answer:
Every plant has got its own characteristics. The age of the plants also responsible for diverse characters.

Activity – 8

Question 8.
How do you observe moss plant through hand lens or dissection microscope? Draw the diagram and write the characteristics of moss plants.
Answer:

  • Collect mosses from the greenish velvety growth on bricks during rainy season.
  • Scrap a bit of the greenish velvety over a slide and observe under a dissection microscope.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 12

Observations :

  1. The structure that are seen in moss plants are not flowers but they are spores.
  2. Spores are formed in Sporangium.
  3. Spores contain very little amount of food.

Lab Activities

9th Class Biology Textbook Page No. 67

Question 1.
Observe slide of Hydra under a microscope. Draw the diagram and write your finding.
Observations :
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 13
a) Is the body made of single cell or a group of cells?
Answer:
The body of Hydra is made up of number of cells.

b) Did you find any hollow structure inside the body?
Answer:
The hollow structure found inside the body is called coelom or body cavity.

c) Did you find any other characters in it?
Answer:

  • The proximal or aboral end is drawn into a slender stalk on the end of which is the basal disc for attachment.
  • The free distal end or oral end bears the mouth which is situated on hypostome.
  • The hypostome is encircled by 6 -10 tentacles.
  • Bud is present at side with a mouth or tentacles like the parent.

Question 2.
Observe slide of tape worm (Taenea Solium) under microscope and write its external characters. Draw diagram of it.
Observations :
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 14
a) How does the body look like?
Answer:
1) The body of Taenia Solium (Tape worm) is long, dorso- ventrally, flattened, narrow, ribbon like.
2) Body consists of scolex or head, neck and strobila or body segments.

b) Did you see a body cavity in it?
Answer:
There is no true internal body cavity or coelom.

c) How does the anterior and posterior look like?
Answer:
The anterior (head) is smaller than the head of a pin. The posterior (tail) is very long and bigger than head and neck.

AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism

Question 3.
Observe slide of round worm (Ascaris) and write the characters of it by drawing the figure.
Observations :
a) Does the body look like the same as in the platyhelminthes?
Answer:
The body is round and cylindrical but not flat as in tape worm.

b) What are the differences you observed between tape worm and round worm?
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 15
Pseudocoelom is present, whereas it is absent in Tape worm. The head and tail are tapering at the ends.

Question 4.
Observe the specimen of earthworm and draw the diagram. Write its characters you have observed.
Observations :
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 16
Answer:

  1. The body of earthworm is bilaterally symmetrical and extensively segmented.
  2. The anterior end is tapering while posterior end is more less blunt.

a) Touch the skin of the earthworm and say how do you feel?
Answer:
The skin of earthworm is moist.

b) What is the colour?
Answer:
The colour of earthworm is dark brown in colour.

c) Are there any differences you observed in its body colour and among the body parts?
Answer:
The dorsal surface is darker than the ventral surface.

d) How does it move?
Answer:
Earthworm moves by alternate contractions of circular and longitudinal muscles.

e) Are there any ring like structures seen in its body?
Answer:
Ring like segments are present in earthworm.

9th Class Biology Textbook Page No. 68

Question 5.
Observe the specimen of Cockroach. Draw its diagram and write its characteristics.
Observations :
a) How does the skin look like? Did you observe any hard layer on the skin?
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 17
The entire body of cockroach is covered by a hard brown Coloured chitinous exoskeleton.

b) How many parts is the body divided into?
Answer:
The body is segmented and distinctly divisible into three parts

  1. Head
  2. Thorax
  3. Abdomen.

c) Observe the legs and says how does it look like.
Answer:
Three pairs of legs are present. Each leg consists of five segmented. Jointed legs are present.

d) Name some more animals whose legs are jointed as seen in Cockroach.
Answer:
Prawn, scorpion, grasshopper, ant, mosquito have jointed legs.

Question 6.
Observe the snail by keeping inside a glass beaker and observe its characters.
Observations :
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 18
a) How does the outer body look like?
Answer:
The outer body is covered with shell.

b) Keep the snail unmoved for sometime and when it starts moving observe its body.
Answer:
The animal creeps by its ventral muscular foot. The movement is gliding movement.

c) Is the body soft or hard?
Answer:
The body of the snail is soft.

d) Did you find any antennae like structure in it?
Answer:
Yes, Tentacles are present.

Question 7.
Observe specimen of starfish and write your observations.
This specimen belongs to Phylum echinodermata.
Observations :
a) What do you find on the skin of the starfish?
Answer:
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 19
Spines are present on the skin of the starfish.

b) Are there any arms and ray shaped structure in it?
Answer:
Most of them are pentamemal, it means they have five fold symmetry with rays of arms in fives.

c) Do you find a small hole in the middle of the starfish?
Answer:
In the middle of starfish a small whole is present which is the mouth of it.

Question 8.
Collect a fish from a fish monger and observe its external characters.
External characters of fish :
AP Board 9th Class Biology Solutions Chapter 5 Diversity in Living Organism 20
a) Observe the skin of the fish. How does it look like?
Answer:
Body is covered with scales.

b) Write the body parts of the fish where scales are not present.
Answer:
On the head, on the tail, fins and on the lower side of the fish.

c) Open the mouth of the fish. What do you seen in it ?
Answer:
Teeth are present in the mouth. Tongue is also present.

Activity – 9

Question 9.
Try to find out the scientific names of at least 10 organisms that you see around you.
Answer:
Scientific names of plants around us :

Name of the plant Scientific name
1. Mango Mangifera indica
2. Coconut Cocos nucifera
3. Thati Borassus flabellifer
4. Garika gaddi Cynodon dactylon
5. Paddy Oryza sativa
6. Plantain Musa paradisica
7. Banyan Ficus bengalensis
8. Indian Goose berry (Pedda Usiri) Emblica Officinalis
9. Thotakura Amaranthus gangeticus
10. Tulasi Ocimum sanctum
11. Teak Tectona grandis
12. Kanakambaram Crossandra infundibuliformis
13. Brinjal Solanum melongena
14. Sapota Achras zapota
15. Gaddi chamanthi Tridax procumbens
16. Dhaniyalu Coriandrum sativum
17. Guava Psidium guajava
18. Rose Rosa grandiflora
19. Chinta (Tamarind) Tamarindus indica
20. China rose Mandara Hibiscus rosa-sinensis

Scientific names of animals around us :

Name of the animal Scientific name
1. Crow Corvous splendens
2. Sparrow Passer domesticus
3. Frog Rana Tigrina
4. Dog Canis familiaris
5. Cat Felis domesticus
6. Chimpanzee Anthropithecus troglodytes
7. Chicken Gallus domesticus
8. Pigeon Columbialivia
9. Buffalo Bubalus bubalis
10. Honey bee Apis indica
11. Earthworm Pheretima posthuma
12. Cockroach Periplanata Americana
13. Leech Hirudinaria granulasa
14. Prawn Palaemon malcolmmsonii
15. Housefly Musca nebulo
16. Snail Pila globosa
17. Owl Bubo bubo
18. Indian cobra Naja naja
19. Domestic horse Equus cabalus
20. Green parrot Psittacula Krameri

AP Board 9th Class Biology Solutions

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

SCERT AP 9th Class Social Studies Guide Pdf 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 24th Lesson రోడ్డు భద్రతా విద్య

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాహన చోదకులు ఏ విధమైన ధృవపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి? ఏ విధమైన నైపుణ్యాలు భద్రతాపరమైన డ్రైవింగ్ కు అవసరం.? (AS1)
జవాబు:
వాహన చోదకులు ఈ క్రింది పేర్కొన్న ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.

  1. డ్రైవింగ్ లైసెన్స్
  2. వాహన రిజిస్ట్రేషన్
  3. వాహనం యొక్క ఇన్స్యూరెన్స్
  4. వాహనం యొక్క కాలుష్యరహిత ధ్రువపత్రం

భద్రతాపరమైన డ్రైవింగ్ కు నైపుణ్యాలు :

  1. రక్షిత, ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  2. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  3. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ లు ఉపయోగించాలి.
  4. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  5. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.

ప్రశ్న 2.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది? (AS1)
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను సూచించండి. (AS4)
జవాబు:
రోడ్డు భద్రతకుగాను మా ప్రాంతంలోని వివిధ వర్గాల వారు తీసుకుంటున్న చర్యలు :
డ్రైవర్ తీసుకుంటున్న చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదులుతున్నారు.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తారు.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
  5. అనవసరంగా హారన్ మోగించరు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగిస్తున్నారు.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతారు.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరు.

పాదచారులు పాటిస్తున్న నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడుస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడుస్తారు.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకుంటారు.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటుతారు.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉంటారు.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటుతారు. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగిస్తారు.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటుతారు.

ప్రశ్న 4.
తప్పనిసరిగా, జాగ్రత్తపడే, సమాచార నిమిత్తం ఉన్న ట్రాఫిక్ గుర్తులను ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
  2. సమాచార గుర్తులు
  3. జాగ్రత్తపరచే గుర్తులు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 4

ప్రశ్న 5.
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించింది. ఆమెకు ఏ విధమైన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమవుతాయో వివరించండి. (AS1)
జవాబు:
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించినప్పుడు ఆమెకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :

  1. అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
  2. రోడ్డుపై నడపటానికి వీలైనది అని తెలిపే ధ్రువీకరణ పత్రం
  3. వాహన బీమా ధ్రువపత్రం
  4. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
  5. నివాస రూఢీ ధ్రువపత్రం

శాశ్వత రిజస్ట్రేషన్ :
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటపుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్.టి.ఏ అధికారులకు ఒక నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 6.
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరే వాహనానికి మార్చాలని భావించాడు. ఇది చేయవచ్చా చేయకూడదా? ఎందుకో వివరించండి. (AS6)
జవాబు:
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరే వాహనానికి మార్చడానికి వీల్లేదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు, వేరొక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు పోలిక ఉండదు.

అలా మార్చడం వలన :

  1. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
  2. నియమ నిబంధనలకు వ్యతిరేకం.
  3. ఒక్కొక్క నెంబరు ప్రారంభం ఒక్కొక్క వాహనానికి వేరేగా ఉంటుంది.
  4. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఆర్.టి.ఏ. అధికారులకు అప్పగించిన ధృవపత్రాలలో తేడా రాకూడదు.
  5. అలా మార్చిన వాహనాలను ఆర్.టి.ఏ. అధికారులు సీజ్ చేస్తారు.

కాబట్టి ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరొక రిజిస్ట్రేషన్ నెంబరుకు మార్చకూడదు.

ప్రశ్న 7.
రోడ్డు భద్రతా ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:

  1. జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్ వంటి వాటి పెరుగుదల వాహనాల రద్దీని కూడా పెంచింది.
  2. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
  3. క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే.
  4. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డును ఉపయోగించుకునే ప్రతి ఒక్కరి బాధ్యత.
  5. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
  6. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండడమే గాక తోటి ప్రయాణికులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

ప్రశ్న 8.
పేజీ నెం. 286లోని ‘ప్రమాద బాధితులు – వయస్సు’ పట్టిక చదివి అత్యధిక కేసులు నమోదైన వయస్సు వారిని గుర్తించి, బార్ ను గీయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 5

ప్రశ్న 9.
పేజీ నెం. 287లోని ‘ట్రాఫిక్ ఇబ్బందులు’ అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఇప్పుడు ప్రతీ పట్టణంలో, నగరాలలో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనులు నిమిత్తం, ఉద్యోగ రీత్యా ప్రజలు వాహనాలనే ఉపయోగించే తమ ప్రయాణాలు చేయడం వలన ట్రాఫిక్ జాంకు కారణమౌతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, డాక్టర్లు ఇలా ఎందరో వివిధ పనుల నిమిత్తం బయలుదేరి ట్రాఫిక్ లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం, వీధుల్లో సంచరించే జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వాహనదారులు ముఖ్యంగా కారు, ఆటో రిక్షా వారు “నిలుపుటకు వీలులేదు” అనే ప్రదేశంలో వాహనాలు నిలుపుట వల్ల ట్రాఫిక్ జాంకు కారణమౌతున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు దగ్గర పనులకు నడవడం ద్వారా కొంత వరకు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య InText Questions and Answers

9th Class Social Textbook Page No.286

ప్రశ్న 1.
ఏ గ్రూపు వయస్సు వారిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? ఎందుకో మీరు చెప్పగలరా?
జవాబు:
25 – 30 సం||రాల మధ్య వయస్కులపై ఎక్కువ కేసులు ఉన్నాయి. వారిపై ఎక్కువ కేసులు ఉండటానికి కారణం :

  1. ప్రతి విషయంలోనూ ఈ వయస్సువారు దుడుకుతనంతో వ్యవహరిస్తారు.
  2. తనకు నచ్చినట్లే చేయాలనే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు.
  3. వివిధ అవసరాల నిమిత్తం రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నది కూడా ఈ వయస్సు వారే.
  4. ఈ వయస్సులోనివారు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తున్నది.
  5. కాబట్టి ఈ వయస్సు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.

ప్రశ్న 2.
20 – 25, 25 – 30 వయస్సు వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి?
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

9th Class Social Textbook Page No.287

ప్రశ్న 3.
ఈ చిత్రాన్ని పరిశీలించి ప్రమాదాలకు గురైన వాహనాల యొక్క సమాచారంతో మీ తరగతిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1

హైదరాబాద్ నగరం

ద్విచక్ర వాహనాల ప్రమాదాల శాతం 30%
త్రిచక్ర వాహనాల ప్రమాదాల శాతం 11%
నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల శాతం 28%
డి.సి.యంల ప్రమాదాల శాతం 3%
తెలియని వాహనాల ప్రమాదాల శాతం 5%
ఆర్టీసీ బస్సుల ప్రమాదాల శాతం 11%
ప్రైవేట్ బస్సుల ప్రమాదాల శాతం 1%
ట్రక్కుల ప్రమాదాల శాతం 5%
టెంపోట్రాలి ప్రమాదాల శాతం 2%
ఇతరములు 4%
మొత్తం ప్రమాదాల సంఖ్య 2577

ప్రశ్న 4.
ఏ రకమైన వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకో చెప్పగలవా?
జవాబు:
ద్విచక్రవాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకంటే

  1. యువకులు ఆ వాహనాలను ఎక్కువగా ఉపయోగించటం.
  2. వారు రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోవటం.
  3. ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరగటం సులభతరం.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.

9th Class Social Textbook Page No.288

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ, మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీచేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసిఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

9th Class Social Textbook Page No.290

ప్రశ్న 7.
మీ టీచర్ సహాయంతో రోడ్డు ఉపరితలంపై సూచించే గుర్తులను ఆర్.టి.ఏ అధికారులు / ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి వివిధ గుర్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
రోడ్డుపైన సూచించే గుర్తులు :
రోడ్డు ఉపరితలంపై పొదచారుల కోసం, వాహన చోదకులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని, అగమ్యాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తులను ఉపయోగిస్తారు.

1) పాదచారుల దారి :
రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి. ఇది సుమారు రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.

2) డివైడర్ :
రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేది.

3) జీబ్రా క్రాసింగ్ :
పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించినది.

రోడ్డుపై సూచించే గుర్తుల వల్ల ప్రయోజనాలు :

  1. పాదచారుల దారి మీదకు వాహనాలు ఏవీ రావు కాబట్టి పాదచారులు నడవటానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రమాదాలు సంభవించవు.
  2. రోడ్డును రెండు సమానభాగాలుగా విభజించటం వలన ఏ విధమైన రాకపోకలకు అవాంతరాలు ఎదురుకావు మరియు ప్రమాదాలు జరగవు.
  3. జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశము. వాహనాలు జీబ్రా క్రాసింగ్ గుర్తులున్నచోట నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి పాదచారులు రోడ్డు దాటవలసి వస్తే ఇక్కడే దాటాలి. దీనితో ప్రమాదాలు నివారించబడతాయి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీకు అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ / ఆర్.టి.ఎ అధికారులను అడిగి క్రింది విషయాలు సేకరించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 3
మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులను తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 6

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

SCERT AP 9th Class Social Studies Guide Pdf 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 23rd Lesson విపత్తుల నిర్వహణ

9th Class Social Studies 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రకృతి ప్రమాదాలు ఏవిధంగా విపత్తులు మారుతున్నాయో వివరించండి. (AS1)
జవాబు:

  1. ప్రణాళికలు లేకుండా నగరాలు విస్తరించడం.
  2. మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం.
  3. జనాభా వేగంగా పెరగడం.
  4. మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
  5. ఈ విపత్తులు వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
  6. దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది.
  7. వీటితోపాటు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరగడం వల్ల వాటివల్ల విలువైన ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తున్నాయి.
  8. వీటితోపాటు అగ్నిప్రమాదాలు, వరదలు, కరవుకాటకాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
ఉగ్రవాదం అనగానేమి? వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఉగ్రవాదం అనగా :
హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ, తమ కోర్కెలను సాధించుకొనేందుకు చేపట్టే ఉగ్ర భయంకర దుష్ట చేష్టలనే ఉగ్రవాదము అంటారు.

ఉగ్రవాదం యొక్క లక్ష్యాలు :

  1. యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరిపోయి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణము కావడం.
  2. అల్లర్లను సృష్టించి, ప్రశాంత వాతావరణం లేకుండా చేయడం.
  3. సైనికులను, సామాన్య ప్రజానీకాన్ని భయ భ్రాంతులకు గురి చేయడం.
  4. రక్తపాతాన్ని సృష్టించడం.
  5. మందు పాతరలు పెట్టి రైళ్ళను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, సైనికులను చంపడం వంటివి చేయడం.
  6. పిల్లలు కూడా నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి / హెచ్చరిక జారీ చేయండి.
  2. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
  3. ఫోను ఎక్కడుందో తెలుసుకుని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి.
  4. పొగ ఉన్నప్పుడు నేలమీద పాకుతూ వెళ్లండి. వేడిగాలి, పొగ పైకి లేస్తాయి కాబట్టి నేల దగ్గర గాలి బాగుంటుంది.
  5. మీరు బైటకు వెళ్లేదారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్లండి. తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి. కిటికీ తలుపు తెరిచి సహాయం కోసం అరవండి.
  6. తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనకనున్న వాళ్లు తలుపులు వేసుకుంటూ రావాలి.
  7. విద్యుత్తు స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టెయ్యటం ఉత్తమం.
  8. అతుకులు, పలు ఉన్న విద్యుత్తు తీగలు, కేబుళ్లకోసం చూడండి. ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి. ప్లగ్ పాయింట్లు కిందకల్లా ఉంటే, ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికీ టేపు వేసేసి ఉంచాలి. లేకపోతే చిన్నపిల్లలు వాటిల్లో వేళ్లు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
  9. బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను గమనించండి. ఏవైనా గోడలు నెమ్ముకుంటూ ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేసి, విద్యుత్తు తీగలను మార్చివేయాలి. నిప్పు, లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి/హెచ్చరిక జారీ చేయండి.
  10. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.

చేయగూడనివి :

  1. మీ బొమ్మలు, పెంపుడు జంతువులు వంటి వాటికోసం అగ్నిప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్లీ వెళ్లవద్దు. అగ్నిమాపకదళం మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలరు.
  2. మంచం కిందగానీ, అలమర లోపలగానీ ఎప్పుడూ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్లాలి.
  3. చాపలు, తివాచీ వంటి వాటికింద నుంచి విద్యుత్తు తీగలు, కేబుళ్లు వంటివి తీస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది.
  4. తేలికగా కాలిపోవటానికి వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్తు బల్బులు అమర్చగూడదు.

ప్రశ్న 4.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలేవి? వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలు :

  1. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం.
  2. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం.
  3. తాగి వాహనం నడపటం.
  4. వాహనాలు సరైన స్థితిలో ఉండక పోవటం.
  5. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు :

  1. మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
  2. వాహనాలను నడిపేవారు మందులను తీసుకుంటూ నడపరాదు.
  3. అలసిపోయి ఉన్నవారు, అలసట ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  4. జబ్బుపడినవారు, గాయాల పాలైన వారు వాహనాలను నడపరాదు.
  5. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  6. రోడ్డు మీద అసహనంగా ఉండరాదు. రోడ్డు మీద పరుగులు తీయరాదు.
  7. మలుపు / మూల వద్ద రోడ్డును ఎప్పుడూ దాటరాదు.
  8. బస్సు / వాహనం ఎక్కటానికి పరుగులు పెట్టరాదు.
  9. ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  10. బస్సు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.

మొదలైన చర్యలు జాగ్రత్తగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చును.

ప్రశ్న 5.
ఉగ్రవాదుల దాడుల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. వీరి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వారి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. రవాణా వాహనాలలో, బహిరంగ ప్రదేశాలలో ఎవరికీ చెందని సూట్ కేసు, సంచి వంటిని గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి. ఎందుకంటే వాటిలో పేలుడు పదార్థాలు ఉండవచ్చు.
  2. “100” నంబరుకి పోలీస్ కంట్రోలు రూమ్ కి ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసే హక్కు ఉంది. తద్వారా ప్రమాదాన్ని వారి ద్వారా నివారించవచ్చు.
  3. పోలీసులకు తెలియజేసిన పిదప అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచాలి. ఇతరులను కూడా దాని నుంచి దూరంగా ఉండమని చెప్పాలి.
  4. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వారి ప్రవర్తనపై, నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  5. పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం కాబట్టి భద్రత పట్ల అవగాహన కల్పించటానికి వివిధ సంస్థలు తమ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రజలను జాగృతం చేయాలి.
  6. ఉగ్రవాదాన్ని ఎదుర్కోటానికి, క్షేమకర జీవితం గడపటానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేస్తారు. వాటి గురించి తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 6.
రైలు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరుచుగా జరిగే రైలు ప్రమాదాలకు గల కారణాలు :

  1. రైలు ప్రమాదాలకు కారణాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి.
  2. రైలు మార్గాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  3. విద్రోహ చర్యలు, కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  4. మానవ పొరపాట్లు, అప్రమత్తంగా లేకపోవడం.
  5. గ్యాస్, పెట్రోల్, బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
  6. రైలులో పొగత్రాగడం, సిగరెట్, బీడీ వంటి వాటి వలన కూడా అగ్ని ప్రమాదాలు రైలులో జరుగుటకు కారణం.
  7. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదాలకు మూలమౌతున్నాయి.

ప్రశ్న 7.
మీ గ్రామంలో, పాఠశాలలో, మీ ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలను గుర్తించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలో, పాఠశాలలో, మా ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలు :

  1. మలుపు / మూలల దగ్గర రోడ్డు దాటేటప్పుడు.
  2. పాఠశాల వదిలి పెట్టిన సమయం.
  3. బస్సు / వాహనం ఎక్కడానికి పరుగులు తీసే సమయం.
  4. బడివాళ్ళు నిర్దేశించిన బస్సులు తప్పించి ఇతర బస్సులు ఎక్కే సమయం.
  5. ట్రాఫిక్ సిగ్నళ్ళు పాటించకపోవడం.
  6. జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోటనే రోడ్డును దాటకపోవడం వంటి సమయాలు.

ప్రశ్న 8.
భారతదేశ పటంలో ఉగ్రవాదుల దాడులకు గురైన ఈ కింది నగరాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ఎ) ముంబై బి) హైదరాబాద్ సి) భాగల్ పూర్ డి) కుంభకోణం ఇ) బెంగళూరు
AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ 1

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక ప్రమాద సంబంధ వైపరీత్యం గురించి రాయండి. (AS6)
జవాబు:
ఇటీవల కాలంలో మా జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన రైలు ప్రమాదం జరిగింది. దీని కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకు గాయాలపాలయ్యారు. విజయనగరం దగ్గరి గొట్లాం సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో పొగచిమ్మగా, పెద్ద ప్రమాదం రైలులో సంభవిస్తుందని తోటి ప్రయాణికులలో అలజడులు రేగగా, ఆ పుకార్లు షికార్లు చేసి భయంతో ప్రయాణీకులు గొలుసులాగి, ఎదురుగా పట్టాలపై పరిగెత్తసాగారు. అదే సమయంలో విజయవాడ వెళుతున్న రాయగడ పాసింజర్ ఈ ప్రయాణీకులను ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయారు. ఇది నాకు తెలిసిన ఇటీవల జరిగిన అత్యంత ప్రమాద సంబంధ వైపరీత్యం.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 10.
పేజీ నెం. 281లోని ‘అగ్ని ప్రమాదం’ అంశం చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణ వాయువు – ఈ మూడు కలిసినపుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, లేదా అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి విపరీత నష్టాలకు మూలమౌతున్నాయి.
ఉదా :
తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చేయాలో టీచర్లకు, విద్యార్థులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే ఇటువంటి సందర్భాలలో అపాయం నుంచి తప్పించుకోవచ్చు.

9th Class Social Studies 23rd Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.277

ప్రశ్న 1.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి? దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా? ముంబాయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి? భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలనేవి కొంతవరకు సహజమైనవి. కొంతవరకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి.

మానవులు చేసే తప్పులను దిద్దుకుంటే కొన్ని వైపరీత్యాలను నివారించవచ్చు. ముంబయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుంటే పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు :

  1. ఏ ప్రణాళికా లేకుండా నగరం విస్తరించటం.
  2. మురుగునీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం.
  3. జనాభా వేగంగా పెరగటం వంటి కారణాల వలన, భారీ వర్షాల వలన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యం పైన కూడా దీర్ఘకాల ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యాలలో సహజమైనవాటికి ఉదాహరణగా వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి అంశాలను పేర్కొనవచ్చు.

అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు వంటి వాటిని మానవ కారక వైపరీత్యాలుగా చెప్పవచ్చును.

9th Class Social Textbook Page No.279, 280

ప్రశ్న 2.
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు ఏవి?
జవాబు:
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు :

  1. రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడండి. రైలు గేటును గమనిస్తూ ఉండండి.
  2. గార్డులేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండువైపులా చూసిన తరవాత పట్టాలు దాటాలి.
  3. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
  4. ప్రయాణీకులను తరలించడానికి వీలుకాని వంతెన మీద, సొరంగాల వద్ద రైలును, రైలింజన్ డ్రైవర్లు ఆపకూడదు.
  5. మండే గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
  6. నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడరాదు. బయటకు తొంగి చూడరాదు.
  7. ఆగి ఉన్నలేదా కదులుతున్న రైలులోంచి మీ తల, చేతులు బయటపెట్టరాదు.
  8. స్టేషనులో రైలు పట్టాల మీదుగా దాటరాదు. ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించండి.
  9. అనుమానాస్పద వస్తువులను తాకరాదు. పట్టాలమీద, రైల్వే యార్డులలో ఆటలు ఆడవద్దు. రైలుబోగీలు ఉన్నట్టుండి కదలడం వల్ల అక్కడ ఉన్నవారు ప్రమాదానికి గురవుతారు.
  10. కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు. దీనివల్ల తీవ్రగాయాలు అవుతాయి.

9th Class Social Textbook Page No.281

ప్రశ్న 3.
విమానం ఎక్కినప్పుడు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతలను తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి.
  2. మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి.
  3. దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి.
  4. సీటులో కూర్చుని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకుని ఉండండి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 4.
విమాన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. విమాన సిబ్బంది చెపుతున్నది విని, అనుసరించండి. మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత.
  2. అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు. కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవవద్దు. తలుపు తెరిస్తే మంటలు లోపలికి వ్యాపిస్తాయి. బయటకు వెళ్ళటానికి ఉన్న మరొక దారిని ఉపయోగించండి.
  3. పొగ పైకి లేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేలమీదకి ఉండండి.
  4. నేలలో ఉండే అత్యవసర దీపాలను అనుసరించండి. ఇవి బయటకు వెళ్లే ద్వారాలను సూచిస్తాయి.
  5. మీ దగ్గర గుడ్డ | రుమాలు ఉంటే ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకోండి.

9th Class Social Textbook Page No.283

ప్రశ్న 5.
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్నిప్రమాదాలు తగ్గించటంలో మీరు పాటించగల మెలకువల గురించి తెలుసుకోండి.
జవాబు:
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్ని ప్రమాదాలను తగ్గించటంలో మేము పాటించగల మెలకువలు గురించి తెలుసుకున్నాము. అవి :

  1. నిప్పుతో ఆటలాడరాదు.
  2. నిప్పు అవసరము తీరిన వెంటనే ఆర్పవలెను.
  3. సిగరెట్లు, బీడీలు కాల్చువారు కూడా సిగరెట్టు, బీడీ కాల్చుకుని మండుతున్న అగ్గిపుల్లను విసిరేసి వెళ్లిపోతారు. అది ప్రక్కన ఉన్న చెత్త చెదారంతో కలిసిపోయి పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  4. అలాగే సిగరెట్లు, బీడీలు కాల్చుకుని ఆర్పివేయకుండా విసిరేసి వెళ్ళిపోతారు. దాని వలన కూడా పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  5. గ్రామీణ ప్రాంతాల యందు కట్టెల పొయ్యి మీద అన్నం, కూరలు వండి, నిప్పును ఆర్పకుండా వారు వేరే పనులలో నిమగ్నమైపోతారు. అలాంటి సమయాలలో కూడా పెద్ద పెద్ద మంటలు ఏర్పడవచ్చును.
  6. అలాంటి పరిస్థితులు వీలైనంత వరకు తటస్థపడకుండా జాగ్రత్తలు వహించాలి.
  7. అతుకులు, పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు ఉపయోగించరాదు.

ప్రశ్న 6.
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. ఉద్రేకానికి లోనవ్వవద్దు.
  2. స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి.
  3. వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి. లేదా టీ.వి. చూడండి.
  4. మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి. ప్రథమచికిత్స చేయండి. తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి.
  5. దెబ్బతిన్న పరికరాలను ఆపివేయండి.
  6. పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి. లేదా గదిలో బంధించి ఉంచండి.
  7. మీ కుటుంబ మిత్రులకు ఫోను చేయండి. ప్రాణానికి ముప్పు ఉంటే తప్పించి మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు.
  8. మీ చుట్టు పక్కల వాళ్ళ గురించి, ప్రత్యేకించి వృద్ధులు, వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి.

9th Class Social Textbook Page No.284

ప్రశ్న 7.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను గుర్తించండి. అవి చిన్న పిల్లల మీద చూపే ప్రభావాన్ని
వివరించండి. జ. భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలు : .

  1. ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులు.
  2. హైదరాబాద్ లోని బాంబు పేలుళ్ళు.
  3. బెంగళూరులోని ‘బాంబు పేలుళ్ళు.

ఉగ్రవాదుల దాడులు చిన్న పిల్లల మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాలలో పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

పిల్లలు పాఠశాలకు హాజరు కావటానికి, సాధారణ జీవితాలు గడపటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా ఇటీవల సంభవించిన మానవ విపత్తులు సమాచారాన్ని సేకరించండి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ ప్రాంతంలో సంభవిస్తే నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొంటారు.?
జవాబు:
మానవ విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒక మానవునిగా తోటి మానవుని ఆదుకోవటానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది.

వారికి బట్టలు సరఫరా చేయటం కాని, ఆహార పదార్థాలు సరఫరా చేయటం కాని, ఇతర గృహనిర్మాణ సామానులు కాని, గృహోపకరణములు గానీ సరఫరా చేయటం జరుగుతుంది.

పశువులకు పశుగ్రాసం నష్టం వాటిల్లితే దానిని అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఉగ్రవాదం వలన సంభవించే వివిధ రకాల నష్టాలను పట్టిక ద్వారా చూపండి.
జవాబు:
ఉగ్రవాదం – వివిధ రకాల నష్టాలు

  1. మానవ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.
  2. జనజీవనం అల్లకల్లోలం
  3. వందల మంది మరణాలు
  4. వేలమంది క్షత్రగాత్రులు
  5. కోట్ల విలువైన ఆస్తినష్టాలు
  6. ప్రపంచ మేధావులలో అభద్రతా భావాలు
  7. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు
  8. అమాయక ప్రజల ఆర్తనాదాలు
  9. మత సామరస్య విఘాతం
  10. అభివృద్ధి కుంటుపడటం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 21th Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కులలో భాగం కాదు? (AS1)
అ) బీహార్ కార్మికులు పంజాబ్ కి వెళ్ళి అక్కడ పనిచేయడం.
ఆ) అల్పసంఖ్యాక మత వర్గం బడులు నడపటం.
ఇ) ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులకు ఒకే జీతం లభించటం.
ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.
జవాబు:
(ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు? (AS1)
అ) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ.
ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.
ఇ) ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టే స్వేచ్ఛ.
ఈ) రాజ్యాంగ మౌళిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ.
జవాబు:
(ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం, హక్కులకు మధ్యగల సంబంధాల గురించి కింద పేర్కొన్న వాటిల్లో ఏది సరైనది? మీ ఎంపికకు కారణాలు పేర్కొనండి.
అ) ప్రజాస్వామికమైన ప్రతిదేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.
ఆ) పౌరులకు హక్కులు ఇచ్చే ప్రతి దేశం ప్రజాస్వామిక దేశం అవుతుంది.
ఇ) హక్కులు ఇవ్వటం మంచిదే, కాని ప్రజాస్వామ్యానికి అవి తప్పనిసరి కాదు. (AS1)
జవాబు:
ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది :
మనదేశం శతాబ్దాల పాటు, రాజులు, రాణుల పాలనలో ఉండగా, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, దేశ భవిష్యత్, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలు తమకు తాము పరిపాలించుకోవాలని నిర్ణయం మొదట తీసుకున్నాం. రాజ్యాంగంలో సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఉండాలని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ అందించబడింది. ప్రజాస్వామ్యంలో భాగాలే పౌరులకు కల్పించే హక్కులు: ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించడానికి పౌరులకు అందించే హక్కులు మార్గదర్శకాలు. ప్రజాస్వామ్యంలో ఇతరులు తమ హక్కులను అనుభవించనిచ్చే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యపు హక్కుకు దిగువ పేర్కొన్న పరిమితులు విధించటం సరైనదేనా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి.
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి.
ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు.
ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది. (AS2)
జవాబు:
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి :
స్వాతంత్ర్యపు హక్కులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్యా, భద్రత దృష్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి లేదు. కొన్ని సరిహద్దు ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే క్రమంలో పౌరులు సంచరించే వీలులేదు. సరిహద్దు ప్రాంతాలలో ఇరు ప్రాంతాలు, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎదురవ్వవచ్చు. అటువంటి సమయాలలో ప్రజలు సంచరిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. కాబట్టి సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతిలేదు.

ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు :
స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనవచ్చును. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అనైతికమైన, ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టరాదు. రాజ్యాంగం పౌరులకు ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం ఏ ప్రాంతంలోనైనా చేపట్టవచ్చు. అయితే చేసే వ్యాపారం వల్ల ఇతరులకు ఇబ్బంది, అన్యాయం, అక్రమాలు చోటు చేసుకోకూడదు. ఆస్తులు (కొనాలన్నా, అమ్మాలన్నా) ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్రయ విక్రయాలు జరగాలి.

ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది :
భారత రాజ్యాంగం స్వాతంత్ర్యపు హక్కు ద్వారా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు అనుగుణంగా వివిధ ప్రచురణలకు, భావ వ్యక్తీకరణలకు అవకాశం కల్పించింది. తమ భావాలను, అభిప్రాయాలను, వాస్తవ విషయాలను పత్రికలు, ప్రచురణలు ద్వారా పాఠక లోకానికి తెలియజేయవచ్చు. అయితే ఆ ప్రచురణలో వ్యక్తిగత దూషణలు, అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు చేయకూడదు. ఒకవేళ ప్రచురణకు పూనుకుంటే దానికి తగిన రుజువులు, సాక్ష్యాలు పొందుపరచవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
ఈ అధ్యాయం, గత అధ్యాయం చూసి రాజ్యాంగం ఇచ్చిన ఆరు ప్రాథమిక హక్కుల జాబితాను తయారుచేయండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ హక్కులు ఉల్లంఘించ బడినప్పుడు అత్యున్నత న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చును. ప్రాథమిక హక్కులు 6. అవి :

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్ర్యపు హక్కు
  3. మత స్వాతంత్ర్యపు హక్కు
  4. పీడనాన్ని నిరోధించే హక్కు
  5. సాంస్కృతిక, విద్యావిషయక హక్కు
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాటిల్లో ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా? అలా అయితే ఏ హక్కు లేదా హక్కులు – ఉల్లంఘింపబడుతున్నాయి? తరగతిలో మీ తోటి విద్యార్థులతో చర్చించండి. (AS1)
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషనులో ఉంచారు.
ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం.
ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారర్ సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేయటానికి పంపిస్తున్నారు.
ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
జవాబు:
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్లో, ఉంచారు :
చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం , హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. చట్టరక్షణ సమానంగా వర్తిస్తుంది. అయితే చట్ట అతిక్రమణ జరిగినట్లు తెలిస్తే, ఫిర్యాదులు వస్తే, వాటికి సంబంధించిన వ్యక్తులకు ముందుగా తెలియజేసి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచవచ్చు. కాని 24 గంటలలోపు ఆ వ్యక్తులను కోర్టులకు అప్పగించాలి. అంతేగాని నేరం రుజువు కాకుండా, 4 రోజులు పోలీసుస్టేషన్లో ఉంచడం చట్టరీత్యా నేరం. అ కారణంగా అరెస్టు చేస్తే ఆ వ్యక్తి తను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంది.

ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం :
ప్రజాస్వామ్యం పౌరులకు ప్రాథమిక హక్కులు అందించింది. వాటిని సక్రమంగా, హుందాగా అనుభవించాలని, అవసరమైతే చట్టాలు, న్యాయస్థానాలు ద్వారా లబ్ధిపొందాలని రాజ్యాంగం తలచింది. అయితే ఏ వ్యక్తి కూడా దురాక్రమణ పూర్వకంగా, ఇతరుల ఆస్తులను, సంపదలను ఆక్రమించటానికి అవకాశం లేదు. తాత తండ్రుల నుండి పౌరులు సంపాదించిన ఆస్తులకు సంబంధించి, రిజిష్టర్డ్ ‘ దస్త్రాలు, రుజువు పత్రాలు ఉంటాయి. వాటిని కాదని ఆస్తిలో సగభాగం తనదని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరం. అటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తాయి.

ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారం సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పని చేయటానికి పంపిస్తున్నారు.
2002లో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందించాలి. తమ పిల్లలు క్రమం తప్పకుండా బడికి హాజరు అయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలు అందుకొని, పిల్లలను పెంచి పోషించి తగిన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. 14 సం||ల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, అగ్గిపెట్టెలు, టపాకాయలు, అద్దకం వంటి ప్రమాదకరమైన పనులలో పెట్టడం నేరం. అలా చేస్తే తల్లిదండ్రులకు కూడా చట్టరీత్యా శిక్షలు అమలుచేస్తారు.

ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును భారత రాజ్యాంగం తొలగించింది. అయితే ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి, రుజువు పత్రాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి, పెద్ద మనుషుల ఒప్పందాలు చాలా ముఖ్యం. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిని నీ సోదరుడు ఇవ్వటానికి నిరాకరిస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, వాటి ద్వారా వారికి రావలసిన ఆస్తి వాటాను పొందవచ్చును.

ప్రశ్న 7.
మీరు ఒక న్యాయవాది అనుకోండి. కొంతమంది ప్రజలు దిగువ పేర్కొన్న విన్నపంతో మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళ తరఫున మీరు ఏవిధంగా వాదిస్తారు?
“ఎగువన ఉన్న కర్మాగారాల వల్ల మా ప్రాంతంలోని నదీజలాలు బాగా కలుషితం అవుతున్నాయి. మాకు మంచినీళ్ళు ఈ నది నుంచే వస్తాయి. ఈ నీళ్ళు కలుషితం కావటం వల్ల మా ఊరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మేం ప్రభుత్వానికి ఫిర్యాదు . చేశాం. కాని వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.” (AS4)
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సుఖంగా నివసించటానికి, ఆనందంగా బ్రతకడానికి, స్థిరపడడానికి హక్కుంది. తను జీవనం సాగించే ప్రదేశంలో తనకు నష్టం కలిగించే చర్యలు, అపాయం, హానికరం కలిగించే కార్యక్రమాలు ఎవరూ చేపట్టకూడదు. కర్మాగారాలు విడిచే హానికరమైన వ్యర్థాలు ద్వారా నదీజలాలు కలుషితమయ్యి, ప్రమాదకరమైన జబ్బులు, ప్రాణాపాయం కలగవచ్చు. తద్వారా మనిషి జీవనం దుర్భరమౌతుంది. అటువంటి సందర్భాలలో వ్యక్తులకు న్యాయస్థానాల ద్వారా, చట్టాల ద్వారా రక్షణ కల్పించాలి.

ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కర్మాగారాల యజమానులను అరెస్టులు చేస్తారు. దానికి నివారణా చర్యలు, ప్రతి చర్యలు ద్వారా, ఈ కలుషితాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. .. అవసరమైతే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించుటకు కృషి చేస్తాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్రశ్న 8.
“బిరుదుల రద్దు” అన్న శీర్షిక కింద ఉన్న వాక్యాలను చదివి ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి.
ఈ బహుమతులు పొందిన వ్యక్తి దానిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. ఎందుకు? (AS2)
జవాబు:
రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టమొచ్చినట్లు, అసమానంగా విభజించటాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎటువంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధం విధించింది. భారతదేశ పౌరులు ఇతర దేశాల బిరుదులను తీసుకోకూడదు. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పతకాలు పొందవచ్చు. భారతరత్న, పరమవీరచక్ర, పద్మవిభూషణ్ వంటి పతకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి, ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక హక్కుల ఉల్లంఘన సందర్భాన్ని విశ్లేషించండి. (AS6)
జవాబు:
రాజ్యాంగం మనకు అందించిన అద్భుతమైన గొప్ప అవకాశం ప్రాథమిక హక్కుల కల్పన. అయితే ఇటీవల సమానత్వపు హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం (అంటరానితనాన్ని) రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దు పరిచింది. ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్లు చట్టరీత్యా శిక్షార్హులు. జైలుశిక్ష కూడా పడుతుంది. కాని ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కొన్ని సందర్భాలలో మేం గమనిస్తున్నాం. గ్రామాలలో టీక్లబ్ వద్ద రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉంది. అంతేకాకుండా హరిజన కాలనీలు, గిరిజన కాలనీలని గ్రామాలకు దూరంగా ఇండ్లను కడుతున్నారు. – అదే విధంగా స్వాతంత్రపు హక్కులో భాగంగా జీవించే హక్కు ముఖ్యమైనది. జీవించే హక్కులో 2002లో విద్యాహక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. కాని ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, అధిక ఫీజులు, భరించలేని శిక్షలు, ప్రభుత్వ సూచనలు పట్టించుకోని యాజమాన్యం, అధిక ఒత్తిడితో బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా నేను హక్కుల ఉల్లంఘనలను గమనిస్తున్నాను.

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.255

ప్రశ్న 1.
గత సంవత్సరం మీరు చదివిన రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన కొన్ని అంశాలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి. ఈ విలువలు భారత రాజ్యాంగ “పీఠిక”లో పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌళిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేం ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”

9th Class Social Textbook Page No.259

ప్రశ్న 2.
ఏ రకమైన సమానత్వపు హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తోంది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తోంది. ఇందులో ఉన్న ముఖ్యమైన హక్కులు :

1. చట్టరక్షణలో సమానత్వం : ఉదా : చట్టరక్షణ సమానంగా లభిస్తుంది. భారతీయ పౌరుల కులం, వర్ణం, లింగ, మతం, హోదా వంటి వాటికి ప్రాధాన్యత లేదు. వివక్షత చూపరాదు. తప్పు చేస్తే ప్రధానమంత్రి అయినా శిక్షార్హుడే.

2. సామాజిక సమానత్వం : ఉదా : పౌరులు, దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు మరియు ప్రభుత్వం అందించు సదుపాయాలు ఉపయోగించుకోవడానికి అడ్డులేదు.

3. అవకాశాలలో సమానత్వం : ఉదా : మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు. వివక్షతకు గురి కాకూడదు.

4. అస్పృశ్యత నిషేధం : ఉదా : అంటరానివాళ్ళుగా ఎవరినీ పరిగణించరాదు.

5. బిరుదులు రద్దు : ఉదా : రాచరికపు బిరుదులను రాజ్యాంగం నిషేధించింది.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
సమానత్వపు ప్రాథమిక హక్కును కింద పేర్కొన్నవి ఉల్లంఘిస్తున్నాయేమో చర్చించండి. ఇలా చేయటం రాజ్యాంగ రీత్యా సరైనదో, కాదో చర్చించండి.
– వీధిలోని నల్లా (కుళాయి) నుండి నీళ్ళు పట్టుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి కుండ తనక కుండకు తగిలిందని ఒక వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు.
– కొన్ని ప్రత్యేక కులాలకు చెందిన వారనే నెపంతో కొందరు పిల్లలను పాఠశాలల్లో మంచినీళ్లు ఇతరులకు పోయనివ్వరు.
– కొన్ని వర్గాల ప్రజలను ఊరిలో కాకుండా ఊరిబయట మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు.
– ప్రార్థనా స్థలాలకు వెళితే తమను అవమానిస్తారనీ, లేదా కొడతారనీ చాలా సమూహాల ప్రజలు అక్కడకు వెళ్ళరు.
జవాబు:
సమానత్వపు ప్రాథమిక హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం పొందుపరిచారు. ఏ రూపంలోనైనా అంటరాని తనాన్ని రాజ్యాంగం రద్దు పరిచింది. అస్పృశ్యతను ఎవరైనా పాటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు. వారికి జైలు శిక్ష కూడా పడవచ్చు. వీధులలో పబ్లిక్ కుళాయిలలో కులమతాలకు అతీతంగా నీటిని పొందవచ్చు. అక్కడ కులం ఆధారంగా వివక్షత చూపిస్తే, ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా నేరం. చాలా గ్రామాలలో కొన్ని వర్గాల ప్రజలను అంటరాని వాళ్ళుగా, తక్కువ కులాల వారిగా పరిగణించి, ఊరిలోకి రానీయకపోయినా, ఊరి బయట బహిష్కరణకు గురిచేసినా తీవ్ర శిక్షకు గురౌతారు. అంతేకాకుండా మన రాజ్యాంగం లౌకికతత్వానికి ప్రాధాన్యతనిస్తూ, అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తూ, అన్ని మతాలను గౌరవిస్తుంది. కాని కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేవాలయాలకు కొంతమందిని అనుమతించకపోవడం, ప్రవేశం నిషేధించడం చట్టరీత్యా నేరం. అటువంటి సంఘటనలు జరిగినచో వారు ఫిర్యాదు చేస్తే దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
రాజ్యాంగంలో సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
రాజ్యాంగం ద్వారా సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే సమన్యాయపాలన దెబ్బతింటుంది. చట్టరక్షణ సమానంగా లభించదు. అస్పృశ్యత అధికమౌతుంది. సంపన్నులు, మేధావులే ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వారికి అవకాశాలు అందవు. దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు, ప్రభుత్వ సదుపాయాలు అందరికీ అందవు. సామాజిక సాంప్రదాయం దెబ్బతింటుంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వెనుకబడినవారు అణగదొక్కబడతారు.

9th Class Social Textbook Page No.261

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో ఎటువంటి సంఘాలు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో మహిళా, డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వైద్య సంఘాలు, వ్యాపార సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
కార్మిక సంఘాలు ఎందుకు ఏర్పడతాయి? అవి ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?
జవాబు:
కర్మాగారాలలో కార్మిక సంఘాలు, తమ కోరికల సాధన కొరకు సంఘాలుగా ఏర్పడతాయి. తమ కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాల కొరకు, అధిక మొత్తంలో జీతాలు కొరకు, వసతి సదుపాయాలు కొరకు, ప్రమాదాల కాలంలో జరిగిన నష్టాలకు పరిహారం గూర్చి, కార్మిక సంఘాలు, కర్మాగారాల యజమానుల నుండి లబ్ది పొందడానికి సంఘాల అవసరం ఉంది.

సంఘాలు ఎదుర్కొనే సమస్యలు :

  1. లాకౌట్లు
  2. తక్కువ సదుపాయాలు
  3. ఎక్కువ పనిగంటలు
  4. ఆరోగ్య సమస్యలు
  5. ఆలస్య జీతాలు
  6. యజమానుల నిరంకుశత్వాలు
  7. ఏకపక్ష నిర్ణయాలు
  8. శాశ్వతం కాని ఉద్యోగాలు
  9. నిరంతరం ఇబ్బందులు

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 7.
ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు స్థిరపడాలనుకుంటారు?
జవాబు:

  1. రోజురోజుకూ అంతరించిపోతున్న కులవృత్తులు.
  2. లాభసాటిగా లేని వ్యవసాయ పనులు.
  3. ఉపాధి, అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు.
  4. గ్రామాలలో లభించే తక్కువ కూలిరేట్లు.
  5. నిరంతరం కరువు కాటకాలు, తుపానులు, వరద బీభత్సాలు.
  6. పట్టణాలలో, నగరాలలో విరివిగా లభించే ఉద్యోగాలు.
  7. తక్కువ పని గంటలు, ఎక్కువ జీతాలు.
  8. నగరాలు, ఇతర ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వలన ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారు.

ప్రశ్న 8.
పట్టణంలో పని దొరికి, ఉండటానికి సరైన ఇల్లు లేని వాళ్ళపట్ల ప్రభుత్వ బాధ్యత ఏమిటి?
జవాబు:
దేశంలో ప్రజలు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ నగరాలలో నివసిస్తున్నప్పటికీ వారికి సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. ఎప్పటికప్పుడు వివిధ ఆర్థిక, గణాంక సర్వేల ద్వారా ప్రజలకు అందుతున్న సదుపాయాలు, గృహవసతి, ఆరోగ్యం , విద్య సదుపాయాలు అందించవలసి ఉంది. వివిధ కారణాలతో ఉపాధి అవకాశాలకై పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారికి ఇళ్ళు, రాజీవ్ గృహకల్పన ద్వారా వసతి సదుపాయాలు కల్పించాలి. దగ్గరలో గల ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి చేయూతనందించాలి.

9th Class Social Textbook Page No.262

ప్రశ్న 9.
కింద పేర్కొన్న వాటిల్లో వాక్ స్వాతంత్ర్య నియంత్రణను దృష్టియందుంచుకొని చర్చ నిర్వహించండి.
1. ఒక కులం ప్రజల భావనలను గాయపరిచే ఉద్దేశంతో ఒక పుస్తకం రాశారు.
2. ప్రతి సినిమాకి విడుదలకు ముందు సెన్సారు బోర్డు నుంచి ఆమోదం పొందాలి.
3. రాత్రి 11 గంటలు దాటిన తరువాత పండుగలు, ప్రార్థనల రోజులలో ఎవరూ మైకు వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది.
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం వల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. వాక్ స్వాతంత్ర్యం పరిమితమైన హక్కు. శాంతిభద్రతలు, ప్రభుత్వ భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కుకు పరిమితులున్నాయి. వాక్ స్వాతంత్ర్యం ద్వారా ఒక కులాన్ని గాని, మతాన్ని గాని కించపరిచే వ్యాఖ్యలు, ప్రచురణలు చేయకూడదు. ఒకరి కుల సాంప్రదాయాలను, ఆచారాలను వక్రీకరించకూడదు. ఒకరి కుల మనోభావాలను కించపరచకూడదు. అవమాన పరచకూడదు మరియు ప్రజల శాంతిభద్రతలకు, వారి సుఖజీవనానికి ఆటంకం కలిగించకూడదు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి, సమావేశాలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు న్యాయస్థానాలు అనుమతి ఉంటుంది. మన వాక్ స్వాతంత్ర్యం మిగతా వారికి ఇబ్బందుల నుండి రక్షణకు కాల నిర్ణయం విధించారు.

సినిమాలు ప్రజలను, సమాజాన్ని, సక్రమ మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు. “సినిమా” అనేది అనుకరణ మాధ్యమం. ఈ సినిమా మాధ్యమం ద్వారా, పిల్లలను, మహిళలను, ఉద్యోగస్థులను, కుల, మతాలను కించపరిచే సన్నివేశాలు, చిత్రాలు, పాటలు, మాటలు ఉండకూడదు. దాని ఫలితంగా సమాజంలో చెడు ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, అశ్లీల దృశ్యాలు, బూతు సాహిత్యం ద్వంద్వార్థ పదాలను సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ముందు పరిశీలించి, సెన్సార్ చేసిన పిమ్మట ఆమోదిస్తూ మంజూరు పత్రం అందిస్తుంది.

ప్రశ్న 10.
ఎనిమిదవ తరగతిలో చదివిన పోలీసులు, న్యాయస్థానాల పాత్రలలో తేడాలు ఏమిటి?
జవాబు:
శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధానపాత్ర. నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ చేయడం పోలీసుల కర్తవ్యం. రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్ష్యులను విచారించి విషయాలు నమోదు చేస్తారు. ముందుగా తొలి సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) తయారుచేస్తారు. సాక్ష్యాలు దోషి అని రుజువు చేస్తుంటే పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలి.

నిందితుడు దోషో, కాదో అని వాదోపవాదాలు సాక్షుల ద్వారా నిర్ధారించుకొని, దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు, లేదా న్యాయవర్గం విధిస్తుంది. హత్య, లంచగొండి తనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు పోలీసులు ఇవ్వరు. బెయిల్ మంజూరు చేయాలో వద్దా నిర్ధారించేది న్యాయమూర్తి. ఒకవేళ బెయిలు మంజూరు చేస్తే కొన్ని హామీలు సమర్పించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ఏ ఏ రకాల పాఠశాలలు ఉన్నాయి? ఇన్ని రకాల పాఠశాలలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేట్ పాఠశాలలు, బాలికల పాఠశాలలు, వికలాంగుల పాఠశాలలు, చెవిటి, మూగ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ముస్లిం పాఠశాలలు (ఉర్దూ), ఆంగ్ల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వం నియమించు ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సాధారణ, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అనేక రకాల బిల్డింగ్లు, మధ్యాహ్న భోజన పథకాలు, ఉచితంగా బట్టలు, పుస్తకాలు అందించబడుతున్నాయి.

ప్రయివేట్ పాఠశాలలో ఉద్యోగస్తుల పిల్లలు, ఆర్థికస్ధమత గలవారు చదువుతున్నారు. ఇందులో శిక్షణ పొందని ఉపాధ్యాయులు కూడా పనిచేస్తుంటారు. వారికి ప్రభుత్వం అందించు సౌకర్యాలు ఉండవు.

బాలికలు వారి అవసరాలు, వారి జీవన విధానానికి అనుగుణంగా, ప్రత్యేక వాతావరణంలో చదువుకోవడానికిగాను బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

గిరిజన బాలబాలికల సంక్షేమం కొరకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

చెవిటి, మూగ విద్యార్థులు, మామూలు విద్యార్థులతో కలిసి చదువుకోలేరు. కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా బోధన చేయాలి. కాబట్టి చెవిటి, మూగ పాఠశాలలున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉర్దూ పాఠశాలలున్నాయి.

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో ఈ రకమైన హక్కులు పిల్లలకు కల్పించబడుతున్నాయని నీవు భావిస్తున్నావా?
జవాబు:
మా ప్రాంతంలో 6-14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందిస్తున్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్లు. ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తున్నారు. క్రమం తప్పకుండా మా తల్లిదండ్రులు బడికి పంపిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా సమకూరుస్తున్నారు. ప్రమాదకరమైన పనులు చేయించటం లేదు. కర్మాగారాలు, హోటళ్ళు, బీడీ పరిశ్రమలు, అగ్గిపెట్టెల తయారీలో పిల్లలను చేర్చుకోవటం లేదు. మా ప్రాంతంలో బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి.

ప్రశ్న 13.
ఉపాధ్యాయుడి సహాయంతో రాష్ట్రంలోని కనీస వేతనాలను తెలుసుకోండి.
జవాబు:
రాష్ట్రంలో స్త్రీ, పురుషులకు, ఉద్యోగస్థులకు, వ్యవసాయ, ఉపాధి హామీ పథకం కూలీలకు వేరువేరుగా వేతనాలు అందిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో
పురుషులకు – రూ. 200 వరకు (రోజుకు) :
స్త్రీలకు – రూ. 150 వరకు (రోజుకు)
రోజువారి వ్యవసాయ కూలి (పురుషులకి) – రూ. 120 (రోజుకు)
రోజువారి కూలి (స్త్రీలకి) – రూ. 80 (రోజుకు)
తాపీ మేస్త్రీకి (ఇల్లు కట్టే సమయంలో) – రూ. 300 (రోజుకు)
సాయం చేసే స్త్రీలకు – రూ. 130
ఉపాధ్యాయులకు – రూ. 300 నుండి రూ. 2000 వరకు (రోజుకు)
వైద్యులకి (తనిఖీ రుసుం) – రూ. 100 నుండి 300 వరకు (రోజుకు)

9th Class Social Textbook Page No.263

ప్రశ్న 14.
సతీసహగమనాన్ని ఆచరించటం వల్ల ప్రాథమిక హక్కులకు ఏవిధంగా భంగం కలుగుతుంది?
జవాబు:
పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. వ్యక్తిగా తన మత ఆచారాలను పాటించకుండా ఏ వ్యక్తినీ నిషేధించలేరు. అయితే మతం మాటున జరిగే ఘోరాలు, హత్యలను రాజ్యాంగం ప్రకారం అనుమతించరు. బలవంతంగా తమ అభిమతాలకు వ్యతిరేకంగా, ‘సతి’ సహగమనాన్ని ప్రోత్సహించడం, ‘ . మత స్వాతంత్ర్యపు హక్కుకు భంగం కలుగుతుంది. ‘సతి’ సహగమనం లౌకికవాద స్ఫూర్తికి విఘాతం. మతం పేరుతో బలవంతపు చావులను రాజ్యాంగం అనుమతించదు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 15.
ఒక వ్యక్తి అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చా?
జవాబు:
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తను అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చు.

9th Class Social Textbook Page No.266

ప్రశ్న 16.
మన రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఉందా? దాని కార్యక్రమాల గురించి తెలుసుకోండి.
జవాబు:
1993లో ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. వీరిని నియమించే సమయంలో గవర్నర్ ఈ కింది వారిని సంప్రదించాలి.

  1. రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిటీకి అధ్యక్షుడు.
  2. రాష్ట్ర విధానసభ స్పీకరు
  3. రాష్ట్ర హోం మంత్రి
  4. రాష్ట్ర విధాన సభ స్పీకర్
  5. రాష్ట్ర విధాన సభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం – 5 సం||రాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి.
మరొక సభ్యుడు మానవ హక్కుల రంగంలో నిష్ణాతుడై ఉండాలి.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార విధానాలు :

  1. మానవ హక్కులు ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్యోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం.
  2. న్యాయస్థానాలు అనుమతితో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరడం.
  3. జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం.
  4. మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను, చట్టపరమైన నిబంధనలను’ నిరంతరం సమీక్షిస్తూ తగిన సూచనలివ్వడం.

ప్రశ్న 17.
మానవ హక్కులకు ఉల్లంఘనలను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. పోలీసుల వేధింపులు
  2. ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేయటం
  3. సమాచార హక్కును తిరస్కరించటం
  4. అవినీతి
  5. మహిళలపై లైంగిక వేధింపులు
  6. అత్యాచారాలు
  7. నేర విచారణలో ఆలస్యం
  8. స్త్రీ, శిశు హత్య
  9. డబ్బుకోసం కిడ్నాపింగ్
  10. మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు
  11. కుటుంబంలో మహిళల పట్ల వివక్షత
  12. ఇంటి పని చేసేవాళ్ళ పై హింస వంటివి మానవ హక్కుల ఉల్లంఘనలకు కొన్ని ఉదాహరణలు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే దానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒక ఫిర్యాదు రాయండి.
జవాబు:

ఫిర్యాదు

విజయవాడ,
10 – 10 – 20xx.

సబ్జెక్టు : జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి మా ప్రాంతంలోని పోలీసుల వేధింపుల గురించి ఒక చిన్న విన్నపం.

To:
జాతీయ మానవ హక్కుల చైర్మన్,
డిల్లీ.

గౌరవనీయులైన జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి,

అయ్యా,
మాది విజయవాడలోని లబ్బీపేట ప్రాంతం. మా ప్రాంతం నందు దినసరి కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారికి చట్టం గురించి కాని, పోలీసుల గురించి కాని అంతగా తెలియదు.’ అయితే పోలీసులు లేనిపోని కారణాలు చెబుతూ తరచుగా మా ప్రాంతంలోని ప్రజలను బెదిరింపులతోను, వేధింపులతోను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల మీరు ఈ విషయం నందు జోక్యం చేసుకుని మా ప్రాంతంలోని, ప్రజలను పోలీసుల వేధింపుల నుండి రక్షణ కల్పించవలసినదిగా ప్రార్థించుచున్నాము.

ఇట్లు
మీ విధేయుడు,
ఎం. భావసాయి,
9వ తరగతి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఒక సీనియర్ న్యాయవాదిని మీ తరగతికి ఆహ్వానించి, ముఖాముఖి ద్వారా ఈ కింది విషయాలు తెలుసుకోండి :
– ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు
– బాలల హక్కుల ఉల్లంఘన
– ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు
– సంబంధిత ఇతర విషయాలు.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు :
ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. థమిక హక్కుల ఉల్లంఘనకు గురైనప్పుడు వ్యక్తులు శిక్షార్హులు అవుతారు.

బాలల హక్కుల ఉల్లంఘన :
బాలల హక్కుల ఉల్లంఘించటం కూడా చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హులు. న్యాయస్థానాలు బాలల హక్కులను పరిరక్షిస్తాయి. దానికితోడు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పాటుచేశారు.

ఈ సంస్థ 18 సం||రాల వయస్సు లోపల గల బాలలందరికి వర్తిస్తుంది.

బాలల కోసం అమలవుతున్న వివిధ రక్షణలను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులు చేస్తుంది. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, విచారించి తగిన చర్యలు చేపడుతుంది. తీవ్రవాదం, మత ఘర్షణలు, గృహహింస, లైంగిక దాడులు, వేధింపులు మొదలగు సమస్యలపై తగిన పరిష్కారాలను సూచిస్తుంది.

బాలల హక్కులకు సంబంధించిన ఒప్పందాలను, చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది. బాలల హక్కులపైన పరిశోధన మరియు హక్కులపై అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చావేదికలు నిర్వహిస్తుంది.

బాల నేరస్థుల జైళ్లను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులపై ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది.

పై విధంగా బాలల హక్కులను ఒకవైపు న్యాయస్థానాలు మరోవైపు కమిషన్ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు :
శాంతియుతంగా, గాంధేయ మార్గంలో హక్కులకోసం .పోరాడాలి. ఏ విధమైన హింసాపూరిత వాతావరణానికి అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయరాదు. పౌరులు, తమ తమ విధులను పాటిస్తూనే శాంతియుత మార్గంలో న్యాయస్థానాలు ద్వారా లేదా సమస్యలను పరిష్కరించు కోవలయును.

సంబంధిత ఇతర విషయాలు :
మానవుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాలతో పాటు జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పనిచేస్తున్నాయి. వీటిని 1993లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటుచేయడం జరిగింది.

జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మను రాష్ట్రపతి నియమిస్తారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను గవర్నర్ నియమిస్తారు.

ఈ కమిషన్లు చేసే విధులు :
మానవ హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్వోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే . లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం. న్యాయస్థానాల అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరటం.

జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం వంటి విధులను నిర్వహించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

SCERT AP 9th Class Social Studies Guide Pdf 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జవాబుదారీ, బాధ్యతాయుత, చట్టబద్ధ ప్రభుత్వం ఉండేలా ప్రజాస్వామ్యం ఎలా చూస్తుంది? (AS1)
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.
  2. దీనిలో ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఎన్నుకుంటారు.
  3. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.
  4. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలలో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి, పనుల ప్రణాళికను ఈ శాసనసభలే ఆమోదించాలి.
  5. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నిటికీ మించి నిర్దిష్ట కాలం తరువాత మళ్ళీ ఎన్నికలుంటాయి.
  6. ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల మద్దతును పొందవలసి ఉంటుంది.
  7. వాళ్ళు చేసిన పనిని వివరించమని అడిగి అది సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజలు వాళ్లను తిరస్కరించవచ్చు.

ప్రశ్న 2.
సామాజిక వైవిధ్యతలను కలుపుకుని వెళ్లే స్వభావాన్ని ప్రజాస్వామ్యాలు ఏ స్థితిలో ప్రదర్శిస్తాయి? (AS1)
జవాబు:

  1. ప్రజల పాలన అని. అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.
  2. వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ధనికులు కావచ్చు,. పేదవాళ్ళు కావచ్చు. నల్లవాళ్లు కావచ్చు, తెల్లవాళ్లు కావచ్చు, హిందువులు లేదా క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు కావచ్చు. ఏ భాష మాట్లాడే వాళ్లేనా కావచ్చు. ఈ భావన ఏర్పడటానికి చాలాకాలం పట్టింది.
  3. సూచికగా ఎన్నికలలో ఓటు చేసే హక్కును తీసుకుందాం.
  4. మొదట్లో ఆస్తి ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
  5. క్రమేపీ కొన్ని దేశాలలో ఈ హక్కును పేదవాళ్ళకు కల్పించారు. ఆ తరువాత అది మహిళలకు లభించింది.
  6. చివరికి అన్ని మతాల, జాతుల వాళ్ళకు ఓటు హక్కు లభించింది.
  7. 1920 నుంచి అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
  8. 1965 లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
  9. న్యూజీలాండ్ 1893లోనే అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశం.
  10. సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటుహక్కు ఉండాలి. ప్రతి ‘ఓటుకు సమాన విలువ ఉండాలి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
కింద వ్యాఖ్యానాలను సమర్ధించటానికి వ్యతిరేకించటానికి మీ వాదనలు పేర్కొనండి : (AS2)
అ. పారిశ్రామిక దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించగలవు, కానీ పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం ఉండాలి.
జవాబు:
పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.

కారణం ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనలోను, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరపాలి తరువాత చట్టాలు, విధానాలు రూపొందించాలి ఆ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు పొందుతారు. అందువలన పేద దేశాలు కూడా ధనిక దేశాలుగా మారతాయి.

పారదర్శకత (దాపరికం లేని పరిపాలన), అమలు జరిగినపుడు,. అవినీతి, అన్యాయం, లంచగొండితనం వంటివి లేనప్పుడు పేదదేశాలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసినప్పటికీ ధనిక దేశాలుగా మారతాయి.

అందువల్ల పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యమే మేలు.

ఆ. పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.
జవాబు:

  1. సమాజం ధనిక – పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
  2. ఉన్నత హెూదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటు వేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
  3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారు.
  4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
  5. దేనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు ? దేనిని విస్మరిస్తారు ? అన్న దానిని బట్టి వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు.
  6. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలను, కార్యక్రమాలను ప్రభావితం చేయగలుగుతారు.
  7. ఇంకోవైపున పేదలకు నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్దంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి.
  8. కాబట్టి రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.

ఇ. పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యల పై తక్కువ ఖర్చు చేసి, పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయాలి.
జవాబు:
పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యలపై తక్కువ ఖర్చుచేసి, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం.

అర్థశాస్త్ర పరిభాషలో వ్యయాలు రెండు రకాలు :

  1. ఉత్పాదక వ్యయం
  2. అనుత్పాదక వ్యయం

ఉత్పాదక వ్యయం అనగా పరిశ్రమలు, వ్యవసాయంపై చేసే వ్యయం.

అనుత్పాదక వ్యయం అనగా రోడ్లు, భవనాలపై చేసే వ్యయం.

అందువలన పేద దేశాలు ఉత్పాదక వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తాయి. అనుత్పాదక వ్యయంపై చేసే వ్యయం వలన అదనపు రాబడులు ఏమీరావు.

ఈ. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆధిపత్యానికి, ఘర్షణలకు తావు ఉండదు.
జవాబు:
ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది. పౌరుల మధ్య ఓటు హక్కు విషయంలో ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. ప్రతి ఓటుకీ సమాన విలువ ఉంటుంది.

పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, హిందువులు, క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు అయినా, ఏ భాష మాట్లాడేవారైనా ఎవరికైనా ఓటుహక్కు ఉంటుంది కాబట్టి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. కావున ఏ విధమైన ఆధిపత్యానికీ, ఘర్షణలకూ తావు ఉండదు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయటంలో కింద ఉన్న వాటిల్లో ఏది వర్తించదు? (AS1)
ప్రజాస్వామ్యంలో :
అ. స్వేచ్ఛాయుత ఎన్నికలు
ఆ. వ్యక్తి గౌరవం
ఇ. అధిక సంఖ్యాకుల పాలన
ఈ. చట్టం ముందు అందరూ సమానులు
జవాబు:
ఆ. వ్యక్తి గౌరవం .

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో రాజకీయ, సామాజిక అసమానతలపై అధ్యయనం ఈ కింది విషయాన్ని వెల్లడి చేస్తోంది. (AS1)
అ. ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలిసి ఉంటాయి.
ఆ. ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.
ఇ. నియంతృత్వంలో అసమానతలు ఉండవు
ఈ. ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం మంచిది.
జవాబు:
(ఆ) ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.

ప్రశ్న 6.
ఆరు దేశాలకు సంబంధించిన సమాచారం దిగువన ఉంది. ఈ సమాచారాన్ని బట్టి ఆయా దేశాలను ఏ రకంగా వర్గీకరిస్తారు? ఒక్కొక్కదాని ఎదురుగా “ప్రజాస్వామికం’ లేదా ‘అప్రజాస్వామికం’ లేదా ‘ఖచ్చితంగా చెప్పలేం’ అని రాయండి. (AS1)
దేశం (అ) : దేశ అధికారిక మతాన్ని అంగీకరించని ప్రజలకు ఓటు హక్కు ఉండదు.
దేశం (ఆ) : ఒకే పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలలో గెలుస్తోంది.
దేశం (ఇ) : గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది.
దేశం (ఈ) : సైన్యాధిపతి ఆమోదం లేకుండా సైన్యానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు చేయలేదు.
దేశం (ఉ) : న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటు చట్టం చేయలేదు.
దేశం (ఊ) : దేశానికి సంబంధించి ముఖ్య ఆర్థిక నిర్ణయాలన్నీ కేంద్ర బ్యాంకు అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు మార్చలేరు.
జవాబు:
దేశం (అ) : ప్రజాస్వామికం
దేశం (ఆ) : ప్రజాస్వామికం
దేశం (ఇ) : ప్రజాస్వామికం
దేశం (ఈ) : అప్రజాస్వామికం
దేశం (ఉ) : ప్రజాస్వామికం
దేశం (ఊ) : అప్రజాస్వామికం

ప్రశ్న 7.
కింద ఉన్న ప్రతి వాక్యంలో ప్రజాస్వామిక, అప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ప్రతి వాక్యానికి ఆ రెండింటినీ వేరుగా రాయండి. (AS1)
అ. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలని మంత్రి చెప్పారు. –  ప్రజాస్వామికం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు . కొన్ని చట్టాలు చేయవలసిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. – అప్రజాస్వామికం

ఆ. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. – ప్రజాస్వామికం

పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించలేదు. – అప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. – ప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. – అప్రజాస్వామికం

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న కింది వాదనలకు మీ ప్రతిస్పందన రాయండి : (AS4)
అ. దేశంలో అత్యంత క్రమశిక్షణ ఉండి, అవినీతిలేని వ్యవస్థ సైన్యం ఒక్కటే. కాబట్టి దేశాన్ని సైన్యం పరిపాలించాలి.
జవాబు:
సైన్యం పరిపాలిస్తే బాగుంటుంది కానీ ప్రజల సమస్యలు సైన్యానికి అంతగా తెలియవు. తెలిసిన వాటిని చేయాలి అనే దృఢ సంకల్పం సైన్యానికి ఉండకపోవచ్చు. కారణం. సైన్యం అనేది ఉద్యోగస్వామ్యం మాత్రమే. ప్రజాసమస్యలు ప్రజాస్వామ్యంలోనే చక్కగా పరిష్కరింపబడతాయి. కానీ నాయకులలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలనుండి వస్తారు కాబట్టి ప్రజాసమస్యలు బాగా పరిష్కరింపబడతాయి.

ఆ. అధిక సంఖ్యాకుల పాలన అంటే ఏమీ తెలియని ప్రజల పాలన. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు కావలసింది విజ్ఞుల పాలన.
జవాబు:
అధిక సంఖ్యాకుల పాలన ఆంటే ప్రజలందరి పాలన. అనగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలందరు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములు కావడం.

తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకి కావలసింది విజ్ఞుల పాలన. అనగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు విజ్ఞులైన నాయకులను ఎన్నుకొని వారి ద్వారా పరిపాలింపబడడం. ఇలాంటి విధానం వలన సమయం ధనం ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఇ. ఆధ్యాత్మిక విషయాలలో మతగురువుల మార్గదర్శనం కోరుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా మార్గదర్శనం చేయమని ఎందుకు అడగకూడదు? దేశాన్ని మతగురువులు పరిపాలించాలి.
జవాబు:
ఆధ్యాత్మిక విషయాలలో మత గురువులు. కానీ వారు రాజనీతిలో కాని రాజకీయాలలోకాని, సంక్షేమ పథకాల రూపకల్పనలో, కాని, వాటిని అమలు చేయడంలో కాని మత గురువులకు అవగాహన ఉండవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాని పట్ల వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. పైగా మత గురువులు మతపరమైన విషయాలపట్ల చూపించిన ప్రతిభ రాజకీయ, ప్రజాపాలన విషయాలలో చూపించకపోవచ్చును, మతం అనేది మత్తుమందు లాంటిది. రాజకీయాలు ఆ విధమైనవి కావు.

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి. (AS5)
అ) శ్రీలంక
ఆ) బెల్జియం
ఇ) రష్యా
ఈ) అమెరికా (యు.ఎస్.ఎ)
AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1

ప్రశ్న 10.
‘పౌరుల గౌరవం, స్వేచ్ఛ’ అనే శీర్షిక కింద గల మొదటి రెండు పేరాలు చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి :
ప్రజాస్వామిక దేశంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మీ సొంతమాటల్లో రాయండి. (AS2)
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

ప్రతి వ్యక్తికీ తోటి మానవుల నుంచి గౌరవం పొందాలని ఉంటుంది.

తనకు తగినంత మర్యాద ఇవ్వటం లేదని భావించినందువల్లనే తరచు వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. • గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్దతే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని కనీసం సూత్రబద్దంగానైనా ప్రజాస్వామిక దేశాలు గుర్తించాయి.

దీనిని వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో సాధించారు. ఆధిపత్యం, పరాధీనత ఆధారంగా తరతరాలుగా నడిచిన సమాజాలలో అందరూ సమానం అని అంగీకరించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రశ్న 11.
ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు పోరాడడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు:
తరతరాలుగా రాచరిక, నియంతృత్వ పరిపాలనపై ప్రజల గౌరవానికి, స్వేచ్ఛకు విలువ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించడంపై ప్రజలు ఎదిరించారు. పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, బాధ్యత లేని పరిపాలన కొనసాగినప్పుడు ప్రజలు, రాచరిక పునాదులపై నడిచే ప్రభుత్వాలను, సైనిక పాలనలను సైతం ప్రజలు తిరస్కరించారు. సమానత్వ సూత్రంపై నడిచే, ప్రజల సంక్షేమం, ఉపాధి మెరుగుపరిచే ప్రజాస్వామ్యంపై ప్రజలు ఇష్టత చూపించారు. కుల ఆధారిత అసమానతలు, అత్యాచారాలు, వ్యక్తికి చట్టపర నైతిక విలువలు లేని పాలనను కాదని ప్రజాస్వామ్యం కావాలన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 12.
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS6)
జవాబు:
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం జరుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు :

  1. మన పాఠశాలల్లో కులమతాలు, ధనిక, పేదాయని భేదం లేకుండా అందరికీ యూనిఫారమ్స్ ధారణ ద్వారా సమానత్వం లభిస్తుంది.
  2. అదేవిధంగా తరగతులు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
  3. అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ ఆ రోజులలో సెలవును మంజూరు చేయడమే కాకుండా స్థానిక ప్రాంత పండుగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  4. తరగతి నాయకుడి ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ విద్యార్ధుల అభిప్రాయం మేరకు, ఎన్నిక ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
  5. పేదవారికి, వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూత నందించుటకుగాను స్కాలర్ షిప్స్, ఆర్థిక పథకాలు అందించడం జరుగుతుంది.

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన InText Questions and Answers

9th Class Social Textbook Page No.247

ప్రశ్న 1.
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు.
  2. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి.
  3. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
  4. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
  5. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి.
  6. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు.
  7. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం.
  8. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.

9th Class Social Textbook Page No.248

ప్రశ్న 2.
ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు పౌరహక్కులను ఇచ్చాయి. అయితే ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచటం వంటి చర్యలు చేపడతాయి. ఇది సరైనదేనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండాలి.
  2. తెలుసుకోటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వాములు అవుతారు.
  3. అంతేకాని ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడం వంటి చర్యల వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది.
  4. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనదికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
ప్రజాస్వామికంగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్రస్థాయిలో అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి?
జవాబు:

  1. అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.
  2. ప్రజాస్వామికంగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండటానికి కారణాలు.
    అ) తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంపద.
    ఆ) ఉన్నత వర్గాలకు చెందినవారు మంచి విద్య, ఉద్యోగావకాశాలు పొందడం.
    ఇ) సంపద మరికొంత సంపదను సముపార్జించి పెట్టడం.
    ఈ) ఉన్న వర్గాలకు చెందినవారు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం.
    ఉ) ఆలోచనా విధానాలలోనూ మార్పులు రావడం.

9th Class Social Textbook Page No.250

ప్రశ్న 4.
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000 మందికి ఓటు హక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అంటే ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. 250 . ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు, దృక్పథాలకు గెలిచిన అభ్యర్థి ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఓటర్లలో 25 శాతం మద్దతు మాత్రమే ఉంది. ఇది న్యాయమైన ప్రజాస్వామిక ఏర్పాటేనా? నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం ఏమైనా ఉందా?
జవాబు:
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000కి ఓటుహక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కుని ఉపయోగించుకుంటారు. అనగా ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. అయితే ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. కానీ 250 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే అతను ఆ 250 మందికి మాత్రమే ప్రతినిధిగా కాకుండా ప్రజలందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

ప్రజలందరికి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రజలందరికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తాడు. ప్రజలందరికి అవసరాలు తీర్చటానికి కృషి చేస్తాడు. అందువల్ల ఇది న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థగానే కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం.

  1. ప్రజలకు ఓటు చేసే హక్కుతో పాటు తిరస్కరించే అధికారం కూడా ఇవ్వాలి.
  2. ఎక్కువమంది ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించరాదు.
  3. అనుకూలమైన ఓట్లతో పాటు వ్యతిరేకమైన ఓట్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

9th Class Social Textbook Page No.254

ప్రశ్న 5.
సామాజిక, మత, భాషాపర వైవిధ్యతలను కలుపుకుని వెళ్ళటానికి ఈ రెండు (బెల్జియం, శ్రీలంక) దేశాలు అనుసరించిన మార్గాలను చర్చించండి.
జవాబు:
బెల్జియం, శ్రీలంకలు రెండు ప్రజాస్వామిక దేశాలే అయినప్పటికీ రెండు దేశాలు అధికారాన్ని పంచుకోవటంలో భిన్నమైన మార్గాలు అవలంబించాయి.

1) బెల్జియం :
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

2) శ్రీలంక :
అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినపుడు దేశ సమైక్యత దెబ్బ తింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో తరగతి ప్రతినిధిని ఎన్నుకోటానికి తరగతిలో ఎన్నికలు నిర్వహించండి.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

పటం 1 : 1900 – 1950లలో ప్రజాస్వామ్య దేశాలు.
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 1
పటం 2 : 2011లో ప్రజాస్వామిక దేశాలు
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 2

ప్రశ్న 1.
అ) ఇచ్చిన పటాల ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలోని ఖండాలలో ప్రజాస్వామిక దేశాల పేర్లు రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 3

ఆ) 2011లో ప్రజాస్వామికంగా ఉన్న ఆఫ్రికా దేశాలను గుర్తించండి.
జవాబు:

  1. దక్షిణాఫ్రికా
  2. నమీబియా
  3. బోట్సువానా
  4. మొజాంబిక్
  5. నైజీరియా
  6. జాంబియా
  7. టాంజానియా
  8. కెన్యా
  9. మడగాస్కర్
  10. మాలి
  11. సూడాన్

ఇ) 2011లో ప్రజాస్వామికం లేని పెద్ద దేశాలను గుర్తించండి.
జవాబు:

  1. చైనా
  2. కజకిస్థాన్
  3. సౌదీ అరేబియా
  4. అల్జీరియా
  5. జైరా
  6. అంగోలా
  7. ఇథియోపియా
  8. సోమాలియా

ప్రశ్న 2.
పటాలను అధ్యయనం చేసి కింది విషయాల గురించి ఆలోచించండి. (AS5)
అ) పటాల ఆధారంగా 20వ శతాబ్దం ప్రజాస్వామ్య విస్తరణకు ముఖ్యమైన యుగంగా పేర్కొనవచ్చా?
జవాబు:
అవును

ఆ) 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా ……………….. ఖండాలలో ఉండింది. ఇంకోవైపు ……………., ………… ఖండాలలో దాదాపుగా ప్రజాస్వామిక దేశాలు లేవు.
జవాబు:
ఉత్తర అమెరికా, ఐరోపా ; ఆఫ్రికా, ఆసియా.

ఇ) ఈనాటికి కూడా ప్రజాస్వామిక ప్రభుత్వాలు లేని …………………… వంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
జవాబు:
నైరుతీ ఆఫ్రికా, ఉత్తర ఆసియా.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
చాలా దేశాలు ఎన్నికలు నిర్వహిస్తూ తాము ప్రజాస్వామిక దేశాలమని పేర్కొంటాయి. ఈ ఎన్నికలు మయన్మార్, లిబియాలలో ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
లిబియా వలస పాలన నుండి, రాచరిక పాలన నుండి గఢాఫి, సైనిక నియంతృత్వ పరిపాలన కొనసాగింది. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సామాజిక సంక్షేమంలో లిబియా అత్యున్నత స్థానాన్ని సాధించింది. ప్రజా సంఘాలను ఏర్పాటు చేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోటాన్ని లిబియాలో ప్రోత్సహించారు. 2010 ద్వితీయార్ధం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. అందులో లిబియా ఒకటి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2012 నుండి లిబియాలో ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికలు జరుగుతున్నాయి.

బర్మాలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలందరి హక్కులు కాపాడాలని బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ కృషి చేశాడు. కాని ఆయనను చంపేశారు. తదుపరి బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ అధీనంలోకి వెళ్ళిపోయింది. బర్మాలో సంక్షేమం జరగలేదు. సైన్యాధిపతులు హక్కులు ఉల్లంఘించారు. 1988 నుండి బర్మాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఆంగ్ సాన్ సూకి కేంద్ర బిందువుగా మారారు. 2011లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగగా 45 పార్లమెంట్ స్థానాలకు గాను 43 సీట్లు ఆంగ్ సాన్ సూకి సారథ్యం గల ఎన్ఎల్ డి గెలుచుకుంది. భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు జరుగుతాయని ఆశిద్దాం.

ప్రశ్న 4.
ప్రసార మాధ్యమాల (మీడియా)ను నియంత్రించటానికి పాలకులు ఎందుకు ప్రయత్నించేవాళ్ళు? మీ ప్రాంతంలో ప్రసార మాధ్యమాలపై నియంత్రణ ఏవిధంగా ఉందో మీకు తెలుసా? (AS4)
జవాబు:
ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజలలో రాజకీయ అవగాహన కల్గించి, విజ్ఞానవంతులను చేయడానికి ప్రసార మాధ్యమాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రసార మాధ్యమాలను పాలకులు తమ అధీనంలో ఉంచుకొని, వాటి ద్వారా ప్రజలను తమ పాలనపై మంచి అభిప్రాయం కలిగేటట్లు కార్యక్రమాలు రూపొందించేవాళ్ళు.

ప్రసార మాధ్యమాలను నియంత్రించకపోతే అవి పాలకుల అవినీతి, నిరంకుశత్వ నిర్ణయాలు, దోపిడీ పరిపాలన, ప్రజలను ఏవిధంగా మోసం చేసి పరిపాలిస్తున్నదీ తెలియజేసి ప్రజలను, ముఖ్యంగా యువత, మహిళలను చైతన్యపరిచినట్లైతే వారు నిరసనలు, ఉద్యమాల ద్వారా పాలకుల పాలనకు చరమగీతం పాడగలరు. చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు కలవు. అందుకే ప్రసార మాధ్యమాలను నియంత్రించేవాళ్లు.

మా ప్రాంతంలో రేడియో, దూరదర్శన్లు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ మాధ్యమాల కార్యక్రమాలు అమలుచేయటానికి వీలులేదు.

ప్రశ్న 5.
తమ దేశాలలోని ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాలు, ఘటనల గురించి లిబియా, మయన్మార్‌కు చెందిన పౌరుల మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
సంభాషణ
జవాబు:
లిబియా పౌరులు : వలస పాలనను ఎదిరించి, రాచరికాన్ని కాదని, సైనిక పాలనను తలదన్ని, మేం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించాం…… చరిత్రలో గొప్పవాళ్ళమయ్యాం.

మయన్మార్ పౌరులు : ఆగండి…. ఆగండి… ఏమీ మీ ప్రేలాపనలు. మీదొక పేద దేశం…. తినడానికి తిండి లేని దేశం. ఎడారులలో పశువులతో సంచరిస్తూ గడిపే మీ జీవితం. మీదొక చరిత్ర. ప్రజాస్వామ్యం కోసం పోరాటం…..

లిబియా పౌరులు : మీరు సాధించినది ఏమిటి? మీలో ఐక్యత లేదు. ప్రజలకు హక్కులు లేవు. బానిస బతుకులు వేలాదిమంది చావులు. ప్రజాస్వామ్యానికొక విధానం లేదు.

మయన్మార్ పౌరులు : ప్రజాస్వామ్యం కోసం పరితపించాం. సైనిక పాలనను ఎదిరించాం. ఆంగ్ సాన్ సూకిలాంటి వాళ్ళు తమ జీవితాలనే త్యాగం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు.

లిబియా పౌరులు : మా ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రపంచ మద్దతు ఉంది. ఐక్యరాజ్య సమితి సైతం మా పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి.

మయన్మార్ పౌరులు : మా దేశంలో ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదే మా ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తికి నిదర్శనం.

లిబియా పౌరులు : ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి నేడు మేం ప్రజాస్వామ్య సంబరాలకు దగ్గరౌతున్నాం…..

మయన్మార్ పౌరులు : మేము కూడా ఎన్నెన్నో పోరాట పతాకాలు ఎగురవేసి ప్రజాస్వామ్య వేడుకలకు వెళుతున్నాం…….

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యం పనిచేయటంలో అక్షరాస్యత, అందరికీ చదువు ఏ విధంగా దోహదం చేస్తాయి? (AS6)
(లేదా)
ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పని చేయటంలో అక్షరాస్యత ఏ విధంగా దోహదం చేస్తుంది?
జవాబు:
ఏ దేశంలో అక్షరాస్యత అందరికీ చదువు అందుతుందో, ఆ దేశం ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుంది. ప్రజలు అక్షరాస్యులై విజ్ఞానవంతులైనచో పౌరహక్కుల వినియోగం, పౌరుల బాధ్యతలు సక్రమంగా అమలు జరుగుతాయి. ప్రజలలో పాలకులను ప్రశ్నించే తత్వం అలవడుతుంది. జవాబుదారీ పాలన కనపడుతుంది. అక్షరాస్యత, చదువుకున్న వాళ్ళలో కుటుంబ నిర్వహణ కాకుండా, తమ పనులలో, వృత్తులలో నైపుణ్యం చూపించి, ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగములలో అభివృద్ధి కనపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి.. ఇవన్నీ సక్రమ వినియోగం జరగాలంటే ప్రజలు ఖచ్చితంగా అక్షరాస్యులవ్వాలి. మహిళా చట్టాలు, సమన్యాయపాలన, వివక్ష, దోపిడీ పాలన వంటి వాటిని దూరం చేయడానికి అక్షరాస్యత అవసరం. చదువుకున్న, చైతన్యవంతులైన యువత ఉండే ఆ దేశంలో ప్రజాస్వామ్య ఫలాలు పదికాలాలు నిలుస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యం, నియంతృత్వాల మధ్య తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:

ప్రజాస్వామ్యం నియంతృత్వం
1. స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలుంటాయి. 1. రాచరిక, సైనికపాలన ఉంటుంది.
2. పౌరులకు హక్కులు కల్పించబడతాయి. 2. పౌరులకు హక్కులు అందించబడవు, నియంత్రించబడతాయి.
3. పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. 3. పత్రికలపై ఆంక్షలు విధించబడతాయి.
4. ప్రజలే పాలకులు. 4. వంశపారంపర్య పాలన గాని, బలవంతంగా ఆక్రమించుకున్న పాలకులు.
5. లౌకిక రాజ్యం అమలులో ఉంటుంది. 5. అధికారిక మతం ఉంటుంది.
6. పాలకులకు జవాబుదారీ తనం ఉంటుంది. 6. జవాబుదారీ తనం ఉండదు.

ప్రశ్న 8.
మయన్మార్ లో ప్రజాస్వామ్యానికై పోరాడటంలో ఆంగ్ సాన్ సూకి పాత్ర ఏమిటి?
జవాబు:
తన తండ్రిగారైన బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ ఆశయాలు నిలబెట్టడానికి, బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆ నాటి నుంచి నేటి వరకు ఆంగ్ సాన్ సూకీ కేంద్రబిందువయ్యారు. పౌరహక్కులు విస్తరింపజేయాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని, సైనిక ప్రభుత్వంపై ప్రపంచదేశాల ఒత్తిడికి కారణం సూకీ నిరంతర పోరాటదీక్షే. 2008 నుండి బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించటానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సూకీ తన జీవితాన్ని ఫణంగా పెట్టారు. కాని సైనిక ప్రభుత్వం ఆమెను గృహ నిర్బంధంలో ఉంచి, తన కొడుకులను కలుసుకోకుండా, తన భర్త చనిపోయిన సందర్భంలో కూడా ఆమెకు స్వేచ్ఛ కల్పించలేదు.

అయినా ఆమె బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి కృషిచేస్తూ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి) “ జాతీయ ప్రజాస్వామ్య కూటమి” ద్వారా నిరంతరం పరితపిస్తూ, ప్రజాస్వామ్య ఫలాలు అందించడానికి తపిస్తున్నారు. ఈమె కృషికి 1991 లోనే ప్రపంచ శాంతి బహుమతి అందుకుంది.

ప్రశ్న 9.
ఈ అధ్యాయం చివరి పేరా చదివి కింది ప్రశ్నకు సమాధానమివ్వండి.
నూతన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? (AS2)
జవాబు:
దేశాలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలలో కొన్నింటిని పరిష్కరించటానికి ప్రజలందరి స్వేచ్ఛను, హక్కులను గౌరవించే
ప్రజాస్వామ్యమే సరైన మార్గమని అందరికీ స్పష్టమవుతుంది. అత్యంత పేద ప్రజలు, బలహీన వర్గాలు కూడా తమ గొంతుక వినిపించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.

9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం InText Questions and Answers

9th Class Social Textbook Page No.235

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచటంలో ఈ రకమైన పరిస్థితులు ఎటువంటి సమస్యలను సృష్టిస్తాయి?
జవాబు:
జాతుల ప్రాబల్యం, సంచారజీవనం, నిరక్షరాస్యత, మహిళలపై ఆంక్షల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలు పంచుకునేలా చేయటం చాలా కష్టమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో ప్రజా సంఘాలను ఏర్పాటుచేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోవటం చాలా సమస్యతో కూడుకున్న వ్యవహారం.

9th Class Social Textbook Page No.237

ప్రశ్న 2.
గఢాఫి ప్రభుత్వం వల్ల ఎంతో ప్రయోజనం పొందినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశారు?
జవాబు:
గఢాఫి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లిబియాను అన్ని రంగాలలో ముందుంచింది. ఎన్నికైన ప్రజాసంఘాలు ద్వారా పరిపాలనకు మధ్యతరగతి వర్గం ప్రోత్సహించింది. కాని గఢాఫి ప్రజాస్వామ్యాన్ని నమ్మలేదు. గఢాఫి ప్రజా సంఘాలకు సమాంతరంగా విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థను ఏర్పరిచారు. రాజకీయ ప్రత్యర్థులను చంపటానికి, చిత్రహింసలు పెట్టడానికి, చంపేయటానికి గఢాఫి ప్రభుత్వం సంకల్పించింది. రాజకీయ పార్టీలకు అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ లేదు. కనుకనే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
గఢాఫి తనది ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఉండవలసిన ఏ అంశాలు అందులో లోపించాయి? ప్రజాస్వామిక ప్రభుత్వంలోని ఏ అంశాలు అందులో ఉన్నాయి?
జవాబు:
గఢాఫి రాచరికాన్ని రద్దుచేసి సైనిక పాలనలో ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పటికీ ప్రజాసంక్షేమంకై అనేక సంస్కరణలు, పథకాలు అమలుచేసినప్పటికీ అందులో ప్రధానంగా ప్రజా సంఘాలను నమ్మటానికి సాహసించలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానపాత్ర పోషిస్తాయి. కాని గఢాఫి ఏ రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించలేదు. కార్మిక సంఘాలు, ఇతర స్వతంత్ర సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయ ప్రత్యర్థులను హింసించటానికి పూనుకున్నారు. పత్రికలకు స్వేచ్ఛలేదు.

ప్రజాస్వామిక అంశాలు కూడా ఉన్నాయి.

  • అందరికీ విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు.
  • వివక్షతను దూరం చేసి మహిళలకు స్వేచ్ఛ, సమాన హెూదా కల్పించటానికి కృషి చేశారు.
  • భూపంపిణీ, భూసంస్కరణలు అమలుచేశారు.
  • సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండటం ఎందుకు ముఖ్యం? లిబియా అనుభవం నేపథ్యంలో వివరించండి.
జవాబు:
లిబియాలో పౌరహక్కులకు భంగం కలిగించే అనేక అంశాలు గమనించవచ్చు. మహిళలపై అణచివేత దృశ్యాలు, ప్రజల సంక్షేమం కంటే పాలకులకు జాతి సంక్షేమం, గౌరవం ప్రధానంగా ఉండేవి. ప్రభుత్వంపై విమర్శలను, వ్యతిరేకతను సహించే అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ, సమన్యాయ పాలన లేకపోవడం పౌరహక్కులు ముఖ్యమని వివరించవచ్చు.

ప్రశ్న 5.
పత్రికలు, టివి వంటి ప్రసార సాధనాలను నియంత్రించటానికి నిరంకుశ పాలకులు ప్రయత్నిస్తారు. ప్రజలు తమ ఆలోచనలను, సమాచారాన్ని పంచుకోగల ఇతర మాధ్యమాలు మీకు తెలుసా?
జవాబు:
సమావేశాలు, వారం వారం జరిగే సంతలు, వివిధ జానపద కళారూపాలు, బుర్రకథ, నాటకాలు, బృందగానాలు, జముకుల కథలు, వివిధ కళారూపాలు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, ఫేస్ బుక్కులు వగైరా.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 6.
ఒక వ్యాపారి చనిపోవటంతో ట్యూనీసియా పోరాటం మొదలైంది. అంతర్జాల వేదికలైన “ఫేస్ బుక్” వంటి వాటి ద్వారా ఉద్యమం బలోపేతం అయ్యింది. ప్రభుత్వం ఇటువంటి వాటిని నియంత్రించటం అంత తేలిక ఎందుకు కాదు?
జవాబు:
ఒకప్పుడు ప్రసార మాధ్యమాలు ద్వారానే ప్రజాచైతన్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు జరిగేవి. అంతేకాకుండా . వాటి నియంత్రణతో ఎటువంటి చైతన్యం ప్రజలలో వచ్చేది కాదు. కాని కాలగమనంలో వచ్చిన అనేక సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధితో ప్రజల ఆలోచనలలో చాలా మార్పు వచ్చినది. ఇతరులకు తెలియకుండా, ప్రభుత్వ పరిశీలనకు అందకుండా ఒకరి భావాలు ఒకరు తెలుసుకుని పాలకులపై సమర శంఖం పూరించడానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఇటువంటి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు.

9th Class Social Textbook Page No.240

ప్రశ్న 7.
స్వాతంత్ర్యం తరువాత బర్మాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
బర్మా మనకు స్వాతంత్ర్యం లభించిన 5 నెలల తరువాత స్వాతంత్ర్యం పొందినప్పటికీ వివిధ జాతులకు తమ హక్కులు, స్వయం నిర్ణయ హక్కుల కొరకు కృషి చేసిన బర్మన్ నాయకుడు ఆంగ్ సాన్ని చంపేశారు. ఆ తదుపరి బర్మా సైన్యం సైనిక బలగంతో పాలన చేజిక్కించుకుంది. బర్మాను పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులు కాలరాసారు. ప్రజలు, పిల్లలు అనే తేడా. లేకుండా వెట్టిచాకిరి చేయించారు. ప్రజాస్వామ్యభావాలు, ఉద్యమాలు ప్రజలలోకి వెళ్ళకుండా సైనిక పాలకులు నియంతృత్వ పాలన కొనసాగించడంతో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేక పోయింది, ప్రజాస్వామ్య పోరాట పటిమ కనపరిచిన ఆంగ్ సాన్ సూకీ లాంటి వారిని గృహ నిర్బంధం చేశారు.

ప్రశ్న 8.
స్వాతంత్ర్యం తరువాత లిబియాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
1951లో లిబియా స్వాతంత్ర్యం పొందినప్పటికీ పేద దేశం. రాచరికం తరువాత దేశ అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు యువత తీవ్రంగా కృషి చేసింది. 1969 నుండి మువమ్మర్ గఢాఫి రాచరికాన్ని కాదని, సైనిక పాలనలో ప్రజాస్వామ్య కార్యక్రమాలతో లిబియాను అన్ని రంగాలలో ముందుంచాడు. అయితే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజా సంఘాల ఏర్పాటును గఢాఫి నేతృత్వంలో తిరస్కరించారు. ప్రజలకు హక్కులు ఇవ్వక, స్వేచ్చలేక నిరంకుశ పాలనకు పూనుకున్నారు. ఉద్యమాలు, తిరుగుబాట్లు, హింసాత్మక ఘటనలు వలన లిబియాలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేకపోయింది.

ప్రశ్న 9.
లిబియా, బర్మాలలో స్వాతంత్ర్యం తీసుకురావటంలో విద్యార్థులు, యువత ప్రముఖ పాత్ర ఎందుకు పోషించారు?
జవాబు:
రెండు దేశాలలో యువత, విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. రెండు దేశాలలో కూడా సైనిక పాలనతో పౌరహక్కులు దూరమై, దేశ సంపదలు కొల్లగొట్టడమే కాకుండా వలస శక్తులు వలన దేశాలు నిర్వీర్యమయ్యాయి. విజ్ఞానవంతులైన యువత తమ దేశంలో గల దుర్భర పరిస్థితులు, బానిసత్వం, స్త్రీలకు గల కట్టుబాట్లు, అణచివేత ధోరణులు, వివిధ జాతుల మధ్య యుద్ధ వాతావరణం నుండి తమ దేశాలను రక్షించడానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చారు. దేశంలో శాంతిని, ఐక్యతను కాపాడి ప్రపంచ దేశములలో అగ్రగామిగా ఉండాలని యువత పూనుకున్నారు.

ప్రశ్న 10.
లిబియా, బర్మా ఘటనలలో ఎటువంటి పోలికలు మీకు కనపడ్డాయి? వీటిని దృష్టిలో ఉంచుకోండి – నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :

  • రెండు దేశాల నాయకులు సైనికపాలనే అమలుచేశారు.
  • స్వేచ్ఛగా భయంలేని వాతావరణంలో జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని రెండుదేశాల ప్రజలు కోరుతున్నారు.
  • గఢాఫి సైనిక పాలనలో ప్రజాస్వామ్య భావాలు అమలుచేయడానికి ప్రయత్నించాడు.
  • ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు, నాయకత్వం కొరకు ఆంగ్ సాన్ సూకీ ప్రయత్నం చేశారు.
  • లిబియా సైన్యాధిపతి గఢాఫి అయితే బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ దేశ అధికారాన్ని ఆక్రమించుకున్నారు.
  • రెండు దేశాలను సైన్యం నుంచి ప్రధాన మద్దతు పొందిన వ్యక్తులు పాలించారు.

పోరాట స్వరూపం :

  • లిబియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చెలరేగాయి.
  • బర్మాలో సైనికపాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు జరిగాయి.
  • లిబియాలో నిరసనకారులు, ఉద్యమకారులపై బెంఘాజి వంటి పట్టణాలలో భద్రతాదళాలు కాల్పులు జరిపి చంపించారు.
  • బర్మాలో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు నిరసనలో వేలమందిని చంపించారు.

మార్పు ప్రక్రియ :

  • సైనిక ప్రభుత్వ పాలన నుండి రెండు దేశాలు మార్పు కోరుకోవాలి.
  • రెండు దేశాలలో చివరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమైంది.
  • ప్రజలు రెండుదేశాల సైనిక పాలనకు చరమగీతం పాడాలని, దానికి అనుగుణంగా మార్పు జరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
ఆ రెండు దేశాలలో ప్రజాస్వామ్యంగా మారే. నేపథ్యంలో ప్రధాన తేడాలు ఏమిటి?
వీటిని దృష్టిలో ఉంచుకోండి. నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :
బర్మా తన ప్రస్థానాన్ని ప్రజాస్వామిక దేశంగా మొదలు పెట్టి సైనికపాలనలోకి మారితే, లిబియా రాచరికాన్ని వదిలించుకుని, సైనికపాలనతో అంతం అయింది. లిబియాలో సైనిక ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు గఢాఫీ నేతృత్వంలో ప్రవేశపెట్టింది.

కాని బర్మాలో పాలకులు ఎటువంటి అభివృద్ధికి అవకాశం ఇవ్వలేదు.

లిబియాలో నాయకులను గృహ నిర్బంధం చేయలేదు. కాని బర్మాలో ప్రజాస్వామ్య పోరాటం కొరకు కృషి చేస్తున్న ఆంగ్ . సాన్ సూకిని గృహ నిర్బంధం చేశారు.

పోరాట స్వరూపం :

  • ప్రజాసంఘాలను వ్యతిరేకిస్తూ గఢాఫి రివల్యూషనరీ కౌన్సిల్ ద్వారా విప్లవసంఘాలను ఏర్పరిచాడు.
  • జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా ప్రజా ఉద్యమాలు.
  • రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయటానికి, చిత్రహింసలు పెట్టడానికి, సైనికశక్తిని ఉపయోగించుకుంది లిబియా.
  • బర్మాలో పాలకులు గృహ నిర్బంధంలో ఉంచి పోరాటస్ఫూర్తిని అడ్డగించాలని చూసింది.
  • లిబియా పోరాటంలో. యువత ప్రధాన పాత్ర పోషించగా బర్మాలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారు.
  • లిబియా పోరాటానికి, నిరసనలకు, ఐక్యరాజ్యసమితి మద్దతు పలకగా, బర్మా పోరాటానికి ప్రపంచం అంగీకారం తెలిపింది.

మార్పు ప్రక్రియ :

  • లిబియాలో సంక్షేమ ఫలాలు అందించి, తమ ప్రభుత్వ ప్రాబల్యం పెంచుకోడానికి కృషి చేసింది.
  • బర్మాలో సంక్షేమ ఫలాలు అందించకుండా ప్రజలను పేదరికంలోకి నెట్టారు.
  • లిబియాలో మార్పు చాలా ఆలస్యమైంది.
  • బర్మాలో మార్పు కొరకు స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మొదలైంది.
  • బర్మాలో ఎన్నికలు ద్వారా ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
  • లిబియాలో రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఇవ్వలేదు.
  • లిబియాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ఉపయోగించుకున్నారు.
  • బర్మాలో ఆ వాతావరణం ఇంకా అభివృద్ధి చెందలేదు.

ప్రశ్న 12.
రెండు దేశాల వివరణలలో రాజకీయ పార్టీలు, ఓటింగ్ కి సంబంధించిన వాక్యాలను గుర్తించండి.
జవాబు:
రెండు దేశాలలో రాజకీయ పార్టీలు రావాలని, ప్రజాస్వామ్య పద్దతిలో ఓటింగ్ జరగాలని వాంఛించాయి. లిబియాలో పార్టీలు ప్రతినిధులను లిబియాలో 200 మందిని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. బర్మాలో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా జరిగిన ఓటింగ్ లో 80 శాతం సీట్లు సాధించాయి.

2011లో బర్మాలో 45 పార్లమెంట్ స్థానాలకు 43 స్థానాలు సూకి పార్టీ అయిన ఎన్ఎల్ డి గెలుచుకుంది.

రెండు దేశాలలో రాజకీయపార్టీలు ద్వారా, ఓటింగ్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య భావాలు, పౌరహక్కులు పొందవచ్చని తలంచి ఆ దిశగా పయనిస్తున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 13.
2012 సంవత్సరంలో లిబియా, బర్మాలలో వచ్చిన మార్పులను రాయండి.
జవాబు:
విప్లవం విజయవంతం, గఢాఫి మరణం తరువాత లిబియాలో వంద రాజకీయ పార్టీలు పోటీచేయగా ప్రజలు స్వేచ్చగా ఎన్నికలలో పాల్గొని 200 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. 2012 నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. ఒక తాత్కాలిక రాజ్యాంగం ఏర్పడింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య మనగలిగి, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడే దారులు కనిపిస్తున్నాయి.

బర్మాలో 2008 నుంచి మార్పులు సంభవించి ప్రజాస్వామిక గణతంత్రంగా మారింది. 2010లో ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఎన్నికలు జరిగాయి. ఆ తదుపరి 2011లో జరిగిన ఎన్నికలలో ఆంగ్ సాన్ సూకి ఎస్ఎల్ విజయవంతంగా విజయం పొందడం ప్రజాస్వామ్యానికి ఆరంభంగా చెప్పవచ్చు. లిబియాలాగా బర్మా కథ ఇంకా పూర్తికాలేదు. దేశం పూర్తి ప్రజాస్వామికంగా మారుతుందని, భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వార్తాపత్రికలు చదివి లిబియా, ఈజిప్టు లేదా ఇతర దేశాలలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వార్తలను కత్తిరించండి. వీటిని కాగితాలపై అంటించి తరగతిలో ప్రదర్శించండి.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో లిబియా, మయన్మార్ లను గుర్తించండి. అవి ఏ ఖండాలలో ఉన్నాయి?
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 4
ఇవి ఆఫ్రికా, ఆగ్నేయాసియా ఖండాలలో ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు అడవులను ఎలా ఉపయోగించుకున్నారు ? ఆ రోజుల్లో అడవులు, పూర్తిగా నాశనమయ్యే అవకాశం అంత ఎక్కువగా ఎందుకు లేదు? (AS1)
జవాబు:
అనాదిగా అడవులలో నివసిస్తున్న ప్రజలు, ఆదివాసీలు తమ రోజువారీ జీవితాలకు కావలసిన అనేక వస్తువులను అడవుల నుండి పొందేవాళ్ళు. ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించటానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునే వాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మే వాళ్ళుకాదు.

వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. అడవులను ఉపయోగించుకున్నప్పటికీ ప్రజలు వాటిని రక్షించే వాళ్ళు. కలపకు పెద్ద చెట్లు నరికి, కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికెయ్యలేదు. అందువల్ల అడవులు పూర్తిగా నాశమయ్యే అవకాశం అంత ఎక్కువగా లేదు.

ప్రశ్న 2.
ఆదివాసీలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? తమ కోపాన్ని, నిరసననీ వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు? కొన్ని – ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆదివాసీలు అడవిలో లభించే అనేక ఫలసాయాన్ని, అటవీ ఉత్పత్తులను అమ్ముకొని, జీవించేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వారి పాలనలో ఆదివాసీల జీవితాలు దుర్భరమైనాయి. వారి జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మధ్యప్రదేశ్, తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ఛత్తీస్ గఢ్ కు చెందిన బైగా, మురియా, గోండ్, భిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీలు అటవీశాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారస్తుల వద, రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు, బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములను ఆక్రమించుకుని, హింసలకు గురి చేశారు. అటవీశాఖ అధికారులు జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్ళలో చొరబడి వస్తువులను లాక్కోవడం, ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం వంటి విషయాలు సాధారణమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్ళు వంటివి తగలబెట్టేవాళ్ళు. అనేకసార్లు అడవిని తగలబెట్టేవాళ్ళు.
ఉదా : 1856 జార్ఖండ్ సంతాల్ తిరుగుబాట్లు.
1922 ఆంధ్రప్రదేశ్ కోయ తిరుగుబాట్లు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 3.
అదివానీ తిరుగుబాటులను బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణచివేశారు?
జవాబు:
అడవి హక్కులు అనుభవించడానికి, స్వేచ్ఛా జీవితం గడపడానికి బయట వ్యక్తుల దోపిడీల నుండి రక్షణ పొందడానికి, వేధింపుల నుండి బయటపడడానికి, అడవిలో హాయిగా నివసించడానికి గాను ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ప్రధానంగా జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించసాగారు. 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమిందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. అయితే సంతాలుల వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు.

జార్బండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసీలు 1874 – 1901 మధ్య ‘బిర్సా’ అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ నిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనుకున్నారు. కానీ నాయకులను పట్టుకొని జైలుపాలు చేయటంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900లో బిర్సాముండా జైలులో చనిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, బస్తర్, మరియా, మురియా ఆదివాసీలు, గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లను ఉత్తరాఖండ్ లోని కుమావూ తిరుగుబాట్లను బ్రిటిష్ పాలకులు కుటిల కుతంత్రాలతో, ఆధునిక ఆయుధాలతో అణచివేశారు.

ప్రశ్న 4.
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియజేసే కాల పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియచేసే కాల పట్టిక :
1880 C : ఆంధ్రప్రదేశ్ లో కోయలు తిరుగుబాటు.
1866 – 56 : జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీల తిరుగుబాట్లు.
1874 – 1901 : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ,ఆదివాసీల తిరుగుబాట్లు
1910 : మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో మరియా, మురియా ఆదివాసీల తిరుగుబాట్లు.
1922 : ఆంధ్రప్రదేశ్ కోయ, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1940 : గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1921 – 22 : ఉత్తరాఖండ్ లోని కుమావూ ప్రాంతంలోని ఆదివాసీల తిరుగుబాట్లు చేశారు.

ప్రశ్న 5.
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలు ఉండేవి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ సారిశ్రామిక వేత్తలకు ఎదురయిన సమస్యలు :

  • రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు భారతీయ పారిశ్రామిక వేత్తలకు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు.
  • భారతీయ పారిశ్రామిక వేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు.
  • పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి ? కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పాలనలో చాలా కార్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ . స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు, బ్రిటిష్ వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరపు కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్ళకు ఎటువంటి నిధుల కొరతాలేదు. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామికీకరణలో ప్రగతి సాధించే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు విదేశీ కంపెనీలలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తద్వారా భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 7.
కార్మిక చట్టాలు ముందుగా పిల్లలకు, ఆ తర్వాత మహిళలకు, చివరకు పురుషులకు చేశారు. వీటిని ఈ క్రమంలో ఎందుకు చేశారు?
జవాబు:
మిల్లులలో మరియు యంత్రాలలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. కార్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. అనారోగ్యాలు, జబ్బులు, అంటువ్యాధులతో రోజూ వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది.

పై దుర్భర కష్టాలన్నీ పిల్లలు, స్త్రీలు కూడా అనుభవించారు. 1-12 సం||ల వయసుగల బాలలు భయంకరమైన పనులు చేసేవారు. బాల్యమంతా మిల్లులలో కరిగిపోయేది. పూవులాంటి పసి పిల్లల కన్నీళ్ళు తుడవాలని, బాల్య మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని తలంచి పనిభారం నుండి ముందుగా విముక్తులను చేయడానికి పిల్లలకు చట్టాలు కల్పించారు.

అదే విధంగా మహిళలు కూడా, ఇంటి పని, వంట పని, కుటుంబ భారమంతా మోస్తూ మరల కర్మాగారాలలో 14 నుండి 18 గంటలు పురుషులతో పాటు పనిచేయడం అందులో గర్భిణులుగా, బాలింతలుగా ఉండటం వల్ల మహిళలు నరకయాతన అనుభవించే వాళ్ళు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లులలో పిల్లలు, మహిళలకే ఎక్కువగా దుర్భర పరిస్థితులు ఉన్నందున ముందుగా వాళ్ళకి విముక్తి చట్టాలు రూపొందించారు.

ప్రశ్న 8.
పారిశ్రామిక అభివృద్ధిని విద్య ఎలా ప్రభావితం చేస్తుంది ? తరగతిలో చర్చించండి. (AS6)
జవాబు:
చాలా దేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, సాంకేతిక విజ్ఞానంతో పయనించి, ప్రపంచ పోటీలో నిలదొక్కుకో సుకానికి ఆయా దేశాలు ముందుగా విద్యకు ప్రాధాన్యత నిచ్చాయి. ముఖ్యంగా, ఇంగ్లాడ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధికి, విద్యకు పెద్దపీట వేశాయి.

చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, విషయ నిపుణతగల సాంకేతిక నిపుణులు కావాలి. వీరంతా మేధావంతులుగా మారి పరిశ్రమలు వేగవంతం కావడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. వివేచనా జ్ఞానం, అద్భుత తెలివితేటలతో పరిశ్రమలను వివిధ స్థాయిలలో అభివృద్ధి చేసి, పోటీని తట్టుకోగలగాలి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధిని విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రశ్న 9.
20వ శతాబ్దంలోని ప్రధాన పారిశ్రామిక పట్టణాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
నా శ్రామిక పట్టణాలు :

  1. ముంబై
  2. అహ్మదాబాద్
  3. జంషెడ్ పూర్
  4. చెన్నై (మద్రాస్)
  5. సూరత్
  6. హైదరాబాద్
  7. పూనె
  8. విశాఖపట్నం
  9. కోల్ కతా
  10. కాన్పూర్
  11. నాగపూర్
  12. ఇండోర్
  13. సేలం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

ప్రశ్న 10.
ఆదివాసీల తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని ఆ ప్రదేశాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆదివాసీల తిరుగుబాట్లు జరిగిన ప్రదేశాలు పటంలో చూడండి.

  1. జార్ఖండ్
  2. చోటానాగపూర్ పీఠభూమి
  3. ఉత్తరాఖండ్
  4. చింతపల్లి
  5. ఆదిలాబాద్

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 2

ప్రశ్న 11.
పేజీ నెం. 221లోని “ఆదివాసీ తిరుగుబాట్లు” అంశాన్ని చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
అనాదిగా అడవులను ఆధారం చేసుకొని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు జీవనం సాగించేవాళ్లు. మధ్యప్రదేశ్, చత్తీ కి చెందిన బైగా, మురియా, గోండ్, బిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర జాతులు అటవీశాఖాదికారులు, గుత్తేదారుల వద్ద, లేదా వడ్డీ వ్యాపారస్తుల వద్ద వెట్టిచాకిరీ కార్మికులుగా శ్రమను చిందించేవారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు, గిరిజనుల భూములను చేజిక్కించుకుని, గిరిజనులను అణగదొక్కారు. అదేవిధంగా అటవీశాఖాధికారులు కూడా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసి జరిమానాలు విధించి, చిన్న కారణాలకు సైతం ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను లాక్కోని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నిత్యసత్యమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. దీనికిగాను వారు విప్లవ పంథాను ఎంచుకుని, పోలీస్ స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లు వంటిని తగలబెట్టేవారు. కొన్ని సందర్భాలలో అడవిని తగలబెట్టేవాళ్లు. ఈ తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 ఆంధ్రప్రదేశ్ కోయ ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు చేశారు.

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.220

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసుల జీవనవిధానం, అడవులను వాళ్ళు ఉపయోగించుకున్న విధానాలను తెలియజేసే నాలుగు వాక్యాలను గుర్తించండి.
జవాబు:
అడవులలో ఆనందంగా జీవించే ఆదివాసీలే అడవులకు యజమానులు. తమ రోజూవారీ జీవనానికి కావలసిన అనేక ఉత్పత్తులు హాయిగా అడవుల నుండి పొందేవాళ్ళు. వేటాడుతూ, తమ ఆహారానికి అవసరమైన దుంపలు, పళ్ళు’ ఆరగిస్తూ, పూలు, వనమూలికలు సేకరిస్తూ, పశువులను మేపుకుంటూ అడవులను ఉపయోగించుకునే వాళ్ళు.

9th Class Social Textbook Page No.221

ప్రశ్న 2.
రైల్వే పట్టాలలో ఒకప్పుడు ఉపయోగించిన కలప స్లీపర్లను మీరు చూశారా? వీటికి బదులుగా ప్రస్తుతం ఏమి వాడుతున్నారు? ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చర్చించండి.
జవాబు:
భారతదేశం బ్రిటిష్ పరిపాలనకు ముందు అడవులతో పచ్చని చెట్లతో వికసించేది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ఓడలు, గనుల నిర్మాణాలకు కలప కోసం అడవులలో లభించే చెట్లను నరికేవారు. రైలు మార్గాలు అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయటానికి ఒక కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. తద్వారా అడవులు రానురాను అంతరించడమే కాకుండా అడవులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం కలప స్లీపర్లకు బదులు ఇనుప స్లీపర్లను వాడుతూ, పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవులను కాపాడుతున్నారు.

9th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
‘రక్షిత మార్కెటు’ అంటే ఏమిటో చర్చించండి.
జవాబు:
ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై లేదా బట్టలపై పన్నులను విధించినట్లయితే విదేశీ వస్తు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వస్తువులపై పన్ను విధించకుండా తక్కువ ఖరీదుకు వస్తువులను అమ్మినట్లయితే భారతదేశ వస్తువులకు విలువ, ప్రాధాన్యత, పనితనం కనిపించి వస్తువులు అమ్మటానికి అనువైన వాతావరణం కనిపిస్తుంది. దీనినే రక్షిత మార్కెట్ అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరసాగారు. ఇది న్యాయమైన కోరికేనా? భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలా?
జవాబు:
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరికే. ఎందుకంటే మన దేశంలో ముడి పదార్థాలను అతి చౌకగా కొని, వాటిని వారి దేశంలో వస్తువులుగా మార్చి , అధిక ధరలకు మన దేశ మార్కెట్లో అమ్మి మన సంపదనంతా వస్తు రూపంలో దోచుకుంటున్నారు. అదే విధంగా వారు తయారుచేసిన వస్తువులలో సాంకేతిక విజ్ఞానం, పనితనం కనిపించడం వలన ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. పన్నులు విధించడం వల్ల బ్రిటిష్ వస్తు ఖరీదు పెరగడమే కాకుండా మన దేశ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి దోపిడీ పాలన గల బ్రిటిష్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం సమానంగా వ్యవహరించవలసిన అవసరం లేదు.

9th Class Social Textbook Page No.226

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత పరిశ్రమలు ఎందుకు వేగంగా వృద్ధి చెందాయి?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) భారతదేశంలోని విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్ళించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాలలో యుద్దానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెటు కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి.

9th Class Social Textbook Page No.227

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఏ పరిశ్రమలు స్థాపించారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నూలు, వస్త్ర పరిశ్రమ. జెంషెటాటా ఆధ్వర్యంలో జంషెడ్ పూర్ వద్ద ఉక్కు కర్మాగారం స్థాపించారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య సమయంలో భారత పరిశ్రమల అభివృద్ధికి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతులలో లేవు. ఇవి చాలా ఎక్కువగా బ్రిటిష్ వారి అధీనంలో ఉండేవి. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అధికారాలు, ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇటువంటి మేధావులైన కార్మికులు మన దేశ పరిశ్రమలలో పనిచేసేవారు కాదు. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మన పరిశ్రమలకు కొరతగా ఉండేవి. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా తగినంత మంది లేకపోవడం కూడా మన పరిశ్రమలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైంది.

9th Class Social Textbook Page No.229

ప్రశ్న 8.
భారతదేశంలో తొలినాటి కర్మాగారాలలో కార్మికుల పని, విశ్రాంతికి సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
మిల్లులలో పనిచేసే కార్మికుల పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్రలేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు పని మొదలు పెడితే ఆపడమనేదే లేదు.

విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. 15 -20 నిమిషాలు భోజనానికి విశ్రాంతి ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. వారానికి ఒక రోజు సెలవులేదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. మిగతా సమయంతా పనిలోనే కార్మికులు నిమగ్నమయ్యేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 9.
వేతనాల చెల్లింపునకు సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
కార్మికులు ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించే వాళ్ళు. “ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ” అన్న నియమాన్ని యజమానులు అమలు చేశారు. ఒక్కొక్క సారి యంత్రాలు పనిచేయకపోయినా చెల్లింపులు ఉండవని చెప్పేవారు. నెల అయిన తరువాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టే పెట్టుకొనే వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పనిమానేసి వెళ్లిపోవటం సాధ్యం అయ్యేది కాదు.

ప్రశ్న 10.
ఏ కారణాల వల్ల కార్మికుల వేతనాలను తగ్గించేవాళ్ళు?
జవాబు:
కార్మికులకు జరిమానాలు విధించేవాళ్ళు. ప్రతీ చిన్న విషయానికి, పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైపోయిందని, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయలేదని యజమానికి అనిపించినా జరిమానాలు విధించి, కార్మికులకు నెలలో రావలసిన వేతనం నుంచి మినహాయించే వాళ్ళు.

9th Class Social Textbook Page No.230

ప్రశ్న 11.
కార్మికులు సమ్మె ఎందుకు చేసేవాళ్ళు?
జవాబు:
కార్మికుల దుర్భర పరిస్థితుల నుండి తమ హక్కుల సాధన కొరకు సమ్మె చేసేవారు.

  • కొన్ని సందర్భాలలో తమ వేతనాలు తగ్గించినందుకు నిరసనగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు.
  • అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా, తమ జీవన విధానం కొరకు వేతనాలను పెంచమని సమ్మె చేశారు.
  • మరి ముఖ్యంగా కార్మికులు వేతనాలు, హక్కుల కోసమే కాకుండా బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు సమ్మెల ద్వారా కార్మికులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న 12.
ఇతర చర్యలకు బదులు సమ్మెనే ఆయుధంగా ఎందుకు ఉపయోగించే వాళ్ళు?
జవాబు:
ఈ సమ్మె చేయడం ద్వారా పరిశ్రమలు మూతబడతాయి.

  • ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ పరిశ్రమలకు, కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది.
  • కంపెనీ ఉత్పత్తులపై సమాజంలో చెడు ప్రభావం పడుతుంది.
  • నిరంకుశ నిర్ణయాలు గల యజమానుల నుండి మార్పు కొరకు సమ్మెనే ఎంచుకుంటారు.

సమ్మె ద్వారా వచ్చే నష్టం కంటే వారి కోరికలు తీర్చడమే ప్రధానమని యజమానులు భావించి, కార్మికుల కోర్కెలు తీరుస్తారు. నిరసనలు, ఉపన్యాసాలు, ఊరేగింపుల ద్వారా కంపెనీ యజమానులలో మార్పురాదు. కాబట్టి బలమైన ఆయుధం సమ్మెనే కార్మికులు ఎంచుకుంటారు.

9th Class Social Textbook Page No.231

ప్రశ్న 13.
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? కాల పట్టికలో దానిని గుర్తించండి. మీ తల్లిదండ్రులు, తాత, అవ్వలు, వీలైతే కొంతమంది వృద్ధ బంధువులు పుట్టిన సంవత్సరాలను కూడా గుర్తించండి.
జవాబు:
నేను 1999లో జన్మించాను. మా నాన్నగారు 1963లో జన్మించారు. మా అమ్మగారు 1965లో జన్మించారు. మా తాతగారు 1943లో, మా అవ్వ 1939లో జన్మించారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 14.
వాళ్ళలో ఎవరైనా ఏదైనా కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందారేమో కనుక్కోండి.
జవాబు:
మా తాతగారు షుగర్ ఫ్యాక్టరీ (పంచదార పరిశ్రమ) లో పనిచేసేవారు. ఈ కార్మిక చట్టాల వలన పనిగంటలు తగ్గాయని, చాలా విషయాలలో కంపెనీ యజమానులు ప్రయోజనం కల్పించారని, వైద్య సదుపాయాలు మరియు విశ్రాంతికి తగిన అవకాశాలు కల్పించారని చెప్పారు.

ప్రశ్న 15.
మొదట్లో కార్మికుల సంక్షేమంపై భారతదేశంలోని విద్యావంతులు ఎందుకు అంతగా దృష్టి పెట్టలేదు?
జవాబు:

  • కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని,
  • యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని,
  • దీనివల్ల కార్మాగారాలలో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోతుందని,

ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి, భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుందని కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదు.

ప్రశ్న 16.
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి?
జవాబు:
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను భయందోళనకు గురిచేశాయి. కార్మిక చట్టాల వల్ల పని గంటలు తగ్గడమే కాకుండా విశ్రాంతి గంటలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గుతుందని, వారిలో ఐక్యత, సమ్మెవంటి హక్కులు ద్వారా మిల్లు యజమానులకు ఖర్చులు పెరిగి, నష్టాలు వచ్చే ప్రమాదముందని భయపడ్డారు.

ప్రశ్న 17.
బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాళ్ళు భారతదేశ కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులపై భారతదేశంలో పన్నులు విధించడం వల్ల వాళ్ళ వస్తూత్పత్తి ధరలు పెరగసాగాయి. కానీ భారతదేశంలో అధిక కార్మికులు తక్కువ వేతనానికి అధిక పని గంటలు పనిచేసి అధికోత్పత్తి సాధించడమే కాకుండా తక్కువ ధరకు భారతీయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కాబట్టి కార్మికులకు మరిన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించి, పని గంటలు తగ్గించి, వేతనాలు పెంచినట్లయితే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, తమ ఉత్పత్తులపై కొనుగోలు శక్తి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని భావించారు.

ప్రశ్న 18.
బ్రిటిషు కాలంలో ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకుండా చేశారు?
జవాబు:
9 సం||ల లోపు పిల్లలను కార్మికులుగా పిల్లలను పెట్టుకోకుండా చేశారు.

ప్రశ్న 19.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకూడదు?
జవాబు:
14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు.

ప్రశ్న 20.
కార్మిక చట్టాల ప్రకారం పిల్లలు, మహిళలు, పురుషులు రోజుకి ఎన్ని గంటల పాటు పనిచేయాలి?
జవాబు:

  1. కార్మిక చట్టాల ప్రకారం పిల్లలతో రోజుకి 7 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
  2. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పనిచేయించకూడదు.
  3. పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.

9th Class Social Textbook Page No.232

ప్రశ్న 21.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఏర్పడిన రెండు ముఖ్యమైన కార్మిక సంఘాలు ఏవి?
జవాబు:
1920 ల నుంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.

  1. సోషలిస్టు భావాలతో ఏర్పడిన “గిర్నికాంగార్ యూనియన్”.
  2. అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన కార్మిక సంఘం “మజూర్ మహాజన్”.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 22.
కార్మికులకు కార్మిక సంఘం ఎందుకు ముఖ్యమైనది? చర్చించండి.
జవాబు:

  1. కార్మికుల సంక్షేమం కోసం.
  2. తమ హక్కుల సాధన కొరకు.
  3. మెరుగైన వేతనాలు సాధించుకోడానికి.
  4. మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి.
  5. కార్మికులకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు, మెరుగైన నష్టపరిహారాలు యజమానుల నుండి పొందడానికి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అటవీ శాఖకు వెళ్ళి అడవులను ఎలా కాపాడుకోవాలి, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి నిర్వహించండి.
జవాబు:
అటవీ శాఖకు వెళ్ళి ‘అడవులను కాపాడుకోవాల్సిన విధం, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి :

నేను – అటవీ శాఖాధికారిగారూ….. అడవులను ఎలా కాపాడుకోవాలి?

అటవీ శాఖాధికారి – అడవులను నరకరాదు. అవి మన జాతీయ సంపద.

నేను – మన కలప అవసరాలు అడవుల ద్వారానే కదా తీరేది.

అటవీ శాఖాధికారి – అడవులనుండి మనకు కలప లభిస్తున్నప్పటికి, అడవులను విచ్చలవిడిగా నరకరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చిన వాటి స్థానంలో మొక్కలను నాటాలి.

నేను – అంటే చెట్లను నరుకుతున్న ప్రదేశాలలో క్రొత్త మొక్కలను నాటవలసి ఉంటుందన్నమాట.

అటవీ శాఖాధికారి – అంతేకాదు, మనం నివసిస్తున్న ప్రదేశాలందు ఖాళీగా ఉన్న ప్రాంతాలలోను, ఆ పాఠశాలల, కళాశాలల ఆవరణములలోని పారిశ్రామిక ప్రాంతాలయందు, రోడ్లకిరువైపుల నదులు, కాలువగట్లపైన మొక్కలను నాటవలసి ఉంటుంది.

నేను – మొక్కలను పెంచడం వలన ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

అటవీ శాఖాధికారి – అనేక ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణం పరిరక్షించబడుతుంది. వర్షాలు సంభవిస్తాయి. వరదలను అరికట్టడం జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వృక్షో రక్షతి రక్షితః – వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.

ప్రశ్న 2.
మీకు దగ్గరలో ఉన్న ఒక కర్మాగారాన్ని సందర్శించి దాని చరిత్ర, సాంకేతిక విజ్ఞానం ఎలా మారింది, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు తెలుసుకోండి. కొంతమంది కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ దృక్పథాలు తెలుసుకోండి.

పట నైపుణ్యాలు

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 3
అల్లూరి సీతారామరాజు
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది, చింతపల్లి, రంపచోడవరం, కె.డి. పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేసిన రాజును మంప గ్రామం వద్ద బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 4
కొమరం భీం
సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో స్ఫూర్తి పొంది, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. గొండు, కోయ యువకులతో భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలను ప్రయోగించడంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందారు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాటిని జతపరచండి. (AS1)

1. నల్లమందు యుద్ధాలు అ) బెల్జియం
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ) స్పెయిన్
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
4. రైతులు స్థిరపడేలా చేయడం ఈ) చైనా

జవాబు:

1. నల్లమందు యుద్ధాలు ఈ) చైనా
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం అ) బెల్జియం
4. రైతులు స్థిరపడేలా చేయడం ఆ) స్పెయిన్

ప్రశ్న 2.
ఐరోపా వాసులు ‘కనుగొనటం’, ‘అన్వేషణ’ అన్న పదాలను ఎలా ఉపయోగిస్తారు? ఆ భౌగోళిక ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను ఇవి ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
ఐరోపా వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు కొనసాగించి అధిక లాభాలు ఆర్జించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వర్తక వాణిజ్యాలు కొనసాగించడానికి, అనేక నూతన ప్రదేశాలను కనుగొని, ముఖ్య పట్టణాలలో ముఖ్యమైన వ్యాపార కేంద్రాలను అన్వేషణ చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రపంచానికి తెలియని అనేక కొత్త ప్రాంతాలు, దేశాలను అన్వేషించి, వాటికి పేర్లు పెట్టారు. తమ వలస ప్రాంతాలకు తేలికగా, సులువుగా చేరుకొనే ప్రయత్నంలో అనేక కొత్త మార్గాలను అన్వేషించారు. పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. వివిధ కొత్త ప్రాంతాలను అన్వేషించి, కనుగొనడం ద్వారా ఆయా ప్రాంత ప్రజలు ఆనందం వెలిబుచ్చారు. వ్యాపారాభివృద్ధితో ముందుకు నడిపించడమే కాకుండా కొన్ని సందర్భాలలో హింసలకు, బానిసత్వానికి గురయ్యారు. ఏ విధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేక వలస పాలకుల అధీనంలో చీకటి బతుకులు బతికేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
వలస ప్రాంతాలుగా మార్చటంలో వ్యాపారం పోషించిన పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
రాజుల పాలనలో రాజుల ఆధీనంలో ఉన్న ముఖ్య పట్టణాలను, వ్యాపారం పేరిట వివిధ దేశాలకు చెందిన వ్యాపారస్తులు, రాజుల అనుమతితో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందేవారు. తమ వ్యాపార మెళుకువలతో రాజులను ఆకర్షించడమే కాకుండా ముఖ్య నగరాలు, ముడి పదార్థాలు అభ్యమయ్యే ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా వ్యాపారస్తులు మలుచుకున్నారు. అంతేకాకుండా అప్పుడు రాజులలో ఉన్న అనైక్యత, వైరుధ్యాలు, వైరాలను తమకు అనుకూలంగా మార్చుకొని, లంచం రూపంలో నిధులు అందించి, చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వ్యాపార కేంద్రాలు ద్వారా తమ అధీనమైన ప్రాంతాలలోని ప్రజలను బానిసలుగా చేసి, వలస ప్రాంతాలుగా మలుచుకొని అధిక సంపదను దోచుకొని, తమ పాదాక్రాంతం చేసుకున్నారు.

ప్రశ్న 4.
వలస పాలన వివిధ దేశాలలో స్థానిక ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసింది? మూడు ఖండాలకు వేరుగా ఒక్కొక్క దాని గురించి ఈ కింది నేపథ్యంలో రాయండి.
ఎ) పండించిన పంటలు
బి) మతం
సి) ప్రకృతి వనరుల వినియోగం (AS1)
జవాబు:
ఎ) పండించిన పంటలు :
యూరపు వలస ప్రాంతాలలోని స్థానికులు నావికులను, వ్యాపారస్తులను ఆహ్వానించి, ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. కాని స్పెయిన్ ప్రజలు వాళ్ళను దోచుకుని బానిసలుగా వాడుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో వలస ప్రాంతాలు ఏర్పరిచారు. పండిన పంటలు ఆక్రమించుకుని రైతుల భూములు ఆక్రమించి వారికి భూముల్లేకుండా చేశారు.

లాటిన్ అమెరికాలో వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించింది. స్పెయిన్ నుంచి స్థిరపడినవారి అధీనంలో విశాల భూభాగాలు ఉండేవి. వీటిని ‘హసియండా’ అనేవాళ్ళు. వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు ఉండేవి. చెరుకు, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగుచేసి వలస పాలిత ప్రాంతాలు వాటిని చవకగా తమపై ఆధిపత్యమున్న దేశాలకు అమ్మాలి.

ఆసియాలో యూరపు వలస దేశాల పాలనలో కూడా రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో ప్రోత్సహించారు.

బి) మతం :
మూడు ఖండాల మధ్య చాలా వ్యాపార మార్గాల అన్వేషణ, నియంత్రణ, అధిక లాభాలకై యుద్దాలు చేసేవారు. కేథలిక్కు మత విధానాలను బలవంతంగా రుద్దసాగారు. మతాధికారులు, మతగురువులు, పోపు ఆధిపత్యం కొనసాగింది. వలస పాలిత ప్రాంతాలలో మత ఆధిపత్యం చెలాయించటానికి అధికంగా ప్రయత్నించారు.

సి) ప్రకృతి వనరుల వినియోగం :
వలస ప్రాంతాలలో ప్రకృతి వనరులు ఈ మూడు ఖండాల వారిని ఆకర్షించాయి. ప్రకృతి వనరులను తమ అధీనంలోకి తెచ్చుకోడానికిగాను భూదాహంతో ఆయా ప్రాంతాలలో స్థిరపడడానికి ప్రయత్నించారు. విలువైన బంగారు గనులు, వెండి నిక్షేపాలు గల భూములను ఆక్రమించి, యజమానులను తరిమికొట్టారు. కొన్ని ప్రాంతాలలో వలస ప్రాంత భూములను చవకగా పొంది ప్రకృతి వనరులను అనుభవించారు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
చైనా, భారతదేశం, ఇండోనేషియాలపై వలసపాలన తీరు గురించి రాయండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశం :
15వ శతాబ్దం ఆరంభంలో గోవా వంటి ఓడ రేవుల పై పోర్చుగీసు ఆధిపత్యం సాధించింది. ఇతర యూరప్ దేశాలు 16వ శతాబ్దం చివరి నాటికి వ్యాపార కేంద్రాలను స్థాపించి, భారతదేశంతో వ్యాపారం చేయటం మొదలుపెట్టాయి. భారతదేశ భాగాలపై రాజకీయ నియంత్రణ దక్షిణ భారతంలో మొదలైంది. మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచి ఆధిపత్యం సాధించాయి. చవక ధరలకు తమ ఉత్పత్తులను అమ్మేలా రైతులు, చేతి వృత్తి కళాకారులు, వ్యాపారస్తులను బలవంతం చేయటానికి తన రాజకీయ శక్తిని బ్రిటిషు వారు ఉపయోగించుకున్నారు.

చైనా :
యూరపు దేశాలు చైనాలో స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి చైనా అనుమతించలేదు. ఒక పట్టణంలో మాత్రమే వ్యాపారం చేసుకోడానికి అనుమతిచ్చారు. చైనాలో బాగా గిరాకి ఉండి, భారత్ లో విరివిగా పండు నల్లమందు అక్రమ రవాణా ద్వారా లాభాలు గడించాలని యూరపు దేశస్తులు తలంచారు. నల్లమందు ద్వారా తమ దేశస్తులు నష్టపోతున్నారని చైనా తలంచగా ఈ రెండు దేశాల మధ్య, 1840 – 42 ల మధ్య యుద్ధాలు జరిగాయి. తదుపరి చైనా ఓడిపోయి ఇంగ్లాండు. ఒప్పందాలకు అంగీకరించింది.

ఇండోనేషియా :
బలమైన రాజ్యాలు లేని ఇండోనేషియాలోని విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకోసాగింది. తమ ఉత్పత్తులను కంపెనీకి తక్కువ ధరలకు అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది. 1800 సం|| నుండి ఇండోనేషియా ఆక్రమించుకొని పాలించసాగింది. ఆ దేశాన్ని ఆదాయ వనరుగా ఉపయోగించుకుంది.

పోలికలు :

  1. ఈ మూడు దేశాలు వలస దేశాలుగా ఉన్నవే.
  2. ఈ మూడు దేశాలు, ప్రకృతి వనరులు, సహజ సంపదతో విలసిల్లేవి.
  3. వ్యాపారాలతో ప్రారంభించి, వలసవాద దేశాల అధీనంలోనికి వెళ్ళినవే.
  4. ఇచ్చట ప్రజలలో, రాజులలో అనైక్యత మూలంగానే.
  5. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు.
  6. ప్రజలను బానిసలుగా మార్చారు.

తేడాలు :
‘భారతదేశం’లో అన్ని ప్రాంతాలలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు పొందారు. (ముఖ్య పట్టణాలు).

‘చైనా’ అన్ని ప్రాంతాలు కాకుండా, ఒకే ఒక్క పట్టణంలో వ్యాపారానికి అనుమతి.
‘ఇండోనేషియా’ బలమైన రాజ్యాలు లేకపోవడం వల్ల దేశం అంతా ఆక్రమణ.
భారతదేశంలో ఆధిపత్యానికి ఒకదానితో ఒకటి పోటి పడసాగాయి. అనేక యుద్ధాలు ద్వారా పరిపాలన పాదాక్రాంతం. చైనాలో నల్లమందు ద్వారా యుద్ధాలు ప్రారంభం. అనేక ఒప్పందాలు వల్ల నిధులన్ని కొల్లగొట్టారు.
ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలు సాగు చేయటాన్ని ప్రోత్సహించింది.

ప్రశ్న 6.
ప్రపంచ పటం నందు పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచి వలసలను గుర్తించి, రంగులతో నింపండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 4

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం InText Questions and Answers

9th Class Social Textbook Page No.205

ప్రశ్న 1.
వాళ్ళకు అసలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణా అమెరికా, అంటార్కిటికా.

ప్రశ్న 2.
వాళ్ళకు తీర ప్రాంతాలు తెలిసి, లోపలి ప్రాంతాలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్.

9th Class Social Textbook Page No.206

ప్రశ్న 3.
1400 లలో ఆసియాతో వ్యాపారాన్ని యూరపు దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ కాకుండా ఇటలీ ఎందుకు నియంత్రిస్తోంది?
జవాబు:
1400 సం||నాటికి యూరపు, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా వాళ్ళు ఆసియా నుండి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా దగ్గర వాళ్లకి అమ్మేవాళ్ళు. పశ్చిమ యూరపులో హాలెండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు, ప్రభుత్వాలు, ఈ వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారు. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలకు ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా తేలికగా, త్వరగా చేరుకునే మార్గాలను అన్వేషించసాగారు.)

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 4.
ఆసియాకి మరో మార్గాన్ని కనుక్కోవటానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఎందుకు అంత ఆసక్తి కనపరిచాయి?
జవాబు:
భారతదేశం, చైనా, ఇండోనేషియా వంటి దేశాలు. ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉండటం, కొన్ని ప్రాంతాలలో ఇటలీ ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారలావా దేవీలు కొనసాగించడం వల్ల ఈ మార్గాలు కాకుండా తేలికగా, త్వరగా చేరుకొనే మార్గాలను అన్వేషించారు. ఉదా : పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటటం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. అనుభవజ్ఞులైన నావికులు, ఓడలు ద్వారా ఆసియాను అన్వేషణ చేశారు.

9th Class Social Textbook Page No.208

ప్రశ్న 5.
1800 నాటి దక్షిణ అమెరికా పటాన్ని చూసి వివిధ వలస రాజ్యా లను, పాలిత దేశాలను గుర్తించండి.
జవాబు:
దక్షిణ అమెరికా వలస రాజ్యా లు :
పోర్చుగీసు, స్పెయిన్, డచ్, యు.కె.

పాలిత దేశాలు :
ఉరుగ్వే,
వెనిజులా,
ఈక్వెడార్,
బొలీవియా,
పెరు,
పరాగ్వే,
అర్జెంటైనా.
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

ప్రశ్న 6.
వలస ప్రాంతాల ప్రభుత్వాలలో అక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు ప్రముఖ పాత్రను ఎందుకు ఇవ్వలేదు?
జవాబు:
స్పానిష్ ప్రజలకు వలస ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి. కూడా ముఖ్యపాత్ర పోషించేది. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు, కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి కాదు. స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలు. మందుగుండు సామగ్రి వలస ప్రాంత ప్రభుత్వాలను భయపెట్టింది. స్పానిష్ వలస పాలనలో ఉన్న ప్రజలు అక్కడ ఎంతో కాలం క్రితం స్థిరపడిన స్పానిష్ ప్రజలతో సహ తమపై స్పానిష్ రాచరిక వర్గాల నియంత్రణను ద్వేషించసాగారు.

9th Class Social Textbook Page No.209

ప్రశ్న 7.
మీరు ఎనిమిదవ తరగతిలో నిజాం రాజ్యంలోని జమీందారీ వ్యవస్థ గురించి చదివారు. నిజాం రాష్ట్రంలోని జమీందారీ వ్యవస్థను దక్షిణ అమెరికాలోని హసియండాలతో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
జమీందారీ వ్యవస్థకు, హసియండాలతో పోలికలు, తేడాలు ఉన్నాయి.

పోలికలు :

  • జమీందారీ వ్యవస్థలోను, హసియండాలోను కూడా ఉండేవి వ్యవసాయ భూములే.
  • జమీందారుల అధీనంలోని భూములు, భూస్వాముల అధీనంలోని భూములు వేలల్లో ఉండేవి.
  • తరతరాలుగా అనుభవిస్తున్నారు.

భేదాలు :

  • జమీందారీ వ్యవస్థలోని భూముల్లో కొన్ని సారవంతమైనవి. మరికొన్ని ఎకరాలు నిస్సారమైనవి.
  • హసియండా భూములు బాగా ఖరీదైనవి, సారవంతమైనవి.
  • జమీందారీ భూములను చిన్నచిన్న రైతులు, కౌలుదార్లు వ్యవసాయం చేసేవారు.
    హసియండా భూముల్లో ఆఫ్రికా బానిసలు, స్వేచ్ఛలేని ఇండియన్లను నియమించుకునేవారు.
  • జమీందారుల భూముల్లో రకరకాల పంటలు, అడవులు, చెట్లు ఉండేవి.
    హసియండా వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బీళ్ళు, కర్మాగారాలు కూడా ఉండేవి.
  • జమీందారీ భూముల్లో భూ సంస్కరణ, భూ పరిమితి చట్టాలు వలన కొంత భూమి కోల్పోయారు. హసియండాలో భూములు కోల్పోలేదు.

ప్రశ్న 8.
లాటిన్ అమెరికాలోని వలస పాలిత ప్రాంతాల్లో దిగువ ప్రజల సమస్యల జాబితా తయారుచేయండి.
జవాబు:
1. హసియండాల యజమానులైన స్పానిష్ వలసవాదులు :
స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉండే విశాల భూభాగాన్ని “హసియండా” అనేవాళ్ళు. ఈ భూస్వాములు తమకింద పనిచేయటానికి, ఆఫ్రికా బానిసలను లేదా స్వేచ్ఛలేని ఇండియన్లని నియమించుకునే వాళ్ళు. వీరు అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తూ, తమ శక్తిని ధారపోసి పనిచేసేవాళ్ళు.

2. అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు :
అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు ఉండేవారు. కాని వలస ప్రాంతాల పరిపాలనలో అక్కడ స్థిరపడిన స్పెయిన్ ప్రజలకు ఎటువంటి పాత్ర లేదు. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు. కాని ఆ దేశాలు అభివృద్ధి చెందటానికి కాదు.

3. స్థానిక అమెరికన్లు :
‘దక్షిణ అమెరికాలో అధికభాగం స్పెయిన్, పోర్చుగల్ అధీనంలోకి వచ్చింది. ప్రజలలో సగానికిపైగా ప్రజలు యూరోపియన్ల చేతుల్లో హతమయ్యారు. తద్వారా యూరప్ ప్రజల నియంత్రణలో, బ్రతికారు. చాలామంది స్థానిక అమెరికన్లు స్పానిష్ నియంత్రణలోకి వచ్చారు. భారీగా పన్నులు చెల్లించేవారు. గనులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చేది. గుడులను విధ్వంసం చేసి చాలామందిని రోమన్ కాథలిక్కు మతానికి మార్చేశారు.

4. లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసలు :
లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసల జీవనం దుర్భరంగా ఉండేది. దక్షిణ అమెరికాలో చాలామంది హతమవ్వడం, రోగాల బారిన పడి చనిపోవడం వల్ల ఆఫ్రికా బానిసలను కొనసాగారు. తద్వారా వాళ్ళు జీవితాంతం నరకయాతన అనుభవించేవాళ్ళు. ఎదిరించే శక్తి లేక, సరైన ఆయుధాలు, నాయకత్వం లేకపోవడం వలన కటికచీకటి బతుకులు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.211

ప్రశ్న 9.
వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ లాటిన్ అమెరికా దేశాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి?
జవాబు:

  1. పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, అమెరికాలపై ఆధారపడి ఉండటం.
  2. సామాజిక, ఆర్థిక, అసమానతలు తీవ్రంగా ఉండడం.
  3. భూమి లేకపోవడం వల్ల పేదరికం ఎక్కువగా ఉండి ఈ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి.

ప్రశ్న 10.
మన్రో సిద్ధాంతం లాటిన్ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కాపాడింది ఇది వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం కూడా చేసిందా?
జవాబు:
1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్. మన్రో తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాలలో కానీ అమెరికా జోక్యం చేసుకోదు. వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
మన్రో సిద్ధాంతం వల్ల బ్రిటన్ ఏ విధంగా లాభపడింది?
జవాబు:
బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్ధించింది. అమెరికా ఖండాలలోని దేశాలు యూరపు శక్తుల రాజకీయ అధీనంలో లేకపోతే వాటికి ఇంగ్లాండుతో వ్యాపారం చేయడానికి, వాటి పారిశ్రామిక ఉత్పత్తులను కొనే స్వేచ్ఛ ఉంటుంది.

9th Class Social Textbook Page No.215

12. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువులు పట్టు, తేయాకు.

13. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి నల్లమందు.

14. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్.

9th Class Social Textbook Page No.216

ప్రశ్న 15.
1913 నాటి ఆఫ్రికా పటాన్ని చూసి ఆఫ్రికాని ఏ మేరకు యూరపు దేశాలు తమ వలస ప్రాంతాలుగా మార్చుకున్నాయో చూడండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

ప్రశ్న 16.
కింద పట్టికలో ఆఫ్రికాలోని కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. 1913లో వీటిని వలసగా చేసుకొని పాలించిన దేశం పేరును ఎదురుగా రాయండి.
జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్
ఈజిప్టు ఇంగ్లాండ్
నైజీరియా ఫ్రాన్స్
ఘనా ఇంగ్లాండ్
లిబియా ఇటలీ
అల్జీరియా ఫ్రాన్స్
అంగోలా పోర్చుగీసు
కాంగో బెల్జియం

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీరు బ్రిటన్ పౌరులైతే వలసపాలనను సమర్థిస్తారా? ఎందుకు? భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? మీ దృక్పథాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
బ్రిటన్ పౌరుడిని అయితే వలస పాలనను సమర్థిస్తాను. ఎందుకంటే ప్రపంచ పోటీని తట్టుకోడానికి, వర్తక వాణిజ్యాలలో, ముందుండడానికి, విశాల సామ్రాజ్యం మా అధీనంలో ఉండడానికి, బ్రిటన్ ప్రపంచంలో బలమైన రాజ్యమని ప్రపంచ ప్రజలు జేజేలు పలకడానికి సమర్థిస్తాను.

భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో ఈ దిగువ దేశాలను గుర్తించుము.
1. మెక్సికో
2. అమెరికా
3. చైనా
4. నెదర్లాండ్స్
5. ఇండోనేషియా
6. టర్కీ
7. స్పెయిన్
8. వెస్ట్ ఇండీస్
9. ఇటలీ
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 3

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పారిశ్రామిక కార్మికుల జీవితాలకు సంబంధించి కింద ఉన్న వాక్యాలలో సరైనవి ఏవి ? సరికాని వాటిని సరిచేయండి. (AS1)
ఎ) కార్మికులు పరిశ్రమలను నియంత్రించేవాళ్ళు.
జవాబు:
కార్మికులు ఏ మాత్రం దయ, కనికరం, సానుభూతిలేని యజమానుల నియంత్రణలో పనిచేశారు.

బి) కార్మికుల జీవన పరిస్థితులు సౌకర్యంగా ఉండేవి.
జవాబు:
పారిశ్రామికీకరణ వలన కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి.

సి) కార్మికుల అసంతృప్తికి తక్కువ వేతనాలు ఒక కారణం. (✓)
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

డి) పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనలకు ప్రాధాన్యత ఉండేది.
జవాబు:
పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనల కంటే హేతువు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.

ఇ) జానపద కథలు, జానపద పాటలలో ప్రకృతికి దగ్గరగా ఉన్న విలువలకు కాల్పనికవాద రచయితలు, కళాకారులు ప్రాధాన్యతనిచ్చారు.
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

ప్రశ్న 2.
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను కొన్నింటిని పేర్కొనండి. ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి. (AS1)
జవాబు:
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు :

  1. నూలు పరిశ్రమలలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు, పనిలేకుండాపోయింది.
  2. యంత్రాలతో పోటీపడలేని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదలుగా మారారు.
  3. కనీస వేతనాలు ఉండేవి కావు.
  4. అధిక పని గంటలు ఉండేవి.
  5. మహిళల, పిల్లల పనిభారం ఎక్కువగా ఉండేది.
  6. తమ హక్కుల కోసం పోరాడడానికి బలమైన కార్మిక సంఘాలు లేవు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.
  7. సానుభూతిలేని పర్యవేక్షకులు, యజమానుల నియంత్రణలో పనిచేయడం.
  8. భద్రత, గౌరవప్రద జీవనానికి అవకాశం లేదు.
  9. దారిద్ర్యం, దుర్భర జీవన పరిస్థితులు.
  10. నివసించే ప్రాంతాలు అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

ఈ రోజుల్లో :

  1. అంత దుర్భర జీవన పరిస్థితులు లేవు.
  2. కొన్ని ప్రాంతాలలో తక్కువ వేతనాలు లభిస్తున్నాయి.
  3. యజమానుల నిరంకుశత్వ, ఒంటెద్దు పోకడలు ఉన్నాయి.
  4. కార్మికుల కోర్కెలు తీర్చలేని యజమానులు లాకౌట్స్ పేరిట పరిశ్రమలను మూసివేస్తున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం (సోషలిజం)ల భావనలను పోలుస్తూ ఒక పేరా రాయండి.. అవి ఎంత వరకు సారూప్యాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి? (AS1)
(లేదా)
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం మధ్య పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి. అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్టు నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది. పెట్టుబడిదారీ విధానం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే పరిస్థితికి అనివార్యంగా, అన్యాయంగా, దోపిడీకి దారితీస్తుందన్నది సామ్యవాదం చేసే విమర్శ. ‘వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాలలో సమానత్వం అన్నది పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి. సోషలిస్టుల * ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, ఏ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

పోలికలలో ప్రధానంగా పెట్టుబడిదారీ విధానంలోని సామ్యవాదంలోను ఉత్పత్తి సాధనాలు ఉండాలి.
1. వస్తూత్పత్తికి పెట్టుబడి రెండింటికి అనివార్యం.
2. నాణ్యమైన వస్తూత్పత్తికి ప్రాధాన్యం. యుగాలు

పెట్టుబడిదారీ విధానం సామ్యవాదం
1. పారిశ్రామికులు, వ్యాపారస్తులు, తమ సంపద ద్వారా యంత్రాలను, ముడి సరుకులను కొనుగోలు చేసి, కార్మికుల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మటమే పెట్టుబడిదారీ విధానం. 1. ప్రకృతి వనరులు, ఆస్తులు, వ్యక్తుల కింద వారి నియంత్రణ లో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనేది సామ్యవాదం.
2. ఉత్పత్తి చేసిన వస్తువులను వాడకం కొరకు కాక, లాభాల కొరకై వినియోగిస్తారు. 2. పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల అధీనంలో ఉంటాయి. 3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు ప్రభుత్వ అధీనంలో ఉండును.
4. ధనిక, బీద అను రెండు వర్గాలు కన్పించును. 4. ఆర్థిక అసమానతల నివారణకు తోడ్పడును.
5. కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకం. 5. కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు.
6. సప్లై మరియు డిమాండ్లు ధరను నిర్ణయిస్తాయి. 6. ధరలను ప్రభుత్వం స్వయంగా నిర్ణయిస్తుంది.
7. మార్కెట్ ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. 7. మార్కెట్ ను చట్టాల ద్వారా ప్రభుత్వం నియంత్రిస్తుంది.
8. వచ్చే లాభాలు వ్యక్తిగత సంపదను పెంచుతాయి. 8. వచ్చే లాభాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 4.
సమానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు అనుసరించిన విధానాలలో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
మానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు :

అనుసరించిన విధానాలలో పోలికలు :

  1. నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల జీవనోపాధిని కోల్పోవటానికి కారణంగా భావించిన మరమగ్గాలపై దాడి చేసి నాశనం చేశారు.
  2. ఆహారం కొరకు ఉద్యమాలు.
  3. గడ్డి నుంచి గింజను వేరు చేసే నూర్పిడి యంత్రాల వల్ల తమకు పనిలేకుండా పోతుందని భయపడిన కార్మికులు అల్లర్లకు దిగారు.
  4. కనీస వేతనం కొరకు మహిళల, పిల్లల భారం తగ్గించటం, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం, తమ హక్కుల కోసం పోరాడటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడటం కోసం అనుసరించిన విధానాలలో పోలికలు ఉన్నాయి.

తేడాలు

మహిళలు కార్మికులు
1. ఓటు హక్కు కొరకు, ఆస్తి హక్కు కొరకు ఉద్యమాలు 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల సాధన కొరకు
2. పురుషుల ఆధిపత్యం నుండి విముక్తి కొరకు 2. దోపిడీ నుండి మెరుగైన వేతనాల కొరకు
3. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం కొరకు 3. యజమానుల యంత్రాలు, సరుకు నిల్వలపై దాడి చేయటం ద్వారా
4. విద్య, వైద్య, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయటం, బలవంతంగా విధవను చేయడం వంటి వాటి విముక్తి కొరకు 4. అణచివేత నుండి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో విముక్తి కొరకు

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 5.
కార్మికులు, మహిళల నేపథ్యంలో “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అన్న భావనలను తెలియచేయటానికి ఒక గోడ పత్రిక తయారుచేయండి. ఈ హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలను గుర్తించండి. (AS5)
జవాబు:

  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచానికి అందించబడిన అమూల్యమైన ఆదర్శా లు.
  2. అయితే ఈ భావనలు కార్మికులకు, మహిళలకు సమాన వేతనం.
  3. సమాన అవకాశాలు, అవకాశాలలో సమానత్వం ముఖ్యమైనవి.
  4. తమ కోర్కెలు చట్టబద్ధంగా తెలియజేయటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు.
  5. కుల, మతాలకు, పేద, ధనిక తారతమ్యం లేకుండా వివక్షత లేకుండా విద్య, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కల్పించుట.
  6. స్త్రీ, కార్మికులకు సమాన ఓటు హక్కు కల్పించుట.
  7. సమాన పనికి సమాన వేతనం.
  8. కార్మికులకు, మహిళలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించుట.
  9. పార్లమెంటరీ, శాసనసభల, ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు.

హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలు :

  1. మహిళలకు ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు.
  2. ఉద్యోగ భద్రత లేదు. మహిళలు, పిల్లలు పట్ల కారుణ్యం లేదు.
  3. ఆర్థిక అసమానతలు.
  4. ఎటువంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ సమానులని గుర్తించక పోవడం.
  5. కార్మికులు తమ హక్కుల కొరకు, సంక్షేమం కొరకు చేసిన ఉద్యమాల కాలంలో జీతాలు నిలిపివేత, కంపెనీ లాకౌట్ ప్రకటన.

ప్రశ్న 6.
సామాజిక నిరసన ఉద్యమాలు జరిగిన దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఇటలీ
5. భారత్
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1

ప్రశ్న 7.
పేజీ నెం. 202లోని చివరి రెండు పేరాలు చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
రోజు రోజుకు పురుష ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను దూరం చేయడానికిగాను మహిళల్లో చైతన్యం వచ్చింది. వివిధ రచయిత్రులు, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, మహిళా ఉద్యమంలో భాగంగా వారిలో చైతన్యం ఉప్పొంగి, రాజకీయ, సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం వంటి అన్ని రంగాలలో వివక్షతకు చరమగీతం పాడారు.

భారతదేశంలో సంఘసంస్కర్తలు నడిపించిన ఉద్యమాలు, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం, బలవంతంగా విధవను చేయటం వంటి దురాచారాలను దూరం చేయ్యటానికి, విద్యయే కారణమని మహిళలు గ్రహించారు.

భారతదేశంలో గాంధీజీ వంటి నాయకులు మహిళా ప్రాధాన్యత గుర్తించి ఉద్యమంలో మహిళల పాత్రను నొక్కి చెప్పారు. కనుకనే స్వాతంత్ర్యం అనంతరం మహిళల కొరకు హక్కులు, చట్టాలు పొందుపరిచి సముచిత స్థానం కల్పించారు.

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.198

ప్రశ్న 1.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు నిరసన ఉద్యమాలకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, జాతీయ రాజ్యాల ఆవిర్భావంతో చేతివృత్తులు, వ్యవసాయం అడుగంటి, ఉద్యోగ భద్రత దూరమై, కార్మికులు, మహిళలు, చిన్న రైతులు, శ్రామికులలో అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు సాగి ఉద్యమాలు చెలరేగాయి.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాల ఆవశ్యకతను గుర్తించిన వీరు వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాల సమానత్వం, వివక్షత లేకుండా హక్కులు పొందడానికి, ఓటు హక్కు వంటి హక్కులు సాధించుకోవడానికి, కార్మిక సంఘాలు, సమావేశాలు, చర్చలు, ఉద్యోగ భద్రత కొరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తినిచ్చాయి.

ప్రశ్న 2.
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలను ప్రజలు సాధించారా?
జవాబు:
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలు ప్రజలు సాధించారని చెప్పవచ్చు. కాని కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆశయాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు పరిశ్రమలలో, వివిధ వ్యవసాయ పనులలో లభించడం లేదు. చాలా పట్టణాలు, గ్రామాలలో కులవివక్ష, మతవివక్ష కనబడుతూ, ఆడపిల్లల విషయంలో విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విషయంలో వివక్షత కనిపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ భావనలతో స్ఫూర్తిని పొందిన సామాజిక ఉద్యమాలు మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా?
జవాబు:
మా ప్రాంతంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలను ఆశయంగా తీసుకొని, ఇటీవల మహిళలు, ఆడపిల్లల యెడల జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, మానభంగాలు, వారికి ఎదురౌతున్న సహోద్యోగుల వేధింపులు, రక్షణకై ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. బాలురుతో పాటు బాలికకు కూడా సమాన ప్రాధాన్యత కొరకు విద్య, ఇంటిలో లభించని స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకై తల్లిదండ్రులలో చైతన్యానికి కార్యక్రమాలు చేపడుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
“మొక్కజొన్న చట్టాలు” తొలగించాలని కార్మికులు ఎందుకు కోరారు? భూస్వాములు వాటిని ఎందుకు సమర్థించారు?
జవాబు:
ఫ్రాన్స్ తో ఇంగ్లాండు యుద్దాలు వల్ల వాణిజ్యం దెబ్బతింది. కర్మాగారాలు మూసివేశారు. సగటు వేతనాల స్థాయికి అందనంతగా రొట్టె ధరలు పెరిగాయి. పేద ప్రజల ఆహారంలో రొట్టె (మొక్కజొన్న రొట్టె) ముఖ్యమైనది. దాని ధర వాళ్ళ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. రొట్టెల నిల్వలను జప్తు చేసి లాభాల కోసం అధిక ధరలకు అమ్మేవారు.

బ్రిటన్లో ధరలు ఒక మేరకు పెరిగే వరకు చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించే “మొక్కజొన్న చట్టాలకు” భూస్వాములు సమర్థించారు.

ప్రశ్న 5.
మన దేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయా?
జవాబు:
మనదేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరంతరం కరవు కాటకాలు, సరియైన ఉత్పత్తి లేకపోవడం వల్ల దిగుమతులు పేద ప్రజలకు మేలు చేస్తాయి.

9th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
యంత్రాలను పగలగొట్టడం కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చింది?
జవాబు:
నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. ఉపాధి కోల్పోయి, పేదలుగా మారారు. తమ ఈ దుర్భరస్థితికి యంత్రాలే కారణమని యంత్రాలను కార్మికులు తగలబెట్టారు.

  1. దీని ద్వారా అనేక సందర్భాలలో కర్మాగార యజమానులు కార్మికులతో సంప్రదింపులకు సిద్ధపడి మెరుగైన పని పరిస్థితులు కల్పించడానికి అంగీకరించారు.
  2. వీరికి సామాజిక మద్దతు లభించింది.
  3. సామ్యవాద భావాలు మరింత బలపడడానికి కారణమయ్యాయి.

ప్రశ్న 7.
యంత్రాలు పగలగొట్టిన వాళ్ళకు మరణశిక్ష విధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఇది సరైనదేనా?
జవాబు:
ఉపాధి కోల్పోయి, పేదరికం పెరిగి, ఆకలితో అలమటించిన వారు ఏ ఆందోళనకైనా, ఏ ప్రతీకార చర్యలకైనా దిగవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆ చర్యలకు గల కారణాలు తెలుసుకొని వారికి పునరావాసం కల్పించాలే గాని, మరణశిక్ష విధిస్తూ విచక్షణారహితంగా చంపడం సరైన చర్య కాదు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 8.
కర్మాగారంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినపుడు సాధారణంగా కొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూనే కార్మికులలో నిరుద్యోగం పెంచకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
కర్మాగారాలలో కొత్త యంత్రాల వలన కొంతమంది ఉపాధి కోల్పోతారు. ఎందుకంటే 50 మంది కార్మికులు ఒక రోజులో చేయవలసిన పని ఒక యంత్రం 3 గంటలలో చేస్తుంది. అదేవిధంగా యంత్రాల ద్వారా నాణ్యత, నమ్మకం ప్రజలలో ఉంటుంది. కార్మికుల నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన అనుకున్న లాభాలు అందకపోవచ్చు. దానివలన యజమానులు మనుషుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతున్నారు.

కాని యంత్రాల సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేస్తున్న కార్మికులను తొలగించకూడదు. యంత్రాలపై పర్యవేక్షణకు, ఉత్పత్తులకు, మార్కెట్ కల్పించడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మార్కెట్ సిబ్బందిని నియమించడానికి గాను కొంతమంది నిరుద్యోగులకు పని కల్పించవచ్చు.

9th Class Social Textbook Page No.202

ప్రశ్న 9.
మార్క్స్ ప్రతిపాదించిన సామ్యవాదం లుద్దిజంతో ఏ విధంగా విభేదించింది?
జవాబు:
లుద్దిజం కార్మికులను విప్లవవాదులుగా మార్చి హింసా, దౌర్జన్య, ఆస్తుల అంతానికి పూనుకుంది. రహస్య విప్లవవాద సంస్థలు ఏర్పడడానికి అవకాశం కల్పించింది. కనీస వేతనం, పనిభారం తగ్గించటం మొదలగు వాటికి అందజం ప్రాధాన్యతనీయగా, సామ్యవాదం దానితో విభేదించింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న ప్రతిదీ సామాజిక ఉత్పత్తి అవుతుంది. వస్తు ఉత్పత్తిలో భాగస్వాములైన అందరికీ ‘వాటా ఉంటుంది. ఉత్పత్తి సమాజానికి సంబంధించినది అయి ఉంటుంది. తాత్కాలిక హక్కులు, హింసా ప్రవృత్తిపై మార్క్స్ విభేదించారు. మెరుగైన వేతనాల కోసమే కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేయాలన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పని చేయాలన్నారు.

ప్రశ్న 10.
కర్మాగార ఉత్పత్తి మెరుగైనది, కోరుకోదగినది అని మార్క్స్ ఎందుకు భావించాడు?
జవాబు:
కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తిలేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకమని మార్క్స్ వాదించెను. కర్మాగారాలను, వనరులన్నింటిని కార్మికులు చేజిక్కించుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటిని నడపటం మొదలు పెడితే కొత్త, సమసమాజానికి మార్గం అవుతుంది. ఉత్పత్తి అన్నది ఒక కుటుంబం, ఒక చిన్న క్షేత్రం లేదా ఒక గ్రామానికి సంబంధించింది కాకుండా మొత్తం సమాజానికి సంబంధించినదిగా అవుతుంది.

ప్రశ్న 11.
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య తేడా కన్పిస్తుంది.

ముందు కాలం నాటి సామ్యవాదులు ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలని వాదించలేదు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తులను వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని చెప్పారు. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

మార్క్స్ దృష్టిలో సామ్యవాదం అంటే ప్రపంచం పారిశ్రామికంగా మారి, అందరి ఉత్పాదక శక్తులను వెలికితీసి కొరత అనేది లేకుండా చేయటం వల్ల ప్రగతిశీలమైనది అన్నారు. కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. కర్మాగారాలు, భూములు, ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారని మార్క్స్ చెప్పెను.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయా? ఆ ఉద్యమాల నాయకులతో ముఖాముఖి నిర్వహించి, నివేదిక తయారుచేయండి. దానిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
మా చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయి.

సామాజిక నిరసన ఉద్యమాలలో భాగంగా ఇటీవల కాలంలో మా ప్రాంతంలో మహిళలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు.

మా ఊరిలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని పద్మక్క నాయకత్వంలోని మహిళలు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్కతో ముఖాముఖి :
నేను – అక్కా ! మన ఊరిలో మద్యపానాన్ని నిషేధించాలని ఎందుకు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్క – మద్యపానం వలన చాలా కుటుంబాలు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నష్టపోవడం జరుగుతుంది.

నేను – అక్కా ! మద్యపానాన్ని సేవించడం వలన ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఎలా నష్టపోవడం జరుగుతుంది?

పద్మక్క – మద్యపానం సేవించడం వలన ఆరోగ్యపరంగా అనేక వ్యాధులకు గురికావలసి ఉంటుంది. ఊపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి.

నేను – అక్కా ! ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా ! మద్యపానాన్ని సేవించడం వలన.

పద్మక్క – ఉన్నాయి. పేద, మధ్యతరగతి పౌరులు తాను సంపాదించిన రోజు వారి వేతనంలో 3 వంతులు తాగడానికి ఉపయోగిస్తే మిగిలిన ఒక వంతు ఆ కుటుంబ జీవనానికి చాలక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వారి వద్ద ధనం లేక ఎవరిని అడిగిన త్రాగుబోతు వానికి ‘అప్పు ఎలా ఇస్తారని, ఒకవేళ ఇచ్చిన మరల మాకు తిరిగి ఎలా ఇవ్వగల్గుతారని ఎవరు ఇవ్వరు. అలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

అందువలన మద్యపానాన్ని సేవించవద్దు. తాగేవారిని ప్రోత్సహించవద్దు.

పట నైపుణ్యాలు

1. పెట్టుబడిదారీ విధానం – పిరమిడ్
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 2

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
………………….., …………….. ల కోసం బ్రిటను ఇతర దేశాలపై ఆధారపడలేదు. (శ్రామికులు, ముడి సరుకులు, పెట్టుబడి, . ఆవిష్కరణలు) (AS1)
జవాబు:
పెట్టుబడి, శ్రామికులు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవకాలంలో ప్రధానమైన రెండు రవాణా మార్గాలు ………… (రోడ్డు, వాయు, జల, రైలు) (AS1)
జవాబు:
జల, రైలు.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి. (AS1)
అ) సాంకేతిక విజ్ఞానం
ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు
ఇ) వ్యవసాయిక విప్లవం
డి) రవాణా వ్యవస్థలు
జవాబు:
అ) సాంకేతిక విజ్ఞానం :
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర పోషించింది. చేతివృత్తులు, చేతి యంత్రాలు వల్ల పెద్ద ఎత్తున సరుకులు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వాణిజ్య కార్యకలాపాలకు పేరు గడించడానికి అనేక పరిశ్రమలు స్థాపించి, ప్రపంచ కర్మాగారంగా ఇంగ్లాండ్ పిలువబడడానికి కారణం సాంకేతిక విజ్ఞానమే.

ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు :
కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఇంగ్లాండ్ లో సంపద అనంతంగా ఉండడం వల్ల పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు. ప్రపంచ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల వలన అధికంగా ఆర్థిక వనరులు సంపాదించింది. ఈ ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించారు. డబ్బును అధికం చేయడంలో ఇంగ్లాండ్ బ్యాంక్ ప్రధానపాత్ర పోషించింది. లండన్ విత్తమార్కెట్, ఉమ్మడి స్టాక్ బ్యాంకు, ఉమ్మడి స్టాక్ కార్పొరేషన్ ఏర్పడడంతో ఆర్థిక వనరులు, డబ్బు. పుష్కలంగా సమకూరాయి. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాలలో ఆర్థిక వనరులు వృద్ధి చెందాయి.

ఇ) వ్యవసాయిక విప్లవం :
బ్రిటిష్ జనాభా పారిశ్రామికీకరణ వల్ల పెరిగింది. లాభసాటికాని, పాతకాల వ్యవసాయ పద్ధతుల స్థానంలో కొత్త సాగు పద్ధతులు అంటే శాస్త్రీయంగా పంటలమార్పిడి వంటివి అనుసరించసాగారు. దీనివల్ల అధికంగా ఆహార ఉత్పత్తి పెరిగింది.

ఈ) రవాణా వ్యవస్థలు :
ముడి సరుకులు, ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచ నలుమూలలకు చేర్చడానికి, లాభసాటి వ్యాపారాలు చేయడానికి రవాణా వ్యవస్థ ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా, రైలు, జల మార్గాలు పట్టణాలకు ఇనుము, బొగ్గును సమీప పట్టణాలకు ప్రయాణీకులను, సరుకులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి తోడ్పాటు నందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
పారిశ్రామిక విప్లవ సమయంలో జరిగిన ఆవిష్కరణల ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడి సరుకులైన బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు పరిశ్రమలలో వినియోగించే సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఇంగ్లాండ్లో లభించేవి. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ (స్మెల్టింగ్) ద్వారా స్వచ్ఛమైన ఇనుమును ద్రవరూపంలో తీస్తారు. కొన్ని శతాబ్దాల పాటు కలపను కాల్చటం నుంచి బొగ్గుతో ఇనుమును కరిగించేవారు. తద్వారా అడవులు మొత్తం నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో ‘కమ్మరం” పనిచేసే ప్రాప్ షైర్ కి చెందిన డర్బీలు 3 తరాలు ద్వారా కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణల కారణంగా కలప, బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. బొగ్గు, లోహాలను లోతైన గనుల నుంచి వెలికి తీసే క్రమంలో గనులు తరుచు నీటి ముంపునకు గురయ్యేవి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంతో ఈ సమస్య పరిష్కారమైంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో “మెడం” ద్వారా పక్కా రోడ్లు తయారుచేసే విధానం మరింత ప్రాధాన్యత పెంచింది. స్టీఫెన్సన్ యొక్క ఆవిరి రైలింజన్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిగ పురోభివృద్ధి సాధించడంలో ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషించాయి.

ప్రశ్న 5.
పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటిష్ మహిళలలోని వివిధ వర్గాలు ఏవిధంగా ప్రభావితమయ్యా యి? (AS1)
(లేదా)
“పారిశ్రామిక విప్లవం వలన బ్రిటిష్ సమాజంలోని అన్ని తరగతుల మహిళలూ ప్రభావితమయ్యారు” – వ్యాఖ్యానించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మహిళల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ముందుగా – మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశుపాలన చేస్తూ, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికే వాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ విప్లవంతో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల జీవన గమనంలో అనేక మార్పులు సంభవించాయి. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండేవారు. ఆ పనిపై పర్యవేక్షణ, తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. పురుషుల కంటే తక్కువ కూలీకి పనిచేయడానికి సిద్దపడే మహిళలను పనిలో పెట్టుకొనేవాళ్ళు. లాంక్ షైర్, యార్క్ షెర్లలోని నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ అల్లిక పరిశ్రమల్లో, బర్మింగ్ హాంలోని లోహ పరిశ్రమల్లో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవారు.

ప్రశ్న 6.
కాలువల ద్వారా, రైళ్ళ ద్వారా రవాణాలలోని లాభాలు ఏమిటి? (AS1)
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకొని ప్రపంచ దేశాలను ఆకర్పించడానికి పటిష్టమైన రవాణా వ్యవస్థ బాగా ఉపయోగపడింది. రవాణా రంగంలో ప్రధానంగా కాలువలు, రైళ్ళు ముఖ్యమైనవి. కాలువల ద్వారా అనేక ప్రయోజనాలను గమనించవచ్చు. ముడి సరుకులను, ఉత్పత్తి అయిన వస్తువులను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు, చేర్చడానికి ముఖ్యమైనది. కాలువల ద్వారా, బొగ్గు, ఇనుము వంటి వాటిని సమీప పట్టణాలకు చేరవేయవచ్చును. కాలువల ద్వారా ప్రయాణ దూరం కూడా సగానికి “పైగా తగ్గుతుంది. కాలువల వలన. వ్యవసాయ భూమి విలువ పెరగడమేగాక సారవంతమవుతుంది. ఎక్కువ దిగుబడితో ఉత్పత్తులు పెరగడానికి కాలువలు దోహదపడతాయి.

రైళ్ళ ద్వారా సుఖవంతమైన, విలాసవంతమైన ప్రయాణం సాధ్యం. అధిక లోడు, అధిక టన్నుల ఉత్పత్తులు గమ్యస్థానాలకు చేరడానికి రైలు రవాణా ముఖ్యమైనది. సరుకులను, ప్రయాణీకులను, ముడి పదార్థాలను వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చగలదు. కరవు, వరదలు, నీళ్ళు గడ్డకట్టడం, క్షామం , తుపానులు వంటి సందర్భాలలో అత్యవసర సేవలకు రైళ్ళు ముఖ్య మైనవి.

ప్రశ్న 7.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ లో వస్త్ర, ఇనుము పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. ఇంగ్లాండ్ లో ఇనుము పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1

2. బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2

ప్రశ్న 8.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిష్కరణలకు సంబంధించిన పట్టికను తయారుచేయండి.
జవాబు:

  • జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రం
  • స్టీఫెన్సన్ – ఆవిరి రైల్వే ఇంజన్
  • మెక్కం – పక్కా రోడ్లు తయారుచేసే విధానం
  • హార్ గ్రీవ్స్ – నూలు వడికే యంత్రం
  • మొదటి అబ్రహాం డర్బీ – కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది)
  • రెండవ డర్బీ – ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేయుట.
  • హెన్రీ కోర్ట్ – కలబోత బట్టీ (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు.)
  • క్రుప్ కుటుంబం – క్షేత్ర ఫిరంగుల కర్మాగారం. రైలు పెట్టెలు, ఆయుధ తయారీ.
  • వెర్నెర్ సీమెన్స్ – విద్యుత్ డైనమో కనుగొన్నాడు.
  • ఎడ్మండ్ కార్డ్ రైట్ – నీటి సహాయంతో నడిచే మరమగ్గం
  • సామ్యుల్ క్రాంప్టన్ – మ్యూల్ అనే మెరుగైన యంత్రం (దీని వలన నాణ్యమైన నూలు ఉత్పత్తి పెరిగెను).
  • ఆర్కిరైట్ – జలశక్తితో మెరుగైన మగ్గాన్ని కనుగొనెను.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 9.
ఓ నెం. 191లోని “కార్మికులు” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి వ్యాఖ్యానించండి?
జవాబు:
పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో భాగంగా కార్మికులు తమ జీవనాన్ని దుర్భరంగా గడిపారు. కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువ. బర్మింగ్ హాంలో 15 సంవత్సరాలు, మాంచెస్టర్ లో 17, డర్బీలో 21 సంవత్సరాలుగా ఉండేది. చిన్న వయసులో మరణాలు అధికంగా ఉండడమే కాకుండా, చిన్న పిల్లల్లో 50 సంవత్సరాల లోపు మరణాలు సంభవిస్తుండేవి. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల క్షయ వంటి అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కలరా వ్యాపించడం వలన 1832లో 31,000 పైగా ప్రజలు చనిపోయారు. ఆ రోజుల్లో ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు తగిన వైద్య సహాయం, వైద్య విజ్ఞానం అందకపోవడం, లేకపోవడం కూడా కార్మికులు, దీన స్థితిలో బ్రతకడానికి దోహదపడ్డాయి.

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు InText Questions and Answers

9th Class Social Textbook Page No.186

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవకాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పేద ప్రజల పిల్లలు ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. పగటిపూట ఎక్కువ పనిగంటలు చేస్తుండేవారు. లోహ పరిశ్రమల్లో పిల్లలు కూడా పని చేసేవాళ్ళు. బొగ్గు గనుల వంటి ప్రమాదకర పనులు సైతం పిల్లలు చేసేవారు. మహిళలు తక్కువ కూలీకి పనిచేయటానికి సిద్ధపడేవారు. విరామం లేకుండా మహిళలు పని చేసేవారు. తక్కువ కూలీ అందించేవారు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో, లోహపరిశ్రమల్లో పని చేస్తూ మహిళలు అనేక కష్టాలు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.187

ప్రశ్న 2.
బ్రిటిష్ లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించిన 18వ శతాబ్దం నాటి బ్రిటన్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిణామాలను చర్చించండి.
జవాబు:
ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్. బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించి, దాని ఫలితంగా ప్రపంచ కర్మాగారంగా గౌరవించబడింది. పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందటానికి బ్రిటన్‌కు ఎన్నో సానుకూల పరిస్థితులే కాకుండా అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు, ప్రపంచంలోని, దేశాలు ఈ మార్పులను తరువాత చవిచూశాయి.

9th Class Social Textbook Page No.188

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణకు నాణ్యమైన ఇనుము, ఉక్కు ఎందుకు కావాలి? తరగతిలో చర్చించండి.
జవాబు:
యాంత్రీకరణకు, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన ముడిసరుకు ఇనుము, ఉక్కు. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ ద్వారా స్వచ్చమైన ఇనుమును ద్రవరూపంలో తీయవచ్చు. ఇనుము, ఉక్కుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. రోజువారీ వస్తువులలో కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయి, ముక్కలు అయ్యే ప్రమాదముంది. ఇనుము నాశనం కాకుండా, దాని యొక్క భౌతిక రసాయనిక, గుణాలను నియంత్రించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు సమాన ప్రాధాన్యత ఎందుకు లభించింది?
జవాబు:
పారిశ్రామికీకరణకు ముఖ్యమైనవి బొగ్గు, ఇనుము. ఇనుము, బొగ్గు పరిశ్రమల ఆధారంగా నాగరికతను ప్రపంచమంతా అనుకరించింది. బొగ్గును ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన . బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించేవి. ముడిసరుకులకు, వస్తూత్పత్తికి, బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత ఉండేది. ముడి ఇనుము తయారు చేయటానికి టన్నుల కొద్దీ బొగ్గు అవసరమయ్యేది. ఈ విధంగా బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత లభించింది.

ప్రశ్న 5.
తొలినాటి పారిశ్రామిక కేంద్రాలు ఇనుము, బొగ్గు గనుల దగ్గర ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
యాంత్రీకరణకు ప్రధానమైనవి ఇనుము, బొగ్గు. వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు, ఇనుము ద్వారా తయారీకి ఆయా దేశాలు ప్రాధాన్యతనందించేవి. సులభంగా రవాణాకు, సమీప పట్టణాలకు తరలించటానికి, ప్రపంచ వ్యాప్తంగా తయారైన వస్తువులకు మార్కెట్ కల్పించడానికి,. బహుళ ప్రచారం చేయడానికి గాను ఇనుము, బొగ్గు గనుల దగ్గర పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 6.
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలు పేర్కొనండి.
జవాబు:
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలలో జేమ్స్ వాట్ 1769లో కనిపెట్టిన ఆవిరి యంత్రం ఒకటి.. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. అదే విధంగా రెండోది 1770లో జేమ్స్ హార్ గ్రీవ్స్ కనిపెట్టిన “స్పిన్నింగ్ జెన్ని” (నూలు వడికే యంత్రం). దీనివలన నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి.

9th Class Social Textbook Page No.193

ప్రశ్న 7.
మహిళలు, పిల్లలపై పారిశ్రామికీకరణ చూపిన రెండు ముఖ్యమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
నూలువడికే జెన్ని’ వంటి చిన్న యంత్రాలు తయారుచేసి పిల్లలను పనిలో నియమించేవారు. దీర్ఘకాల పనిగంటలు, ఆదివారాల నాడు యంత్రాలను శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకు తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేవి కావు. పిల్లలు నిద్రలోకి జారుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచుకున్నా వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోనే పిల్లలు చనిపోయేవాళ్ళు. లోహ పరిశ్రమల్లో పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలు పని చేసేవాళ్ళు.

9th Class Social Textbook Page No.194

ప్రశ్న 8.
తొలి పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై ప్రభావాలను, భారతదేశంలో అదే పరిస్థితులలోని ప్రభావాలతో పోల్చండి.
జవాబు:
తొలి పారిశ్రామికీకరణ బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై చాలా ప్రభావాన్ని చూపింది. అనేక సమస్యలకు లోనై, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. జనాభా పెరుగుదలకు దీటుగా గృహవసతి, తాగటానికి శుభ్రమైన నీళ్ళు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. మురికివాడలలో నివసిస్తూ, కలరా, టైఫాయిడ్, క్షయ వంటి అంటు వ్యాధుల వలన అనేక వేలమంది చనిపోయారు.

భారతదేశంలో కూడా వలస పాలన వలన చేతివృత్తులు, కులవృత్తులు నశించి, వ్యవసాయరంగంలో ఆహార పదార్థాల • ఉత్పత్తి తగ్గిపోయి, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత నిచ్చారు. అనేక ప్రాంతాలలో కరువు కాటకాలు, మలేరియా, టైఫాయిడ్, క్షయవంటి జబ్బులు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచినీరు దొరకక ప్రజలు అల్లాడిపోయారు. వైద్యశాస్త్రం నిర్లక్ష్యం
చేయబడింది.

9th Class Social Textbook Page No.195

ప్రశ్న 9.
జర్మనీ, ఫ్రాన్లలో పారిశ్రామికీకరణలను పోల్చండి. పోలికలు, తేడాలను గుర్తించండి.
జవాబు:
పోలికలు :
జర్మనీ, ఫ్రాన్స్ రెండు దేశాలు, ఇంగ్లాండ్ బాటలో నడవడానికి ప్రయత్నించాయి. ఇవి పారిశ్రామికీకరణ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తలంచాయి. రోడ్డు, రైలు మార్గాలు పారిశ్రామికీకరణకు రెండు దేశాలు ప్రాధాన్యతనిచ్చాయి.

తేడాలు :

జర్మనీ :
కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మనీ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. పారిశ్రామికీకరణకు కావలసిన డబ్బులను పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. జర్మనీ కొత్తతరం పరిశ్రమలైన ఇనుము – ఉక్కు రసాయనిక, విద్యుత్ పరిశ్రమలను అభివృద్ధి చేసింది. బ్రిటనను మించిపోయింది. బలమైన పారిశ్రామిక శక్తిగా జర్మనీ వెలుగొందింది.

ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ ఇందుకు విరుద్ధంగా పారిశ్రామికీకరణను నిదానంగా కొనసాగించింది. 19వ శతాబ్దం చివరకు కూడా ఫ్రాన్స్ లో అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలు సాగుచేసే దేశంగానే ఉంది. యాంత్రీకరణ కంటే మానవశక్తికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఫ్రాన్స్ లో ఆర్థిక కష్టాలు అధికంగా ఉండేవి. జర్మనీ అంత సాంకేతిక విజ్ఞానాన్ని, యాంత్రీకరణను ఫ్రాన్స్ దిగుమతి చేసుకోలేకపోయింది.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 10.
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు :

  1. నిధుల సమస్య.
  2. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఫ్రాన్స్ అందుకోలేకపోయింది.
  3. గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటం వలన ఉత్పత్తి తగ్గుముఖం.
  4. బొగ్గు గనులు లేమి, దిగుమతులపై ఎక్కువ ఖర్చు.
  5. బట్టలు వంటి చిన్న పరిశ్రమలపై దృష్టి.
  6. ఎక్కువ పెట్టుబడిని ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ లో లేకపోవడం.
  7. మానవ మేధస్సు తక్కువ.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను అధిగమించటానికి జర్మనీకి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను జర్మనీ అధిగమించటానికి దోహదం చేసిన అంశాలు :

  1. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల జర్మన్ పరిశ్రమల ప్రయోజనం.
  2. ప్రపంచ దేశాల సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవడం.
  3. పెద్ద పెద్ద పెట్టుబడుల్ని సమకూర్చగల బ్యాంకుల సహకారం.
  4. కొత్తతరం పరిశ్రమలైన రసాయనిక, విద్యుత్ పరిశ్రమల అభివృద్ధి.
  5. నూతన ఆలోచనా విధానం.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవ పరిణామాలు ఆర్థిక రంగంపై ఎలా ప్రభావం చూపాయో పేర్కొనండి. ఒక నివేదిక రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త యంత్రాల వినియోగంతో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామికీకరణ వలన – సంపద అనంతంగా ఉండటంతో వస్తు ఉత్పత్తికి, ముడి పదార్థాల వినియోగానికి, రవాణా వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి సమకూర్చుకోవడం తేలిక అయింది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి.

పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆర్థిక వనరులతో పెట్టుబడిని రెండింతలు చేసి నిధులు మరింత పెంచుకోవడానికి దేశాలు బ్యాంకులలో ఆదా చేశాయి. అంతేకాకుండా సముద్రయానం చేసే పారిశ్రామికవేత్తలకు అధిక మొత్తంలో అధికవడ్డీకి డబ్బులు ఇచ్చి లాభాన్ని గడించాయి. విత్తమార్కెట్, స్టాక్ బ్యాంకు, స్టాక్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక చర్యలు వలన అధికంగా నిధులు సమకూరి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.