AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 10 బతుకు పుస్తకం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 10th Lesson బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ఏ విషయాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఈ పేరా పుస్తకపఠనం, దాని ప్రయోజనాలను గూర్చి తెలుపుతుంది.

ప్రశ్న 2.
పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
పుస్తకాలు చదివితే రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి.

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది?
జవాబు:
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశం, ఆ పుస్తకానికి సంబంధించిన ముందుమాట, పరిచయ వాక్యాలు, అభిప్రాయాలు, పుస్తక పరిచయాలు అనేవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 4.
మీరు ఏ పుస్తకాన్ని ఐనా చదవడానికి ముందు ఏం చేస్తారు?
జవాబు:
నేను పుస్తకాన్ని చదవడానికి ముందు, ఆ పుస్తకం గురించి రచయిత రాసిన తొలిపలుకు, ఆ రచనను గురించి ఇతరుల అభిప్రాయాల్ని చదువుతాను.

ప్రశ్న 5.
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక మీకు ఎలా కలుగుతుంది?
జవాబు:
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక, ఆ పుస్తక పరిచయ వాక్యాల ద్వారా కలుగుతుంది. ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో ఆ పుస్తక పరిచయ వాక్యాలు మనకు దారిని చూపిస్తాయి. ఆ పుస్తకాన్ని చదివిన పుస్తక పరిచయ రచయితల వాక్యాల ద్వారా, ఆ పుస్తకాన్ని చదవాలనే కోరిక కలుగుతుంది.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
ఉప్పల లక్ష్మణరావుగారు రాసిన మరో పుస్తకం ఏది? ఆ పుస్తకంపై సమీక్షకురాలి స్పందన ఏమిటి?
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన మరో పుస్తకం, “అతడు – ఆమె” అనే నవల. “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాల తరబడి తనలో పేరుకుపోయిన నీరసం, పటాపంచలైపోయిందనీ, ఎక్కడలేని ఉత్సాహమూ పుట్టుకొచ్చిందనీ రచయిత్రి రాసింది. తనతో సమంగా ప్రతి ఒక్కడూ జీవించాలనే మంచి ఆశయం గల వ్యక్తి తప్పించి, మరొకరు ఆ గ్రంథం రాయలేరని తనకు అనిపించిందని రచయిత్రి రాసింది.

ప్రశ్న 2.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారో చెప్పండి.
జవాబు:
పుస్తకావిష్కరణ సభకు ఒకరు అధ్యక్షులుగా ఉంటారు. కొత్త పుస్తకాన్ని పేపరులో చుట్టి ఉంచుతారు. ఒకరు ఆ పేపరు విప్పి, సభలోని వారికి ఆ పుస్తకాన్ని చూపిస్తారు. దాన్నే “ఆవిష్కరణ” అంటారు. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని గూర్చి ఒకరు సమీక్ష చేస్తారు. దానిని “కావ్య సమీక్ష” అంటారు. సభలో ఉన్నవారికి ఆ పుస్తకంలోని విషయాలను సమీక్షకులు వివరించి చెపుతారు. రచయిత తన గ్రంథాన్ని గూర్చి చెపుతాడు. రచయితకు సన్మానం చేస్తారు. అధ్యక్షులు ప్రారంభంలోను, చివరలోనూ తమ అభిప్రాయాన్ని చెప్పి, రచయితను అభినందిస్తారు. పుస్తకాలను సభలో అందరికీ ఉచితంగా కానీ, తక్కువ ధరకు కానీ ఇస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) పాఠ్యాంశం ఆధారంగా కింది మాటలను ఏ సందర్భంలో ఎవరు అన్నారో రాయండి.

ప్రశ్న 1.
“అదీ శిశువుముందు శిరసొగ్గే నిరహంకారమంటే!”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారి తాతగార్ని గూర్చి, ఈ పాఠ్యరచయిత్రి సావిత్రి గారు చెప్పిన మాట ఇది. లక్ష్మణరావు గారి తాతగార్ని వారి మనుమడు “తాతగారూ ! మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగాడట. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన తాతగారు, తాను దేవుణ్ణి చూడలేదనీ, ఉన్నాడో లేడో తాను చెప్పలేననీ, కష్టాలు పంచుకొనేవాడు ఒకడున్నాడంటే బావుంటుంది కదా ! అందుకే ప్రార్థిస్తున్నాననీ జవాబు చెప్పారట.

లక్ష్మణరావుగారి తాతగారి ఆ నిజాయితీని రచయిత్రి మెచ్చుకొని, ఆ తాతగారిది, శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమని ప్రశంసించిన సందర్భంలోనిది.

ప్రశ్న 2.
“దేశపు తిండి గింజల సమస్య తీర్చని పరిశోధనలెందుకు ?”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు, గ్రిప్సువాలు యూనివర్సిటీలో ఆయనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొంతకాలం అయ్యాక, లక్ష్మణరావుగారికి, తన పరిశోధనలు మనదేశంలోని తిండిగింజల సమస్యను తీర్చలేవనీ, ఒకవేళ ఉపయోగించినా, ఆ ఫలితాలను వినియోగించుకొనేందుకు విస్తీర్ణమైన పొలాలు మనదేశంలో లభించవనీ, అనిపించింది. దానితో తాను చేసే పరిశోధనలు మానివేసి, మన దేశానికి తిరిగివచ్చి అనువాదక వృత్తిని చేపట్టారు. దేశం తిండిగింజల సమస్య తీర్చని పరిశోధనలు ఎందుకని లక్ష్మణరావుగారు తనలో తాను తర్కించుకొన్న సందర్భంలోని మాట ఇది.

ప్రశ్న 3.
“ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త!”
జవాబు:
లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖానును, ఈ విధంగా బెదిరించింది. మెల్లీ ఖాదీ ప్రదర్శనలో పాల్గొంటోంది. అలా పాల్గొనడం నిషిద్ధమని జి.వో. లేదు. ఆలీఖాను మెల్లీని ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని బెదిరించాడు. అలా నిషిద్ధం కాని పనిని, వద్దని నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని ఆ దేశపు రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ, మెల్లీ ఆలీఖానను బెదిరించిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం 1

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రచయిత్రి ఈ పాఠం ద్వారా ఏ పుస్తకం గురించి పరిచయం చేసింది?
జవాబు:
రచయిత్రి సావిత్రిగారు, ఈ పాఠం ద్వారా, ఉప్పల లక్ష్మణరావుగారు రచించిన “బతుకు పుస్తకం” అనే, వారి జీవిత చరిత్రను గూర్చి పరిచయం చేసింది.

ప్రశ్న 2.
మెల్లీ దుందుడుకు స్వభావానికి చెందిన సంఘటనలు తెలపండి.
జవాబు:
1) మెల్లీ సాహసానికి మరో పేరు. ఈమె తనవంటి వారికి అవమానము జరిగినా, ఒక మంచిపనికి అవరోధం జరిగినా, సహించేది కాదు. ఒకసారి రాజోలు నుండి నర్సాపురం వెళ్ళే లాంచి ఎవరో పెద్ద అధికారి కోసం ఆపేశారట. వెంటనే మెల్లీ ఆ చీకట్లో ఈత దుస్తులు వేసుకొని, గోదావరిలోకి దూకి, ఐదు గంటలలో ఆ 16 మైళ్ళ దూరాన్ని, దుస్సాహసంతో ఈదింది.

2) ఒకసారి తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖాన్ మెల్లీని, ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని హెచ్చరించాడు. అయితే అటువంటి ప్రదర్శన చేయడం నిషిద్ధమనే జి.వో. ఏమీలేదు. అప్పుడు మెల్లీ తనను ప్రదర్శనలో పాల్గొనకుండా నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని వారి రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ ఆలీఖానను బెదిరించింది.

3) గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో స్త్రీలకు గస్తీని నిషేధించగా, ఈమె సత్యాగ్రహం చేసి, స్త్రీలు కూడా గస్తీకి అర్హులేనని అంగీకరించేలా చేసింది.

ప్రశ్న 3.
గ్రంథాలు, పుస్తకాలు ఎలా ఉండాలని రచయిత్రి తెలియజేసింది?
జవాబు:
గ్రంథాలు నిరుత్యాహికి ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనూ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్నీ, తగిన ఆర్ధతనూ తప్పక అందించగలగాలి. అదేదో మహాగ్రంథమని, తమకు అర్థం కాదనీ అనిపించకూడదు. ఆ గ్రంథం ఒక డైరీలా, స్నేహితుని లేఖలా, దగ్గరగా ఉండాలి. పాఠకుడు ఓపిక తెచ్చుకొని చదవాలి అనిపించాలి. రచయిత తన మనస్సులోని బాధను కప్పి పుచ్చకుండా తెలపాలి. ఇతని బాధను విందాం, అనిపించేటట్లు నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపూ హాయి కలగాలి. ఇన్నాళ్ళకైనా ఇంత మంచిపుస్తకం చదవగలిగాను కదా అని అనిపించాలి. వివరణ స్పష్టంగా ఉండాలి. ఏదో కొత్త విషయం చెప్పాలి. ఎంతో కొంత కార్యశీలత రేపాలి. కదపాలి. కుదపాలి. మంచిదారిని చూపించి, మనశ్శాంతిని కలిగించాలి.

ప్రశ్న 4.
లక్ష్మణరావుగారు పరిశోధనరంగం నుంచి రచనారంగం వైపు ఎందుకు మారారు?
జవాబు:
లక్ష్మణరావుగారు, చెప్సువాలు యూనివర్సిటీలో తనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొన్నివేలు ఖర్చుచేసి జరిపిన తన పరిశోధన, దేశానికి ఉపయోగంగా ఉంటుందని లక్ష్మణరావుగారికి నమ్మకం కలుగలేదు. దేశం తిండిగింజల సమస్యను తీర్చని ఆ పరిశోధనలు ఎందుకు ? అని ఆయనకు అనిపించింది. ఒకవేళ ఆ పరిశోధనలు ఉపయోగపడినా, ఆ ఫలితాల్ని వినియోగించేందుకు విస్తీర్ణమైన పొలాలు మనకు లభించవని ఆయన గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ పరిశోధనలు, ధనిక రైతులకే గాని, సామాన్యునికి ఉపకరించవని ఆయన గ్రహించారు. అందువల్ల తనలో తాను బాగా తర్కించుకొని, తనకు బాగా ప్రాణప్రదమైన బోటనీ పరిశోధనలు మానివేసి, ప్రగతి ప్రచురణాలయంలో అనువాదక వృత్తిని వారు చేపట్టారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉంది?
జవాబు:
సమాజానికి లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం, ఒక చారిత్రక అవసరం. నిరుత్సాహికి, ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనీ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని తగుమాత్రపు ఆర్ధతనూ అందించగలిగిన పుస్తకాలను రచించే రచయిత అవసరం. రచయిత ఎంతో కొంత కార్యశీలత రేపాలి. పాఠకుని కదపాలి, కుదపాలి, మంచిదారిని చూపాలి. మనశ్శాంతిని కలిగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 2.
“లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత ఎప్పటికీ విస్మరింపరానిది” అని సావిత్రిగారు అనడం సరైందేనని మీరు భావిస్తున్నారా ? ఎందుకు?
జవాబు:
లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత, మరువరానిదని సావిత్రిగారు చెప్పిన మాట, సరయినదే అని చెప్పాలి. మనం చేసే పనులు మనకే కాక, ప్రపంచానికి కూడా మేలు చేయాలన్న లక్ష్మణరావు గారి సంకల్పం, ఉత్తమమైనది. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు చేస్తుండేవారు. కొన్ని వేలు ఖర్చుపెట్టి జరిపిన ఆ పరిశోధన, మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందనే నమ్మకం ఆయనకు కలుగలేదు. మన దేశానికి తిండి గింజల సమస్య తీర్చని ఆ పరిశోధనలు, ఎందుకని లక్ష్మణరావు గారు జర్మనీలో పరిశోధనకు స్వస్తిచెప్పి, భారతదేశానికి వచ్చి ఒక ప్రచురణాలయంలో అనువాదకుడిగా చేరారు. దీనిని బట్టి లక్ష్మణరావు గారి విజ్ఞత, ఆయన ప్రపంచం పట్ల చూపిన బాధ్యత, ఎప్పటికీ మరువరానిది అన్నది సత్యం.

ప్రశ్న 3.
హేతువాదులు ప్రశ్నించే విషయాలు ఎలాంటివై ఉంటాయి?
జవాబు:
హేతువాదులు దేవుణ్ణి చూశారా ? అని అడుగుతారు. దేవుడు కనబడడు కాబట్టి, దేవుడు లేడని వారు వాదిస్తారు. ప్రతిదాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే, దాన్ని వారు నమ్ముతారు. సాధువులు, సన్యాసులు, బాబాలను వారు నమ్మరు. వారు చూపించే మహిమలు అన్నీ, గారడీలు అని హేతువాదులంటారు. విగ్రహారాధన పనికిరాదని వారు వాదిస్తారు. రాళ్ళను, రప్పలను పూజించరాదంటారు. హేతువు అంటే కారణము. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుందంటారు.

ప్రశ్న 4.
కరుణ గల విజ్ఞానం అంటే ఏమిటి? కరుణ కలిగిన వారు చేసే పనులు ఏమై ఉంటాయి?
జవాబు:
‘విజ్ఞానం’ అంటే విశేషమైన జ్ఞానం. అంటే నేటి సైన్సు, ఇంజనీరింగు, డాక్టరు మొదలయిన వృత్తుల వారు ఎంత జ్ఞానం కలవారైనా, తోటి మానవులపై వారికి ‘కరుణ’ అంటే జాలి లేక దయ ఉండాలి. లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ కరుణ గల విజ్ఞాని. ఆమె డాక్టరుగా ఎంతో విజ్ఞానం గడించింది. ఒకసారి పెంటబండిని ఈడ్వలేకపోతున్న ముసలివాడి కష్టాలు సహింపలేక తాను ఆ బండిని వెనుక నుంచి తోసి, అతనికి సహాయపడింది. అపుడు మెల్లి తెల్లని ఫ్రాక్ వేసుకొని, ఒక విందుకు వెడుతూ ఉంది. మెల్లీ ఆ పెంటబండిని తోసి, తన బట్టలపై పడ్డ నల్లని మరకలతోనే ఆ విందుకు వెళ్ళింది. కరుణ గల విజ్ఞానులు పైన చెప్పినటువంటి పనులు చేస్తారు.

ప్రశ్న 5.
పరిశోధనలు ఎందుకు చేస్తారు ? దీనివల్ల ఎవరికి మేలు జరగాలి? ఏఏ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి?
జవాబు:
పరిశోధనలు దేశానికి ఉపయోగకరంగా ఉండాలి. పరిశోధనా ఫలితాలు వినియోగించుకొనేందుకు వీలుగా ఉండాలి. పరిశోధనలు సామాన్యునికి ఉపయోగించాలి. సాంకేతిక పరిశోధనల వల్ల కలిగే లాభం, సమాజానికీ, పేద ప్రజలకీ ఉపకరించాలి. వ్యవసాయంలో చేసే పరిశోధనలు, రైతులు పంటలు ఎక్కువగా పండించడానికి ఉపయోగించాలి. అణుశాస్త్రంలో పరిశోధనలు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఉపయోగించాలి. వస్తువులను చౌకగా, విరివిగా తయారు చేసేందుకు పరిశోధనలు ఉపయోగించాలి. సమ సమాజ స్థాపనలో, సమాజానికి పరిశోధనలు ఉపయోగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ పాఠం ఆధారంగా “బతుకు పుస్తకం”లోని అంశాలను పదివాక్యాల్లో రాయండి.
జవాబు:
ఉప్పల లక్ష్మణరావుగారి తాతగారు కాలేజీ కమిటీతో పోరాడి, మనవరాలిని బడిలో చేర్పించారు. లక్ష్మణరావుగారి తాతగారిని, వారి మనవడు “దేవుణ్ణి చూశారా? తాతగారూ?” అని అడిగాడట. తాను దేవుణ్ణి చూడలేదని లక్ష్మణరావు గారి తాత, నిజాయితీగా ఒప్పుకున్నారట.

లక్ష్మణరావుగారి భార్య మెల్లీ, తెల్లని ఫ్రాకు ధరించి విందుకు వెడుతూ, దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని బండిని తోసి సాయంచేసిందట. మెల్లీ, లక్ష్మణరావుగారులు షరతులు విధించుకొని, వివాహం చేసికొన్నారట. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు మానివేసి, మనదేశంలో అనువాదకుడిగా చేరారట.

మెల్లీ రాజోలు నుండి నర్సాపురం వరకూ స్విమ్మింగ్ డ్రెస్ లో 15 మైళ్ళు ఈదిందట. సబర్మతి ఆశ్రమంలో మెల్లీ తాను కూడా గస్తీ తిరగడానికి అనుమతినిమ్మని సత్యాగ్రహం చేసిందట. మెల్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో, తనను ఖాదీ ప్రదర్శనలో పాల్గొనడానికి ఆయన నిరోధిస్తే, దానిని అంతర్జాతీయ సమస్యగా తాను మారుస్తానందట. లక్ష్మణరావుగారు తెచ్చి ఇచ్చిన కాగితాన్ని సిమెంటు కంపెనీ డైరెక్టరు క్రిందపడవేస్తే, దాన్ని బల్లమీద డైరక్టరు తిరిగి పెట్టకపోతే, తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని డైరక్టర్నీ బెదిరించారట.

ప్రశ్న 2.
“బతుకు పుస్తకంలో కరుణ గల విజ్ఞానానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయి కదా !” వాటిలోంచి ఏదైనా ఒక సంఘటనను విశ్లేషించండి.
జవాబు:
లక్ష్మణరావుగారు ప్రేమించిన అమ్మాయి స్విట్జర్లాండు దేశస్థురాలు ‘మెల్లీ’. లక్ష్మణరావుగారు మెల్లీని కరుణ గల విజ్ఞానిగానే ఈ చూసి ప్రేమించారు. ఒకసారి మెల్లీ పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకు ధరించి, విందుకు వెడుతోంది. అప్పుడు ఆమెకు 24 ఏళ్ళు. దారిలో ఒక ముసలివాడు వెంటబండిని ఈడ్చుకు వెడుతున్నాడు. అతడు ఆ బండిని లాగలేక అవస్థపడుతున్నాడు. అప్పుడు మెల్లి దృష్టి ఆ వృద్ధుని మీద పడింది. ఆమెకు ఆ వృద్ధుని పై జాలి వేసింది. మెల్లీ తాను తెల్లని బట్టలు వేసుకున్నానని కానీ, విందుకు వెడుతున్నానని కానీ చూడలేదు. వెంటనే ఆ వృద్ధుని బండిని వెనక నుండి తోసి సాయం చేసింది. ఈ విధంగా మెల్లీ ఆ ముసలివాడికి సాయపడింది. ఆ సంఘటనను చూసిన లక్ష్మణరావు గారి మనస్సు ద్రవించింది. మెల్లీ కరుణగల విజ్ఞాని అని గ్రహించారు. మెల్లీని లక్ష్మణరావుగారు పెండ్లాడారు.

మెల్లీ, ఆ మురికి బట్టలతోనే విందుకు వెళ్ళింది. ప్రక్కవారు ఏమనుకుంటారో అని, మెల్లీ అనుకోలేదు. ఒక వృద్ధునికి సాయం చేశాననే సంతృప్తితో ఆమె గుండెలు నిండాయి.

దీనిని బట్టి మెల్లీ కరుణ గల విజ్ఞాని అని తెలుస్తోంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 3.
సావిత్రి గారి ‘బతుకు పుస్తకం’ గురించి పరిచయం చేసిన విధానం ఏ విధంగా ఉంది?
జవాబు:
‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని. రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావుగారు రచించిన ‘అతడు – ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది. లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.

మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠశాల గ్రంథాలయంలోని రెండు మూడు పుస్తకాల్లోని ముందుమాటలు చదవండి. ఆ పుస్తకాల గురించి మీరు తెలుసుకున్న విషయాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
ముందుమాట

ప్రశ్న 1.
అల్లసాని పెద్దనామత్యుని ‘మనుచరిత్రము’ – కవి సమ్రాట్ కమనీయ పీఠిక
ఈ పీఠిక ద్వారా అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజ కవులలో ప్రథముడిగా ప్రధానమైనవాడని తెలిసింది. మనుచరిత్రను రాయలకే అంకితమిచ్చాడు పెద్దన. తెలుగువారి తొలి స్వతంత్ర్య కావ్యం మనుచరిత్ర. తెలుగు పంచ కావ్యాలలో మొదటిది మనుచరిత్ర. ఈ గ్రంథానికే స్వారోచిషమనుసంభవం అను నామాతరం కలదు. స్వారోచిష మనువు యొక్క కథే ఈ మనుచరిత్ర. అరుణాస్పదపురం – ప్రవరుడు కథతో ప్రారంభమై, హిమాలయ వర్ణన, వరూధిని, గంధర్వుని ఎత్తుగడ – స్వరోచి పుట్టుక – మనోరమ వృత్తాంతం – ఇందీవరాక్షుని వేడుకోలు – స్వరోచి పెండ్లి – దశావతరా స్తోత్రము – ఇంత వివరణగా పీఠిక రాసి, కావ్యమంతా తేలికగా అర్థము చేసుకొనుటకు వీలు కల్పించారు విశ్వనాథవారు.

ప్రశ్న 2.
పప్పురి రామాచార్యుల ‘వదరుబోతు’ – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక.
ఈ పీఠిక ద్వారా 1932లో ప్రచురితమైన ‘వదరుబోతు’ గ్రంథ రచయితలెవరో స్పష్టంగా తెలియదు కాని పప్పురి రామాచార్యుల పేరొకటి మాత్రం వినబడుతోందని తెలిసింది. వదరుబోతు వ్యాసాలు సంఘ సంస్కరణకి ఉద్దేశించినవి. రాజకీయ స్వాతంత్ర్యం కన్న ప్రజల్లో నీతి, మత ధర్మాల పట్ల ఆసక్తిని కలిగించి, వారిని నిస్వార్థ పరులుగా చేయటమే ఈ వ్యాసాల ఆదర్శమని తెలుసుకున్నాను. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అనంతపుర పట్టణంలో కొందరిలో కలిగిన నూతన ఆలోచన ఫలితమే వదరుబోతు వ్యాసాలు వెలువడ్డాయి. ఎడిసన్ – స్పెక్టేటర్, స్టీల్ టాటర్ ఇంగ్లీషులోని ఉపన్యాస వ్యాసాలు. స్పెక్టేటర్ ఆధారంగా తెలుగులో సాక్షి వ్యాసాలు పానుగంటివారు రాశారు. సాక్షి వ్యాసాల కన్నా వదరుబోతు వ్యాసాలు మృదు స్వభావం కలవి. సుమారు 50 వ్యాసాలు రాసినా, దొరికనా 22 వ్యాసాలతో ‘వదరుబోతు’ ముద్రించారు. ఈ విషయాలన్నీ ఈ పీఠిక ద్వారా తెలుసుకున్నాను.
(లేదా)
సావిత్రి ‘బందిపోట్లు’ కవితను సేకరించండి. దీనిపై మీ అభిప్రాయం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పుస్తకం లభ్యమైన తరువాత చదివి నా అభిప్రాయాన్ని రాస్తాను.

III. భాషాంశాలు

పదజాలం

అ) పాఠం ఆధారంగా ఈ కింది ఖాళీలను పూరించండి.

1. ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం కంటే ముందుగా సావిత్రి చదివిన పుస్తకం ‘అతడు – ఆమె’.
2. లక్ష్మణరావు తల్లిగారి విమర్శను దృష్టిలో వుంచుకొని నవల తిరిగి రాశారట.
3. ఆనాటి స్త్రీల పత్రికలు నిజంగా పాటుపడేవారి చేతులు మీదుగా వెలువడేవి.
4. మెల్లీ సబర్మతిలో సత్యాగ్రహం ప్రారంభించిందట.
5. లక్ష్మణరావుగారు జర్మనీ నుంచి తన పరిశోధనావకాశాలు శాశ్వతంగా వదలి వేసుకొని రచనారంగం వైపు మారారు.

ఆ) గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి. ఆ అర్థంతో మరొక కొత్త వాక్యం రాయండి.

1. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది.
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) చెల్లాచెదరు
డి) ముక్కలు ముక్కలు
అర్థం : పటాపంచలు = చెల్లాచెదరు
వాక్యప్రయోగం : నేను కళాశాలలో చేరగానే, నాకున్న సిగ్గు పటాపంచలు అయ్యింది.

2. మనదేశ చరిత్రకు అద్దం పట్టిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి.
ఎ) పొగిడిన
బి) గొప్పదనాన్ని
సి) ప్రతిబింబించిన
డి) సంక్షిప్తం చేసిన
అర్థం : అద్దం పట్టిన = ప్రతిబింబించిన
వాక్యప్రయోగం : అద్దంపట్టిన – నీలోని సద్గుణాలు, మా నాన్నగార్కి అద్దం పట్టినట్టున్నాయి.

3. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి పుస్తకం
ఎ) చురుకైన
బి) పనిలేనివాడు
సి) తెలివైనవాడు
డి) అజ్ఞాని
అర్థం : రికానికి = పనిలేనివాడు
వాక్యప్రయోగం : రికామీగా తిరిగే గోపాల్ కు, ఒక మంచిపని అప్పగించబడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) కింది పదాలను వివరించండి. సొంతవాక్యాలు రాయండి.
1) పఠించతగిన = __చదువదగిన
వాక్య ప్రయోగం : భగవద్గీత అందరూ పఠించతగిన గ్రంథము.

2) గొప్ప నిదర్శనం = గొప్ప ఉదాహరణ
వాక్య ప్రయోగం : రాముడు పితృవాక్య పరిపాలనకు గొప్ప నిదర్శనము.

3) అకుంఠితమైన దీక్ష = మొక్కవోని పట్టుదల
వాక్య ప్రయోగం : హనుమంతుడు అకుంఠిత దీక్షతో లంకను గాలించి సీతమ్మ జాడను తెలిసికొన్నాడు.

వ్యాకరణం

అ) కింది వాటిని జతపరచండి.
1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి (ఈ) అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో (ఆ) ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే (అ) ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? (ఇ) ఈ) క్వార్థకం

ఆ) పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త !” అని అతన్నే బెదిరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని, జాగ్రత్త అని మెల్లీ అతడినే బెదిరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు. (పరోక్ష కథనం)

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం రచయిత్రి పరిచయం

సావిత్రి గారు రాజమండ్రి దగ్గర ఉండేశ్వరపురంలో 18.05. 1949 లో జన్మించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువు అర్ధాంతరంగా ఆగిపోయినా సాహిత్య పఠనాభిలాషను కొనసాగించి అనేక కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాసి స్త్రీవాద సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1991లో వీరి మరణానంతరం ఆమె రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో “సావిత్రి” పేరుతో వెలువడ్డాయి. వీరి “బందిపోట్లు” కవిత ప్రసిద్ధమైంది. ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాటమనస్తత్వం పదునైన భావావేశం ఈ రచయిత్రి ప్రత్యేకత.

కఠిన పదాలకు అర్థాలు

విశిష్ట, వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన, వ్యక్తితత్వము
సమాజము = సంఘము
సాహితీమూర్తి = సాహిత్యము రూపుదాల్చిన వ్యక్తి
ఆవిర్భావం = పుట్టుక
చారిత్రక అవసరం = చరిత్రకు అవసరం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
పటాపంచలు = చెల్లాచెదరు
సదాశయం (సత్ + ఆశయం ) = మంచిమనస్సు
వ్యక్తి = జాతికి వేటై, ఆ జాతికి
హుందా = దర్జా
మహిళ = స్త్రీ
జీవిత భాగస్వామి = జీవితంలో పాలు పంచుకొనే స్త్రీ (భార్య)
ఇల్లాలు = భార్య
దాస్య శృంఖలాలు = బానిసత్వం అనే సంకెళ్ళు
స్వాతంత్రోద్యమకారిణి (స్వాతంత్ర + ఉద్యమకారిణి) = స్వాతంత్ర్యం కోసం ప్రయత్నం చేసిన స్త్రీ
చిత్రించింది = వ్రాసింది (వర్ణించింది)
నిర్నిబంధం = బంధములు లేనిది
పఠిత = పాఠకుడు (చదివేవాడు)
జడము = తెలివిలేనిది
హాస్యము = నవ్వు
ఉన్మాదపు ఉత్సాహము = పిచ్చి ఉత్సాహము
చిర్రెత్తించే = కోపం కలిగించే
(చిఱ్ఱ + ఎత్తించు)
(చిఱ్ఱు + ఎత్తించు)
రీడబులిటీ (Readability) = చదువదగినది ఆశ్రయమైన రూపము
రికామీ = పనిలేనివాడు
అజ్ఞాని = తెలివిలేనివాడు
జిజ్ఞాసువు = తెలిసికొనగోరువాడు
ఆర్థత = మెత్తదనము
డైరీ (Diary) = దినచర్య
నేస్తం = స్నేహితుడు
సన్నిహితం = చేరువ, సమీపం

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

నిరహంకారం = అహంకారం లేకుండుట
ఆత్మీయం = ఆత్మవంటిది (కావలసినది)
నయం = మేలు
క్లిష్టము = కఠినము
కార్యశీలత = పనిచేసే స్వభావమును కలిగి
కుదుపాలి = కదల్చా లి
విమర్శకురాలు = విమర్శ చేయు స్త్రీ
పెదవి విరిచేయు = నిరాశను సూచించు తర్కించుకొని
కీచులాట = కలహము
మహాసంగ్రామం = గొప్ప యుద్ధం
పూర్వరంగం = ముందు విషయం
మలచి = వంచి
ఏకీభవించు = ఒక్కటియగు; కలిసిపోవు
నిష్పక్షపాతం = పక్షపాతం లేనిది
సహృదయుడు = మంచిమనస్సు కలవాడు (విద్వాంసుడు)
హోరా హోరీ = ఎడతెగకుండా (నిర్విరామంగా)
అభ్యంతరం = అడ్డు
ఆస్తికులు = భగవంతుడున్నాడని నమ్మువారు
హేతువాదము = ప్రత్యక్ష ప్రమాణము చూపిస్తేనే నమ్ముతాను అనే మాట
ఫేషన్ (Fashion) = సొగసుకాడు; సొగసుదనం
విరివిగా = అధికంగా
సౌజన్యాన్ని = మంచితనాన్ని
కసరకుండా = కోప్పడకుండా
శిరసొగ్గే = తలవంచే
కరుణ = దయ, జాలి
వెల్లివిరుస్తుంది = ప్రవహిస్తుంది
ఫ్రాకు ‘(Frock) = వదులుగా ఉండే పెద్ద గౌను
వృద్ధుడు = ముసలివాడు
అగచాట్లు = ఆపదలు
నిదర్శనం = దృష్టాంతము; ఉదాహరణ
పరిశోధనావకాశాలు = పరిశోధన చేసే అవకాశాలు
క్షుణ్ణంగా = సంపూర్తిగా యుండుట
పఠించదగ్గవి = చదువదగినవి
వినియోగించుకొను = ఉపయోగించుకొను
సోషలిస్టు సమాజస్థాపన = సమ సమాజమును స్థాపించుట
తర్కించుకొని = ఊహించుకొని
స్వస్తిచెప్పి = చాలించి; ముగించి
నిశ్శబ్దం = ధ్వనిలేమి
అనువాదకవృత్తి = అనువాదం చేసేపని (Translation)
ఆవేదన = బాధ
ఆవేశపడిపోవు = కోపము వహించు
అకుంఠితమైన = అడ్డులేనట్టి
విస్మరింపరానిది = మరువరానిది
అవరోధము = అడ్డగింత
క్షణం = అత్యల్పకాలము
ఓర్వదు = సహింపదు
మంకుపట్టు = మొండి పట్టు
స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ (Swimming costumes) = ఈత దుస్తులు
గస్తీ = కావలి (కాపలా)
స్టాకిస్టు (Stockist) = స్టాకు చేసేవాడు
దుందుడుకు = మిక్కిలి తొందర
నిదానం = తొందరపడకుండా విచారించడం
పురోగమం = ముందు నడవడం
తాదాత్మం = ఒకదానిలో కలసిపోవడం
నిరాహారదీక్ష = ఆహారం తినకుండా దీక్ష
నిషిద్ధము = నిషేధింపబడినది
జి.వో. (Government order) = ప్రభుత్వ ఆదేశం
అంతర్జాతీయ సమస్య = దేశాల మధ్య సమస్య

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 9 భూమి పుత్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 9th Lesson భూమి పుత్రుడు

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

మనిషి జీవించడానికి ముఖ్యంగా కావలసినవి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, నివసించడానికి ఇల్లు – ఈ మూడు అవసరాలు తీరాలంటే ప్రకృతిలోని మొక్కలు, చెట్లే ఆధారం. అవి ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉంటే వాటి నుంచి తమ అవసరాలు తీర్చుకొనేవాడు ఆదిమానవుడు. కాలక్రమేణ మానవ అవసరాలు ఎక్కువ కావడంతో, ఆయా మొక్కలను, చెట్లను ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. రాను రాను ఆ వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది. దాని ఆధారంగా మానవుడి నాగరికత కూడా పెరిగింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మనిషికి కావలసిన ముఖ్యావసరాలు ఏవి?
జవాబు:
మనిషికి ముఖ్యంగా కావలసినవి మూడు :

  1. తినడానికి తిండి
  2. కట్టుకోవడానికి బట్ట
  3. నివసించడానికి ఇల్లు.

ప్రశ్న 2.
ఆదిమానవుడు మొదట్లో తన అవసరాలను ఎలా తీర్చుకొనేవాడు?
జవాబు:
ప్రకృతిలో ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉండే మొక్కలు, చెట్ల నుండి ఆదిమానవుడు తన అవసరాలను తీర్చుకొనేవాడు.

ప్రశ్న 3.
వ్యవసాయం ఎలా మొదలయింది?
జవాబు:
మానవ అవసరాలు ఎక్కువ కావడంతో మానవుడు ఆయా చెట్లనూ, మొక్కలనూ ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి ‘వ్యవసాయం’ అని పేరు పెట్టాడు. వ్యవసాయం ఆ విధంగా మొదలయ్యింది.

ప్రశ్న 4.
వ్యవసాయం వలన ఏమి పెరిగింది?
జవాబు:
వ్యవసాయం వలన మానవుడి ‘నాగరికత’ కూడా పెరిగింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 5.
వ్యవసాయం చేసేవారిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వ్యవసాయం చేసేవారిని కర్షకులు, రైతులు, సేద్యగాండ్రు అని పిలుస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో రాగయుక్తంగా, భావం తెలిసేటట్లు చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘భూమి పుత్రుడు’ అనే శీర్షిక తగినట్లు ఉన్నదా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
సామాన్యంగా రచనలోని విషయాన్ని కొంతవరకు ఊహించగలిగిన విధంగా, వివరించగలిగిన దానిగా, ‘శీర్షిక’ ఉండాలి. శీర్షిక అంటే పాఠం పేరు. ఈ పాఠంలో రామిరెడ్డిగారు రైతును గురించి, అతడు భూమిని దున్ని చేసే వ్యవసాయం గురించి చర్చించారు. పుత్రుడు తండ్రి ఆస్తిని అనుభవించడానికి పూర్తి హక్కు కలిగి ఉంటాడు. భూమి పుత్రుడు అంటే కర్షకుడు లేక రైతు. భూమిని పూర్తిగా అనుభవించే అర్హత గలవాడు. రైతు పంటలు పండించి, సమాజంలోని ఇతర సోదరులు అందరికీ తిండి పెడుతున్నాడు కాబట్టి రైతులను గురించి చెప్పిన ఈ పాఠానికి “భూమి పుత్రుడు” అనే పేరు సరిపోతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తన పంచన చేరిన అతిథిని రైతు ఎలా ఆదరిస్తున్నాడు?
జవాబు:
రైతు తాను తిన్నా తినకపోయినా, తన పంచకు ఆకలితో వచ్చిన అతిథికి కడుపునిండా తిండి పెట్టి, త్రాగడానికి నీరు ఇస్తాడు. ఏ ఒక్క అతిథినీ రైతు నిరాశపరచడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
కవి రైతును ఏమి తెలుసుకోమంటున్నాడు?
జవాబు:
రైతు ఎప్పుడూ కష్టాల కన్నీళ్ళలో కూరుకుపోవాలని ఎవరూ శాసించలేరనీ, రైతుకు ఏమీ లోటు లేదనీ, రైతు గొప్పదనాన్ని రైతు తెలుసుకోవాలని రామిరెడ్డి గారు చెప్పారు. రైతు తన గొప్పదనాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలోని జాతీయాలను, సామెతలను గుర్తించి వివరించండి.
జవాబు:
ఈ పాఠంలో కింది జాతీయాలు, సామెతలు ఉన్నాయి.
1) పిండికొద్ది రొట్టె:
మనం చేసిన కృషికి తగిన విధంగానే ఫలితం ఉంటుందని భావం. మనం ఎక్కువ పిండి వేస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొద్ది పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుందని అర్థం.

2) బోడితలకు, మోకాళ్ళకు ముడులు పెట్టు :
ఏదో సంబంధం లేని మాటలు చెప్పడం అని అర్థం. వారు చెప్పే మాటల్లో పొంతన, అతుకు లేదని అర్థం. మోకాళ్ళమీద, బోడి తలమీద వెంట్రుకలు ఉండవు. నున్నని గుండుకూ, మోకాలికీ ముడివేయడం జరిగే పని కాదని అర్థం. అసంబద్ధమైన మాటలని సారాంశం.

3) చిటికెల పందిళ్ళు పన్ను :
ఇంత చేస్తాము అంత చేస్తాము అని అతిడంబపు మాటలు మాట్లాడడం అని అర్థం. తాము చిటికె చప్పుడు చేసే పని అయిపోతుందని గొప్పలు చెప్పడం అని భావం. మాటలతో మభ్యపెట్టడం అని అర్థం.

4) నేల నూతులకు ఉగ్గాలు నిలుపుట :
కొన్ని ప్రాంతాల్లో దిగుడు బావులు ఉంటాయి. దానిలోకి ప్రక్కనున్న మెట్ల ద్వారా దిగి, నీరు పైకి తెచ్చుకోవాలి. నేలనూతుల నుండి మామూలు నూతులలోకి వలె చేదకు త్రాడుకట్టి తోడుకోవడం సాధ్యం కాదు. కానీ కొందరు అసాధ్యమైన కార్యములు చేస్తామని గొప్పలు చెపుతారు. అలాంటి వారిని గూర్చి ఈ మాట అంటారు.

5) ఉత్తయాసలకన్న మేలుద్యమంబు :
అది కావాలి ఇది కావాలి అని కేవలం కోరుకుంటూ కూర్చోడం కన్న, ఆ కావలసిన వాటి కోసం, ‘ఉద్యమంబు’ అంటే ప్రయత్నం చేయడం మంచిదని భావం.

6) సిరియె భోగోపలకి ‘జీవగట్టి’ :
‘జీవగట్టు’ అన్నది జాతీయము. జీవన ఔషధం అని భావం. ‘అతిముఖ్యం’ అని సారాంశము. భోగాలు పొందాలంటే సిరిసలఎదలు ముఖ్యంగా కావాలని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 4.
పాఠం ఆధారంగా రైతు గుణగణాలను రామిరెడ్డి గారు ఏయే విశేషణాలతో వర్ణించారో రాయండి.
జవాబు:
“రైతు”

  1. భారత క్ష్మాతల ఆత్మగౌరవ పవిత్రమూర్తి.
  2. శూరమణి
  3. ప్రొద్దుపొడిచినది మొదలుకొని ప్రొద్దు క్రుంకు వఱకూ కష్టిస్తాడు.
  4. ఇరుగు పొరుగు వారి సంపదకై ఈర్ష్య చెందడు
  5. పరుల కష్టార్జితానికి ఆశపడడు.
  6. తాను తిన్నా తినకున్నా, అతిథులకు లేదనకుండా తృప్తిగా పెడతాడు.
  7. సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యాలకు రైతు కారకుండు.
  8. తన కష్టాన్ని గుర్తించని కృతఘ్నులను రైతు పట్టించుకోడు.
  9. తన కాయకష్టాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.

అంశం చేపట్టిన పని / ఫలితం
సమాజ నిర్మాణం, సంక్షేమం కోసం వ్యవసాయ వృత్తిని చేపట్టడం. “లోకహితం” దాని  ఫలితం.
శ్రమ చేయడం వల్ల ఫలములు సిద్ధిస్తాయి.
పరిశ్రమలకు ప్రధాన వనరు “వ్యవసాయం”.
విజయం సాధించాలంటే శౌర్యము, విద్య, బుద్ధి, సత్యసంధత, ఆత్మ విశ్వాసం విడువరాదు.

ఈ) కింది పేరాను చదవండి. కారణాలు రాయండి.

“ఏటి కేతంపట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా ! నేను గంజిలో మెతుకెరుగనన్నా!” అని ఒక కవి పాట రూపంలో రైతు దుస్థితిని తెలియజేశాడు. వ్యవసాయానికి కావలసిన ముఖ్యమైన వనరులు భూమి, నీరు, దానితోపాటు ఎరువులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కూడా అవసరమే. జనాభా పెరగకముందు పై వనరులన్నీ పుష్కలంగా ఉండేవి. రానురాను జనాభా పెరిగిపోయింది. మానవుడి అవసరాలూ పెరిగిపోయాయి. వీటన్నిటికీ భూమే ఆధారం. ఇతర అవసరాలకోసం భూమి వినియోగం ఎక్కువ కావడం లాంటి పరిస్థితులవల్లనే వ్యవసాయరంగానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత, ఇబ్బందుల వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదు.

1. కవి పాట రాయడానికి కారణం : రైతు దుస్థితిని తెలియజేయడానికి.
2. వ్యవసాయ వనరులు తగ్గడానికి కారణం : జనాభా పెరిగిపోవడం.
3. వ్యవసాయ రంగానికి ఇబ్బందులకు కారణం : ఇతర అవసరాల కోసం భూమి వినియోగం ఎక్కువ కావడం.
4. దిగుబడి తగ్గడానికి కారణం : వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత. ఇబ్బందులు.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుఖాల కన్నిటికీ ధనమే మూలం’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
సుఖాలు పొందాలంటే ధనం ఉండాలని కవి చెప్పాడు. ‘సిరియె భోగోపలబ్దికి జీవగట్టు’ అన్నాడు. నిజమే ‘ధనమూలమ్ ఇదం జగత్’ – అని పెద్దలు చెప్పారు. ఈ లోకమంతా డబ్బుమూలంగానే నడుస్తుంది. మన దగ్గర ధనం ఉంటేనే కావలసిన టి.వి, ఫ్రిజ్, పట్టుబట్టలు, కారు, మోటారు సైకిలు వగైరా కొనుక్కుని సుఖంగా జీవించగలం. కావలసిన వస్తువులు కొని తినగలం. కాబట్టి కవి చెప్పినట్లు సుఖాలు పొందాలంటే ధనం అవసరం అన్నది సత్యం.

ప్రశ్న 2.
“పిండికొద్దీ రొట్టె” అనడంలో కవి ఉద్దేశమేమి?
జవాబు:
పిండి వాడిన దానిని బట్టి రొట్టె పరిమాణం ఉంటుంది. ఎక్కువ పిండి వేసి కాలిస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొంచెమే పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుంది. అలాగే, మనం పడిన శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రమలు లేకుండా ఫలములు రావు. కష్టపడితే సుఖం కలుగుతుంది. మనం పడిన శ్రమను బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది అని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 3.
‘రైతు హృదయం నిర్మలమైనది’ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైతు కేవలం తన నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అతడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని అన్నింటినీ పంటలు పండించడానికే వినియోగిస్తాడు. రైతు రోజంతా కష్టపడతాడు – ప్రక్కవారి సంపదలను గూర్చి ఆశపడడు. రైతు తాను తిన్నా, తినకపోయినా తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా తృప్తిగా పెడతాడు. పైన చెప్పిన రైతు గుణగణాలను చూస్తే అతడి హృదయం నిర్మలమైనదని నా అభిప్రాయం.

ప్రశ్న 4.
‘పాలనాదండం’ కంటే ‘హలం’ గొప్పదని కవి ఎందుకన్నాడు?
జవాబు:
దేశాన్ని పాలించే రాజు చేతిలో పాలనా దండం ఉంటుంది. భూమిని దున్ని పంటలు పండించే రైతు చేతిలో ‘హలం’ ‘అనగా ‘నాగలి’ ఉంటుంది. రాజు తన పాలనా దండంతో తప్పు చేసిన వారిని దండిస్తాడు. రైతు తన చేతిలోని నాగలితో పంటలు పండిస్తాడు. దేశ ప్రజలందరికీ రైతు తిండి పెడతాడు. కాబట్టి రాజు ప్రజలను శిక్షించడానికి ఉపయోగించే పాలనా దండము కన్నా, రైతు పంటలు పండించి పదిమందికీ కడుపు నింపేందుకు ఉపయోగించే హలం గొప్పది అని కవి అన్నాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కర్షకుని గొప్పతనాన్ని గురించి కవి ఏమని చెప్పాడు?
జవాబు:
వ్యవసాయ వృత్తి వృత్తులన్నిటిలో గొప్పది. కర్షకుడు భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్రమూర్తి. రాజదండం కన్నా, రైతు చేతి హలం గొప్పది. కర్షకుడు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అంతకు మించి ఆశలు పెట్టుకోడు. కర్షకుడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని పంటలను పండించడానికే వినియోగిస్తాడు.

కర్షకుడు రోజంతా కష్టపడతాడే గాని, ప్రక్క వారి సంపదలను గూర్చి అసూయపడడు. కర్షకుని మనస్సు నిర్మలమైనది. తాను తిన్నా తినకున్నా ఇతరుల కష్టార్జితానికై ఆశపడడు. ఆకలితో తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా పెడతాడు.

కర్షకుడు చేపట్టిన వ్యవసాయమే పరిశ్రమలన్నిటికీ మూలం. పరిశ్రమల వల్లనే సంపదలూ, సంపదల వల్లనే సుఖం లభిస్తుంది. సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి కర్షకుడే కారణం.

కర్షకుని కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. కర్షకుడు తాను చేసిన మేలును మరచిన కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవులు వచ్చినా అతడు లెక్కచేయడు. తన కాయకష్టాన్నే నమ్ముకొంటాడు. అతడు తన శరీరశ్రమతో లభించిన పట్టెడన్నం తిని, తృప్తిపడతాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
(లేదా)
భూమి పుత్రుడైన రైతు సుఖదుఃఖాలను కవి ఏ విధంగా విశ్లేషించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వ్యవసాయము వృత్తులలోకెల్లా ఉత్తమమైనది. ప్రపంచానికి మేలు చేయడం కోసం, కర్షకులు వ్యవసాయం చేస్తున్నారు. కర్షకులకు ఎవరూ సాటిరారు. హాలికుడు భారతదేశం ఆత్మ గౌరవాన్ని తెలిపే పవిత్రుడు. రాజదండం కన్నా రైతు నాగలి గొప్పది. రైతు ఎక్కువగా ఆశించడు. రోజూ ఖర్చులు వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. కర్షకుడు ప్రక్కవారి సంపదలకు అసూయపడడు. రైతు మనస్సు స్వచ్ఛమైనది.

కర్షకుడు తాను తిన్నా తినకపోయినా, అతిథులకు తప్పక పెడతాడు. వ్యవసాయం వల్లనే, సంపదలు లభిస్తాయి. సమాజ సుఖసంతోషాలకు హాలికుడే కారణం. హాలికుని కష్ట ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారు. రైతుకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కఱవే.

రైతు కష్టంతో భోగాలు అనుభవించే వారు రైతును కన్నెత్తియైనా చూడరు. కర్షకుడు అటువంటి కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వర్షాలు వచ్చినా, కఱవు వచ్చినా పట్టించుకోడు. రైతు తన కాయకషాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

అందుకే కవి “ఓ కర్మకా! నీ గూర్చి నీవు తెలిసికోవాలి. శ్రమను నమ్ముకొన్నవాడు, ఎన్ని ఆటంకాలనైనా దాటుతాడు. జీవిత యుద్ధంలో విజయానికి శక్తి, తెలివి, చదువు, సత్యము, ఆత్మవిశ్వాసము అనే ఆయుధాలు ధరించి ముందుకు నడు” అని బోధిస్తున్నాడు.

ఇ) సృజనాత్మకంగా సమాధానం రాయండి.

*నేడు గ్రామాలలో వ్యవసాయం చేసేవారు తగ్గుతున్నారు. భవిష్యత్తులో పంటలు పండించేవారు కరువైతే, ఆహారం దొరకడం గగనమవుతుంది. కోటీశ్వరుడైనా ఆకలికి అన్నమే తింటాడు కాని బంగారాన్ని తినడు కదా ! కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకవసరమైన ప్రత్యేక ఋణ సౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,
ఆర్యా,

విషయం : రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక.

మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా:
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ॥గో॥ జిల్లా.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఈ) ప్రశంసాపూర్వకంగా సమాధానం రాయండి.

రైతు కృషి వల్లనే మనకు ఆహారం లభిస్తున్నది కదా! రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయశాఖ తరఫున ఆయన్ను అభినందించాలనుకున్నారు. ఈ అభినందన సభ కోసం రామయ్యగారిని ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
(లేదా)
ఆదర్శరైతు రామయ్యను ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!

మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 పాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు, పూగో॥ జిల్లా,

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని మీకు తెలిసిన ఒక ఆదర్శరైతు వద్దకు లేదా వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళి ఆధునిక పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని ఎలా సాధింపవచ్చో వివరాలు సేకరించండి. వివరాలు తరగతి గదిలో చదివి ప్రదర్శించండి.
జవాబు:
మీ గురువుల పర్యవేక్షణలో పై ప్రాజెక్టు పనిని నిర్వహించండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి.

1. ఈర్ష్య అ) కర్జం
2. విజ్ఞానం ఆ) సత్తు
3. సుఖం ఇ) ఆన
4. కార్యం ఈ) ఈసు
5. ఆజ్ఞ ఉ) సుగం
6. సత్యము ఊ) విన్నాణం

జవాబు:

1. ఈర్ష్య ఈ) ఈసు
2. విజ్ఞానం ఊ) విన్నాణం
3. సుఖం ఉ) సుగం
4. కార్యం అ) కర్జం
5. ఆజ్ఞ ఇ) ఆన
6. సత్యము ఆ) సత్తు

ఆ) కింది వాక్యాలను అవగాహన చేసుకొని గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.

1. ఉచితం కదా ! అని దేన్నీ వృథా చేయడం ఉచితం కాదు.
ఉచితం : (నానార్థాలు) 1) రుసుము లేనిది 2) తగినది

2. పండించిన ఫలానికి ధర ఉన్నప్పుడే రైతు ఫలం పొందగలడు.
ఫలం: (నానార్థాలు) 1) పండు 2) లాభం

3. నేడు ధరకు విపరీతంగా ధర పెరిగిపోయింది.
ధర : (నానార్థాలు ) 1) నేల 2) వెల.

4. ఆధునిక కాలంలో కృష్ణ చేయడానికి ఎవరూ కృష్ణ చేయడం లేదు.
కృషి : (నానార్థాలు) 1) వ్యవసాయం 2) ప్రయత్నము

5. వర్మం లేక ఈ వర్మం జలాశయాలు నిండలేదు.
వర్షం : (నానార్థాలు) 1) వాన 2) సంవత్సరము

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఇ) కింది పదాలకు సమానార్థక పదాలను రాయండి. వాటిని సొంతవాక్యాలలో ఉపయోగించండి.
ఉదా: మహిళ = స్త్రీ, ఉవిద, నారి

వాక్య ప్రయోగం : ఉవిద తన హక్కుల కోసం పోరాటంలో భాగంగా నార్తీలోకాన్ని చైతన్యపరచి మహిళ అంటే ఏమిటో నిరూపించుకుంటున్నది.

1. హలం : 1) నాగలి, 2) సీరము
వాక్య ప్రయోగం : సీరము గుర్తుతో, నాగలిని భుజాన ధరించి రామయ్య పోటీ చేశాడు.

2. హాలికుడు : 1) రైతు 2) కర్పకుడు 4) సైరికుడు
వాక్య ప్రయోగం : రైతు బాంధవుడైన వ్యక్తిని కర్షకులు తమ నాయకుడిగా ఎన్నుకొంటే సైరికుల క్షేమానికి అతడు కృషి చేస్తాడు.

3. పొద్దు : 1) సూర్యుడు 2) దినము 3) వేళ
వాక్య ప్రయోగం : ఈ దినము సూర్యుడు మబ్బులలో మునిగి, భోజనం వేళ దాటాక కనబడ్డాడు.

4. వృక్షం : 1) చెట్టు 2) తరువు
వాక్య ప్రయోగం : ఈ తరువుకు కొమ్మలు లేవు కాని, వృక్షం నిండా పళ్ళు ఉండడం వల్ల చెట్టు మీద కోతులు చాలా ఉన్నాయి.

5. సత్యం : 1) నిజం 2) యథార్ధము
వాక్య ప్రయోగం : సత్యం కదా అని, నిజం చెపితే, యథార్థంగా వాడు చిక్కులలో పడతాడు.

6. సంగ్రామం : 1) యుద్ధము 2) రణము
వాక్య ప్రయోగం : యుద్ధములో పాల్గొన్న సైనికుడు, సంగ్రామంలో ఉత్సాహం చూపితే రణములో విజయం సిద్ధిస్తుంది.

7. అతిథి : 1) ఆవేశికుడు 2) ఆగంతువు
వాక్య ప్రయోగం : ఆవేశికుడైన మహర్షి. ఊరివారందరికీ అతిథిగా ఉంటూనే, ఆగంతువులా సన్మానం పొందాడు.

8. సౌఖ్యం : 1) సుఖం 2) హాయి
వాక్య ప్రయోగం : సౌఖ్యంగా ఉంటుందని హాయిగా షికారుకు వెడితే అక్కడ చలిగాలితో సుఖం మాయమయ్యింది.

9. నుయ్యి : 1) కూపం 2) బావి
వాక్య ప్రయోగం : నుయ్యి కన్నా బావి గొప్పదంటారు కానీ, కూపం మరింత గొప్పది.

వ్యాకరణం

అ) కింది సంధులకు ఉదాహరణలు రాసి, సూత్రాలు కూడా రాయండి.

1. వృద్ధి సంధి – సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐకారమూ; ఓ, ఔలు పరమైతే ఔకారమూ ఏకాదేశంగా వస్తాయి.
ఉదా :
1) జీవనైకపరిపాలన – జీవన + ఏకపరిపాలన – వృద్ధి సంధి
2) మహైశ్వర్యము = మహా + ఐశ్వర్యము – వృద్ధి సంధి
3) వనౌషధి = వన + ఓషధి – వృద్ధి సంధి

2. త్రిక సంధి సూత్రం :
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికమనబడును.
2) త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3) ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛిక దీర్ఘంబునకు హ్రస్వంబగు.
ఉదా :
1) ఎక్కాలము = ఏ + కాలము – త్రికసంధి
2) ఎవ్వారు = ఏ + వారు – త్రికసంధి
3) ఇమ్మహర్షి = ఈ + మహర్షి – త్రికసంధి
4) అమ్మధురత్వము = ఆ + మధురత్వము – త్రికసంధి

3. గుణసంధి – సూత్రం:
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంబగు.
ఉదా :
1) భోగోపలబ్ధి = భోగ + ఉపలబ్ది – గుణసంధి
2) సాంఘికోత్కృష్ట = సాంఘిక + ఉత్కృష్ట – గుణసంధి
3) కష్టోత్కటము = కష్ట + ఉత్కటము – గుణసంధి
4) మహర్షి = మహా + ఋషి – గుణసంధి
5) మదేభము = మద + ఇభము – గుణసంధి

4. అత్వసంధి – సూత్రం:
అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉదా :
1) రామయ్య = రామ + అయ్య – అకారసంధి
2) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అకారసంధి
3) సీతమ్మ = సీత + అమ్మ – అకార సంధి
4) మేనల్లుడు = మేన + అల్లుడు – అకారసంధి

5. ఇత్వసంధి – సూత్రం :
ఏమ్యాదుల ఇకారానికి సంధి వైకల్పికముగానగు.
ఉదా :
1) పొడిచినదాదిగా = పొడిచినది + ఆదిగా – ఇకార సంధి
2) ఆకలెత్తగ = ఆకలి + ఎత్తగ – ఇకారసంధి
3) అదేమి = అది + ఏమి – ఇకార సంధి
4) ఇదేమి = ఇది + ఏమి – ఇకార సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఆ) కింది వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను గుర్తించండి.

సమాస పదాలు విగ్రహవాక్యం సమాసం పేరు
1) అమాంద్యం మాంద్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
2) సచ్ఛీలురు మంచి శీలము కలవారు బహుబ్లి హి సమాసం
3) చిటికెల పందిళ్ళు చిటికెలతో పందిళ్ళు తృతీయా తత్పురుష సమాసం
4) భారత క్ష్మాతలం భారతము అనే భూభాగం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
5) హృదయకళిక హృదయము అనే కళిక రూపక సమాసం

ఛందస్సు

I. తేటగీతి
1) నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలూ, రెండు సూర్యగణాలూ వరసగా ఉంటాయి.
3) నాలుగో గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
4) ప్రాస నియమము లేదు.
1. AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 1
అభ్యాసం :
అలాగే మీరు ఈ పద్యానికి సంబంధించిన మిగతా పాదాలకు గణవిభజన చేయండి.
గణవిభజన (2వ పద్యం, 2వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 2

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి. ఇది తేటగీతి పద్యపాదం, యతి నాల్గవ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 3వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 3
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 4వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 4

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు కవి పరిచయం

శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు 09.11.1895న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన 19వ ఏట సాహిత్యరంగంలో ప్రవేశించి నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడ్కోలు, పానశాల-కావ్యాలను, నక్షత్రశాల-నైవేద్యము, భగ్నహృదయము, పరిశిష్టము, ప్రథమకవిత్వము అనే ఖండకావ్యాలను రచించారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచి, లాటిన్, జర్మన్, బెంగాలీ, పర్షియన్, ఉర్దూ, దువ్వూరి తమిళభాషలలో పండితులు. ఈయన 11.09. 1947 నాడు కన్నుమూశారు. వీరికి ‘కవికోకిల’ రామిరెడ్డి అను బిరుదు కలదు.

దువ్వూరివారి రచనాశైలి సరళసుందరంగా వుంటుంది. పాతకొత్తల, ప్రాక్పశ్చిమాల కలయికతో అందాన్ని సంతరించుకున్నది. విశ్వశాంతి, దేశభక్తి, మానవతావాదం, అభ్యుదయం ఈయన రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ మనకు మేలుకొలుపు పాడుతూ ఉంటాయి.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చం! మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీ పితామహుల మాంద్యసుశీలురు సర్వవృత్తిపా
వన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై.
ప్రతిపదార్థం :
మనుజసమాజనిర్మితి సమంబుగన్;
మనుజ = మానవుల యొక్క
సమాజ = సమాజాన్ని (సంఘాన్ని)
నిర్మితి = నిర్మాణంలో
సమంబుగన్ = సమత్వము కలిగేలా
నీకున్ = నీకు
ఒక = ఒక
ముఖ్య మైన = ప్రధానమైన
వృత్తి = వృత్తి
నియతము = నిర్ణయింపబడింది (నియమించబడింది.)
అట్టి = అటువంటి
ధార్మిక విధిన్ = ధర్మబద్ధమైన పనిని
చిరకాలము = చాలాకాలము
అమాంద్య సుశీలురు; అమాంద్య = సోమరితనంలేని
సుశీలురు = గొప్ప శీలవంతులు అయిన
నీ పితామహులు = నీ తండ్రి తాతలు
సర్వవృత్తి ……. లోకహితార్థకాంక్షులై;
సర్వవృత్తి = అన్ని వృత్తులలో
పావన = పవిత్రమైన
కృషి = వ్యవసాయాన్నే
జీవన + ఏక = ముఖ్య జీవనంగా
పరిపాలన = చక్కగా కాపాడుతూ
లోకహిత + అర్థ, కాంక్షులు + ఐ = ప్రపంచానికి మేలు చేయాలనే కోరిక కలవారై
గౌరవంబుతోన్ = గౌరవంగా
మనిచిరి నిర్మితి = రక్షించారు; పోషించారు.

భావం :
మానవ సమాజ నిర్మాణంలో భాగంగా, నీకొక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. ఇది వృత్తులలోకెల్లా పవిత్రమైనది. ప్రపంచానికి మేలు చేకూర్చాలనే కోరికతో, నీ పూర్వికులు ధర్మబుద్ధితో చాలాకాలంగా గౌరవంతో, వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తూ వస్తున్నారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

2వ పద్యం :
తే॥ శ్రమలు లేకయె ఫలములు దుముకబోవు
పిండికొలదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, కలుగు సుఖము
ఉత్తయాసలకన్న మే లుద్యమంబు
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ కర్షకుడా!
శ్రమలు లేకయె = శ్రమపడకుండా
ఫలములు = ఫలితాలు
దుముకబోవు = ఉట్టిపడవు (తమంతట తాముగా రావు)
పిండికొలది + ఎ = పిండిమేరకే
రొట్టె = రొట్టె తయారవుతుంది
ఓపిన విధాన = శక్తికి తగ్గట్టుగా (శక్తివంచన లేకుండా)
కష్టపడుము = కష్టపడు
సుఖము, కలుగున్ = నీకు సుఖం కలుగుతుంది
ఉత్త + ఆసలకన్నన్ = కేవలమూ ఆశలతో జీవించడం కన్నా
ఉద్యమంబు = ప్రయత్నం చేయడం
మేలు = మంచిది

భావం :
కృషీవలా! శ్రమ చేయకుండా, ఫలితాలు రావు. పిండి కొద్దీ రొట్టె కదా! శక్తివంచన లేకుండా కష్టపడు. నీకు సుఖం కలుగుతుంది. కేవలం ఉత్త ఆశలతో జీవించడం కన్నా, ప్రయత్నం చేయడం మంచిది.

3వ పద్యం
తే॥ వేలనూతుల కుగాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, చిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్నుఁ బోలరు, తమ్ముడా, యెన్నడైన
ప్రతిపదార్థం :
నేల నూతులకున్ = బావులకు (లోతుగా ఉండే దిగుడు బావులకు)
ఉగ్గాలు = చేదలు (చిన్న చెంబులు)
నిలుపువారు = ఏర్పాటు చేసేవారు
బోడితలకున్ = వెండ్రుకలు లేని తలకూ
మోకాళ్ళకున్ = మోకాళ్ళకూ
ముడులువెట్టువారు = ముళ్ళు వేసేవారు
చిటికెల పందిళ్ళు పన్నువారు = మాటలతో మభ్య పెట్టేవారు (ఇంత చేస్తాము, అంత చేస్తాము అని అతిడంబములు పలికి నమ్మించేవారు.)
తమ్ముడా = సోదరా !
ఎన్నడైనన్ = ఎప్పుడూ కూడా
పోలరు (నీకు) = సాటిరారు

భావం :
తమ్ముడా ! లోకంలో కొందరు చిత్రంగా ఉంటారు. వీరిలో కొంతమంది చిన్నతాడు కట్టిన చెంబుతో నేలనూతిలోని నీళ్ళుతోడుతారు. మరికొందరు గుండుకూ మోకాలికీ ముడి పెడతారు. ఇంకొందరు చిటికెలతో పందిళ్ళు వేస్తారు. చేతలతో సమాజసేవ చేస్తున్న నీకు, వారు ఎప్పుడూ సాటిరారు. (పైన చెప్పిన వారంతా కేవలం మాటల చమత్కారంతో, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు.)

4వ పద్యం :
తే|| సైరికా, నీవు భారతజ్మా తలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె?
ప్రతిపదార్థం :
సైరికా = సేద్యకాడా! (ఓ రైతా!)
భారత క్ష్మాతల = భారతదేశం యొక్క (భారత భూమండలం యొక్క)
ఆత్మగౌరవ = ఆత్మగౌరవాన్ని ప్రకటించే
పవిత్రమూర్తివి = పవిత్ర రూపుడవు
శూరమణివి = శూరులలో శ్రేష్ఠుడివి
ధారుణీపతి = భూమిని పాలించే రాజు యొక్క
పాలన దండము = పాలించే ధర్మదండము
ఎపుడున్ = ఎప్పుడునూ
నీ హలంబుకన్నను = నీ నాగలికంటె
ప్రార్థనీయము + అగునె = కోరదగినది అవుతుందా? (కాదు) (రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతి నాగలి గొప్పది అని భావము)

భావం :
హాలికుడా ! నీవు భారతదేశ ఆత్మగౌరవాన్ని తెలిపే పవిత్ర స్వరూపానివి. శూరులలో శ్రేష్ఠుడివి. రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతిలోని నాగలి గొప్పది. (రాజదండంలో దండించే గుణం ఉంది. నీ నాగలిలో పండించే గుణం ఉంది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

5వ పద్యం :
తే॥ దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర టెక్కలురాని నీ యిచ్ఛలెపుడు;
పైరుపచ్చలె యవధిగా (బ్రాకుచుండు
నీ విచారము, సహయు, నిపుణతయును
ప్రతిపదార్థం :
ఎగురన్ = ఎగరడానికి
ఱెక్కలురాని = రెక్కలు లేని
నీ + ఇచ్చలు = నీ కోరికలు
ఎపుడు = ఎప్పుడూ
దైనిక + ఆవశ్యకములన్ = రోజురోజూ అవసరములయిన నిత్యావసర వస్తువులను
దాటిపోవవు = అతిక్రమింపవు
నీ విచారమున్ = నీ ఆలోచనయూ
ఊహయున్ = ఊహయూ
నిపుణతయును = నేర్పునూ
పైరుపచ్చలు + ఎ – పైరుపంటలే (పైరు పంటల్ని బాగా పెంచడం మీదే)
అవధిగాన్ = హద్దుగా
ప్రాకుచుండున్ = అల్లుకుంటాయి

భావం :
నీవు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తావు తప్ప, నీకు అంతకు మించిన కోరికలు లేవు. నీ ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాలనూ అన్నింటినీ, పైరు పంటలను పండించడానికే వినియోగిస్తావు. (నీకు రోజు ఎలాగో గడచిపోతే చాలు. అది ఇది కావాలనీ, ఏదో సంపాదించేద్దామనీ నీవు కోరవు. నీ తెలివితేటలు అన్నింటినీ పైరుపంటలను బాగా పెంచడం మీద పెడతావు.)

6వ పద్యం :
తే॥ ప్రొద్దువొడిచిన దాదిగా ప్రొద్దుగ్రుంకు
వజకు కష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీ హృదయకళిక!
ప్రతిపదార్థం :
ప్రొద్దు + పొడిచినది = సూర్యుడు ఉదయించినది
ఆదిగా = మొదలుగా (తెల్లవారినప్పటి నుండి)
ప్రొద్దు + క్రుంకు వఱకు = సూర్యుడు అస్తమించే వజకూ
కష్టింతువే + కాని = కష్టపడతావే కానీ
ఇరుగుపొరుగు వారి = ప్రక్కన, దగ్గరగానూ ఉన్న వారి
సంపదకై = ఐశ్వర్యానికై
ఈసు + కూరబోవవు = అసూయ పొందవు
నీ హృదయ కళిక = నీ హృదయము అనే మొగ్గ
ఎంత నిర్మలము + ఓయి = ఎంత పవిత్రమైనదో కదా!

భావం :
తెల్లవారినప్పటి నుండి సాయంత్రం అయ్యే వఱకూ కష్టపడతావు. అంతేకాని ఇరుగు పొరుగు వారి సంపదలను గూర్చి అసూయపడవు. నీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది.

7వ పద్యం :
తే॥ ఉండి తిన్నను లేక పస్తున్న గాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి
తినక, త్రావకపోయిన దినములేదు
ప్రతిపదార్థం :
ఉండి = నీకు తినడానికి తిండి ఉండి
తిన్నను = నీవు తినినా
లేక = నీకు తినడానికి లేక
పస్తున్నగాని (పస్తు + ఉన్న + కాని) = ఉపవాసము ఉన్నా కాని
పరుల = ఇతరుల
కష్టార్జితంబున్ (కష్ట + ఆర్జితంబు) = కష్టించి సంపాదించిన దానిని
ఆసచేయవు = ఆశించవు
ఆకలి + ఎత్తగన్ = ఆకలివేయగా
నీ పంచకున్ = నీ ఇంటి దగ్గరకు
అరుగు = వెళ్ళే (వెళ్ళిన)
అతిథి = అతిథి (అతిథి, అభ్యాగతి మొదలయిన వారు)
తినక = కడుపు నిండా తినకుండా
త్రావక = కావలసిన మంచినీరు, మజ్జిగ మొదలయినవి త్రాగి దాహం తీర్చుకోకుండా
పోయిన = వెళ్ళిపోయిన
దినము లేదు = రోజు లేదు

భావం :
నీవు తిన్నా, తినకపోయినా ఇతరులు సంపాదించుకున్న సంపదలకు ఎప్పుడూ ఆశపడవు. ఆకలితో నీ ఇంటికి వచ్చిన అతిథి కడుపు నిండా తిని, తృప్తిగా తాగి వెడతాడు. (అంటే రైతు అతిథి అభ్యాగతులకు తిండి పెట్టి వారి దాహం తీరుస్తాడని భావం)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

8వ పద్యం :
తే॥ కృషి సకల పరిశ్రమలకు కీలుచీల ;
సత్పరిశ్రమ వాణిజ్య సాధనంబు,
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు
సిరియె గోపలబ్దికి జీవగఱ్ఱ
ప్రతిపదార్ధం :
కృషి = వ్యవసాయమే
సకల పరిశ్రమలకున్ = అన్ని పరిశ్రమలకూ
కీలుచీల = ముఖ్యమైన సీల (మూలము)
సత్పరిశ్రమ = మంచి పరిశ్రమయే
వాణిజ్య సాధనంబు = వ్యాపారానికి సాధనము
అఖిల వాణిజ్యములు= అన్ని వ్యాపారాలూ
సిరికి = సంపదకు
ఆటపట్లు = వాసస్థానము (నివసించే చోటు)
సిరియె = సంపదయే
భోగోపలబ్ధికిన్ (భోగ + ఉపలబ్ధికి) = సుఖాలను పొందడానికి
జీవగఱ్ఱ (జీవ + కఱ్ఱ) = బ్రతికించు మందు

భావం :
వ్యవసాయమే పరిశ్రమలన్నింటికీ మూలం. పరిశ్రమలు వ్యాపారానికి సహాయపడతాయి. వ్యాపారం వల్ల సంపద కలుగుతుంది. సంపద వల్ల సుఖం లభిస్తుంది.

9వ పద్యం :
తే|| కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకుఁ
గట్టఁ గుడువను కజవె యెక్కాలమందు !
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ హాలికా!
నుతులన్ = పొగడ్తలతో
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు; సాంఘిక = సంఘమునకు సంబంధించిన (సమాజానికి చెందిన)
ఉత్కృష్ట = ఉప్పొంగిన
సౌభాగ్య = వైభవానికి
సౌఖ్యములకు = సుఖాలకు
నీవె (నీవు + ఎ) = నీవె
కారణమవు = కారకుడవు
తలపరు = జ్ఞప్తికి తెచ్చుకోరు
ఫలము + అనుభవించు వారలు = ఫలాన్ని అనుభవించేవారు
పరులు = ఇతరులు
నీకు = నీకు మాత్రం
కట్టన్ = కట్టుకొనే బట్టకూ
భుజించుచున్ = అనుభవిస్తూ
కుడువను = తినడానికీ (తిండికీ)
నినున్ = నిన్ను ఎక్కాలమందు
(ఏ + కాలమందు) = ఎప్పుడునూ
కఱవె (కఱవు + ఎ) = లోటే

భావం:
ఓ హాలికుడా ! సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి నీవే కారణం. నీ కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. నీకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కొరతే (లోటే).

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

10వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై
పలుమాజమ్మధురత్వమున్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, వట్లే రమా
కలితు ల్బోగములన్ భుజించుచు విమం గన్నెత్తియుం జూతురే?
ప్రతిపదార్థం :
ఫలముల్ = పండ్లను
మెక్కెడి వారు = తినేవారు
తత్ఫల రసాస్వాదక్రియాలోలురై ; తత్ + ఫల = ఆ పండ్ల యొక్క
రస = రసాన్ని
ఆస్వాదక్రియా = అనుభవించే పనిలో
లోలురు + ఐ = అత్యాసక్తి కలవారై
పలుమాఱు = చాలాసార్లు
అమ్మధురత్వమున్ (ఆ + మధురత్వమున్) = ఆ తీపిదనాన్ని
సంభావింతురేకాని = గౌరవిస్తారే కాని
తత్ఫలహేతుక్రమవృక్షముం; తత్ + ఫల = ఆ పండు రావడానికి
హేతుక్రమ = కారణభూతమైన
వృక్షముం = చెట్టును గూర్చి
ఎవ్వా రైన = ఎవ్వరునూ
అట్లే = ఆ విధముగానే
రమా కలితుల్ = లక్ష్మీ సంపన్నులు (ధనంతో కూడినవారు)
భోగములన్ = సుఖాలను
కన్నెత్తియున్ + చూతురే = కన్ను పైకెత్తి చూడరు. (పట్టించుకోరు)

భావం :
పండ్లను తినేవారు వాటి తియ్యదనాన్ని పొగడుతూ తింటారే కాని, ఆ పండ్లను ఇచ్చిన చెట్టును గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తారా ? అలాగే నీ కష్టంతో భోగభాగ్యాలను అనుభవించే లక్ష్మీ సంపన్నులు నిన్ను కన్నెత్తి కూడా చూడరు కదా !

11వ పద్యం :
ఉ॥ అట్టి కృతఘ్నులన్ మనమునందుఁ దలంపక సేద్యనాద్యఫున్
ఘట్టన వస్థిపంజరముగా తమవెండినగాని, వరముల్
నీవు పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు ఎప్పుడున్!
ప్రతిపదార్థం :
అట్టి = అటువంటి
కృతఘ్నులన్ = చేసిన మేలు మరచిపోయిన వారిని
మనమునందున్ = (నీ) మనస్సు నందు
తలంపక = పట్టించుకోక (భావింపక)
సేద్యనాద్యపుం ఘట్టనన్ ; సేద్యనాద్యము = వ్యవసాయ సంబంధమైన
ఘట్టనన్ = రాపిడితో (సేద్యంలో పడే కష్టంతో)
అస్థిపంజరముగా = ఎముకల గూడుగా
తనువు = (నీ) శరీరము
ఎండినగాని = ఎండిపోయినా
వర్షముల్ = వర్షాలు (అతివృష్టి
పట్టిన + కాని = వచ్చినా
క్షామములు = కఱవులు (అనావృష్టి వల్ల)
వచ్చిన + కాని = వచ్చినా
శరీరసత్త్వము + ఏ = (నీ) శరీరంలోని శక్తియే
పట్టుగ = ఊతగా (అవలంబముగా) స్వశ్రమ + ఆర్జితము = (నీ) శరీర శ్రమతో లభించిన
పట్టెడు + అన్నమున్ (పట్టు + ఎడు) = గుప్పెడు అన్నాన్ని
ఎప్పుడున్ = ఎప్పుడునూ
తిందువు = తింటావు

భావం :
చేసిన మేలును మరచిపోయేవారిని నీవు అసలు పట్టించుకోవు. వ్యవసాయాన్ని చేయడంలో నీ శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవు పీడించినా వాటిని లెక్క చేయవు. నీ శరీర కష్టాన్నే నమ్ముకొని, నీ శరీర శ్రమతో లభించిన పట్టెడన్నమైనా సరే దాన్నే తింటావు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

12వ పద్యం :
తే॥ ఓ కృషీవల ! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు
ప్రతిపదార్థం :
ఓ కృషీవల = ఓ కర్షకుడా !
నీవు = నీవు
కష్టోత్కటంపు దుర్భరావస్థ + అందె; కష్ట + ఉత్కటము = పెద్ద కష్టంతో కూడిన
దుర్భర + అవస్థయందె = భరింపరాని స్థితియందే
తోదోపు + పడగన్ (తోపు + తోపు) = ఎక్కువగా రాపిడి పొందాలని
ఎవరు = ఎవరు
శాసించువారు = (నిన్ను) ఆజ్ఞాపిస్తారు
నీకున్ = నీకు
కొదవ = లోటు
ఏమి = ఏముంది?
ఆత్మ విజ్ఞానమయముగా = నిన్ను నీవు తెలిసికొనడం
అలవరింపు = నేర్చుకో

భావం :
ఓ కృషీవలా! నీవు పెద్ద కష్టాలలో కూరుకుపోవాలని నిన్ను శాసించేవారు ఎవరు ? నీకేమి తక్కువ ? నీ గొప్పతనాన్ని నీవు తెలుసుకో.

13వ పద్యం :
జీవనస్పర్థ సామాన్య చేష్టమైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్యవిరహితు డన్యభోజ్యత నశించు
నరజీవియె యంతరాయముల దాటు
ప్రతిపదార్థం :
జీవన స్పర్ధ = బ్రతకడం విషయంలో పోటీ
సామాన్యచేష్ట = సహజమైన కార్యము
ఐన కాలమున = అయిన నేటి రోజుల్లో
వ్యక్తివాదము = ఆయా వ్యక్తుల తత్త్వము (వ్యక్తి యొక్క కృషి)
అగ్రత వహించు = ప్రాధాన్యాన్ని పొందుతుంది
సత్త్వ విరహితుడు = సత్తువ లేనివాడు
అన్యభోజ్యతన్ = ఇతరులు పెట్టే తిండిపై ఆధారపడడంతో
నశించు = నాశనం అవుతాడు
అర్హజీవి + ఎ = అర్హత గలవాడే
అంతరాయములన్ = విఘ్నములను
దాటున్ = దాటుతాడు

భావం :
బ్రతకడం కోసం పోటీతత్వం సహజమైన కాలం ఇది. ఈ పరిస్థితులలో వ్యక్తివాదం ప్రాధాన్యం వహిస్తుంది. ఏ ప్రయత్నమూ, ఏ పనీ చేయనివాడు ఇతరులపై ఆధారపడి జీవిస్తూ నాశనం అవుతాడు. కానీ శ్రమను నమ్ముకున్నవాడు, ఎలాంటి అడ్డంకులనయినా దాటగలడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

14వ పద్యం :
తే॥ కావ జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,
సత్యసంధత, యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడవకు హలికవర్య
ప్రతిపదార్థం :
హలికవర్య = శ్రేష్ఠుఁడవైన ఓ రైతూ !
కానన్ = కాబట్టి
జీవన సంగ్రామ కార్యమందు జీవన = జీవితము అనే
సంగ్రామ కార్యమందు = యుద్ధంలో
విజయివి + అగుటకు = విజయం పొందడానికి
శౌర్యంబు = శక్తి
విద్య = చదువు
బుద్ధి = తెలివి
సత్యసంధత = సత్యవాక్కు
ఆత్మవిశ్వాసము = నీపై నీకు నమ్మకము
అనెడు = అనే
ఆయుధంబులన్ = ఆయుధాలను
విడవకు = విడిచిపెట్టవద్దు

భావం :
కాబట్టి – ఓ రైతు శ్రేష్ఠుడా! జీవితము అనే యుద్ధంలో విజయం పొందడానికి ‘శక్తి, చదువు, తెలివి, సత్యము, నీపై నీకు నమ్మకము’ అనే ఆయుధాలను విడువక ముందుకు నడువు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 8 చూడడమనే కళ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 8th Lesson చూడడమనే కళ

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పూర్వం ఒక రాజుగారికి ఇద్దరు మంత్రులు ఉండేవారు. రాజు అన్ని విషయాల్లో పెద్దమంత్రినే సలహా అడిగేవాడు. అది చిన్నమంత్రికి నచ్చేది కాదు. అతనికి పెద్దమంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. మక ఒకరోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్నమంత్రితో రాజు అన్నాడు. చూసివచ్చి ‘కుక్క ఈనిందన్నాడు చిన్నమంత్రి పిల్లలెన్ని’ అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి ‘నాలుగు’ అన్నాడు. ఏ రంగులో ఉన్నాయన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి రెండు నలుపూ, రెండు గోధుమరంగు’లో ఉన్నాయన్నాడు. ఇంతలో పెద్దమంత్రి వచ్చాడు. అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి, రాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చాడు. పెద్దమంత్రి గొప్పతనం అర్థమైన చిన్నమంత్రి సిగ్గుపడ్డాడు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిన్నమంత్రి ఒక్కొక్కసారి ఒక సమాధానాన్నే ఎందుకు చెప్పాడు?
జవాబు:
చిన్నమంత్రి విషయాన్ని పూర్తిగా పరిశీలించి చూడడం, వినడం అనే కళ తెలిసినవాడు కాడు. కేవలము, రాజు తనను అడిగిన విషయాన్ని మాత్రమే చూచి వచ్చి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకే సమాధానాన్ని చెప్పగలిగాడు.

ప్రశ్న 2.
పెద్దమంత్రి ఒకేసారి అన్ని విషయాలు చెప్పడానికి కారణమేమిటి?
జవాబు:
పెద్దమంత్రి దగ్గర పరిశీలనగా విషయాన్ని సంపూర్తిగా వినడం, చూడడమనే కళ ఉంది. కాబట్టి రాజు తనను చూచి రమ్మన్నపుడు విషయాన్ని అంతా పరిశీలించి వచ్చి, అన్ని విషయాలు చెప్పగలిగాడు.

ప్రశ్న 3.
ఇద్దరిలో పరిశీలనా శక్తి ఎవరికి ఎక్కువగా ఉంది?
జవాబు:
మంత్రులు ఇద్దరిలో పెద్దమంత్రికి పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
మనం వేటి వేటిని జాగ్రత్తగా పరిశీలించాలి? ఎందుకు?
జవాబు:
మనం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా పరిశీలించాలి. శ్రద్ధ చూపాలి. మనం చూసిన దాన్ని గురించి ఎవరు ఏమడిగినా దాన్ని గూర్చి చెప్పగలగాలి.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
సూర్యోదయ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుంది?
జవాబు:
సూర్యోదయ సమయంలో పక్షులు కిలకిల ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఆవులూ, దూడలూ అంబా అని అరుస్తూ ఉంటాయి. పూలు వికసించి పరిమళిస్తూ ఉంటాయి. నిద్ర నుండి మనుషులు లేచి తమ తమ పనులకోసం సిద్ధం అవుతూ ఉంటారు. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటారు. రైతులు పొలాలకు వెడుతూ ఉంటారు. జంతువులు నిద్ర నుండి లేస్తాయి. మంచు తెరలు తెరలుగా విడిపోతుంది. సూర్యకిరణాలు వెచ్చవెచ్చగా వ్యాపిస్తాయి.

ప్రశ్న 2.
శ్రద్ధ చూపడం అంటే ఏమిటి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండటం. శ్రద్ధ అంటే, ప్రేమ అనే దానిలో ఒక లోతైన భాగం. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంతో ఇది ప్రారంభం అవుతుంది. శ్రద్ధ చూపడం అంటే పెంపుడు జంతువును బాగా చూడడం, బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రంగా స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మీరు పాతిన మొక్కకు నీరు పోసి, ఎరువు వేసి చక్కగా పెంచడం, మీరు పెంచుకొనే కుక్కకు సరైన ఆహారాన్ని ఇచ్చి, దాన్ని ఆరోగ్యంగా పెంచడం వంటి పనులు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 3.
ఎలా వినాలి? ఎలా మాట్లాడాలి?
జవాబు:
పరిశీలించడం, వినడం అన్న పనులు రెండూ, నిజానికి ఒకటే. ఇదంతా ఒకే పని కాబట్టి మనచుట్టూ ఉన్నవాటిని గురించి తెలిసికోవాలి. ఆ పని మనల్ని సున్నితంగా చేస్తుంది. మనం పరిశీలిస్తే, వింటే, అప్పుడు తక్షణమే క్రియ జరుగుతుంది. పరిశీలించినప్పుడే, విన్నప్పుడే చర్య తీసుకుంటారు. వినడం ఎలాగో తెలిస్తే, ఉన్నదాన్నంతటినీ మీరు గ్రహిస్తారు. ” ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుకమీదనే ఉన్నదని అర్థం అవుతుంది. వినడంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

ఆ) కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి భావం రాయండి.

ప్రశ్న 1.
బిడ్డను ప్రేమించడం అంటే ఆ బాబు, పాప సరయిన విద్యను పొందేటట్లు చూడడం.
జవాబు:
ఈ వాక్యం, మా పాఠ్యాంశంలో ఎక్కడా లేదు.

ప్రశ్న 2.
పరిశీలించకపోతే మీరు ‘ప్రజ్ఞావంతంగా’ ఉండలేరు.
జవాబు:
మనం, మన చుట్టూ ఉన్న పక్షుల్నీ, చెట్లనూ, బీదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయం లేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్ని పరిశీలించాలనీ, లేకపోతే మనం ప్రజ్ఞావంతంగా అంటే తెలివిగలవారుగా ఉండలేమని రచయిత చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 3.
ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ.
జవాబు:
లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో, ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడడం కూడా అంతే కష్టం అని, ప్రతి వస్తువునూ ఉన్నదానిని ఉన్నట్లుగా చూడడం అనేది ఒక విద్య అని, రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 4.
“నా అంతట నేనే తెలుసుకోబోతున్నాను” అని చెప్పే సమయం మీకుండదు.
జవాబు:
మనం ఎవరో ఒకరు చెప్పింది వినడానికి అలవాటు పడిపోయాము. మనకు తల్లిదండ్రులూ, గురువులూ, పత్రికలూ, రేడియోలూ, టీవీలు చెపుతూ ఉంటాయి. అలా ఇతరులు చెప్పింది వినడమే కాని, మనంతట మనం తెలుసుకోబోతున్నామని చెప్పే సమయం మనకు ఉండదని రచయిత చెప్పిన సందర్భంలోని వాక్యమిది.

ప్రశ్న 5.
ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు.
జవాబు:
స్విట్జర్లాండులో ఒక అమ్మాయి తాను సైకిలు మీద వెడుతూ, అకస్మాత్తుగా సైకిలు దిగి, రోడ్డుమీద ఉన్న కాగితం ముక్కను తీసి దగ్గరగా ఉన్న చెత్తకుండీలో వేసిందనీ, ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదనీ, రచయిత స్విట్జర్లాండులో మిత్రునితో పాటు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటనను గూర్చి చెప్పిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) కింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.

“సర్ జగదీశ్ చంద్రబోస్” బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు. మొక్కలమీదా, జంతువులమీదా గాఢమైన ఆసక్తిని పెంచుకున్నారు. భౌతికశాస్త్రం అభ్యసించినప్పటికీ జీవశాస్త్రం అంటే ఆసక్తి ఎక్కువ. సొంతంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని అనేక పరిశోధనలు చేశారు. మొక్కలను, జంతువులను నిశితంగా పరిశీలించారు. మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు. చెట్లు అర్థరాత్రి నిద్రిస్తాయని, ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయని చెప్పారు. మత్తుపదార్థాల ప్రభావం చెట్లపై కూడా ఉంటుందని నిర్ధారించారు.

ప్రశ్న 1.
జగదీశ్ చంద్రబోస్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు.

ప్రశ్న 2.
జగదీశ్ చంద్రబోసు జీవశాస్త్రం అంటే ఎందుకు ఆసక్తి ?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ మొక్కలు, జంతువులపై గాఢమైన ఆసక్తి పెంచుకున్నారు. ఆయన భౌతికశాస్త్రం నేర్చుకొన్నప్పటికీ, జీవశాస్త్రం అంటే ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నారు.

ప్రశ్న 3.
చంద్రబోస్ తన పరిశోధనలో ఏమి కనుక్కొన్నారు?
జవాబు:
చంద్రబోస్ తన పరిశోధనలలో మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు.

ప్రశ్న 4.
చెట్లమీద పరిశోధన చేసి నిర్ధారించిన విషయమేమిటి?
జవాబు:
చెట్లకు ప్రాణం ఉంటుంది. అవి ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయి. మత్తు పదార్థాల ప్రభావం చెట్లపై ఉంటుందని నిర్ధారించారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసివాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎవరయినా దేన్నయినా నిజంగా పట్టించుకుంటున్నారో, ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద ప్రదర్శిస్తున్నారో మనం చూస్తూ తెలుసుకోవచ్చు” అని జిడ్డు కృష్ణమూర్తిగారు, అన్నారు. తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే కృత్రిమ మర్యాద. మనస్సు లోపల ఎదుటివారి పై గౌరవం లేకపోయినా, పైకి చిరునవ్వు చిందిస్తూ, ఎదుటివారిని గౌరవించడం, వారికి మర్యాదచేయడం వంటి పనులను ‘తెచ్చి పెట్టుకున్న మర్యాద’ అని అంటారు. సాధువులూ, సన్యాసులూ వంటి వారికి మంత్రులు స్వాగత సత్కారాలు చేయడం, మగ పెళ్ళి ‘వారికి ఆడ పెళ్ళివారు చేసే మర్యాదలూ తెచ్చి పెట్టుకొన్న మర్యాదలే. అత్తగారిపై మనస్సులో ప్రేమ, గౌరవాలు లేకపోయినా, ఉన్నట్లు నటించడాన్ని తెచ్చిపెట్టుకొన్న మర్యాద అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 2.
పరిశీలనకు, ప్రజ్ఞకు గల సంబంధాన్ని తెలపండి. (లేదా) పరిశీలన, ప్రజ్ఞ ఒకదానికొకటి విడదీయలేనివనే విషయం వివరించండి.
జవాబు:
మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ అంటే పక్షుల్నీ, చెట్లనూ, పేదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయంలేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్నీ. బాగా పరిశీలించాలి. అలా పరిశీలించకపోతే, ప్రజ్ఞ కలవారిగా ఉండలేము. అలా చుట్టూ ఉన్నవాటిని పరిశీలించకపోతే, హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు.

జీవితంలో ప్రతిదాన్నీ ఊరకే గమనించాలి. గమనింపులో నుండి ప్రజ్ఞ ఉదయిస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే తత్వం , మతం వంటివాటికి సంబంధించిన గ్రంథాలు చదవనవసరం లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుక మీదనే ఉన్నదని అర్థం అవుతుంది.

ప్రశ్న 3.
‘వల్లించడం’ అంటే ఏమిటి? అది విద్యార్థికి ఉపయోగపడుతుందా, కాదా? ఎందువల్ల?
జవాబు:
‘వల్లించడం’ అంటే నోటికి వచ్చేలా, వేదాలు మొదలయిన వాటిని మరలా మరలా చదవడం. విద్యార్థులు చిన్నతనంలో పద్యాలనూ, గేయాలనూ, ఎక్కాలనూ, ముఖ్యమైన లెక్కలు, సైన్సు సూత్రాలనూ వల్లిస్తారు. ఆ వల్లించే విషయానికి వారికి అర్థం తెలియదు. అయినా వల్లెవేస్తారు. ఆ పద్యాలూ, ఆ ఎక్కాలూ వగైరా వారికి పెద్ద అయ్యాక సులభంగా జ్ఞప్తికి వస్తాయి. క్రమంగా వారికి అర్థజ్ఞానం కలుగుతుంది.

అందుకే సుమతీ శతకం, కృష్ణశతకం, దాశరథి శతకం వంటి శతకాలలోని పద్యాలను పిల్లలు వల్లిస్తారు. అవి వారికి జీవితాంతం గుర్తుంటాయి. అవి విద్యార్థికి ఉపయోగిస్తాయి.

కాని విద్యార్థి పెద్దవాడు అయ్యాక వల్లించడం మంచి పద్దతి కాదు. విషయం గ్రహించి సొంతంగా రాయగలగాలి. వల్లించిన మాటలు చిలుక పలుకులులా ఉంటాయి. పెద్దవారయిన విద్యార్థులకు వల్లించడం ఉపయోగకరం కాదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
ప్రవర్తన అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి?
జవాబు:
ప్రవర్తన అంటే నడవడి. పరిశుభ్రతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలి. ఎదుటివారిని విమర్శించరాదు. విమర్శించకుండా, అంచనా వేయకుండా ఊరకనే గమనించాలి. మరింత జాగ్రత్తగా ఉండాలి. అశుభ్రతను, అశ్రద్ధను తగ్గించుకోవాలి. సహజమైన క్రమశిక్షణలో ఉండాలి. క్రమశిక్షణ, సున్నితత్వం కలసి ఉంటాయి. పరిశీలిస్తూ వింటూ ఉంటే, స్వతస్సిద్ధంగా, ఒత్తిడి లేకుండా అక్కడ ఒక క్రమత, సమన్వయత, క్రమశిక్షణ సంభవిస్తుంది.

ప్రశ్న 5.
శ్రద్ద చూపడం అంటే ఏమిటి? విద్యార్థులు వాటి పట్ల శ్రద్ధ చూపాలి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం. దయగా ఉండడం, వారిపట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం.

విద్యార్థులు తమ పాఠ్యగ్రంథములలోని విషయాల పట్ల శ్రద్ధ చూపాలి. గురువులను, తల్లిదండ్రులను గౌరవ భావంతో చూడాలి. తాము చదవవలసిన విషయాలపై లక్ష్యం ఉండాలి. సోదర విద్యార్థులను దయతో చూడాలి. తల్లిదండ్రులను, గురువులను ప్రేమగా చూడాలి. వారిపట్ల క్రూరంగా ఉండరాదు. గురువులు చెప్పిన దానిని సరిగా వినాలి. సరిగా పరిశీలించాలి.

విద్యార్థులు రోడ్డుపై నడిచి వెళ్ళేటప్పుడు పేదల అశుభ్రతనూ, రోడ్డు మీది బురదనూ, జబ్బుచేసిన జంతువులనూ ప్రేమతో శ్రద్ధగా చూడాలి.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవితంలో క్రమశిక్షణ అవసరం. ఎందుకో వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. ఈ అంశాన్ని సమర్థిస్తూ క్రమశిక్షణ ఆవశ్యకతను విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

‘క్రమశిక్షణ’ అంటే ప్రతి పనినీ, సక్రమమయిన పద్దతిలో సకాలంలో నెరవేర్చడం. పెద్దల పట్ల, గురువుల పట్ల, గౌరవనీయుల పట్ల వినయ విధేయతలు కలిగియుండడం. జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి నిద్రించే వరకూ చేయవలసిన పనులను, వేళతప్పకుండా చేయడం క్రమశిక్షణ. మన శరీరానికి అవసరమయిన పోషకపదార్థాలను అందించే ఆహార పదార్థాలను సరయిన రీతిలో తినడం కూడా క్రమశిక్షణయే.

క్రమశిక్షణ లేని జీవితము చుక్కాని లేని పడవ వంటిది. క్రమశిక్షణ అనే పేరుతో బలవంతంగా పనులు చేయరాదు. స్వతస్సిద్ధంగా ఒత్తిడి లేకుండా పనులు చేయాలి. అప్పుడే ఒక క్రమత, సమన్వయత, ఒక క్రమశిక్షణ సంభవిస్తుంది.

జీవితంలో క్రమశిక్షణగా పాఠాలు చదవాలి. ఇంటిపని పూర్తిచేయాలి. ఏ వృత్తిలో ఉన్నవారయినా సరే, క్రమశిక్షణగా వారి వృత్తిధర్మాలను పూర్తిచేయాలి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాలు సాధింపవచ్చు. క్రమశిక్షణగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఆటలు ఆడితే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివితే విద్యార్థులు విజయం సాధిస్తారు. క్రమశిక్షణగా పొదుపు చేస్తే వారు ధనవంతులవుతారు. వారికి డబ్బు చిక్కులు రావు.

జీవితంలో క్రమశిక్షణ పాటించిన వారు ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగిస్తే చక్కని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

ప్రశ్న 2.
ప్రపంచంలో శాంతి’ ఉండాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ప్రపంచంలో శాంతి ఉండాలంటే, ప్రజలు తమలో తాము శాంతిగా ఉండాలి. మనది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఆనందంగా జీవించడం కోసం, ముందు మనలో మనం పోటీపడడం ఆపాలి. మన పనిని మనం ప్రేమిస్తూ చేయాలి. మన పనిని మనం ప్రేమిస్తూ ఉంటే, మన కంటే ముందుకు ఎవరు వెళ్ళారో, వెనుక ఎవరు ఉన్నారో మనం పట్టించుకోము. మన సామర్థ్యాన్ని అంతా, అంటే మన మనస్సునూ, మన శరీరాన్నీ, మన హృదయాన్ని అంతా వెచ్చించి పనిచేస్తాము. హృదయం లోపల, మనిషిలో సమూలమైన పరివర్తన కలిగితే శాంతి వర్ధిల్లుతుంది.

ప్రపంచంలో ఇప్పటికి రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. దీనికి కారణం, దేశాల మధ్య పోటీ మనస్తత్వం. ఒకరి కంటే ఒకరు ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు ఆర్థికంగా, బలమైన దేశంగా ఉండాలని పోటీ పడుతున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా వంటి దేశాలు నేటికీ తమలో తాము పోటీ పడుతున్నాయి. ఆయుధాలను భారీగా పోగుచేస్తున్నాయి. ఇందువల్లనే యుద్దాలు సంభవిస్తున్నాయి.

అలాగే మతం కూడా కొన్ని దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతున్నది. కాబట్టి మత సామరస్యం ఉండాలి. ఒక దేశానికి మరోదేశం సహకారం అందించాలి. మిత్రరాజ్య సమితిని మరింత శక్తి సంపన్నంగా చేయాలి. అగ్రరాజ్యాలవారు, బీద దేశాల వ్యవహారాలలో తలదూర్చరాదు. వారు ఆయుధాలను అమ్మి, దేశాల మధ్య పోటీ పెంచరాదు. మనిషిలో సమూలమైన మార్పు రావాలి. ప్రపంచదేశాల మధ్య మరింత సమన్వయం అవసరం. శాంతి తత్త్వాన్ని, ప్రేమ తత్త్వాన్ని ” ప్రజలలో పెంచి పోషించాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వము ప్రజలలో వెల్లివిరిస్తే, ప్రపంచ శాంతి పుష్పం నిండుగా వికసిస్తుంది. ప్రపంచ ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలి.

ప్రశ్న 3.
చిన్నతనంలో ఉన్న ఊహాశక్తి, పెద్దవారవుతున్న కొద్దీ ఎందుకు పోతుంది? ఆలోచించి రాయండి.
జవాబు:
చిన్నతనంలో మానవులలో అసాధారణమైన ఊహాశక్తి ఉంటుంది. మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ శక్తి పోతుంది. చిన్నతనంలో నదిని చూస్తూ ఉంటే ఆ నదిలోని పడవలో మనం ఉన్నట్లూ, భయంకర తుఫానుల మధ్య చిక్కుకున్నట్లు ఊహిస్తాము. మేఘాన్ని మనం చూస్తే, మనకు అది మేడలా కన్పిస్తుంది. ఆ మేడలో మనం ఉన్నట్లు భావిస్తాము. గాలి శబ్దం వింటే సంగీతాన్ని విన్నట్లు భావిస్తాము. ఒక పెద్ద పక్షిని చూస్తే, మనం దానివీపుపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లు తలపోస్తాము.

అలాగే మనకు బాగా డబ్బు ఉన్నట్లూ, మంచి పేరు ఉన్నట్లూ, అందరూ మెచ్చుకొనే అద్భుతమైన వ్యక్తి మనం అన్నట్లు మనం భావిస్తాము. మనం ఏదైనా చరిత్ర చదివితే, దాన్ని గూర్చి ఆలోచించేటప్పుడు ఏవేవో కల్పించుకొని ఊహిస్తాము.

పెద్దవారయిన కొద్దీ మన కలలూ, ఊహలూ ఆవిరి అవుతాయి. జీవిత యధార్థ దృశ్యం మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది. చిన్నప్పుడు మనం మహారాజు కావాలనీ, అయినట్లూ ఊహిస్తాము. కానీ చదువు రాక, ఉద్యోగం లేక, నిరుద్యోగిగా మిగిలినప్పుడు ఇంక ఊహలు ఉండవు. విద్యార్థి దశలో శిష్యులకు ఎన్నో సందేహాలూ, ఎన్నో ప్రశ్నలూ ఉంటాయి. సామాన్యంగా గురువులు వాటిని తీర్చకుండా, వారిపై కోపపడి వారి జిజ్ఞాసపై నీళ్ళు చల్లుతారు. తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పరు. క్రమంగా పిల్లల్లో తెలిసికోవాలనే కోరిక అడుగంటుతుంది. జీవితంలో స్థిరత్వం వచ్చాక, తాను దేవేంద్రలోకంలో అప్సరసల మధ్య ఉన్నట్లు కలలు కనడు – తన నిజ స్థితిని తాను గుర్తిస్తాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) సృజనాత్మకంగా స్పందించండి.

ప్రశ్న 1.
పాఠంలోని మొదటిపేరా ఆధారంగా చిత్రాన్ని గీయండి. దాని గురించి వర్ణించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
(లేదా )

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ‘ప్రపంచశాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(వ్యాసరచన పోటీ)

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి x x x x వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని . ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.
దివి x x x x x.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీలో పాల్గొని, ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుమతినందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.
ఉంటా.

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,
9వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
కాకినాడ.

(లేదా)
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళాఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికల్లో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,
ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ షుహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

IV. ప్రాజెక్టు పని

* మనచుట్టూ ఉండే ప్రతి ప్రాణిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీరు చూసిన పక్షులు, జంతువుల లక్షణాలను, ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాసి ప్రదర్శించండి.

పక్షులు/జంతువులు లక్షణాలు ప్రత్యేకత
కుక్క వాసన పసిగట్టడం విశ్వాసము కలది
కోడి గుడ్లు పెట్టుట కోడికూత
ఆవు సాధు జంతువు మచ్చిక చేసిన పాలు ఇస్తుంది.
సింహం క్రూరమైనది మృగరాజు
ఏనుగు ఎత్తైనది బరువులు ఎత్తుట
పావురం పెంపుడు పక్షి సమాచారం చేరవేయుట

III. భాషాంశాలు

పదజాలం

అ) ఇచ్చిన వాక్యాలు ఆధారంగా కింద గీత గీసిన పదాలకు అర్థాలను గ్రహించి, మరో వాక్యం రాయండి.

1. ఇంద్రధనుస్సులో రంగులను చూస్తే, విస్మయం కలుగుతుంది.
అర్థాలు : ఇంద్రధనుస్సు = హరివిల్లు; విస్మయం = ఆశ్చర్యం
వాక్యప్రయోగం : హరివిల్లు ఆకాశంలో కనబడితే, పిల్లలకు ఆశ్చర్యము కలుగుతుంది.

2. మనం ప్రతిరోజు ప్రాతఃకాలంలో నిద్రలేవాలి.
అర్థం : ప్రాతఃకాలము = తెల్లవారే సమయము.
వాక్యప్రయోగం : పక్షులు తెల్లవారే సమయములో కిలకిలారావములు చేస్తాయి.

3. వెన్నను చేతితో తాకితే మృదువుగా ఉంటుంది.
అర్థం : మృదువు = మెత్తనిది
వాక్యప్రయోగం : పూలు మెత్తగా, సున్నితంగా ఉంటాయి.

4. ప్రవర్తన సరిగా లేనివారు జీవితంలో కష్టాల్లో పడతారు.
అర్థం : ప్రవర్తన = నడవడి
వాక్యప్రయోగం : మనిషి జీవితాన్ని వారి నడవడి నిర్ణయిస్తుంది.

5. ఆదర్శానికి, ఆచరణకు సమన్వయం ఉండడం వాంఛనీయం.
అర్థం : సమన్వయం = సరియైన క్రమము
వాక్యప్రయోగం : ధర్మార్థములకు సరియైన క్రమము అవసరము.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఆ) కింది వాటిలో ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలున్నాయి. వాటిని వేరుచేసి వాక్యాలు రాయండి.
తనంతట తాను, దురదృష్టం, కాఠిన్యం, తెలుసుకోడం, క్లిష్టం. నిజం చెప్పడం, పలు అసాధారణం, పనిని ఇష్టపడడం, స్వతస్సిద్ధం.
జవాబు:
ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలు

  1. తనంతట తాను
  2. స్వతస్సిద్ధం
  3. నిజం చెప్పడం
  4. తెలుసుకోడం
  5. పనిని ఇష్టపడడం

వాక్య ప్రయోగాలు :

  1. తనంతట తాను . ఇతరుల సాయం లేకుండానే రవిబాబు తనంతట తానుగా ఆ కార్యం నెరవేర్చాడు.
  2. స్వతస్సిద్ధం గోపాల్ బాబు స్వతస్సిద్ధంగా గొప్ప కార్యసాధకుడు.
  3. నిజం చెప్పడం . ఏమైనా సరే, నిజం చెప్పడం మనిషి కర్తవ్యం అని బాబు నమ్ముతాడు.
  4. తెలుసుకోడం : తన శక్తిని తాను తెలుసుకోడం, కార్యసాధకుని మొదటి లక్షణం.
  5. పనిని ఇష్టపడడం : పనిని ఇష్టపడడం అన్నది యోగ్యుని లక్షణం అని చెప్పాలి.

ఇ) కింది వాక్యాలలో ప్రకృతి పదాలను గుర్తించండి. వాటి ఎదురుగా వికృతులను ఎంపిక చేసుకొని రాయండి.
1) ఆకాశంలో మబ్బులను చూశారా?
జవాబు:
ఆకాశం

2) సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
జవాబు:
ఆహారం

3) నెమలి జాతీయ పక్షి.
జవాబు:
పక్షి

4) ఉపాధ్యాయుడు బడిలో పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్పుతాడు.
జవాబు:
ఉపాధ్యాయుడు

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

వికృతి పదాలు : ఓగిరం, సంద్రం, పక్కి, దెస, ఒజ్జ, గారవం, ఆకసం, బాస, సాకిరి
జవాబు:
ప్రకృతి – వికృతి
1) ఆకాశం – ఆకసం
2) ఆహారం – ఓగిరం
3) పక్షి – పక్కి
4) ఉపాధ్యాయుడు – ఒజ్జ

వ్యాకరణం

ఈ) కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డుమీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి, దగ్గరలో నున్న చెత్తకుండీలో వేసి, మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
జవాబు:
సంక్లిష్ట వాక్యం

పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
అసమాపక క్రియలు : 1) తీసి 2) వేసి 3) ఎక్కి అనేవి. ఇవి క్వార్థకములు అనే అసమాపక క్రియలు.

2) ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నవాక్యంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున, మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా : దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యాలు :

  1. మీరెప్పుడయినా గమనించారా? (గమనించారు + ఆ)
  2. మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
  3. వీటిని మీరు చూస్తారా? (చూస్తారు + ఆ)
  4. నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
  5. శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
  6. పెద్దవారయిన కొద్దీ పోతుంది. ఎందువల్ల?
  7. పెరుగుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటారు?
  8. ఇంట్ల కెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
  9. పిరికిదనం గల్గియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

3) ఒక వస్తువు స్వభావాన్ని / ధర్మాన్ని తెలిపే క్రియలను, నిత్య సత్యాలను తెలిపే వాటిని “తద్ధర్మ” క్రియలు అంటారు.
ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఎగురుతుంది మొదలైనవి. ఇలాంటి క్రియలను మీ పాఠంలో వెతికి రాయండి.
జవాబు:
నడుస్తారు, ఉదయిస్తుంది, పారిపోతారు, చూస్తారు, ఊహిస్తారు, గ్రహిస్తారు, చదువుతారు, చేస్తారు మొ||నవి.

ఉ) రుగాగమ సంధి :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు.

గమనిక :
పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి ప్రక్కనున్న ‘ఆ’ అనే శబ్దం పరమైతే అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే ఇలా రుగాగమం ‘5’ వస్తుంది. రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే ‘ఆగమం’ అంటారు.

సూత్రం 1 :
పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) (నామము)
విశేషణం – నామం
మనుమ + ఆలు = మనుమరాలు
బాలింత + ఆలు = బాలింతరాలు

సూత్రం 2 :
కర్మధారయంలో తత్సమపదాలకు ఆలు శబ్దం పరమైతే, పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర . + ఆలు
(ధీర + ఉ + ర్ + ఆలు) = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు

మరికొన్ని ఉదాహరణలు రాయండి.
1) విద్యావంతురాలు : విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
2) అసాధ్యురాలు : అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
3) పవిత్రురాలు – పవిత్ర + ఉ + ర్ + ఆలు = పవిత్రురాలు
4) ధైర్యవంతురాలు : ధైర్యవంత + ఉ + ర్ + ఆలు = ధైర్యవంతురాలు

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ రచయిత పరిచయం

జిడ్డు కృష్ణమూర్తిగారు మే 12, 1895న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో – జన్మించారు. వీరు ఆంగ్లములో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు | చేశారు. కృష్ణమూర్తిగారు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త.

మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో.

ఆ మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ జిడ్డు కృష్ణమూర్తి విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

కఠిన పదాలకు అర్థాలు

సూర్యోదయము (సూర్య + ఉదయము) = సూర్యుడు ఉదయించడం
సూర్యాస్తమయము (సూర్య + అస్తమయము) = సూర్యుడు అస్తమించడం
విస్మయపరచు = ఆశ్చర్యము కలుగజేయు
గమనించు = గ్రహించు
ప్రతిబింబించు= ప్రతిఫలించు
ప్రాతఃకాల భానుడు = ఉదయకాల సూర్యుడు
వెండితునక = వెండి ముక్క
మాలిన్యాన్ని = మురికిని
హీనస్థితి = దారిద్ర్య స్థితి
మన్నన = గౌరవము
కాఠిన్యం = కఠినత్వము
మృదుస్వభావం = మెత్తని స్వభావము
స్పందన = కదలిక
ఆరంభము = ప్రారంభము (మొదలు)
ఆశ్రయము = ఆధారము
ప్రజ్ఞావంతముగా = తెలివి కలవారుగా
హృదయం = మనస్సు
చింత = ఆలోచన
అంతరంగం = హృదయము
నిరుత్సాహం = ఉత్సాహం లేకపోవడం
ప్రతిస్పందించు = తిరిగి కదలడం
గమనించు = గ్రహించడం
క్లిష్టమైన = కఠినమైన
అసాధారణం = విశేషము
ప్రజ్ఞ = తెలివి, అప్పటికప్పుడు పుట్టే ప్రతిభ
ఆప్యాయత = ప్రీతి
లక్ష్యపెట్టు = పట్టించుకొను
లక్ష్యం = శ్రద్ధ (గురి)
సాక్షులు = కంటితో చూచినవారు
అశుభ్రత = శుభ్రత లేకపోవడం
దైన్యాన్ని = దీనత్వాన్ని
చర్య = నడవడి, అనుష్ఠానము
సంఘర్షణ = ఒరపిడి
మిత్రునితో = స్నేహితునితో
ప్రాధాన్యత = ప్రాముఖ్యము
అస్తిత్వం = ఉండడం
స్వతస్సిద్ధంగా = తనంతట తానుగా సిద్ధించినది (సహజంగా)
శ్రవణానందము (శ్రవణ + ఆనందము) = చెవులకు ఆనందము
నిరపేక్ష = అపేక్ష లేకపోవడం (కోరికలేమి)
బెస్తవారు = పడవలను నడిపే, చేపలు పట్టుకొనే వారు
విమర్శ = తఱచి మంచిచెడ్డలను చెప్పడం

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ఆడినమాట

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 7 ఆడినమాట Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పొదలను తొ! శిస్తున్నాడు. ఆ పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి చెట్లను నరకవద్దు నీకు సహాయం చేస్తానని చెప్పి ఒక రత్నం ఇచ్చింది. దాన్ని అతడు ఎక్కువ ధరకు అమ్మి ధనవంతుడయ్యాడు. చేసిన మేలు మరచి అతడు పాముకు ఇన్ని మణులెక్కడివని ఆలోచించి పుట్టను కనుక్కొని అందులో ఎండు గడ్డి వేసి మంటపెట్టాడు. ఆ మంటలకు పాము చనిపోయింది. మణుల కోసం పుట్టను తవ్వుతుండగా మిగతా పాములు కరచి అతడు చనిపోయాడు. ‘కృతజ్ఞత’ లేని నరుడు క్రూరమైనవాడు కదా !

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చెట్లను నరక వద్దని పాము అనడానికి కారణమేమిటి?
జవాబు:
ఆ చెట్ల మధ్య, పొదల మధ్య ఆ పాము పెట్టిన పుట్ట ఉంది. ఆ పాము, ఆ పుట్టలో నివసిస్తోంది. తనక. నివసించడానికి పుట్ట లేకుండా పోతుందనే భయంతో పాము వేటగాడిని చెట్లను నరక వద్దని చెప్పింది.

ప్రశ్న 2.
వేటగాడు పామును ఎందుకు చంపాడు?
జవాబు:
వేటగాడికి పాము ఒక రత్నాన్ని ఇచ్చింది. దాన్ని అమ్మి వేటగాడు ధనవంతుడయ్యాడు. పాము పుట్టలో ఇంకా మరెన్నో రత్నాలు ఉంటాయని వేటగాడు ఆశించాడు. అందుకే వేటగాడు పుట్టను కనిపెట్టి ఎండుగడ్డితో దానిపై మంట వేసి పామును చంపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ప్రశ్న 3.
వేటగాడి స్వభావం ఎలాంటిది? ఇలాంటిదే మరో కథ తెలుసా మీకు?
జవాబు:
వేటగాడు, చేసిన మేలు మరచిపోయే స్వభావం కలవాడు. అనగా కృతజ్ఞత లేనివాడు. దురాశాపరుడు. పాము తనకు చేసిన మేలును మరచి, ఆ పాము పుట్టనే మంట పెట్టి ఆ పామును చంపాడు. ఈ వేటగాడు కృతఘ్నుడు. ఇలాంటి కథ మరొకటి నాకు తెలుసు.

కృతఘ్నతగల మరో జంతువు (పులి) కథ :
పూర్వము ఒక పులి, అడవిదున్నపోతును చంపి తింది. అప్పుడు పులి దవడలో ఒక ఎముక గ్రుచ్చుకుంది. పులి ఎంత విదల్చినా ఆ ఎముక ఊడి రాలేదు. పులి బాధతో విలవిలలాడింది. అప్పుడు ఆ పులి ఒక సూచీ ముఖ పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగి తనకు సాయం చేయమని కోరింది. ఆ పక్షి, పులి మాటలు నమ్మి ఆ ఎముకను తన ముక్కుతో లాగింది. పులి బాధ తీరిపోయింది. తరువాత పులి, ఆ పక్షి స్నేహం కొనసాగించాయి. అప్పుడప్పుడు ఆ పక్షి, పులి నోట్లో గుచ్చుకున్న ఎముకలను లాగి ఉపకారం చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ పులికి ఆహారం ఎక్కడా దొరకలేదు. పులి, పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగమని చెప్పింది. పక్షి పులిమాటలు నమ్మి, పులి నోట్లో దూరి ఎముకను లాగుదామని చూస్తుండగా పులి ఆ పక్షిని కఱచి చంపింది. ఆ పులికి కృతజ్ఞత లేదు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలో ఆవు మాట్లాడిన విషయాన్నీ, పద్యాలనూ రాగయుక్తంగా పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
ఆవు మాట్లాడిన పద్యములు ఇవి. 1, 2, 4, 9, 10 వీటి భావాలను “పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు”లో చూడండి.

ప్రశ్న 2.
అట్లాగే పులి మాట్లాడిన విషయాలున్న పద్యాలను రాగంతో పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
పులి మాట్లాడిన పద్యములు : 3, 13, 14
ఈ పద్యాల భావాలు “ప్రతిపదార్థాలు – భావాలు” వద్ద చూడండి.

ప్రశ్న 3.
క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్థిస్తూ సరైన కారణాలతో మాట్లాడండి.
అ) “ఆడినమాట తప్పని ఆవు చాలా గొప్పది” – ఎందుకంటే …….
జవాబు:
ఆవు, పులికి మాట ఇచ్చిన విధంగా తన పుత్రునికి పాలిచ్చి, తనను తినివేయమని పులి వద్దకు తిరిగి వచ్చింది. అందుకే ఆవు గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) స్వభావరీత్యా పులి క్రూరమైన జంతువు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆవును చూసి, మారిన పులి ఇంకా గొప్పది. ఎందుకంటే ………
జవాబు:
పులి సహజంగా మాంసం తినే జంతువు. అయినా ఆడినమాట తప్పని ఆవును చంపలేదు. ఆవు వంటి మహాత్ముణ్ణి చంపితే తనకు అంతులేని పాపం వస్తుందని పులి చెప్పింది. ఆవును తిరిగి తన దూడవద్దకు పంపించింది. కాబట్టి పులి ఇంకా గొప్పది.

ఇ) ‘ఆడిన మాట ప్రకారం వచ్చిన ఆవు, మారిన పులి రెండూ గొప్పవే’. ఎందుకంటే ……….
జవాబు:
ఆవు ఆడిన మాటను నిలబెట్టుకుంది. కనుక ఆవు గొప్పది. పులి హింసా ధర్మాన్ని మాని, ఆడిన మాట తప్పని ఆవును చంపకుండా దయతో విడిచి పెట్టింది. కాబట్టి పులి గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) చెప్పేవారు చెప్పినా, వినేవారికి వివేకముండాలి.
జవాబు:
“చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె?” ఈ మాటలను పులి, ఆవుతో అంది.

ఆ) నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు.
జవాబు:
“మెత్తని మనసే నాయది యెత్తి యిటులు చూడనేల”? ఈ మాటలను ఆవు తనను తినమని, పులిని బ్రతిమలాడుతూ చెప్పినది.

ఇ) నీవు ధర్మం తెలిసినదానివి. నీకెవ్వరూ సాటిలేరు.
జవాబు:
నీవు ధర్మవిదురాలవు. నీకెన యెవ్వరు? ఈ మాటలను పులి, ఆవును ప్రశంసిస్తూ చెప్పింది.

ఈ) నిన్ను కన్నందుకు ఋణవశాన ఇన్ని రోజులు సాకి పాలు ఇచ్చాను.
జవాబు:
“నిన్ను గని యిన్ని దినములు చన్నిచ్చితి ఋణవశంబున” ఈ మాటలను గోవు తన దూడతో అంది.

ఉ) ఇంతమాత్రానికే నా, ప్రాణాలు పోతాయా?
జవాబు:
“ప్రాణములింతనె పోవుచున్నవే?” ఈ మాటలను పులి, ఆవుతో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) పులిని ఆవు ఏమని వేడుకున్నది? ఎందుకు?
జవాబు:
పులిని ఆవు తనకు ఏడెనిమిది రోజుల క్రితమే పుట్టిన కుమారునకు పాలు ఇచ్చి వస్తానని వేడుకున్నది. తనకు కుమారుడు జన్మించి ఏడెనిమిది రోజులు మాత్రమే అయినది వానికి ఇంకా గడ్డి మేయుట చేతకాదని కావున వానికి పాలిచ్చి తగు జాగ్రత్తలు చెప్పిరావడానికి పులిని వేడుకున్నది. ఈ

ఆ) ఆవు మాటలు విన్న పులి ఏమన్నది? ఏం చేసింది?
జవాబు:
ఆవు మాటలు విన్న పులి, ఆవును అపహాస్యం చేసి ‘ఓ గోవా ! నీవు మాట్లాడుతున్నదేమిటి? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది సమంజసమేనా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండవద్దా? అన్నది.

ఇ) ఆవు తన కొడుకుకు ఏమని బుద్దులు చెప్పింది?
జవాబు:
ఎప్పుడూ అబద్దాలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలిసి ఉండకు. ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లుగా ఉండి ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని బుద్ధులు చెప్పింది.

ఈ) తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఏమన్నది?
జవాబు:
నీ వంటి మహాత్ములను చంపి, పాపాన్ని మూటకట్టుకోలేను. కావాలంటే నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం నా చేత గడ్డి తినిపించునా? (పాపాన్ని ఎందుకు చేయిస్తాడు?) ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా ఏం”? అని పులి తిరిగి వచ్చిన ఆవుతో పలికింది.

ఉ) తినడానికి నిరాకరించిన పులితో ఆవు ఏమన్నది?
జవాబు:
“ఓ పుణ్యాత్ముడా ! ఈ కథలన్నీ ఎందుకు ? నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు. నేనీ శరీరాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా” అని తనను తినడానికి నిరాకరించిన పులితో ఆవు పలికింది.”

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆకలితో ఉన్న పులిని ఆవు తన ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పించింది కదా ! పులి ఆవును నమ్మడానికి గల కారణాలు ఏమిటి?
(లేదా)
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది?
జవాబు:
తాను తిరిగిరాకపోతే – అబద్ధాలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురుమాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేయుచున్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ నరకాల్లో పడతారో, తిరిగి రాకుంటే తాను కూడా అదే నరకాలలో పడతానని శపథం (ప్రమాణం) చేస్తుంది. కావున ఆవు మాటలను పులి నమ్మినది.

ప్రశ్న 2.
ఆవు తాను తిరిగి అడవికి వెళ్ళేముందు అబద్దమాడకు, పనికిరానివాళ్లతో తిరగకు అని బుద్ధులు చెప్పింది కదా ! ఆవు తన బిడ్డకు ఇంకా ఏమేమి బుద్దులు చెప్పి ఉండవచ్చు?
జవాబు:

  1. పక్క వారితో విరోధాలు పెట్టుకోకు
  2. అందరితో స్నేహం చెయ్యి
  3. వేళకు మేత తిను
  4. మేత తిని చక్కగా కడుపు
    నిండా నీళ్లు తాగి హాయిగా పడుకో వంటి నీతులు ఆవు దూడకు చెప్పవచ్చు.

ప్రశ్న 3.
ఇతరులు ఎవరైనా కీడును కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లు ఉండి, వెళ్ళమని ఆవు తన కొడుకుతో చెప్పింది కదా ! అలా అనడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
ఇతరులు కీడు కలిగించే మాటలు, పొగరుబోతుతనంతో మాట్లాడవచ్చు. ఆ మాటలకు భయపడి కూర్చుంటే మనం సంఘంలో ఏమీ చేయలేము. ఎవరికీ భయపడరాదు. ధైర్యంగా ఉండాలి. ఇతరులు నిందిస్తే తిరిగి వారిని నిందించరాదు. అలా ఎదురు మాటలు మాట్లాడితే తగవులు వస్తాయి. అందుకే ఆవు “ఎవరు ఏమి అన్నా భయపడకు. వారి మాటలు
పట్టించుకోకు” అని తన కొడుకుకు చెప్పింది.

ప్రశ్న 4.
“ఈ కథలన్నీ ఎందుకు” ? అని ఆవు అన్నది కదా ! ఈ మాటలనే ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటారు?
జవాబు:

  1. మనం ఎవరినైనా ఎక్కడకైనా ఏదో పనిమీద పంపిస్తే, వాడు ఆ పని చేయకుండా ఎక్కడో తిరిగి వస్తాడు. పని ఏమయిందిరా అని అడిగితే ఏవో కథలు చెపుతాడు.
  2. పరీక్షలో ఎందుకు మంచి మార్కులు రాలేదంటే ఏవేవో కారణాలు చెపుతాడు. అప్పుడు పెద్దలు వాడితో “ఏవేవో కథలు చెప్పకు” అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఆవు-పులి” వంటి స్వభావం ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారు కదా ! వీరి స్వభావం ఎలా ఉంటుంది?
జవాబు:
ఆవు వంటి స్వభావం ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉంటారు. వారు ఇతరులకు కష్టం వస్తే చూసి సహించలేరు. తనకు కష్టం కలిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తారు. తనకు కడుపునిండా తిండి లేకపోయినా, ఇతరులు కషాల్లో ఉన్నప్పుడు తనకు ఉన్నదంతా ధారపోసి ఎదుటివారిని ఆదుకుంటారు. సమాజంలో ఉన్నవారినందరినీ తనలాగే చూస్తారు. తనకు కష్టం వస్తే ఎలాగుంటుందో, ఇతరులకూ అలాగే ఉంటుందని వారు అనుకుంటారు.

ఆవు వంటి స్వభావం కలవారు ఎన్నడూ అబద్ధం మాట్లాడరు. ఆడినమాట కోసం తమ ప్రాణాలనైనా ధారపోస్తారు.

పులి వంటి స్వభావం కలవాళ్ళు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. ఇతరులు ఎంత నష్టపోయినా వీరు పట్టించుకోరు. తమకోసం, తమవారి కోసం ఎదుటివారిని కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుంటారు.

పులి వంటి స్వభావం కలవారు అసత్యాలు మాట్లాడుతారు. అధర్మంగా నడచుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు. పక్కవారి మంచిచెడ్డలను పట్టించుకోరు. పులి వంటి స్వభావం కలవారు అవసరమైతే ఇతరులను హత్యలు చేస్తారు. చేయిస్తారు, హింసిస్తారు, దుర్మార్గంగా నడుస్తారు.

ప్రశ్న 2.
“ఆవు” గుణగణాలను గురించి రాయండి.
జవాబు:
ఆవు ఆడినమాట తప్పని గోమాత. తన చిన్న బిడ్డకు పాలిచ్చి వస్తానని, వెళ్ళిరావడానికి తనకు అనుమతి ఇమ్మని పులిని బ్రతిమాలింది. తన బిడ్డకు గుమ్మెడు పాలు చాలునని, పులికి తన మాంసం అంతా తింటే కాని ఆకలి తీరదని, కాబట్టి ముందు తన పిల్లవాడికి పాలివ్వడం ధర్మమని నచ్చచెప్పింది. తాను అబద్ధం ఆడనని శపథాలు కూడా మాట్లాడి పులిని నమ్మించింది.

ఇంటికి వెళ్ళి ప్రేమతో కుమారుడికి పాలిచ్చి బుద్దులు చెప్పింది. ఆవు చెప్పిన బుద్ధులను బట్టి ఆవు స్వభావం చాలా మంచిదని తెలుస్తుంది. జరిగింది చెప్పి, కొడుకును ఓదార్చి పులి వద్దకు తిరిగి వచ్చింది. తన మనస్సు అసలే మెత్తనిదనీ ఇంకా పరీక్షించవద్దనీ పులికి చెప్పి, తనను తినమని పులిని బ్రతిమాలింది. దేవతలు సైతం ఆవు సత్యవాక్యశుద్ధిని మెచ్చుకున్నారు.

ప్రశ్న 3.
కథలో ఆవు గొప్పదనాన్ని తెలిపే సంఘటన ఏది? అట్లాగే పులి గొప్పదనాన్ని తెలిపే సన్నివేశం ఏది?
జవాబు:
ఆవు గొప్పదనం :
ఆవు తిరిగి వచ్చి పులిని తనను తిని కడుపు నింపుకోమంది. పులి, ఆవును చంపితే తనకు పాపం వస్తుందని చెప్పింది. అప్పుడు ఆవు పులితో “తనది అసలే మెత్తని మనస్సు అనీ, తనను ఇంకా పరీక్షించవద్దని చెప్పింది. అలాగే దూడకు బుద్ధులు చెప్పిన సంఘటన కూడా ఆవు గొప్పదనాన్ని తెలుపుతుంది.

పులి గొప్పదనం :
ఆవు చేసిన శపథములు విని, ఆవు ధర్మాత్మురాలని మెచ్చుకొని ఆవును నమ్మి ఇంటికి పంపిన ఘట్టంలో పులి గొప్పదనం తెలుస్తుంది. తిరిగివచ్చిన ఆవును తింటే తనకు దోషమనీ, తనకు మాంసం ఎక్కడైనా దొరకుతుందనీ, తనను పుట్టించిన దేవుడే తనకు ఆహారం చూపిస్తాడనీ, పులి చెప్పిన మాటలు – పులి గొప్పదనాన్ని తెలుపుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) సృజనాత్మకంగా రాయండి. .
“ఆవు – పులి” పాత్రల సంభాషణలు రాయండి. నాటకీకరణ చేయండి.
(లేదా)
క్రూర స్వభావం గల పులి, సాధు స్వభావం గల ఆవుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
(ఆవు-పులి)
జవాబు:
పులి : ఆగు ! ఆగు ! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే.

ఆవు : పులిరాజా ! నేను చేసిన అపరాధమేమిటి?

పులి : (ఆవును పట్టుకొని) నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.

ఆవు : అయ్యా ! పులిరాజా ! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి ఏడెనిమిది రోజులు ఉంటాయి. అది గడ్డి కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరికి వస్తా. నన్ను విడిచి పెట్టు.

పులి : అదేం కుదరదు. నీ మాటలు నేను నమ్మను.

ఆవు : వ్యాఘ్ర కులభూషణా ! నా మాట నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటే కాని తృప్తి తీరదు. ఈ రెండు పనుల్లో ఏది ముందు చేయాలో నీకు తెలుసు. నాకు అనుమతి ఇయ్యి. తొందరగా తిరిగి వస్తా.

పులి : (అపహాస్యంగా నవ్వి) ఓ గోవా ! ఇలా మాట్లాడుతున్నావేమిటి? నన్ను మోసపుచ్చి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి , వస్తానంటున్నావు. ఇది సమంజసంగా ఉందా? ఎవరైనా నీ మాటలు నమ్ముతారా?

ఆవు : అయితే శపథం చేస్తా. అబద్దాలాడే వాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ దుర్గతికి పోతారో, నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతా. నన్ను నమ్ము.

పులి : సరే. నేను నమ్మాను. వెళ్ళి త్వరగా రా.

ఆవు : (దూడకు పాలిచ్చి తిరిగి ఆవు పులి దగ్గరకు వచ్చి) పులిరాజా ! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో.

పులి : శభాష్ ! మాట నిలబెట్టుకున్నావు. నీవు ధర్మాత్మురాలవు. పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరకుతుంది. నీవు వెళ్ళిరా.

ఆవు : పులిరాజా ! నా మనస్సు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని నీకు ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో.

పులి : వద్దు వద్దు. నిన్ను నేను తినలేను. నీవు సత్యమూర్తివి. నీ ధర్మం నిన్ను కాపాడింది. వెళ్ళిరా !

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

(లేదా)
“ఆవు – పులి” రెండింటినీ ఒక కుందేలు చూసింది. ఆ కుందేలు వీటిని చూసి గొప్పగా గౌరవభావంతో పొగిడింది. ఆ కుందేలు ఆవును ఏమని పొగిడి ఉంటుంది? అట్లాగే పులిని ఏమని పొగిడి ఉంటుంది? ఊహించి రాయండి.
జవాబు:
కుందేలు ఆవును పొగడడం :
శభాష్ గోవా ! నీ వంటి ధర్మాత్మురాలిని నేను ఎక్కడా చూడలేదు. నీవు ఆడినమాటను నిలబెట్టుకున్నావు. నీ చిన్ని బిడ్డపై నీకు ఎంతో ప్రేమ ఉన్నా, దానిని విడిచిపెట్టి, ఇచ్చిన మాటకోసం పులికి ఆహారం కావడానికి సిద్ధపడ్డావు. సత్యవాక్యపాలనలో నీవు సత్యహరిశ్చంద్రుణ్ణి, బలిచక్రవర్తినీ, కర్ణుడినీ మించిపోయావు. నీవు లేదు మహాత్ముడివి. నిజానికి నీవు ధర్మమూర్తివి. నీ ధర్మమే నిన్ను కాపాడింది. నీ సత్యవాక్యశుద్ధిని, మనుష్యులూ, జంతువులూ, దేవతలూ సహితం మెచ్చుకుంటారు. భేష్.

కుందేలు పులిని మెచ్చుకోవడం :
శభాష్ పులిరాజా ! నీవు నిజంగా వ్యాఘ్రకుల భూషణుడవు. ఆవు పలికిన శపథాలు విని, దానిని నమ్మి, అది తన దూడకు పాలు ఇచ్చి రావడానికి, దానిని విడిచి పెట్టావు. అంతేకాదు అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన గోవును మెచ్చుకొని దాన్ని చంపకుండా విడిచిపెట్టావు. నీవు దయామూర్తివి. కరుణా సముద్రుడివి. దేవతలు సహితం నిన్ను పొగడకుండా ఉండలేరు.

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
ఆవు తన కొడుక్కి మంచి బుద్ధులు చెప్పింది కదా ! అట్లాగే పిల్లలకు తల్లి చెప్పే బుద్ధులు ఏవి? ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులేవో రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోటి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్ధగా రాసుకో
  6. అసత్యం మాట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొ||నవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నా చెల్లెళ్ళవలె ప్రేమగా గౌరవించు – మొ||నవి. “
ఆచరించాల్సినవి ఆచరించాలని అనుకొన్నవి నెల తరువాత
ఆడిన మాట తప్పకపోవడం ఆడిన మాట తప్పకపోవడం లేదు
అబద్ధం ఆడకుండా ఉండడం అబద్దం ఆడకుండా ఉండడం అవును
సమయపాలన పాటించడం భయపడకుండా ఉండడం లేదు
ఎవరైనా మనను సహాయం కోరితే సహాయం చేయడం ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం అవును
భయపడకుండా ఉండడం నిత్యం ఉదయం నడవడం లేదు
ఇంకేమైనా ఆటలలో పాల్గొనడం అవును

IV. ప్రాజెక్టు పని

1. “ఆడినమాట తప్పరాదు!”, “సత్యవాక్కు” …… ఇలాంటి నీతికథలను మరికొన్నింటిని సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు:
“బలిచక్రవర్తి – వామనుడి కథ” శ్రీమహావిష్ణువు వామనుడిగా పుట్టి, బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇస్తానని బలి మాట ఇచ్చాడు. ఇంతలో బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, వామనుడు శ్రీమహా విష్ణువని, బలిని మోసం చేయడానికే వచ్చాడని, దానం ఇయ్యవద్దని అడ్డు పెట్టాడు. ఆడినమాట తప్పని బలి, వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు రెండు అడుగులతో భూమినీ, ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు బలి తలపై పెట్టి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఈ విధంగా బలి ఆడిన మాట తప్పలేదు.
(లేదా)
2. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏఏకవులు/ఏఏరచయితలు రాసినవి? వాటి వివరాలు చార్టు మీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 3 AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 4

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలలో రాయండి.

అ. కడుపార (కడుపునిండుగా) : పసిపిల్లలు కడుపునిండుగా పాలు తాగితే ఏడవకుండా నిద్రపోతారు.
ఆ. సుకృతం (పుణ్యం) : మన గతజన్మ సుకృతమే నేడు మనము అనుభవించేది.
ఇ. బడబాగ్ని (సముద్ర జలములోని అగ్ని) : పేదల హృదయాలలో ఆకలి మంట, బడబాగ్నిలా విజృంభిస్తోంది.
ఈ. అపహాస్యం (ఎగతాళి) : పెద్దల హితవచనాలను ఎన్నడూ అపహాస్యం చేయరాదు.
ఉ. మెత్తని మనసు (మెత్తని గుండె) . : పేదలకు నా మిత్రుడు తన మెత్తని మనస్సుతో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు.
ఊ. ప్రసన్నులైరి (సంతోషించారు) : మహర్షుల తపస్సులకు మెచ్చి దేవతలు ప్రసన్నులయ్యారు.
ఎ. గగనవీధి (ఆకాశవీధి) : హనుమ గగనవీధి గుండా ఎగిరి లంకకు చేరాడు.
ఏ. దుర్గతి (హీనదశ) : నేటి పేదల దుర్గతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

అ) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) పూరి : గడ్డి, తృణం
ఆ) అగ్ని : శుచి, చిచ్చు, అగ్గి, మంట
ఇ) ప్రల్లదము : పరుషవాక్యం, కఠినపు మాట
ఈ) కొడుకు : కుమారుడు, సుతుడు, పుత్రుడు మజుడు
ఉ) సత్యం : నిజం, ఒట్టు
ఊ) సత్వరం : వెంటనే, త్వరితం, చయ్యన, త్వరగా
ఎ) పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
ఏ) ఆవు : గోవు, ధేనువు, మొదవు

ఇ) కింది వాక్యాలలో భావాన్ని బట్టి గీత గీసిన పదాలకు గల వేరువేరు అర్థాలను గుర్తించి రాయండి.

1. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి.
సూర్యరశ్మి సోకగానే సరస్సులో పుండరీకం వికసిస్తుంది.
జవాబు:
పుండరీకం = పులి, పద్మం

2. సీత గుణములు చెవిసోకగానే శివధనస్సుకు రాముడు గుణమును బిగించుటకు ప్రయత్నించాడు.
జవాబు:
గుణము – స్వభావం, అల్లెత్రాడు

3. అందమైన తమ కులములో తమ కులము వృద్ధి చెందాలని కోరుకుంటారు.
జవాబు:
కులము = ఊరు, వంశము, తెగ, ఇల్లు, శరీరం

4. కొందరు పలుకులు మిఠాయి పలుకులుగా ఉంటాయి.
జవాబు:
పలుకు = మాట, ముక్క

5. రమణీరత్నము తన ఉంగరములో రత్నమును ధరించింది.
జవాబు:
రత్నము = శ్రేష్ఠము, మణి

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఈ) ఈ క్రింది పట్టికలోని వాక్యాలకు సంబంధించిన వ్యుత్పత్తిపదాలను రాయండి.
వ్యుత్పత్తిపదాలు : వ్యాఘ్రము, ప్రదక్షిణ, ప్రాణం, ధర్మం, రక్తం

1. శరీరాన్ని నిలిపే వాయువు = ప్రాణం
2. జనులచేత పూనబడునది = ధర్మం
3. పొడలచేత నానావర్ణాలతో శరీరం కలది = వ్యాఘ్రం
4. ఎఱ్ఱని వర్ణము కలది = రక్తం
5. దేవతాదులనుద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం = ప్రదక్షిణ

వ్యాకరణం

అ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.

1. ఉత్త్వసంధి : ఉత్తునకు సంధి నిత్యము
ఉదా :
ఇట్లు + అని = ఇట్లని
నేను + ఇట్లు = నేనిట్లు
నీవు + ఎన్నడు = నీవెన్నెడు

2. జశ్వసంది :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
మత్ + రక్తమాంసములు = మద్రక్తమాంసములు
వాక్ + దత్తము = వాగ్దత్తము

3. గసడదవాదేశ సంధి :
ప్రథమము మీది పరుషములకు గసడదవలగు
ఉదా :
అడుగు + తిరుగక = అడుగుదిరుకగ
అన్యచిత్త + కాక = అన్యచిత్తగాక
సక్తమ్ము + చేసి = సక్తమ్ము సేసి

4. ఇత్వసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
అంటివి + ఇది = అంటివిది, అంటివియిది
వారికి + ఇంచుక = వారికించుక, వారికి యించుక

5. యడాగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీ + ఉదరాగ్ని = నీ యుదరాగ్ని
నా + అది = నాయది
హింస + ఒనర్చి = హింస యొనర్చి

త్రికసంధి

ఆ) ఆ, ఇ, ఏ అను సర్వనామాలను త్రికం అంటారు. క్రింది ఉదాహరణలను గమనించండి.
అప్పులి = ఆ + పులి

1. దీనిలో ‘ఆ’ అనేది ‘త్రికము’లలో ఒకటి. ఇది దీర్ఘాక్షరం.
2. అటువంటి త్రికమైన ‘ఆ’ మీద ఉన్న అసంయుక్త హల్లు అయిన ‘పు’ అనే అక్షరానికి ద్విత్వం వచ్చి ‘ప్పు’ అయింది. అప్పుడు ఆ + ప్పులి అయినది.
3. ద్విత్వమైన ‘ప్పు’ పరమైనందువల్ల అచ్చతెనుగు ‘ఆ’ ఇపుడు ‘అ’ అయినది.. అప్పుడు ‘అప్పులి’ అయినది.

సూత్రములు :
1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
2. త్రికంబుమీది అంసయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు.

కింది మాటలను విడదీసి రాయండి.
1. ఇచ్చోట – ఈ + చోట
2. అక్కడ – ఆ + కడ
3. ఎక్కడ – ఏ + కడ

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠంలోని సమాస పదాల ఆధారంగా కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
1. నా సుతుడు నా యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం
2. ధేనురత్నము రత్నము వంటి ధేనువు రూపక సమాసం
3. ధర్మవిదుడు ధర్మమును తెలిసినవాడు ద్వితీయ తత్పురుష సమాసం
4. గంభీరరవము గంభీరమైన రవము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. నాలుగు చన్నులు నాలుగు సంఖ్యగల చన్నులు ద్విగు సమాసము
6. అసత్యము సత్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
7. తల్లిదండ్రులు తల్లి, తండ్రి ద్వంద్వ సమాసం

ఈ) బహుబ్లిహీ సమాసం

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు – విష్ణువు అని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు (చక్రానికి గాని పాణికి గాని) ప్రాధాన్యం లేకుండా ఆ రెండూ మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్యపద అర్థాన్ని స్ఫురింపజేస్తే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్యపదార్థ ప్రాధాన్యం కలది బహుజొహి సమాసం.

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. ముక్కంటి : మూడు కన్నుల కలవాడు (శివుడు)
2. శోభనాంగి : చక్కని అవయవములు కలది (స్త్రీ)
3. మహాత్ముడు : గొప్ప ఆత్మకలవాడు (మహానుభావుడు)
4. అన్యచిత్త : వేరు ఆలోచన కలది / కలవాడు
5. చతుర్ముఖుడు : నాలుగు ముఖములు కలవాడు (బ్రహ్మ)
6. నీలాంబరి : నల్లని వస్త్రాలు ధరించినది

ఓ) ఛందస్సు

కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

1. ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 1
పద్యం : ఉత్పలమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : భ, ర, న, భ, భ, ర, వ

2. పులికి ప్రదక్షిణించి తలపుం బలుకున్ సదృశంబుగాగన (స్థలిత)
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 2
పద్యం : చంపకమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : న, జ, భ, జ, జ, జ, ర

ఊ) అలంకారాలు

7వ పద్యంలోని అలంకారాన్ని కనుక్కొని పేరు రాసి లక్షణాలతో సరిపోల్చండి.

రూపకాలంకారం : పాషాణ ధేనువు
ఇచట ఉపమేయమైన ధేనువును, ఉపమానమైన పాషాణానికే అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

ఋ) స్వభావోక్తి

“మునుమునుబుట్టె ………………… దయాగుణముల్లసిల్లగన్”
పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా గడ్డిని కూడా తినలేడని – ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇలా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తి అలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.

  1. ఆ తోటలోని చిలుకలు పచ్చని రెక్కలతో, ఎఱ్ఱని ముక్కుతో పండు తినుచున్నది.
  2. ఆమె ముఖము కాటుక కళ్ళతో, చిరునగవు పెదవులతో చూపురులను ఆకర్షిస్తున్నది.

9th Class Telugu 7th Lesson ఆడినమాట కవి పరిచయం

కవిపేరు : అనంతామాత్యుడు (అనంతుడు)
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : శ్రీకాకుళక్షేత్ర సమీపంలోని పెనుమకూరు
రచనలు : భోజరాజీయం – 2092 పద్యాల ప్రబంధ గ్రంథం. ఛందోదర్పణం – ఛందశ్శాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాల గ్రంథం) రసాభరణం – అలంకారశాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాలతో 344 గద్య పద్యాలు కలవు.)
కవితాదృక్పథం : ప్రతికథలోను నైతికత, సత్యం, త్యాగం అను సుగుణాలు ఉంటాయి.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చ. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్లపాటి గలఁడింతియ, పూరియు మేయనేరఁ డేఁ
జని, కడుపారం జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న ! దయాగుణ ముల్లసిల్లఁగన్.
ప్రతిపదార్థం :
నాకున = నాకు
మునుమును = ముందుగా (తొలి సంతానంగా)
ఒక ముద్దుల పట్టి = ఒక ముద్దు బిడ్డ
పుట్టెన్ = పుట్టాడు
అతండు, పుట్టి = ఆ బిడ్డ పుట్టి
ఏడు + ఎనిమిది నాళ్లపాటి
గలడు = ఎనిమిది రోజులయింది
ఇంతియ = ఇంకా
పూరియున్ = గడ్డి కూడా
మేయనేరడు = తినడం చేతకాదు
ఏన్ + చని = నేను వెళ్ళి
కడుపారన్ = బిడ్డకు కడుపునిండా
చనుడిపి = పాలిచ్చి
చయ్యనన్ = వెంటనే
వచ్చెదన్ = తిరిగివస్తాను
దయాగుణము + ఉల్లసిల్లగన్ = దయాగుణం వెల్లడి అయ్యేటట్లు
నన్నున్ = నన్ను
పోయిరమ్ము + అని = వెళ్ళి రమ్మని చెప్పి
సుకృతంబు = పుణ్యము
కట్టికొనవన్న (కట్టికొనుము + అన్న) = కూడగట్టుకోవయ్యా!

భావం :
అయ్యా ! నాకు తొలి సంతానంగా పుట్టిన ముద్దుల బిడ్డ వయస్సు డెనిమిది రోజులు మాత్రమే. వాడికింకా గడ్డి మేయడం కూడా రాదు. వాడికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను. దయతో నేను వెళ్ళిరావడానికి అంగీకరించి పుణ్యం కట్టుకో అని ఆవు పులితో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

2వ పద్యం :
ఉ. గుమ్మెడు పాల నా సుతునకుం బరితృప్తి జనించుఁగాని, మాం
సమ్ము సమస్తముం గొనక చాలదు నీ యుదరాగ్ని కైన, ని
కుమ్ముగ నిందులోఁబ్రథమ కార్య వినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మన వన్న ! వ్యాసకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.
ప్రతిపదార్థం :
నా సుతునకున్ = నా బిడ్డకు
గుమ్మెడు పాలన్
(గుమ్మ + ఎడు = గుమ్మెడు) = ఒక పాలధారతో
పరితృప్తి = సంతృప్తి
జనించున్ = కలుగుతుంది
కాని = కానీ
నీ + ఉదర + అగ్నికిన్ + ఐనన్ = (నీయుదరాగ్నికైనన్) = నీ కడుపు మంటకు అయితే
మాంసమ్ము సమస్తమున్ = నా మాంసాన్ని అంతా
కొనక = తినక
చాలదు = సరిపోదు
నిక్కమ్ముగ = నిజంగా
ఇందులోన్ = ఈ విషయంలో
ప్రథమ కార్య వినిరతి = ముందుగా చేయవలసిన పని
నీవు + ఎరుంగవే = నీకు తెలియదా?
వ్యాఘ్రకుల భూషణ – పులుల వంశంలో శ్రేష్ఠుడా!
పొమ్మనవన్న = (పొమ్మనుము + అన్న) వెళ్ళు అని చెప్పవయ్యా!
చయ్యనన్ = వెంటనే
పోయి వచ్చెదన్ = వెళ్ళి తిరిగివస్తాను.

భావం :
ఓ పులివంశంలో శ్రేష్ఠుడా ! గుమ్మెడు పాలతో నా కుమారునకు తృప్తి కలుగుతుంది. నా మాంసము అంతా తింటే కాని నీ ఆకలి మంట చల్లారదు. అయినా నిజంగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నీకు తెలియదా? నాకు అనుమతి ఇయ్యి. తొందరగా వెళ్ళివస్తాను.

3వ పద్యం :
చ. అనవుడు పుండరీక మపహాస్యముచేసి ‘యిదేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ దున్నెడ కేగి సత్వరం|
బునఁ జనుదెంతు నంటి విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెదువారి కించుక వివేకము పుట్టదె, యింత యేటికిన్.
ప్రతిపదార్థం :
అనవుడు = (ఆవు) అట్లనగా
పుండరీకము = పెద్దపులి
అపహాస్యము చేసి = ఎగతాళి చేసి
గోవ = ఓ ఆవా !
ఇదేమి = ఇది + ఏమి ఇదేమిటి?
ఇట్లు + అనియెదు = ఇలా అంటున్నావు
నన్నున్ = నన్ను
బేల్పఱచి = అమాయకుని చేసి
ఆత్మజుడు = నీ కొడుకు
ఉన్నెడకున్ (ఉన్న+ఎడకున్) = ఉన్న చోటుకు
ఏగి = వెళ్ళి
సత్వరంబునన్ = త్వరగా
చనుదెంతున్ = తిరిగి వస్తాను
అంటివి = అన్నావు
ఇది, పోలునె = ఇది తగినదా? (ఇలా అనడం బాగుందా?)
చెప్పెడువారు = చెప్పేవారు
చెప్పినన్ = చెప్పినా
వినియెడువారికిన్ = వినే వారికి
ఇంచుక = కొంచెము
వివేకము = ఆలోచన (తెలివి)
పుట్టదె (పుట్టదు + ఎ) = పుట్టవద్దా
ఇంత + ఏటికిన్ = ఇదంతా ఎందుకు?

భావం :
ఆవు అట్లా అనగానే పులి అపహాస్యం చేసి, ‘ఓ గోవా ! ఇదేమిటి? ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది బాగుందా? చెప్పేవాడు చెప్పినా వినేవాడికి కొంచెం వివేకం ఉండవద్దా ! ఇదంతా ఎందుకు?’ అన్నది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

4వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాజుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి మొడ్లచే
సుల్ల మెలర్ప మేయఁజనుచున్న వృషంబు నదల్చునాతఁడు
ద్రెళ్ళాడు నట్టిదుర్గతులఁ దెళ్ళుదు నేనిటు రాక తక్కినన్.
ప్రతిపదార్థం :
ప్రల్లదము + ఆడి = కఠినమైన మాట మాట్లాడి
పెద్దలకు = పెద్దవారికి
బాధ + ఒనర్చు + అతండు = బాధ కలిగించేవాడూ
తండ్రికిన్ = తండ్రికిని
తల్లికిన్ = తల్లికి
మాఱు పల్కెడు + అతండును = ఎదురు తిరిగి మాట్లాడేవాడునూ
ఆ కొని వచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల (ఒడ్డుల) = గట్లపై గల
చేను = సస్యము
ఉల్లము + ఎలర్బన్ = మనస్సునకు సంతోషము కలిగేటట్లు
మేయన్ = మేయడానికి
చను చున్న (చనుచున్ + ఉన్న) = వెళుతున్న
వృషంబున్ = ఎద్దును
అదల్చునాతడున్ (అదల్చు + ఆతడున్) = బెదరించేవాడునూ
త్రెళ్ళెడునట్టి = పడేటటువంటి
దుర్గతులన్ = నరకాలలో
నేను = నేను
ఇటురాక = తిరిగి ఇటువైపురాక
తక్కినన్ = మానేస్తే
తెళ్ళుదున్ = పడతాను

భావం :
కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడూ, తండ్రికీ, తల్లికీ ఎదురు మాట్లాడే వాడూ, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును (ఎద్దును) వెళ్ళగొట్టేవాడూ, ఏ నరకాలలో పడతారో, తిరిగి నేను నీ దగ్గరికి రాకపోతే నేను ఆ నరకాలలో పడతాను.

5వ పద్యం :
క. అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము – “నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు, ధేనువ ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ” నినఁ బటుబుద్దిన్,
ప్రతిపదార్థం :
అని = అట్లని
శపథంబులు పలికినన్ = శపథాలు మాట్లాడగా, (ఒట్లు పెట్టగా)
వ్యాఘ్రము = పులి
విని = విని
నీవు = నీవు
ధర్మవిదురాలవు = ధర్మం తెలిసిన దానవు
నీకున్ = నీకు
ఎవ్వరు = ఎవరు
ఎన = సాటి వస్తారు
ధేనువ = ఓ గోవా !
ఏన్ = నేను
నినున్ = నిన్ను
నమ్మితిన్ = నమ్మాను
పోయి రమ్ము =
అనినన్ = అని పులి అనగా
పటు బుద్దిన్ = (ఆవు) మంచి బుద్ధితో

భావం :
అని ఆవు పలికిన శపథాలు విన్న ఓ గోవా ! నీవు ధర్మం తెలిసిన దానవు. నీకెవ్వరూ సాటిరారు. నేను నిన్ను నమ్మాను. నీవు వెళ్ళిరా” అని చెప్పింది. ఆవు అప్పుడు చక్కని బుద్ధితో.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

6వ పద్యం :
చ. పులికిఁ బ్రదక్షిణించి తలఁపుంబలుకున్ సదృశంబు గాఁగ, న
సలిత విలాసయాన మెసంగం బురికేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు బ్రేఁగుపఱుపంగ గభీర రవంబుతోడ వీ
థుల నడయాడు బాలకులు దోరపు భీతిఁ దొలంగి పాఱఁగన్
ప్రతిపదార్థం :
పులికిన్ = పులికి
ప్రదక్షిణించి = ప్రదక్షిణము చేసి
తలపున్ = ఆలోచనయూ
పలుకున్ = మాటయూ
సదృశంబు = సమానము
కాగన్ = కాగా
చతుస్తనంబులున్ = నాలుగు చన్నులునూ
బలసి = పుష్టిపొంది
పొదుంగు = పొదుగు
త్రేగు పఱుపంగన్ = చేపగా
అస్ఖలిత = తొట్రుపాటు లేని
విలాసయానము = విలాసపు నడక
ఎసగన్ = అతిశయింపగా
గంభీరవంబుతోడన్ = గంభీరమైన ధ్వనితో
వీథులన్ = వీధులలో
నడయాడు = సంచరించే
బాలకులు = పిల్లలు
తోరపు భీతిన్ (తోరము + భీతిన్) = పెద్ద భయంతో
తొలంగి = ప్రక్కకు తప్పుకొని
పాఱగన్ = పరుగెత్తగా
పురికేగెన్ (పురికిన్ + ఏగెన్) = తన నివాస స్థలానికి వెళ్ళింది

భావం :
ఆవు, పులికి ప్రదక్షిణము చేసింది. తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలూ, మాటలూ ఏకమయ్యాయి. స్తనములు లావెక్కి పొదుగు చేపుకు వచ్చింది. ఆవు గంభీర ధ్వని చేసింది. వీధులలో తిరిగే పిల్లలు పెద్ద భయంతో ప్రక్కకు తప్పుకొని పారిపోతుండగా ఆవు విలాసంగా నడుస్తూ, తన నివాసానికి వెళ్ళింది.
పురాతన

7వ పద్యం :
చ. కొడుకు చనుగ్రోలుచున్నంత దదవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ సోఁకినఁ గదలకుండా
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.
ప్రతిపదార్థం :
కొడుకు = తన దూడ
చనుగ్రోలు చున్న = పాలు త్రాగుచున్న
అంతతడవు = అంత సేపూ
తల్లి = తల్లియైన ఆ ఆవు
అడుగు + తిరుగక = (తన) కాలు మరలింపక
కదలక = కదలకుండా
అన్యచిత్త + కాక = వేరు ఆలోచన లేక
పైన్ = తనపైన
ఈగ సోకినన్ = ఈగ వాలినా
పాషాణ ధేనువున్ = రాతి ఆవును
నిలిపినట్లు = నిలబెట్టినట్లు
నెమ్మి = దూడపై ప్రేమతో
కదలకుండె (కదలక + ఉండె) = కదలకుండా నిలబడింది.

భావం :
కొడుకు పాలు తాగుతున్నంత సేపూ ఒక్క అడుగు కూడా కదల్చకుండా, తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, తన మీద ఈగ వాలినా కూడా కదలకుండా, ప్రేమతో రాతి ప్రతిమలా ఆవు నిలిచి ఉంది.

8వ వచనం:
వ. అయ్యవసరంబున
(ఆ + అవసరంబున) = ఆసమయంలో
తా॥ ఆ సమయంలో

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

9వ పద్యం :
క. ‘నిన్నుఁ గని యిన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున. నిఁక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు ,
మన్న ! మమత్వంబు విడువు మన్న, మనమునన్’
ప్రతిపదార్థం :
నిన్నున్ + కని = నిన్ను నా పుత్రునిగా కని;
ఋణవశమునన్ = ఋణానుబంధం వల్ల
ఇన్ని దినములు = ఇన్ని రోజులూ
చన్నిచ్చితి (చన్ను + ఇచ్చితి) = పాలు ఇచ్చాను
అన్న = నాయనా
ఇఁకన్ = ఇంకముందు
నీవు = నీవు
ఎన్నడున్ = ఎప్పుడూ
నన్నున్ = నన్ను గూర్చి
తలంపకుము = ఆలోచించకు
అన్న = నాయనా
మనమునన్ = మనస్సులో
మమత్వంబు మమకారము (నా తల్లియనే అభిమానము)
విడువుము = విడిచిపెట్టు.

భావం :
నిన్ను కన్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న ఋణానుబంధం చేత ఇన్ని రోజులూ నీకు పాలు ఇచ్చాను. ఇంక నీవు నన్ను ఎప్పుడూ తలంపవద్దు. నీ మనస్సులో ఇంక అమ్మ అనే భావాన్ని రానీయకు.

10వ పద్యం :
క. ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గాడిన నెదు రుత్తరమీల
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.
ప్రతిపదార్థం :
అసత్య భాషలు = అబద్దపు మాటలు
ఆడకుము = మాట్లడకుము
కొఱగాని వానిన్ = పనికి మాలినవాడిని
కూడకు = చేరకు (పొందుచేయకు)
ఒరులు = ఇతరులు
ఎగ్గాడినన్ (ఎగు. + ఆడినన్) = నిందించినా
కొంకక = జంకక
ఎదురు + ఉత్తరము = ఎదురు జవాబు (తిరిగి సమాధానము)
ఈఁజూడకు (ఈన్ + చూడకు) = ఇయ్యాలని చూడవద్దు
విని = అవతలి వారి మాటలు విని కూడా
విననివాని చొప్పునన్ = విననట్టి వాడివలె
చనుమీ = వెళ్ళు

భావం :
అసత్యపు మాటలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలసి ఉండకు. ఇతరులు ఎవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే, తిరిగి ఎదురు జవాబు చెప్పకు. విని కూడా వినని వాడివలె అక్కడి నుండి వెళ్ళిపో.

11వ పద్యం :
కం. చులుకన జలరుహతంతువు
చులుకన తృణకణము దూది చుల్కనసుమ్మీ !
యిలనెగయు ధూళిచులను
చులకనమరి తల్లిలేని సుతుడు కుమారా!
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా ! (గోవత్సమా !)
ఇలనే = ఈ భూమిపై
జలరుహతంతువు = తామరతూడు
చులకన = లోకువ
తృణకణము = గడ్డిపరక
చులకన = లోకువ
దూది = ప్రత్తి
చుల్కన = తేలిక
ఎగయు = ఎగురుతున్న
ధూళి = దుమ్ముకూడా
చులకన = తేలిక
మఱి = అదేవిధంగా
తల్లిలేని = తల్లి లేని అనాధ ఐన
సుతుడు = కుమారుడు కూడా
చులకన సుమ్మీ = లోకువగా చూడబడతాడు కదా!

భావం :
ఈ లోకంలో తామరతూడు, గడ్డి పరక, ప్రత్తి, దుమ్ములను తేలికభావంతో చూస్తారు కదా ! అలాగే తల్లి లేని పిల్లలను కూడా అందరూ లోకువగా చూస్తారు. అని ఆవు తన కుమారునికి చెప్పింది.

12వ వచనం :
వ. అని గడుపాఱఁ బాలు కుడిచి తనిసిన కొడుకునకుం గడచిన
వృత్తాంతం బంతయు నెఱింగించి, పెద్దగా నేడ్చు కొడుకు నెట్టకేల
కోదార్చి, తగ బుద్ధి చెప్పి యా మొదవు పులియున్న వనంబునకు
మగిడి వచ్చిన …..
ప్రతిపదారం :
అని = అని ఆవు దూడకు చెప్పి
మును = ముందు
పుట్టగన్ + చేసిన + అట్టి = పుట్టించినట్టి
దైవము = భగవంతుడు
ఈ పట్టునన్ = ఈ సమయములో
పూరిన్ = గడ్డిని
మేపెడినే = (నాచే) తినిపిస్తాడా?
ప్రాణములు = నా ప్రాణాలు
ఇంతనె = నీ మాంసము మాత్రము చేత
పోవుచున్నవే = పోతాయా?

భావం :
అని ఆవు బుద్దులు చెప్పి, తనివి తీరా పాలు త్రాగిన కొడుకును చూసి జరిగిన సంగతి అంతా చెప్పింది. అది విని గట్టిగా ఏడుస్తున్న కొడుకును ఎట్లో ఓదార్చి, తగిన బుద్ధులు చెప్పి, ఆవు తిరిగి ఆ పులి ఉన్న అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

13వ పద్యం : కంఠసపద్యం
*ఉ. ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టికొనంగఁజాల, మటి కల్గవె మాంసము లొండుచోట, నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టి దైవ మీ
పట్టునఁ బూరి మేపెడినే ! ప్రాణములింతనె పోవుచున్నవే !
ప్రతిపదార్థం :
ఇట్టి మహానుభావులకున్ = ఇంత గొప్ప ఔదార్య బుద్దిగల నీ వంటి వారికి
హింస + ఒనర్చి = హింసించి (చంపి)
దురంత దోషముల్ = అంతులేని పాపములను
కట్టికొనంగన్ + చాలన్ = మూట కట్టుకోలేను
ఒండు చోటన్ = మరోచోట
మాంసములు = మాంసములు
కల్గవె = లభింపవా!
ఈ పుట్టువునందు = ఈ జన్మమునందు
నన్నున్ = నన్ను
కడుపాఱన్ = కడుపు నిండా
పాలుకుడిచి = పాలు త్రాగి
తనిసిన = తృప్తి పడిన
కొడుకునకున్ = తన పుత్రునకు
కడచిన వృత్తాంతంబు + అంతయున్ = జరిగిన సంగతినంతా
ఎఱింగించి = తెలిపి
పెద్దగాన్ + ఏడ్చు, కొడుకున్ = పెద్దగా ఏడుస్తున్న పుత్రుని
ఎట్టకేలకున్ + ఓదార్చి = చిట్టచివరకు ఓదార్చి
తగన్ = తగు విధంగా
బుద్ధి చెప్పి = బుద్ధులు చెప్పి
ఆ మొదవు = ఆ ఆవు
పులి = పులి
ఉన్న వనంబునకున్ = ఉన్న అడవికి
మగిడి = తిరిగి
వచ్చినన్ = రాగా

భావం :
ఇటువంటి మహాత్ములను హింసించి అంతులేని పాపాల్ని మూటకట్టుకోలేను. మాంసాలు నాకు మరొక చోట దొరకవా ! ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం, నాచే గడ్డి తినిపిస్తాడా? ఇంత మాత్రానికే నా ప్రాణాలు పోతాయా?” అని పులి ఆవుతో అన్నది.

14వ పద్యం : కంఠస్థ పద్యం
మ. అని యా ధేనువుఁ జూచి-నీ విమల సత్య ప్రొధికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదు తలగాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర, నీ సఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్త ప్రీతిమై నొందఁగన్
ప్రతిపదార్థం :
అని = పులి ఆ విధంగా ఆవుతో అని
ఆ ధేనువున్ = ఆ ఆవును
చూచి = చూచి
నీ = నీ యొక్క
విమల = నిర్మలమైన
సత్యప్రౌఢికిన్ = సత్యము యొక్క గొప్పతనానికి
మెచ్చు = ప్రీతి (సంతోషము)
వచ్చెన్ = కల్గింది
నినున్ = నిన్ను
చంపగన్ + చాలన్ = చంపజాలను
ఈ ప్రొద్దు = ఈ వేళ
ధర్మము = నీ ధర్మగుణము
నీదు = నీయొక్క
తల + కాచెన్ = తలను రక్షించింది
నీ సఖులు = నీ తోడి గోవులు
సమ్మోదంబునున్ + పొందన్ = మిక్కిలి సంతోషాన్ని పొందేటట్లు
నీ తనయుండు = నీ కుమారుడు
అత్యనురాగమున్ = మిక్కిలి ప్రేమను
పొరయన్ = అనుభవించేటట్లు
చిత్తప్రీతి = (నీ) మనస్సులో సంతోషము
మైనొందగన్ = కలిగేటట్లుగా
నిజావాసము (నిజ + ఆవాసము) = నీ యొక్క నివాస స్థానమును
చేరన్ + పొమ్ము = చేరడానికి వెళ్ళు. (సమీపించుము)

భావం :
పులి ఆవుతో అట్లు చెప్పి, ఆ ఆవును చూచి “నీవు మాట నిలబెట్టినందుకు నాకు సంతోషము కలిగింది. నిన్ను నేను చంపలేను. నీ ధర్మము ఈ రోజు నిన్ను రక్షించింది. నీ తోడివారు సంతోషించేటట్లు, నీ కొడుకు నీ ప్రేమను పొందేటట్లు, నీ మనస్సుకు ప్రీతి కలిగేటట్లు, నీ ఇంటికి నీవు వెళ్ళు” అని చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

15వ వచనం :
వ. అనిన నప్పులికి న మ్మొద విట్లనియె
ప్రతిపదార్థం :
అనినన్ = పులి అట్లనగా
అప్పులికిన్ = (ఆ + పులికిన్) ఆ పులితో
అమ్మొదవ = (ఆ + మొదవు) ఆ ఆవు
ఇట్లనియె = (ఇట్లు + అనియె) ఇలా అంది

భావం :
పులి చెప్పిన మాటలు విని, ఆవు పులితో ఇలా చెప్పింది.

16వ పద్యం :
క. ‘మెత్తని మనసే నాయది
యెత్తి యిటులు చూడనేల ? యో పుణ్యుడ ! నే’
నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె ! కథ లేమిటికిన్.
ప్రతిపదార్థం :
ఓ పుణ్యుడా = ఓ పుణ్యాత్ముడా ! (ఓ పులి రాజా !)
కథలు + ఏమిటికిన్ = ఈ కథలు అన్నీ ఇప్పుడు ఎందుకు?
నా + అది = నాయది; (కాపాడింది)
మెత్తని మనసు + ఏ = అసలే మెత్తని మనస్సు
ఒత్తి = గట్టిగా నొక్కి
ఇటులు = ఈ విధంగా
చూడన్ + ఏల = పరీక్షించి చూడడం ఎందుకు?
నేను = నేను
ఇతనువు (ఈ + తనువు) = ఈ శరీరం
నీకున్ = నీకు
మును = ముందుగానే
వాగ్దత్తము (వాక్ + దత్తము) = మాటతో ఇచ్చినది
కాదె = కాదా?

భావం :
ఓ పుణ్యాత్ముడా ! “ఈ కథలన్నీ ఎందుకు? నా మనసు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోవద్దు. నేను నా శరీరాన్ని ఇస్తానని నీకు ముందే వాగ్దానం చేశాను కదా”.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

17వ వచనం :
వ. కావున పగలించి యుపవాసభారం బంతయుఁ
బోవునట్లు మద్రక్తమాంసములతో సక్తమ్ము సేసి
నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.
ప్రతిపదార్థం :
కావున = కాబట్టి
పగలించి = చీల్చి
ఉపవాస భారంబు = నీ ఉపవాస భారాన్ని; (తిండి లేకుండా ఉన్న నీ కష్టమును)
అంతయున్ = అంతా
పోవునట్లు = పోయేటట్లు
మద్రక్త మాంసమ్ములతోన్ మత్ = నా యొక్క
రక్తమాంసములతోన్ = రక్తంతో, మాంసంతో
సక్తమ్ము + చేసి = ఆరగించి
నాకున్ = నాకు
పుణ్యమ్ము = పుణ్యమును
ప్రసాదింపుము = అనుగ్రహింపుము

భావం :
“కాబట్టి నన్ను చీల్చి, నీ ఉపవాస భారము అంతా పోయేటట్లు, నా రక్తమాంసాలు ఆరగించి, నాకు పుణ్యం ప్రసాదించు.

18వ పద్యం :
క. అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవు గాని విజువదు దానిన్.
ప్రతిపదార్థం :
అని = అట్లని
కపిల = ఆ కపిల ధేనువు
గంగడోలు = తన మెడ కింద ఉండే తోలు
బిగియగన్ = బిగించి
తనమెడ = తన మెడ
ఎత్తుకొని = పైకి ఎత్తి
దగ్గఱన్ = (పులికి) దగ్గరగా
చనుదెంచినన్ = రాగా
చూచి = ఆవును చూచి
పుండరీకము = పులి
వెనువెనుక = వెనుకకు వెనుకకే
పోవున్ + కాని – పోతోంది కానీ
దానిన్ = ఆవును
విఱువదు = (పైనబడి) చీల్చదు.

భావం :
అని చెప్పి ఆవు తన గంగడోలు బిగించి, తన మెడ ఎత్తి, పులి దగ్గరకు వెళ్ళగా, ఆ పులి వెనుక వెనుకకే వెడుతోంది. కానీ ఆవును చంపడానికి ముందుకు రాలేదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

19వ పద్యం :
సీ. ‘కుడువంగ ర’ మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
నాఁకలి గా దొల్ల ననుచుఁ బెనఁగు
నతఁడును బోలె నాతతశోభనాంగియై
తనరు నా ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపటుప, సద్యోజ్ఞాన
శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొక కొంత
దడవు ముహుర్భాషితంబు లిట్లు
ఆ. జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ,
బులి కృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.
ప్రతిపదార్థం :
కుడువంగన్ = తినడానికి
రమ్మని = రమ్మని
తొడరి = పూనుకొని
చుట్టమున్ = బంధువును
పిల్వన్ = పిలువగా
ఆకలి + కాదు = ఆకలిగా లేదు
ఒల్లన్ + అనుచున్ = ఇష్టము లేదని (వద్దని)
పెనుగు+అతడును+పోలెన్ = పెంకితనము చేసే వాడిలా (మొరాయించే వాడిలా)
ఆతత శోభ నాంగియై ఆతత = విస్తృతమైన (అధికమైన)
శోభన+అంగి+ఐ = చక్కని అవయవములు గలదై
తనరు = ఒప్పునట్టి
ఆ ధేనురత్నంబు = ఆ రత్నము వంటి ఆవు
తన్నున్ = తనను
భక్షింపుము + అని = తినుమని
పట్టు పఱుపన్ = పులిని లొంగ దీయు చుండగా (బ్రతిమాలుచుండగా)
సద్యోజ్ఞానశాలియై = అప్పుడే కలిగిన జ్ఞానముతో కూడినదై
పరగు = ఒప్పునట్టి
శార్దూల విభుడు = పులిరాజు
తాను = తాను
ఒల్లను + అని = అంగీకరించనని (తిననని)
పల్కన్ = చెప్పగా
తమలోనన్ = ఆ పులికీ, ఆవుకూ మధ్య
ఒక కొంత తడవు = ఒక కొంచెం సేపు
ముహుః + భాషితంబులు = మాటి మాటికీ అవసరం లేక పోయినా మాట్లాడే మాటలు
ఇట్లు = ఈ విధంగా
జరుగుచుండన్ = సాగుచుండగా
గోవు సత్యవాక్శుద్ధికిన్ = ఆవు యొక్క సత్య వాక్యము యొక్క పవిత్రతకూ
పులి = పులి యొక్క
కృపా సమగ్ర బుద్ధికిని; కృపా = దయతో
సమగ్ర = నిండిన
బుద్ధికిని = బుద్ధికీ
సురలు = దేవతలు
ప్రసన్నులు + ఐరి = సంతుష్టులైరి
గగన వీధిన్ = ఆకాశ వీధిలో
ఎల్లయెడలన్ = అన్ని చోట్ల
సాధువాదములు = భళీ బాగు, సాధు అనే మాటలు
ఉల్లసిల్లెన్ = కలిగాయి. (పుట్టాయి, వినిపించాయి)

భావం :
తినడానికి రమ్మని బంధువును పిలిస్తే ఆకలిగా లేదు వద్దని పేచీ పెట్టే వాడిలా, చక్కని అవయవములతో ఒప్పిన ఆ శ్రేష్ఠమైన ఆవు తనను తినమని పులిని బ్రతిమాలంగా, జ్ఞానము కల్గిన ఆ పులిరాజు తాను తిననని చెప్పాడు. ఇలా వారు మాటిమాటికీ మాట్లాడుతున్నారు. అప్పుడు దేవతలు గోవు యొక్క సత్యవాక్య పవిత్రతకూ, పులి యొక్క దయతో నిండిన బుద్ధికీ సంతోషించారు. ఆకాశ వీధిలో అన్ని దిక్కులలో భళీ, బాగు అనే మాటలు వినిపించాయి.

కఠిన పదాలకు అర్థాలు

గుమ్మ = పాలు పితికేటప్పుడు వచ్చేధార
సుతుడు = కుమారుడు
పరితృప్తి = సంతోషం
ఉదరాగ్ని = కడుపులో మంట, ఆకలిమంట
వినిర్గతం = బయలు వెడలినది
వ్యాఘ్రము = పెద్దపులి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం వంటి వాడు, గొప్పవాడు
ఆత్మజుడు = కొడుకు
సత్వరం = వెంటనే
పాషాణము = రాయి
అసత్యభాషలు = అబద్దాలు
శార్దూలము = పెద్దపులి

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రబోధం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 6th Lesson ప్రబోధం

9th Class Telugu 6th Lesson ప్రబోధం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

గాంధీజీ ఒక సభలో ఇలా సందేశమిచ్చారు. ‘స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీమీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికున్న నైతికబలం సామాన్యమైంది కాదు. ఈ ‘అంతశ్శక్తి’ పై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆమెను ఓడించలేదు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
‘స్వరాజ్య సాధన’ ఎందుకు అవసరం?
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యాభివృద్ధిని సాధించడం కోసం ‘స్వరాజ్య సాధన’ అవసరం.

ప్రశ్న 2.
సామాన్యుల మిథ్యావాదం ఏమిటి?
జవాబు:
స్త్రీలు పిరికివారు, బలహీనులు అనేది సామాన్యుల మిథ్యావాదం.

ప్రశ్న 3.
స్త్రీలలో ఉన్న “అంతశ్శక్తి” ఏది?
జవాబు:
వారి నైతికతే వారి “అంతశ్శక్త.”

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 4.
స్త్రీల గురించి గాంధీజీ కి ఉన్న అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. వారి పనుల్లో వారు నిష్ణాతులు కావాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
‘స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధకములు’ దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
చిన్న వయస్సులోనే వివాహం చేయటం వల్ల స్త్రీల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్ళైన పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు. పెళ్ళి కుదిరిన తరువాత ఆడపిల్లలు చదువుకు స్వస్తి పలికేవారు.

ప్రశ్న 2.
“స్వశక్తిచేత” ఏ పనులనైనా సాధించవచ్చు? నిజమా ? కాదా ? వివరించండి.
జవాబు:
స్వశక్తితో ఏ పనులనైనా సాధించవచ్చు. ఇది నిజమే ఇతరులపై ఆధారపడితే వారికి అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని చేసుకోగలం.

ఆ) పాఠం ఆధారంగా కింది వాటికి సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లేఖ’ ను ఎవరు రాశారు? ఎవరికి రాశారు?
జవాబు:
లేఖను ‘శారద’ అనే పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు. కల్పలత అనే ఆమెకు రాస్తున్నట్లుగా ‘గృహలక్ష్మి’ పత్రికకు రాశారు.

ప్రశ్న 2.
సభలో ఉపన్యసించిన వారెవరు? సభకు అధ్యక్షురాలు ఎవరు?
జవాబు:
సభలో ఉపన్యసించినది శ్రీమతి సరోజినీ దేవిగారు. సభకు అధ్యక్షురాలుగా నెమలి పట్టాభి రామారావు పంతులుగారి కుమార్తె శ్రీమతి పద్మావతిదేవి గారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 3.
ఢిల్లీ మహిళాసభవారు చేసిన తీర్మానాలు ఏవి?
జవాబు:
ఢిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్ని బాలబాలికలకు విధిగా విద్య నేర్పించాలి. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యము సాధించుట. అతి బాల్య వివాహము అనర్థకమని ప్రచారం చేయుట.

ప్రశ్న 4.
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల కలిగిన ఫలితాలేవి?
జవాబు:
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నుకొనబడింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. సమర్థురాలుగా పేరుపొందింది. ఇంకా చాలా స్థానిక సభల్లో, విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యులుగా నియమించబడుతున్నారు.

ప్రశ్న 5.
తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చునని సరోజినీదేవి చెప్పిన అంశాలేవి?
జవాబు:
భూతదయ కలిగిఉండటం. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం. జాతిమత భేదాలు పాటించక విశ్వ మానవులందరిని సోదరులుగా భావించడం, అకల్మషమైన హృదయాన్ని కలిగి ఉండటం. వీటి వల్ల మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరించబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జులై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్ 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మ సైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’కు నామినీగా స్వీకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

అ) మలాలా జన్మించిన ప్రాంతంలోని పరిస్థితులు ఏమిటి?
జవాబు:
చిన్నప్పటి నుండి చదువంటే ఆసక్తిగల మలాలాకు తన ప్రాంతంలో బాలికల చదువుకు వ్యతిరేక పరిస్థితులున్నాయి.

ఆ) తాలిబాన్ ఛాందసవాదులు దేన్ని నిషేధించారు?
జవాబు:
తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు.

ఇ) మలాలా బాలికలను ఏ విధంగా ప్రోత్సహించింది?
జవాబు:
మలాలా తాలిబాన్లకు ఏమాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచింది. వారు కూడా పాఠశాలలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

ఈ) మలాలా ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
జవాబు:
తాలిబాన్లు మలాలాపై 9-అక్టోబర్-2012న కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది.

ఉ) ఐక్యరాజ్య సమితి మలాలాను ఏ విధంగా గౌరవించింది?
జవాబు:
మాలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా తీసుకొంది. నవంబర్ 10వ తేదీన ‘మలాలా రోజు’గా ప్రకటించి ఆమెను గౌరవించింది.

ఈ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాన్ని బట్టి భావం రాయండి.

అ) నియోజిత, నియోజక స్వాతంత్ర్యం మన స్త్రీలకు శీఘ్రంగా లభించినది.
జవాబు:
భారతీయ స్త్రీలు తమకు తాము స్వతంత్రంగా ఎన్నికలలో పాల్గొనే హక్కును, తమకు నచ్చిన వారిని ఎన్నికలలో ఎన్నుకొనే హక్కును పొందారు. పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు ఈ హక్కులను పొందడానికి ప్రత్యేకంగా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. వారితో పోలిస్తే భారతీయ స్త్రీలు వీటిని చాలా త్వరగా పొందినట్లే అని సరోజినీదేవి చెప్పారు.

ఆ) మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును.
జవాబు:
మనం కాశీ – రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయాలనుకుంటాం కాని భూతదయను కలిగిఉండటం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం, జాతి, మత భేదాలు లేకుండా అందరిని సోదరులలాగా చూడడం, అమలిన హృదయంతో ఉండటం వీటి ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు.

ఇ) చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు.
జవాబు:
నిజానికి జీవితమే తీర్థయాత్ర అన్నింటికి మనస్సే మూలం. మనసు సంస్కరించబడకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది వాటికి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తెలపండి.
జవాబు:
సాధారణంగా తల్లి తన బిడ్డకు ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలనైనా పణంగా పెట్టి బిడ్డను కాపాడుకోవడానికి సాహసిస్తుంది. అలాంటే ప్రేమను ఇరుగు పొరుగు వారిపై కూడా చూపాలి. ఇంకా, సర్వమతాల వారిపై చూపాలి. సర్వమానవుల్ని సొంతవారిగా భావించగలగాలి. అన్ని ప్రాణుల్ని సొంతబిడ్డలా ప్రేమించగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
మనిషికి నిజమైన సౌందర్యం ఏమిటి?
జవాబు:
మనిషి విలువైన ఆభరణాలు ధరిస్తే సౌందర్యం పెరుగుతుందని మనం భావిస్తాం. అది నిజం కాదు. నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండటం, కరుణతో ప్రవర్తించడం నిజమైన సౌందర్యం. అందరితో ప్రేమను పంచుకోవడమే సౌందర్యం. కాబట్టి సుగుణాలు కలిగి ఉండటమే సౌందర్యం. విలువైన ఆభరణాలు ధరించడం సౌందర్య హేతువు కాదని గ్రహించాలి.

ప్రశ్న 3.
‘స్త్రీ శక్తి స్వరూపం’ ఈ మాటను సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంతశక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచి పెట్టడం ద్వారా సాహస కార్యాల్ని చేయవచ్చు. వేదకాలం నాటి స్త్రీలు యజ్ఞయాగాల్ని నిర్వహించినట్టు, శాస్త్ర చర్చలలో పురుషులతో పోటీ పడినట్టు మన చరిత్ర చెపుతుంది. సంపదలను సాధించడంలో కూడా స్త్రీలు నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మహారాణి రుద్రమ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి సాహసం నేటికీ మరుపురానివే, స్త్రీలు తమ పని శక్తిస్వరూపాన్ని గుర్తించి, వెలికితీయడం ద్వారా ఉన్నత స్థితిని త్వరగా పొందవచ్చు.

ప్రశ్న 4.
ప్రతిబంధకాలు అంటే ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి?
జవాబు:
అభివృద్ధికి అడ్డంకి కలిగించే వాటిని ప్రతి బంధకాలు అంటారు. ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కలుగుతాయి. వాటిని అధిగమిస్తేనే కోరుకున్నదాన్ని సాధించగలం. అడ్డంకులు ఏర్పడగానే కంగారు పడిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించుకొని సమస్యను అధిగమించాలి. ఉద్రేకానికి లోను కాకూడదు. అవసరమైతే పెద్దవారి సలహాలను, స్నేహితుల సహకారాన్ని తీసుకోవాలి. తెలివిగా సమస్యలను సాధించుకోవడం నేర్చుకోవాలి.

ప్రశ్న 5.
‘సరస్వతీ ప్రసన్నత’ అంటే ఏమిటి? అది ఎప్పుడు లభిస్తుంది?
జవాబు:
‘సరస్వతీ ప్రసన్నత’ – అంటే ఉన్నత విద్యలను అభ్యసించగలగడం. ప్రాథమిక విద్యలను అభ్యసించకుండా, ఉన్నత విద్యలను అభ్యసించడం కుదరదు కాబట్టి ప్రాథమిక విద్యలను ముందు అభ్యసించి, అంతటితో ఆగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉన్నత విద్యలను అభ్యసించాలి. కష్టాలను ఎదిరించి ఇష్టతతో చదివేవారికి తప్పక సరస్వతీ ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల సులువుగా ఉన్నత విద్యలను అభ్యసించగలుగుతాము.

ప్రశ్న 6.
బాలబాలికలకు విధిగా విద్య నేర్పాలని సరోజినీదేవి ఎందుకన్నది?
జవాబు:
దేశ భవిష్యత్తు బాలల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ఏర్పడింది. బాలలందరూ విద్యావంతులైనప్పుడే సమాజం విద్యావంతమవుతుంది. విద్యావంతమైన సమాజం వల్లే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం సర్వతోముఖాభివృద్ధిని త్వరగా సాధించాలంటే పౌరులందరూ ఉన్నత విద్యావంతులు కావాలి. కాబట్టే బాలబాలికలందరూ విధిగా విద్యనేర్చుకోవాలని సరోజినీదేవి కోరింది.

ఆ) కింది వాటికి పదిహేనేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సరోజినీదేవి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
స్త్రీ సమాజాభివృద్ధికై సరోజినీదేవి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలేవి?
(లేదా)
సరోజినీదేవి స్త్రీలనుద్దేశించి చెప్పిన సందేశపు సారాంశాన్ని మీ మాటల్లో రాయండి.
(లేదా)
బాలబాలికలకు విధిగా విద్య నేర్వవలెను. అతిబాల్య వివాహాలు అనర్థదాయకాలు – అని సరోజనీ దేవిగారు స్త్రీ సామాజికాంశాలపై ఏ విధంగా స్పందించారో వివరించండి. ఆ
జవాబు:
శ్రీమతి సరోజినీదేవి గారి ఉపస్యౌసం మదనపల్లి యందు హిందూ సమాజం వారి యాజమాన్యంలో నిర్వహించబడింది. శ్రీమతి పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించిరి. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశం ఇట్లున్నది.

ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల్ని చర్చించారు. బాలలందరకూ తప్పక విద్య నేర్పించాలని అన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. చిన్నవయస్సులోనే వివాహాలు చేయకూడదన్నారు. ఇతర దేశాల్లో స్త్రీలు ఎక్కువ కష్టం సాధించిన ఎన్నిక హక్కులు మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారు. మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిఫ్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నిక అయింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రి పదవిని పొందింది. ఇంకా చాలామంది మహిళలు స్థానిక సభల్లోను, విద్యాసంఘాల్లోను సభ్యులయ్యారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మన దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలి.

స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాల్ని చేయవచ్చు. కాని అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయింది. చాలామంది కాశీ రామేశ్వరాది పుణ్య యాత్రల్ని చేయాలనుకుంటారు. కాని సకల ప్రాణుల్ని ప్రేమించడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం, జాతి మత భేదాలు పాటించక విశ్వమానవులందరినీ సోదరులుగా భావించడం ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరింపబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు. తోటివారిని అంటరాని వారిగా చూడడం తప్పు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు. నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
‘స్త్రీ విద్య’ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
విద్యావంతురాలైన గృహిణి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గృహకార్యాలనే కాక బయటకు వెళ్ళి చేసుకోవలసిన పనులను కూడా చక్కగా నిర్వహించుకోగలదు. తన పిల్లలను చదివించడంలోను, వారికి వచ్చే సందేహాలను తీర్చడంలోనూ, విద్యావంతురాలే సమర్థురాలు. మూఢనమ్మకాలకు, మోసపు మాటలకు లొంగిపోకుండా వైజ్ఞానికంగా ఆలోచించగలగాలంటే గృహిణులు తప్పక విద్యావంతులు కావాలి ఒక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటిని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. కొబట్టే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అనే సామెత ఏర్పడింది. పిల్లలచే ఉన్నత విద్యలను అభ్యసింపజేయడంలో చదువుకున్న ఇల్లాలే చక్కని నిర్ణయాలు తీసుకోగలదు.

ఆడపిల్లల చదువు వల్ల చాలా అనర్థాలు దూరమవుతాయి. సమాజం విద్యావంతమవుతుంది. ఉత్తమ సమాజం వల్ల ఉత్తమ దేశం ఏర్పడుతుంది. మూఢవిశ్వాసాలు నశిస్తాయి. వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
స్త్రీల చైతన్యానికి మహిళా సంఘాలు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు:
బాలికలు పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి మహిళా సంఘాలు పరిశ్రమించాయి. వయోజనులు, గృహిణులైన స్త్రీల కోసం వయోజన విద్యా సంఘాలను ఏర్పాటుచేశాయి. సమాజంలో స్త్రీల అణచివేతను అనేక ఉద్యమాలతో ఎదుర్కొన్నాయి చదువుకొనే ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మహిళా సంఘాలు కృషిచేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల మహిళా సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు లభించాయి. ఉన్నత కుటుంబాలలోని .ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చి చదువుకోగలుగుతున్నారు. పరదాలమాటున, ఘోషాల చాటున మగ్గిన మహిళలు నేడు స్వేచ్ఛగా బయటికి వచ్చి తమ పనులు నిర్వహించుకోగలుగుతున్నారంటే వీటి వెనుక మహిళా సంఘాల కృషి ఎంతో ఉంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వరకట్న సమస్యలను, యాసిడ్ దాడులను దూరం చేయడంలో మహిళా సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకురావడంలో మహిళా సంఘాలు విజయాన్ని సాధించాయి. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘నిర్భయ్’ వంటి రక్షణను పొందడం (ఇందులో కొన్ని).

ఇ) కింద ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తూ పది వాక్యాలు రాయండి.

అక్షరాస్యత – 2011 సం|| జాతీయస్థాయి రాష్ట్రస్థాయి
పురుషుల అక్షరాస్యత 82.14% 75.56%
స్త్రీల అక్షరాస్యత 70.04% 59.74%
మొత్తం 65.46% 67.61%

జవాబు:

  1. భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకొకసారి జనాభాను లెక్కిస్తారు.
  2. ఈ మధ్యకాలంలో స్త్రీ – పురుష, చిన్న – పెద్ద తేడాలతో మాత్రమేగాక వివిధ కులాల, వర్గాల ప్రాతిపదికగా జనాభాను లెక్కించారు.
  3. 2001 వ సంవత్సరంలో జనాభాను లెక్కించాక తిరిగి పదేళ్ళ తర్వాత 2011వ సంవత్సరంలో జనాభా లెక్కలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
  4. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో పురుషుల అక్షరాస్యత 82.14%గా ఉంది.
  5. స్త్రీల అక్షరాస్యత 70.04% గా ఉంది.
  6. ఈ రెండింటి మధ్య తేడా 12.10. దీని ద్వారా పురుషుల కంటే స్త్రీల అక్షరాస్యతా సంఖ్య తక్కువ
  7. రాష్ట్రస్థాయిలో చూస్తే పురుషుల అక్షరాస్యతా శాతం 75.56% గా ఉంది.
  8. మహిళల అక్షరాస్యత 59.74% గా ఉంది.
  9. ఈ రెండింటి మధ్య తేడా 15.82%
  10. మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యతా శాతం ఇంకా పెరగాల్సి ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఈ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఆమెకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా రాయండి. – పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ – జననం 19 సెప్టెంబరు, 1965.
– అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు
– అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ.
– ఎక్కువసార్లు అంతరిక్షయాత్ర చేసిన మహిళ
– 1998లో NASA చేత ఎంపిక.
– 2007లో భారత పర్యటన.
– గుజరాత్ లో స్వగ్రామం (జులాసన్), సబర్మతి సందర్శన
– విశ్వప్రతిభ అవార్డ్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు.
– 4 అక్టోబర్ 2007లో “అమెరికన్ ఎంబసీ” లో ప్రసంగం.
– భారత ప్రధానితో సమావేశం.
– NASA లో డిప్యూటీ చీఫ్ గా 2008లో బాధ్యత.
జవాబు:
ప్రాచీన కాలపు భారతదేశ చరిత్రలో మహిళలు పురుషులతో పోటీపడటమే గాక, వారినధిగమించి తమ సత్తా చాటుకొన్న సందర్భాలు కోకొల్లలు. స్త్రీలు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నట్లు వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. గార్గియనే మహిళా శిరోమణి వేదవేదాంగాలలోను నిష్ణాతురాలు. తనను శాస్త్రవాదనలో ఓడించినవానినే వివాహం చేసుకుంటానని కఠోర ప్రతిజ్ఞ చేసింది. ఎందరో మహాపండితులను శాస్త్ర వాదనలో ఓడించింది. చివరకు యాజ్ఞవల్క్య మహర్షితో జరిగిన శాస్త్ర చర్చలో ఓడిపోయి, ఆ మహానుభావుణ్ణి వివాహం చేసుకొంది. తదనంతర కాలంలో భర్త ద్వారా బ్రహ్మవిద్యను పొంది మహా ప్రజ్ఞావంతురాలిగా పేరొందింది. తదనంతర కాలంలో మహిళలు తమ సామర్థ్యాన్ని విస్మరించి కష్టాల కడలిలో మునిగిపోయారు. కాని ఆధునిక కాలంలో మహిళలు ప్రతికార్యంలోనూ పురుషులతో పోటీపడుతున్నారు. తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే భారతీయ మహిళ “కల్పనా చావ్లా” మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రవేశించింది. మహిళల గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కాని అంతటితో సంతృప్తి పడక స్వర్గలోకానికి కూడా ఆ కీర్తిని చాటాలని సంకల్పించి స్వర్గ సోపానాలను (మెట్లను) అధిరోహించింది.

కల్పనాచావ్లా లేని లోటును తాను భర్తీ చేస్తానని భారతీయులను ఊరడించింది శ్రీమతి సునీతా విలియమ్స్. సునీతా భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ, ఈమె 19-9-1965న జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ గర్వించేలా అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1998వ సంవత్సరంలో NASA చేత ఎంపిక చేయబడి అంతరిక్షయానం చేసింది. తన అనుభవాలను, అనుభూతులను భారతీయులతో పంచుకోదలచి 2007వ సంత్సరంలో భారతదేశంలో పర్యటించింది. గుజరాత్ రాష్ట్రంలో తన స్వగ్రామమైన జులాసనను, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది. భారతీయుల ఆత్మీయతను, ఆప్యాయతను చవిచూసింది. వారు ప్రేమతో ఇచ్చిన ‘విశ్వ ప్రతిభ అవార్డు’ను, “ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు’ను స్వీకరించి, గర్వంగా భావించింది. 4-10-2007వ తేదీన “అమెరికన్ ఎంబసీ’లో ప్రసగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశమై కృతజ్ఞతలు తెలిపింది. 2008వ సంవత్సరంలో NASA లో డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఒక మహిళ అందులోను భారతీయ సంతతి అలాంటి ఉన్నతపదవిని పొందడం అదే ప్రథమం.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఉ) ప్రశంసాత్మకంగా రాయండి. రాణి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదోతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతినందుకున్నది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నిన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువు మానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.
ధన్యవాదాల

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగుమాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,
బ్రాడీపేట 2/14, గుంటూరు.

చిరునామా :
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం,
గుంటూరు జిల్లా.

IV. ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన స్త్రీల పేర్లు సేకరించి వారు ఏ రంగంలో పేరు పొందారో పట్టికను రాసి ప్రదర్శించండి.
ఉదా :
క్రీడలకు సంబంధించిన వారు, రచయిత్రులు – మొదలయిన వారు.

పేరు ప్రసిద్ధిగాంచిన రంగం
1. మొల్ల కవయిత్రి
2. రంగాజమ్మ కవయిత్రి
3. ఇందిరాగాంధీ రాజకీయం
4. పి.టి. ఉష క్రీడలు
5. అశ్వని నాచప్ప క్రీడలు
6. కల్పనాచావ్లా వ్యోమగామి
7. సునీతా విలియమ్స్ వ్యోమగామి
8. కిరణ్ బేడి రక్షణ విభాగం
9. మదర్ థెరిస్సా దీనజనసేన
10. డొక్కా సీతమ్మ అన్నదాత
11. శారదామాత ఆధ్మాత్మిక రంగం
12. శకుంతలాదేవి గణితశాస్త్రం
13. యద్దనపూడి సులోచన రాణి నవలా రచయిత్రి
14. ఐశ్వర్యారాయ్ చలనచిత్రం
15. అరుంధతీరాయ్ ఆంగ్ల సాహిత్య రచయిత్రి
16. శోభానాయుడు నాట్యకారిణి
17. యమ్.యస్. సుబ్బులక్ష్మి సంగీతం
18. కిరణ్ మజుందార్ షా వాణిజ్యం

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పట్టికలో సమానార్థక పదాలున్నాయి. వాటి నుండి పట్టిక కింద ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు వెతికి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం 1
1) వనిత, 2) లక్ష్మి, 3) కరుణ, 4) నెచ్చెలి, 5) శీఘ్రం, 6) అనిశం, 7) భ్రాత. 8) విక్రమం , 9) విదుషి
జవాబు:
1) వనిత : స్త్రీ, పడతి
2) లక్ష్మి : శ్రీ, రమ
3) కరుణ : దయ, జాలి
4) నెచ్చెలి : స్నేహితురాలు, ప్రాణసఖి
5) శీఘ్రం : వేగం, తొందర
6) అనిశం : ఎల్లప్పుడు, సదా
7) భ్రాత : సోదరుడు, సహోదరుడు
8) విక్రమం : పరాక్రమం, శౌర్యం
9) విదుషి : విద్వాంసురాలు, పండితురాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఆ) కింది వాటిలో ప్రకృతి, వికృతులు కలగలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి, ఎదురెదురుగా రాయండి.
ఫలము, లచ్చి, విద్దె, కృష్ణుడు, ఇంతి, లక్ష్మి, పండు, స్త్రీ, కన్నయ్య, విద్య, శక్తి,
జవాబు:
ప్రకృతి – వికృతి
ఫలము – పండు
లక్ష్మి – లచ్చి
విద్య – విద్దె
కృష్ణుడు – కన్నయ్య
స్త్రీ – ఇంతి
శక్తి – సత్తు

ఇ) కింది పదాలకు అర్థాలను గుర్తించి కింద గీత గీయండి. ఆ అర్థాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
అనిశం = ఎల్లప్పుడు, అన్నము, గాలి
వాక్యం : సూర్యుడు ఎల్లప్పుడు తూర్పున ఉదయిస్తాడు.

1. విదుషీమణి అను విద్యావంతురాలు, నాయకురాలు, పండితురాలు.
వాక్యం : సరోజినీ నాయుడు ఆంగ్లభాషలో గొప్ప పండితురాలు.

2. నిర్మలం : స్వేచ్ఛ, స్వచ్ఛమైనది, భిన్నం కానిది.
వాక్యం : ఈ కొలను చాలా స్వచ్చమైనది.

3. కల్మషం : కలశం, కమలం, పాపం
వాక్యం : ఏ పాపం చేయని వారే తప్పు చేసిన వారిని శిక్షిం’ ‘లని ఏసుక్రీస్తు ప్రబోధించాడు.

4. ప్రతిబంధకం = ఎదిరించేది, అడ్డగించేది, తిరిగి బంధించేది.
వాక్యం : ముస్లిం స్త్రీల విద్యకు బురఖా పద్ధతి అడ్డంకిగా తయారయ్యింది.

ఈ) కింది పదాలకు ఎదురుగా వాటి నానార్థాలున్నాయి. వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
ఫలం (పండు) : నేను తిన్న ఫలం తీయగా ఉలు.
ప్రయోజనం : లక్ష్యం లేకుండా పనిచేస్తే ఫలం లభించదు.

1. పురము (పట్టణం) : గుంటూరు పురము విద్యలకు నెలవు.
(ఇల్లు) : మా పురము పేరు సౌదామిని.

2. నారి (స్త్రీ : బ్రిటిష్ అధికారులను ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.
(వింటితాడు) : అర్జునుడి నారి ధ్వనికే శత్రువులు భయపడిపోయేవారు.

వ్యాకరణం

అ) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.

1. కర్మణి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజంచారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది.
కర్తరి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభను జరిపారు.

2. కర్మణి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమించబడింది.
కర్తరి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు.

3. కర్మణి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు.
కర్తరి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు.

ఆ) పడ్వాది సంధి :
భయము + పడు – భయపడు (మువర్ణానికి లోపం)
భయము + పడు – భయంపడు (బిందువు రావడం)

విడదీసిన పగాలకు, కలిపిన పదాలకు తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’కు బదులుగా (0) వచ్చింది. ‘ము’ లోపించింది.

సూత్రం :
పడ్వాదులు పరమగునప్పుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

పడ్వాదులు :
పడు, పట్టె, పాటు, పఱచు, పెట్టు మొదలగునవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఇ) కింది వాటిని గమనించండి :
1. తృప్తిగంటిని – తృప్తి పొందాను.
2. ఉపన్యసించిరి – ఉపన్యసించారు.
3. తీర్మానములు గావించియున్నారు – తీర్మానాలు చేశారు.
4. లభించినవి – లంచాయి.
5. చేయుదురు – చేస్తారు.

గమనిక :
మార్పు దాదాపు చివరి రెండు మూడు అక్షరాలలోనే రావడం గమనించండి. గ్రాంథిక భాషా పదాలు వ్యవహారభాషలోకి మార్చాలంటే – నిత్యం మనం మాట్లాడే భాషను బాగా పరిశీలించాలి.

కింది పదాలను వ్యవహారభాషలోకి మార్చండి.

గ్రాంథికము వ్యవహారభాష
1) చూడుడు 1) చూడండి
2) సాహసించును 2) సాహసిస్తుంది/సాహసిస్తాడు
3) కలిగియుండవలెను 3) కలిగి ఉండాలి

9th Class Telugu 6th Lesson ప్రబోధం రచయిత్రి పరిచయం

కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో 6. 10. 1896న జన్మించారు. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు, రెండు నవలలు రచించారు. భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి మొదలయిన పత్రికలలో రచనలు చేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు ఆరు సంవత్సరాలపాటు శారదలేఖలు ప్రచురణ అయ్యాయి. ‘లీలావతి’ అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో ‘మా చెట్టునీడ ముచ్చట్లు’ శీర్షికతో రచనలు చేశారు. ‘గాంధీ దండకం’ రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ అనేక పాటలు, పద్యాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ నాటికలు రచించారు.

ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి, కలముపట్టి రచనలు చేసిన ‘విదుషీమణి’ కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరి సాహిత్యకృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణపతకం, 1934లో ‘స్వర్ణకంకణం’ అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మానసభలో ‘కవితా ప్రవీణ’ బిరుదును పొందారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభల స్వర్ణఫలకం, తామ్రపత్ర బహుమతి నందుకున్నారు.

కఠిన పదాలకు అర్థాలు

సౌభాగ్యవతి = ముత్తైదువ (శ్రీమతి)
నెచ్చెలి (నెఱు + చెలి) = ప్రాణ స్నేహితురాలు
శుభ, సమాచారము = మంచి, ముచ్చట
వనితామణి = స్త్రీ రత్నము
గంభీరోపన్యాసము = గంభీరమైన ఉపన్యాసము
ఆలింపవలెనని = వినాలని
స్తంభించిపోయినది = మొద్దువారినది
ఎల్లరు = అందరు
అనిశము = ఎల్లప్పుడు
ఉత్కంఠపడు = ఇష్టమైన వస్తువును పొంద డానికి తొందరపడు
కవయిత్రి = కవిత్వం అల్లే స్త్రీ
విదుషీమణి = గొప్ప విద్వాంసురాలు
నారీరత్నము = స్త్రీ రత్నము
మహత్తరోపన్యాసము = గొప్ప ఉపన్యాసము
లేఖామూలముగా = ఉత్తరం ద్వారా
కొమార్తె = కూతురు
అగ్రాసనాధిపురాలు = అధ్యక్షురాలు
ఆంగ్లభాష = ఇంగ్లీషుభాష
మహనీయుడు = గొప్పవాడు
సారాంశము = తాత్పర్యము
మహిళాసభ = స్త్రీ సభ
బాల్యవివాహము = చిన్నవారికి వివాహము
పడయజాలక = పొందలేక
తత్పలితము = దాని ఫలితము
మంత్రిణి = మంత్రిగా ఉన్న స్త్రీ
నిర్వహింపుచున్నది = నెరవేర్చుతుంది
సభ్యురాండ్రు = సభలోని స్త్రీలు
ప్రతిబంధకము = అడ్డగించునది
రూపుమాపవలెను = నశింపజేయాలి
లక్ష్మీప్రసన్నత = ధనము కలుగుట
సరస్వతీప్రసన్నత = చదువువచ్చుట
బిడియము = సిగ్గు
అశక్తలు = శక్తిలేని వారు
విదుషీమణులు = శ్రేష్ఠమైన విద్వాంసురాండ్రు
పశ్చాత్తాపము = తాను చేసింది తప్పు అని తెలిసినపుడు, అలా చేశానే అని తరువాత చింతించుట
విశ్వమానవ భ్రాతృత్వము = ప్రపంచ మానవ సోదరత్వము
అకల్మష హృదయము = పాపము లేని మనసు
తనువు = శరీరము
చిత్త సంస్కారము = మనస్సు శుద్ధి
అస్పృశ్యులు = అంటరానివారు
అర్పించుట = ఇచ్చుట
నిర్మలము = స్వచ్ఛము
కరుణాభరితము = దయతో కూడినది
ప్రేమ పూర్ణము = ప్రేమతో నిండినది
పడయగోరు = పొందగోరు
ముఖ్యాంశములు (ముఖ్య + అంశములు) = ముఖ్య విషయాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 5 పద్యరత్నాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 5th Lesson పద్యరత్నాలు

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! – బద్దెన

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పద్యం భావం చెప్పండి.
జవాబు:
భావం:
ఓ వేమనా! ఎవరు చెప్పినా వినాలి. విన్న తరువాత తొందర పడకుండా ఆలోచించాలి. అది నిజమో, అబద్దమో తెలుసుకోవాలి. అలా తెలుసుకొన్న వాడినే లోకంలో నీతిపరుడు అంటారు.

ప్రశ్న 2.
ఇలాంటి పద్యాలను ఏమంటారు?
జవాబు:
నీతి పద్యాలు లేక సుభాషితాలు అని అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
మీకు తెలిసిన ఇతర శతక పద్యాలు చెప్పండి.

1) కం|| అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ! – సుమతీ శతకం

2) కం|| కలకొలది ధర్మముండిన
గలిగిన సిరి కదలకుండు కాసారమునన్
గల జలము మడువు లేమిని
గొల గొల గట్టుతెగిపోదె గువ్వలచెన్నా ! – గువ్వలచెన్న శతకం

3) ఆ||వే|| పరుల కొఱకే నదులు ప్రవహించు గోవులు
పాలనిచ్చు చెట్లు పూలుపూచు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా ?
లలిత సుగుణజాల తెలుగుబాల ! – తెలుగుబాల శతకం

4) ఆ||వే|| జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటే ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగుబిడ్డ ! – తెలుగుబిడ్డ శతకం

5) తే॥॥ విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె ! – భర్తృహరి సుభాషితం

6) ఉ॥ పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు
దండత పీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహనికురుంబములుండవె చేరి భాస్కరా! – భాస్కర శతకం

7) ||వే|| మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! – వేమన శతకం

8) ఆ॥వె॥ పుస్తకముల నీవు పూవు వోలెను చూడు
చింపఁబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకముల ఎరువు తెచ్చితివేని
తిరిగి యిమ్ము వేగ తెలుగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం

ప్రశ్న 4.
ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు?
జవాబు:
నీతిని బోధించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి రాసి ఉంటారు.

ప్రశ్న 5.
వీటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది?
జవాబు:
వీటి వల్ల సమాజానికి ఏది నీతో, ఏది అవినీతో తెలుస్తుంది. ఉత్తమ సమాజం ఏర్పడటానికి ఇది దోహదం చేస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అంశాల గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో భావయుక్తంగా పాడండి. భావాలు చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో పద్యాలు చదవండి.
భావాలు :
1) శుభాలనిచ్చే రాజశేఖరుడా ! అల్పుడు, దుర్మార్గుడు, మోసకారిని ధనవంతుడు కదా అని కోరి చేరితే, కోరికలు నెరవేరకపోగా హాని కలుగుతుంది. విలువైన మణితో ఉంది కదా అని క్రూరమైన పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

2) ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై, నాశనమైపోయినా, సముద్రాలు తమ హద్దుల్ని దాటి పొంగుకు వచ్చినా; సూర్యచంద్రులు తమ గతుల్ని తప్పినా ; నీ భక్తుడు మాత్రం చలించడు, గర్వంతో వీడిపోడు. నీతిని, భక్తి మార్గాన్ని వీడిపోడు.

3) ఓ సర్వేశ్వరా ! సత్యవంతుడు, దురాచారుడు కానివాడు, విచక్షణతో మెలిగేవాడు, దుర్జనులతో స్నేహం చేయనివాడు, భక్తులతో స్నేహంగా ఉండేవాడు, కామాతురుడు గానివాడే ఈ మూడు లోకాల్లో నీకు నిజమైన సేవకుడు.

4) ఓ శివా ! పార్వతీపతీ ! గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను, జిల్లేడు చెట్టు కల్పవృక్షంగాను ఎప్పటికి కాలేవు. అట్లే పిసినారి దుర్జనుడు రాజు కాలేడు.

5) ఆభరణాలతో ప్రకాశించేవాడా ! ధర్మపురి అనే గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను చంపేవాడా ! పాపాలను దూరం చేసేవాడా ! ఓ నరసింహస్వామీ ! సాధువులతోను, మంచివారితోను తగాదా పెట్టుకుంటే కీడు కలుగుతుంది. కవులతో గొడవ పెట్టుకున్నా, దీనులను పట్టుకొని హింసించినా, బిచ్చగాళ్ళకు కష్టం కలిగించినా, నిరుపేదలను నిందించినా కీడు కలుగుతుంది. ఇంకా పుణ్యాత్ములను తిట్టినా, భక్తులను తిరస్కరించినా, గురువుల ధనాన్ని దోచుకున్నా హాని కలుగుతుంది.
6) ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలను చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడిదలోన వేసిన నెయ్యి మాత్రమే అవుతుంది.

7) భద్రాదిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయగలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెదలాంటివాడవు. రాక్షసులనే కలువలను నాశనం చేయగల మదపుటేనుగువు. చక్కని శరీరం గల వాడవు.

8) శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది. సముద్రం కూడ గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

9) ఓ కుమారా ! చదువు చెప్పే గురువును ఎదిరించకు. పోషించే యజమానిని తిట్టకు. ఒక్కడివే పనికి సంబంధించిన ఆలోచనలను చేయవద్దు. మంచి నడవడికను విడవవద్దు.

10) ఓ సుమతీ ! ఉడుము వందేళ్ళు బతుకుతుంది. పాము వెయ్యేళ్ళు ఉంటుంది. చెరువుల దగ్గర కొంగ చాలాకాలం ఉంటుంది. వీటిలో ఎక్కువకాలం ఉండటం వలన ఉపయోగం లేదు. మంచి చేయాలనే ఆలోచనతోను, ధర్మార్థ కామ మోక్షాలను సాధించగలిగినవాడే ఉత్తముడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది అంశాలను చరించండి.
జవాబు:
i) నడవడిక :
లోకం పట్ల మన ప్రవర్తననే నడవడిక అంటారు. లోకానికి అపకారం చేయకుండా మంచిగా ఉంటూ జీవితాన్ని గడపాలి. లేకుంటే మన వద్దకు ఎవరూ రారు. పాము తన తలపై ఎంత విలువైన మణిని కలిగి ఉన్నా దాని దగ్గరకు ఎవరూ వెళ్ళరు కదా ! ఎక్కడైనా, ఎన్నడైనా గాజుపూస విలువైన రత్నం కాలేదు. అట్లే కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను మారలేదు. అలాగే పిసినారి రాజు కాలేడు. అంటే దానగుణం కలవాడు, సత్ప్రవర్తన కలవాడే లోకంలో ఎప్పటికైనా ఉన్నత స్థితిని పొందగలడు.

ii) గుణగణాలు :
కుల పర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు గతి తప్పినా భగవద్భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని వీడడు. ఎందుకంటే తనను భగవంతుడు రక్షిస్తాడనే ధైర్యం. భగవంతుడు ధర్మాన్ని, ధర్మం ఆచరించేవారిని తప్పక కాపాడతాడు. తాను తన ధర్మాన్ని పాటిస్తున్నాడు గనుక భగవంతుడు తప్పక రక్షిస్తాడని భక్తుని విశ్వాసం.

సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండటం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని సేవకుడి లక్షణాలు.

భక్తులు కాకపోయినా లోకంలో చాలామంది మంచి లక్షణాలను కలిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో లోభం వల్లగాని, భయం వల్లగాని, ప్రలోభాలకు లొంగికాని చెడుమార్గంలో ప్రవేశించడానికి అవకాశాలున్నాయి. భగవద్భక్తులు తమని భగవంతుడు రక్షిస్తాడని భావించడం వల్ల ధర్మానికి తప్ప వేటికీ భయపడరు. కాబట్టి జీవితాంతం సద్గుణాలతో శోభిస్తారు.

iii) మార్గదర్శకం :
లోకంలో మంచిని పాటించేవారు, చెడుని ఆచరించేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే మంచి కోసం ప్రాణం విడిచేవారు, ధర్మానికి కట్టుబడినవారు మిగతావారికి మార్గదర్శకులై నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చెడ్డవారిని చూసి ఎలా ఉండకూడదో కూడా లోకం తెలుసుకుంటుంది. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది. పాము వెయ్యేళ్ళు వృథాగా పడి ఉంటుంది. కొంగ కూడా చెరువుల వద్ద వ్యర్థంగా కాలం గడుపుతుంది. ఇవి ఇలా ఎంతకాలం ఉన్నా లోకానికేమీ ప్రయోజనం ఉండదు. వీటిని చూసి మనం అందరికీ మంచిని చేయాలనే ఆలోచనను, ధర్మార్థ కామ
మోక్షాలను సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలి. అలా చేయగలిగినవాడే ఉత్తముడు. అతడే మార్గదర్శి.

iv) నైతిక విలువలు :
నీతికి సంబంధించిన విషయం నైతికం. మానవులు పాటించాల్సిన కనీస ధర్మాలను విలువలంటారు. నీతికి సంబంధించి కనీసం పాటించాల్సిన విషయాలను నైతిక విలువలంటారు.

గురువులను ధిక్కరించకూడదు. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. అలానే తనను పోషిస్తున్న యాజమానిని తిట్టకూడదు. ఒక్కడే చాలా విషయాలు గురించి ఆలోచించకూడదు. పెద్దలు, అనుభవం గలవారి సలహాలనూ, సూచనలనూ తీసుకోవాలి.

ప్రశ్న 3.
పాఠంలో మీకు నచ్చిన పద్యాలేవి? ఎందుకో చెప్పండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన పద్యాలు
కం|| ఉడుముండదె నూడేండ్లునుఁ
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
కడునిల( బురుషార్థపరుడు గావలె సుమతీ !

కం॥ ఆచార్యున కెదిరింపకు
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !

నేటి సమాజంలో కొందరిలో నీతిగా జీవించడం తగ్గిపోగా, చాలామందిలో నీతిమంతమైన జీవనమే లోపించింది. అందుకనే అవినీతిపరుల గురించి వార్తలు పత్రికల్లో తరచుగా కన్పిస్తున్నాయి. కుమారశతకంలోని పద్యంలో నైతిక విలువలు చెప్పబడ్డాయి. సుమతీ శతకంలోని పద్యంలో ‘ఎంతకాలం బతికామనే దానికన్నా ఏమి సాధించామనే దానికే ప్రాధాన్యమ’నే నీతి చక్కగా నిరూపించబడింది. అందుకనే నాకు ఈ రెండు పద్యాలంటే చాలా ఇష్టం.

ఆ) 3, 4, 8 పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
జవాబు:
ఈ పాఠంలో ఇచ్చిన 3, 4, 8 పద్యాల ప్రతిపదార్థాలు చూడండి.

ఇ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే ఏమవుతుంది?
జవాబు:
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే కోరికలు తీరకపోగా, ఆపదలు కలుగుతాయి. విలువైన మణి పడగపైన . ఉన్నప్పటికీ కూడా ఎవరూ పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

ప్రశ్న 2.
‘కులశైలంబులు’ అనే పద్యంలో అన్నమయ్య ఏం చెప్పాడో రాయండి.
జవాబు:
ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లా చెదురై , నాశనమైపోయినా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతులు తప్పినా భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని విడచిపోడు కూడా.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
ఎలాంటి జీవనం నిష్ప్రయోజనమని బద్దెన అంటున్నాడు?
జవాబు:
ఉడుము వందేళ్ళు వ్యర్థంగా గడుపుతుంది. పాము అవమానాలను సహిస్తూ వెయ్యేళ్ళు జీవిస్తుంది. కొంగ చెరువుల వద్ద తన జీవితాన్ని వృథాగా గడుపుతుంది. అలాగే మానవుడు స్వార్థంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపితే ప్రయోజనం ఉండదు. అలాగాక ధర్మాన్నీ, అర్థాన్నీ, కోరికల్ని, మోక్షాన్ని సాధించగలిగినపుడే మానవ జీవితం ప్రయోజనవంతమవుతుందని బద్దెన బోధించాడు.

ప్రశ్న 4.
ధూర్జటి అభిప్రాయం ప్రకారం అన్నీ సులభసాధ్యమయ్యేలా చేసేది ఏది?
జవాబు:
ఈ లోకంలో “శివ ! శివ ! ” అని ఉత్సాహంగా పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది.
సముద్రం కూడా గట్టి నేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం కూడా అమృతంగా పరిణమిస్తుంది. కాబట్టే ఈశ్వరుని పేరు తలచుకోవడం వల్ల అన్నీ సులభసాధ్యాలవుతాయి. 5. భగవంతుని సేవకుని లక్షణాలను తెలపండి. జ. కులపర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలు దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతుల్ని
తప్పినా భగవంతుని భక్తుడు చలించడు. నీతిమార్గాన్ని వీడిపోడు. ఇంకా సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండడం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని
సేవకుడి లక్షణాలు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లోభియైనవాడు రాజుగా తగడు’ ఇది సమర్ధనీయమేనా ?ఎందుకు ? (లేదా) “పిసినారియైన వాడు రాజుగా తగడు” అనే విషయం సమర్థించ తగినదేనా పద్యరత్నము ఆధారంగా వివరించండి.
జవాబు:
పిసినారి రాజుగా ఉండటానికి తగడు. ఎందుకంటే రాజువద్దకు పేదవారు, దరిద్రులు ఇంకా ధనం అవసరమైన వారు
సహాయార్థులై వస్తారు. రాజు సహృదయతతో వారి కష్టాల్ని, బాధల్ని విని తగిన సహాయం చేయాలి. పిసినారి ఆ పని చేయలేడు.
దానితో వచ్చిన వారు రాజు పై ద్వేషంతో సంఘ విద్రోహులుగా, దొంగలుగా మారే ప్రమాదం ఉంది. కాలం ఎప్పుడూ అనుకూలంగానే ఉండదు. ఒక్కొక్కసారి అతివృష్టి వలన గాని, అనావృష్టి వలన గాని రాజ్యంలో పంటలు దెబ్బతినడం గాని, సరిగా పండకపోవడం గాని జరగవచ్చు. అలాంటి సమయంలో రాజు ప్రజలకు అండగా నిలచి పన్నులను రద్దు చేయాలి. కాని లోభి ధన వ్యామోహంతో ప్రజలకు పన్ను మినహాయింపులివ్వక
బాధిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను లోభి రాజుగా తగడు.

ప్రశ్న 2.
నరసింహ శతకపద్యంలో గల విషయాలు నేటి సమాజానికి ఎంతవరకు అవసరమో వివరించండి.
జవాబు:
నరసింహ శతక పద్యంలో గల విషయాలు నేటి సమాజానికి బాగా ఉపయోగపడతాయి. మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, దీనులయిన వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడుపనులు చేసే వారికి నరకం తప్పదు. వీరికి నరకం భద్రంగా కట్టుకొన్న మూటే.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
‘ధనంపై కోరికతో అల్పుని దగ్గరికి చేరితే హాని కలుగుతుంది’ దీనికి సంబంధించి మీకు తెలిసిన సంఘటనను వివరించండి.
జవాబు:
మా వీధి చివరలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడికి భార్యాబిడ్డలు లేరు. అతనికి బీదవాళ్ళంటే తేలిక భావం. ఎవరైనా బీదవాళ్ళు డబ్బు కావాలని అతని వద్దకు వెడితే అతడు వారికి సహాయం చేయడు. వారిని అవమానిస్తాడు. అత్యవసరంగా డబ్బు కావాలని ఎవరైనా అతణ్ణి అడిగితే మంగళ సూత్రాలూ, చెవి దుద్దులూ వగైరా తాకట్టు పెట్టుకుంటాడు. తిరిగి వారు డబ్బు ఈయలేకపోతే, ఆ నగలను తానే సొంతం చేసుకుంటాడు. వారికి ఉన్న చిన్న ఇంటిని లేక పాకను బాకీలు పేరు చెప్పి స్వాధీనం చేసుకుంటాడు. – కనుక అల్పబుద్ధి గల ధనవంతులను ధనం కోరి చేరితే హాని కలుగుతుందని తెలుస్తోంది.

ప్రశ్న 4.
‘పవి పుష్పంబగు’ పద్యభావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచవుతుంది. సముద్రం కూడా గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

ప్రశ్న 5.
‘అరణ్యరోదనం’ అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాల్లో వాడతారు?
జవాబు:
అడవి మధ్యలో ఉండి ఏడిస్తే ఆదుకొనేవారు, ఓదార్చేవారు ఎవరూ ఉండరు. ఏడ్చినా ఎవరూ పట్టించుకోకపోతే ఆ ఏడుపు వృథానే. వ్యర్థంగా ఏడిచే ఏడుపునే ‘అరణ్యరోదనం’ అంటారు. మనసులోని బాధను ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకోకపోయినప్పుడు, బాధను తీర్చేవారు ఎవరూలేని సందర్భాల్లో దీన్ని వాడతారు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నిజమైన భక్తునికి ఉండదగిన లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
భక్తులకు ఇంద్రియ నిగ్రహం, సర్వజీవుల హితం కోరే గుణం ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషించకూడదు. అన్ని ప్రాణులను ప్రేమించాలి. సుఖదుఃఖాలకు చలించకుండా స్థిరంగా ఉండగలగాలి. మమతను, అహంకారాన్ని వీడాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. భగవంతుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరినీ ఉద్రేకపరిచేలా ప్రవర్తించకూడదు. తాను కూడా ఎవరి చేష్టలకూ ఉద్రేకపడకూడదు. ఏమాత్రం కోరిక లేకుండా చేసే పనులన్నీ భగవంతుని పూజలా భావించి శ్రద్ధగా చేయాలి. శుచిగా ఉండాలి. పక్షపాత ధోరణిని వీడాలి. శత్రువుల యెడ, మిత్రుల యెడ సమభావంతో ఉండాలి. నిందకు కుంగిపోకుండా, పొగడ్తకు పొంగిపోకుండా ఉండగలగాలి. ఫలితాన్ని ఆశించకుండా పనులను చేయగలగాలి.

ప్రశ్న 2.
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు :
మంచి విద్యార్థికి గురువులను గౌరవించే లక్షణం ఉండాలి. ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. విద్యలలోనే పోటీతత్త్వం ఉండాలి కాని ఇతర విషయాలలో పోటీ పడకూడదు. తోటి విద్యార్థులు స్నేహంగా ప్రవర్తించాలి. అందరితోనూ కలసిపోయే గుణం పెంచుకోవాలి. జ్ఞానార్జనకు సన్నద్ధులై ఉండాలి. మందమతులైన విద్యార్థులకు విద్యాభ్యాసంలో సహకరించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి.

మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు :
విద్యార్థులకు అసూయాద్వేషాలు పనికిరావు. అంగవైకల్యం గల విద్యార్థులను పరిహసించకూడదు. మందమతులైన విద్యార్థులను హేళన చేయకూడదు. గురువుల మాటలకు ఎదురు చెప్పకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ధనమున్నవాళ్ళు తమధనాన్ని దానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని ఈ పాఠంలో చదువుకున్నాం కదా!ఈ భావం వచ్చేటట్లు అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ఇవ్వమని ధనవంతులను కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
కరపత్రం
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు
దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘ విద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవ చేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మనకందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచిపెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని, భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్య వస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.
పేదలకు సాయం చేద్దాం
పేదరికాన్ని రూపుమాపుదాం
(లేదా)
మీ పాఠం ఆధారంగా కవుల భావాలను నీతివాక్యాల రూపంలో రాయండి.
(లేదా)
పద్యరత్నాలు పొఠం ఆధారంగా కొన్ని నీతివాక్యాలు రాయండి.
జవాబు:

  1. దుర్గుణాలు గల ధనవంతునితో చేరిక ; మణిగల నాగుపాముతో కలయిక.
  2. ప్రకృతి ప్రకోపించినా వేయకు వెనుకడుగు ; దేవుని చేరడానికి వేయి ధర్మపథాన ముందడుగు.
  3. గుణవంతుడు, కాంక్షారహితుడు, సత్యవంతుడు కాగలడు భగవద్భక్తుడు.
  4. పిసినారి కాలేడు ఎన్నటికీ ఉన్నతాధికారి ; విలువలేనివి చేరి పొందవుగా ఉన్నతి మరి.
  5. చేస్తే సమాజానికి హాని ; పడతాడు దేవుడు నీ పని.
  6. చేయకుండా భగవంతుని స్మరణం ; చేసిన పనులన్నీ అవుతాయి (శూన్యం) వ్యర్థం.
  7. నిరంతరం భగవంతుని స్మరణం ; అనవరతం కష్ట కార్యహరణం.
  8. గురువుల మాటకు ఎదురు చెప్పకు’ ; పోషించే యజమానిని నిందించకు.
  9. ఒక్కడివే కార్యాలోచన చేయవద్దు ; మంచి నడవడికను ఎన్నడు వీడవద్దు.
  10. ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం ; ఎంతమందికి మంచి చేశామన్నది ముఖ్యం.

(లేదా)
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యానికి తగిన గేయాన్ని గాని, కవితను గానీ రాయండి.
జవాబు:
భగవంతునిపై భక్తి
పెంచుతుందెంతో ధీశక్తి
సమాజ సేవలపై కలిగిస్తుంది ఆసక్తి
చెడు స్నేహాల నుండి కల్పిస్తుంది విముక్తి
మంచి కార్యాలపై పెంచుతుంది అనురక్తి
దురలవాట్లపై కలిగిస్తుంది విరక్తి
సర్వానర్థాల నుండి కలుగుతుంది ముక్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
“మంచి గుణాలు గల వ్యక్తికి రూపం, ధనం లేకపోయినప్పటికీ, వాణ్ణి బుద్ధిమంతులు చక్కగా గౌరవిస్తారు.” అని చదువుకున్నాం కదా ! అటువంటి వ్యక్తులెవరైనా మీకు తెలిసిన వారున్నారా? వారి గురించి తెలపండి.
జవాబు:
ఆంగ్ల సాహిత్యంలో “జార్జ్ బెర్నార్డ్ షా” సుప్రసిద్ధుడు. కానీ ఆయన అందవికారి. అయితే అతని అందవికారం అతనికి మహాకవిగా, గొప్ప విమర్శకునిగా కీర్తి రావటంతో ఏమాత్రం అడ్డంకి కాలేదు. అతనికి మంచి రూపం లేకపోయినప్పటికి బుద్ధిమంతులతని సాహిత్యాన్ని, విమర్శలను గొప్పవిగా గుర్తించి, గౌరవించారు. కాబట్టి రూపం ఎప్పుడూ మంచిగుణాలు గల వారికి అడ్డంకి కాలేదు.

మన తెలుగు సాహిత్యంలో మహాకవులుగాను ప్రసిద్ధులైన వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవించారు. ఉదాహరణకు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడైన “శ్రీరంగం శ్రీనివాసరావు”. ఈ మహాకవి “ఈ యుగం నాది” అని సగర్వంగా చాటుకొన్నాడు. ఇంతటి మహాకవి కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. గుప్పెడు మెతుకుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలెన్నో చేశాడు. డబ్బు లేక ప్రపంచాన్ని చుట్టివచ్చే అనేక అవకాశాలను వదులుకున్నాడు. ఎన్నో రోజులు ఆహారం లేకుండా గడిపాడు. అతిసామాన్యుల కష్టాలను బాగా దగ్గరగా పరిశీలించాడు. కాబట్టే ఆయన కవిత్వంలో పీడితులు, బాధితులు, కార్మికులు, కర్షకులు ప్రధానమయ్యారు. ఆయన కవిత్వాన్ని దేశవ్యాప్తంగానే గాక, ప్రపంచవ్యాప్త మేధావులు చదివి మెచ్చుకున్నారు. ఆయన విశ్వనరునిగా ఎదగడానికి ఆయన దారిద్ర్యం ఏమీ అడ్డం కాలేదు.

జరుక్ శాస్త్రిగా సుప్రసిద్ధుడైన “జలసూత్రం రుక్మినాథశాస్త్రి” తెలుగు సాహిత్యంలో ‘పేరడీ’ ప్రక్రియకు ఆద్యుడు. ఈయన కూడా భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. కష్టాలను, బాధలను హాస్యంగా మలచి తన ‘పేరడీ’లలో ఆంధ్రులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. నవ్వుతోపాటు కన్నీటి చుక్కల్ని కూడా తెప్పించగలిగిన మహామేధావి, కవీశ్వరుడు. ఆయన ఆరంభించిన ‘పేరడీ’ తర్వాత ఆంధ్రసాహిత్యంలో ఒక ప్రక్రియగా ఏర్పడి, నేటికీ అందరిచే ఆదరించబడుతున్నది. బాధని నవ్వుగా మలచగలిగిన బుద్ధిశాలి జరుక్ శాస్త్రి.

(లేదా)
ఈ పాఠంలో చెప్పిన గుణాల్లో ఏయే మంచి గుణాలను మీరు అలవరచుకోవాలనుకుంటున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:
నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్న మంచిగుణాలు :

  1. ధనవంతులైనా, కాకపోయినా చెడ్డవారిని ఆశ్రయించకూడదనే మంచి అలవాటు అలవర్చుకోవాలనుకుంటున్నాను.
  2. ఎన్ని కష్టాలెదురైనా ధర్మమార్గాన్ని వీడను.
  3. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని నిశ్చయించుకున్నాను.
  4. ఏ పనినైనా ఫలితాన్ని ఆశించకుండా చేయాలనుకుంటున్నాను.
  5. పిసినారితనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను.
  6. సమాజానికి హాని కలిగించే పనుల్ని చేయకూడదని నిర్ణయించుకున్నాను.
  7. గురువుల మాటకు ఎదురుచెప్పకూడదని అనుకుంటున్నాను.
  8. నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, జీవనోపాధి కల్పించిన యాజమానిని/సంస్థను నిందించకూడదని అనుకుంటున్నాను.
  9. చెడు నడతను విడిచి పెట్టాలనుకుంటున్నాను.
  10. కార్యాలోచన ఒక్కడ్లే చేయకుండా ఆత్మీయుల, మిత్రుల సలహా, సూచనలతో చేయాలనుకుంటున్నాను.
  11. మంచి నడవడికను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాను.
  12. అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకున్నాను.

IV. ప్రాజెక్టు పని

ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లోని నీతి పద్యాలను సేకరించి, ఒక పుస్తకంలా తయారుచేయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద పదాలకు అర్థాలను పాఠ్యపుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’లో వెతికి వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
మడువు = కొలను, మడుగు
కొంగ మడువులోని చేపలను తినాలని చూసింది.

1. అవని = భూమి
అవనిపై పచ్చదనం తగ్గిపోతుందీ మధ్య.

2. కొక్కెర = కొంగ
కొక్కెర నేర్పుగా చేపలను పడుతుంది.

3. భృంగం = తుమ్మెద
పద్మాలపై భృంగం అందంగా తిరుగుతుంది.

4. అనర్ఘం = వెలకట్టలేనిది
మంచి పౌరులు సమాజానికి అనర్ఘ రత్నాల వంటివారు.

5. పవి = వజ్రాయుధం, పిడుగు
1) ఇంద్రునికి ఇష్టమైన ఆయుధం పవి.
2) ఈ సంవత్సరం పవి పతనాల (పిడుగుపాటు) వల్ల మరణాల సంఖ్య పెరిగింది.

6. తురంగం = గుఱ్ఱము
మోటారు వాహనాలు లేని రోజుల్లో తురంగం ప్రయాణాలకు ఉపయోగపడేది.

7. పంచాస్యం – సింహము
వేటగాని దాడివల్ల పంచాస్యం మరణించింది.

8. దురాచారుడు = చెడు ఆచారాలు గలవాడు
దురాచారునితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్నే కలిగిస్తుంది.

9. దివ్యాహారం = అమృతము దేవతలు,
దానవులు పాలసముద్రాన్ని మధించినపుడు దివ్యాహారం పుట్టింది.

ఆ) కింది పదాలకు పదపట్టికలో పర్యాయపదాలు వెతికి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
ఈప్సితం = కోరిక, వాంఛ

అ) కళ్ళారా హిమాలయాలను చూడాలని రవికి చిరకాల వాంఛ.
ఆ) ఎన్నోసార్లు తన కోరికను తల్లిదండ్రుల ముందు బయటపెట్టాడు.
ఇ) మొత్తానికి తన ఈప్సితం తీరేటట్లు తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు.

అవని :
1) భూమి
2) ధరణి

అ) భూమిని రక్షించుకోవడం అందరి బాధ్యత.
ఆ) ఓజోన్ పొర తొలగిపోవటం వల్ల అవనికి ప్రమాదం ఏర్పడింది.
ఇ) సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాలు వస్తూండడం వల్ల ధరణి వేడెక్కిపోతున్నది.

2. విపత్తు :
1) ఇడుము
2) ఆపద
అ) ఆడవారికీ మధ్యకాలంలో ఆపదలు పెరిగాయి.
ఆ) ఎటు నుండి విపత్తులు వస్తాయో అని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇ) ప్రభుత్వం ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా ఇడుములు దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నది.

3. ఏనుగు :
1) కరి
2) మత్తేభం ,
అ) ఏనుగులు చెఱకుతోటలపై దాడిచేస్తాయి.
ఆ) కరుల సమూహాన్ని దూరంగా పంపడం కష్టంతో కూడిన పని.
ఇ) కొన్నిసార్లు మత్తేభాల కాళ్ళు కిందపడి జనాలు మరణిస్తూ ఉంటారు.

4. భుజంగం :
1) వాతాశనం
2) సర్పం
అ) సర్పాలలో విషం కలిగినవి కొన్నే. కాని మనం వాతాశనాన్ని చూడగానే చంపుతాం.
ఆ) కాబట్టే భుజంగాల సంఖ్య బాగా తగ్గిపోయిందీ మధ్యకాలంలో,

5. తురంగం :
1) అశ్వం
2) వాజి
అ) జంతువులలో బాగా వేగంగా పరుగెత్తగలవి అశ్వాలు.
ఆ) తురంగాల కాళ్ళు ఇసుకలో కూరుకుపోవు.
ఇ) కాబట్టే వాజులను ఎడారులలో ప్రయాణించడానికి వినియోగించేవారు పూర్వకాలంలో.

6. సత్యం :
1) నిజం
2) ఋతం
అ) పిల్లలు నిజం పలికేలా చూడాలి.
ఆ) సత్యం చెప్పడం వల్ల మంచి జరుగుతుందని వారికి నచ్చచెప్పాలి.
ఇ) ఋతాన్ని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

1. దాశరథి : దశరథుని కుమారుడు (రాముడు)
2. గురువు : అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు
3. జలజాతం : నీటి నుండి పుట్టినది
4. పంచాస్యం : విస్తరించిన ముఖం గలది (సింహం)
5. మధువ్రతం : తేనె సేకరించడమే వ్రతంగా గలది (తుమ్మెద)
6. అబ్దం : నీటి నుండి పుట్టినది (అప్ అంటే నీరని అర్థం)
7. ధూర్జటి : పెద్ద జడలు కలిగినవాడు (శివుడు)
8. ధర : అన్నింటినీ ధరించునది (భూమి)

ఈ) పాఠార్యశం ఆధారంగా కింది నానార్థాలకు సంబంధించిన మూలపదాలను వెతికి రాయండి.
1. నీరు, గరళం, తామరతూడు = విషం
2. చీకటి, తమోగుణం, దుఃఖం = తమం
3. ఏనుగు, మూడడుగుల కొలత, ఎనిమిది అనే అంకె = గజం
4. అవయవం, ఒక దేశం, భాగం = అంగం

ఉ) కింది జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. గజస్నానం : వ్యర్థమైన స్నానం
చిన్న పిల్లలకు స్నానం చేయించినా అది గజస్నానమే.

2. అరణ్యరోదనం : ఏడుపు వల్ల ప్రయోజనం లేకపోవడం.
నగరాలు విస్తరిస్తున్న నేటి కాలంలో ప్రకృతి ప్రేమికుల అరపులు అరణ్యరోదనలే అవుతున్నాయి.

3. బూడిదలో పోసిన నెయ్యి : వ్యర్థమైపోవడం
మా అన్నయ్య ఇంజనీరింగ్ లో తప్పడంతో అమ్మానాన్నల శ్రమ అంతా బూడిదలో పోసిన నెయ్యి అయింది.

వ్యాకరణం

అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా:
ఫణాగ్రము – ఫణ + అగ్రము : సవర్ణదీర్ఘ సంధి

పదం విసంధి రూపం సంధి పేరు
1. పరమాన్నం పరమ + అన్నం సవర్ణదీర్ఘ సంధి
2. పంచాస్యం పంచ + ఆస్యం సవర్ణదీర్ఘ సంధి
3. పదాబ్దం పద + అబ్దం సవర్ణదీర్ఘ సంధి
4. ధనాఢ్యుడు ధన + ఆఢ్యుడు సవర్ణదీర్ఘ సంధి
5. మధువ్రతేంద్రం మధువ్రత + ఇంద్రం గుణసంధి
6. సర్వేశ్వరా సర్వ + ఈశ్వరా గుణసంధి

ఆ) కింది పదాలను కలిపి, ఏ సంధులో గుర్తించండి.
ఉదా:
పలాయనంబు + అగుట = పలాయనంబగుట = ఉకారసంధి

విసంధి రూపం పదం సంధి పేరు
1. అభోజ్యములు + ఔట అభోజ్యములౌట ఉకారసంధి
2. కోపంబు . + ఎక్కువ కోపంబెక్కువ ఉకారసంధి
3. భృత్యుండు + అతడు భృత్యుండతడు ఉకారసంధి
4. ప్రాప్తము + అగు ప్రాప్తమగు ఉకారసంధి
5. రాజు + ఔనా రాజానా ఉకారసంధి

ఇ) పాఠం చదివి, కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. ఆ సంధి పదాలను విడదీసి, సూత్రాలను నోటుబుక్కులో రాయండి.

1. యణాదేశ సంధి :
య్, వ్, ర్ – అనే వర్ణాలకు యణ్ వర్ణాలని పేరు. సంధిలో యణ్ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. గనుక ఇది యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వాటి స్థానంలో క్రమంగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇతి + ఆభాషణ = ఇత్యాభాషణ = యణాదేశ సంధి
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 1

2. గుణసంధి :
ఏ, ఓ, అర్ అనే వర్ణాలకు గుణవర్ణాలని పేరు. సంధిలో గుణవర్ణాలు ఏకాదేశంగా వస్తాయి గనుక ఇది గుణసంధి.

సూత్రం :
అకారమునకు ఇ, ఈ లు పరమైతే ఏ కారం, ఉ, ఊ లు పరమైతే ఓ కారం ; ఋ, ౠలు పరమైతే ‘అర్’ అనేవి ఏకాదేశంగా వస్తాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 2

1) సర్వ + ఈశ్వరా = సర్వేశ్వరా = గుణసంధి
2) శివ + ఇతి = శివేతి = గుణసంధి
3) ఆభాషణ + ఉల్లాసికిన్ = ఆభాషణోల్లాసికిన్ = గుణసంధి
4) మధువ్రత + ఇంద్రం = మధువ్రతేంద్రం = గుణసంధి
5) పరంపర + ఉత్తుంగ = పరంపరోత్తుంగ = గుణసంధి
6) నామ + ఉక్తి = నామోక్తి = గుణసంధి

3. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఆ అనే అచ్చులు ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడతాయి. ఇలా ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. సవర్ణాలకు సంధిలో దీర్ఘం వస్తుంది గనుక ఇది సవర్ణదీర్ఘ సంధి.

సూత్రం :
అకార – ఇకార – ఉకారములకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

ఉదాహరణలు :
1) ధన + ఆఢ్యుడు = ధనాఢ్యుడు = సవర్ణదీర్ఘ సంధి
2) ఫణ + అగ్రభాగము = ఫణాగ్రభాగము = సవర్ణదీర్ఘ సంధి
3) పంచ + ఆస్యము = పంచాస్యము = సవర్ణదీర్ఘ సంధి
4) సుర + అవనీజము = సురావనీజము = సవర్ణదీర్ఘ సంధి
5) పద + అబ్ద = పదాబ్ద = సవర్ణదీర్ఘ సంధి
6) దయ + అంతరంగ = దయాంతరంగ = సవర్ణదీర్ఘ సంధి
7) ధరా + ఆత్మజ = ధరాత్మజ = సవర్ణదీర్ఘ సంధి
8) నిశాచర = అబ్జ = నిశాచరాబ్జ = సవర్ణదీర్ఘ సంధి
9) శుభ + అంగ = శుభాంగ = సవర్ణదీర్ఘ సంధి
10) దివ్య + ఆహారము = దివ్యాహారము = సవర్ణదీర్ఘ సంధి
11) శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తీశ్వరా = సవర్ణదీర్ఘ సంధి
12) కార్య + ఆలోచనము = కార్యాలోచనము = సవర్ణదీర్ఘ సంధి
13) పురుష + అర్థపరుడు = పురుషార్థపరుడు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

4. ఉత్వ సంధి :
హ్రస్వమైన ఉకారానికి జరిగే సంధిని ఉత్వసంధి అంటారు. .

సూత్రం :
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉదాహరణలు :
1) వారలు + ఈప్సితము = వారలీప్సితము
2) కాంతురు + ఆ = కాంతురా
3) తలకండు + ఉబ్బడు = తలకండుబ్బడు
4) సత్యంబు + ఎప్పుడు = సత్యంబెప్పుడు
5) తప్పడు + ఏనియు = తప్పడేనియు
6) కాడు + పని = కాడేని
7) ఔచిత్యంబు + ఏమరడు = ఔచిత్యంబేమరడు
8) పొందడు + ఏ = పొందడే
9) సాంగత్యంబు + ఆదట = సాంగత్యంబాదట
10) పాయడు + ఏని = పాయడేని
11) భృత్యుండు + ఆతడు = భృత్యుండాతడు
12) రత్నము + అగునా = రత్నమగునా
13) జోరు + ఈగ = జోరీగ
14) మధువ్రతేంద్రము + అగునా = మధుప్రతేంద్రమగునా
15) పంచాస్యము + ఔనా = పంచాస్యమౌనా
16) అవనీజము + అగునా = అవనీజమగునా
17) రాజు + ఔనా = రాజౌనా
18) కార్యములు + ఒనరించు = కార్యములొనరించు
19) ఘనతరంబు + ఐన = ఘనతరంబైన
20) చందంబు + అగున్ = చందంబగున్
21) మౌనంబు + ఒప్పన్ = మౌనంబొప్పన్
22) వేదము + అటవీ మధ్యంబులో = వేదమటవీ మధ్యంబులో
23) ఏడ్పు + అగున్ = ఏడుగున్
24) హోమములు + ఎಲ್ಲ = హోమములెల్ల
25) విడువబోకుము + అయ్య = విడువబోకుమయ్య
26) పుష్పంబు + అగు = పుష్పంబగు
27) మంచు + అగు = మంచగు
28) స్థలంబు + అవు = స్థలంబవు
29) శత్రుండు + అతి = శత్రుండతి
30) మిత్రుడు + ఔ = మిత్రుడా
31) దివ్యాహారము + ఔ = దివ్యాహారమౌ
32) సర్వవశ్యకరము + ఔ = సర్వవశ్యకరమౌ
33) ఆచార్యునకు + ఎదురు = ఆచార్యునకెదురు
34) చేయకుము + ఆచారము = చేయకుమాచారము
35) పోకుము + అయ్యా = పోకుమయ్య
36) ఉండుము + ఉండదె = ఉండుముండదె
37) నూఱు + ఏండ్లు = నూడేండ్లు
38) ఉండదు + ఏ = ఉండదే

ఈ) నూతన పరిచయం :
జశ్వ సంధి :
జశ్ వరాలకు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, స) జరిగే సంధి కాబట్టి ఇది జశ్వ సంధి. ఉదాహరణలు :
1) సత్ + భక్తి = సద్భక్తి
2) దిక్ + అంతము = దిగంతము
3) సముత్ + అంచత్ + సముదంచత్
4) మృత్ + ఘటము = మృద్దటము
5) వాక్ + ఈశుడు = వాగీశుడు
6) వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం
7) వాక్ + వాదం = వాగ్వాదం
8) తత్ + విధం = తద్విధం

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.

4) సమాసాలు – ఖాళీలను పూరించండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. సాధుసజ్జనులు సాధువులైన సజ్జనులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. ధనాఢ్యుడు ధనము చేత ఆడ్యుడు తృతీయా తత్పురుష సమాసం
3. నూడేండ్లు నూటైన సంఖ్య గల ఏండ్లు ద్విగు సమాసం
4. దుష్టచిత్తుడు దుష్టమైన చిత్తము గలవాడు బహుబీహి సమాసం
5. క్రూర భుజంగం క్రూరమైన భుజంగం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. కార్యాలోచనము కార్యమును గూర్చి ఆలోచనము ద్వితీయా తత్పురుష సమాసం
7. ఫణాగ్రభాగము ఫణము యొక్క అగ్రభాగము షష్ఠీ తత్పురుష సమాసం
8. అనర్ఘ రత్నాలు అనర్హమైన రత్నాలు విశేషణ పూర్వపద కర్మధారయం

ఊ) కర్మధారయ సమాసాలు
కర్మధారయ సమాసం : విశేషణానికి విశేష్యం (నామవాచకం) తో చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : కృష్ణ సర్పం.

‘కృష్ణ’ అనేది విశేషణం. ‘సర్పం’ అనేది విశేష్యం.

I. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
పోలిక చెప్పడానికి ఉపయోగించేదాన్ని ‘ఉపమానం’ అంటారు. కర్మధారయ సమాసంలో మొదటి పదం ఉపమానం అయితే దాన్ని ‘ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
కలువ కనులు.

కలువ వంటి కన్నులు అనే అర్థంలో కర్మధారయ సమాసంలో కన్నులను కలువలతో పోల్చారు. కాబట్టి ‘కలువ’ ఉపమానం. ఉపమానం మొదటి పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం.

II. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో ఉపమానం ఉత్తరపదంగా ఉంటే దాన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
పదాబ్దము

పద్మం వంటి పదం (పాదం) అనే అర్థంలో కర్మధారయ సమాసం చేయగా పదశబ్దం మొదటి పదంగా నిలిచింది. ఉపమానమైన అబ్దం (పద్మం) రెండవ పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. తేనెమాట తేనెవంటి మాట
(తేనె – ఉపమానం; మాట-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. తనూలత లత వంటి తనువు
(తనువు-ఉపమేయం; లత-ఉపమానం)
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
3. చిగురుకేలు చిగురు వంటి కేలు
(చిగురు-ఉపమానం; కేలు-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
4. కరకమలములు కమలముల వంటి కరములు
కరములు-ఉపమేయం: కమలములు-ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

1) సుధామధురం
2) జుంటిమోవి
3) ముఖారవిందం
4) కాంతామణి
జవాబు:

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. సుధామధురం సుధలా మధురమైనది
(సుధ = అమృతం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. జుంటిమోవి జున్ను వంటి మోవి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
3. ముఖారవిందం అరవిందం (పద్మం) వంటి ముఖం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
4. కాంతామణి మణి వంటి కాంత ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఋ) రూపక సమాసం:
“విద్యాధనం” దీనిలో విద్య, ధనం అనే రెండు పదాలు ఉన్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం. కనుక, ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడాన్ని – రూపక సమాసం అంటారు. విగ్రహవాక్యంలో ‘అనెడి’ అనే మాట చేరుతుంది.
ఉదా :
1) హృదయసారసం – హృదయమనెడి సారసం (సరస్సు) .
2) సంసారసాగరం – సంసారమనెడి సాగరం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1) జానజ్యోతి -జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
2) అజ్ఞానతిమిరం అజ్ఞానమనెడి తిమిరం – రూపక సమాసం
3) వచనామృతం — అమృతమనెడి వచనం – రూపక సమాసం

ఋ) ఛందస్సు – మత్తేభం :
1) ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి స. భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
3) ప్రాసనియమం ఉంది.
4) 14 వ అక్షరం యతిస్థానం.
5) ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 3
యతి : ప – పా.

మీరు కూడా పాఠంలోని పై పద్యంలో మిగిలిన మూడు పాదాలకూ, గణవిభజన చేసి, పై మత్తేభ పద్య లక్షణాలు సరిపోయాయో లేదో చూడండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 4
యతి : ప – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 5
యతి : అ – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 6
య యతి : శి – శ్రీ.

ఎ) అలంకారాలు :
గతంలో మీరు నేర్చుకున్న రూపక, ఉపమాలంకారాలు 6, 7 పద్యాల్లో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి, లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.
గమనిక (1):
6వ పద్యంలో ‘ఉపమాలంకారాలు’ ఉన్నాయి పరిశీలించండి.

1. స్నానంబుల్ నదులందు జేయుట గజ స్నానంబు చందంబగున్”
ఇందులో ఉపమాలంకారం ఉంది.

లక్షణము : దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) గజస్నానంబు – ఉపమానం
2) నదులందుచేయుట – ఉపమేయం
3) చందంబు – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

2. మౌనంబొప్ప జపించు వేద ‘మటవీ మధ్యంబులో నేడ్పగున్’
ఇందులో ఉపమాలంకారం ఉంది.
లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) అటవీ మధ్యంలో ఏడుపు – ఉపమానం
2) మౌనంతో వేదం జపించడం – ఉపమేయం
3) (లోపించింది) – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

3. ‘నానాసూమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చనున్’
ఈ పాదంలో ఉపమాలంకారము ఉంది.

లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) బూడిదలలోవేల్చు నెయ్యి – ఉపమానం
2) నానా హోమములు – ఉపమేయం
3) (లోపము) – ఉపమావాచకం
4) చనున్ – సమానధర్మం

గమనిక (2) :
ఏడవ పద్యంలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. పరిశీలించండి.

1. ‘విపత్పరంపరోత్తుంగ తమః పతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడు అని భావం.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం రూపకాలంకారం.
సమన్వయము :
1) తమము (తమస్సు) – ఉపమానం
2) విపత్పరంపరలు – ఉపమేయం
ఉపమానమైన చీకటికీ, ఉపమేయమైన విపత్తులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

2. ‘ధరాత్మజాహృదయసారసభృంగ’
ఈ వాక్యంలో ‘రూపకాలంకారం’ ఉంది.
భావం :
సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెద వంటివాడవు. రూపకాలంకార

లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం.
సమన్వయం:
1) సారసము (పద్మము) – ఉపమానం
2) హృదయము – ఉపమేయం
ఉపమానమైన సారసమునకూ, ఉపమేయం అయిన హృదయమునకూ భేదం ఉన్నా, లేనట్లు చెప్పడం జరిగింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

3. ‘నిశాచరాప్తమాతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
రాక్షసులు అనే కలువలను నాశనం చేసే ఏనుగువంటివాడు.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన – ఉపమేయములకు అభేదం చెప్పడం, లేక ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం.
సమన్వయం:
1) అబ్జము (కలువ) – ఉపమానం
2) నిశాచరులు – ఉపమేయం
ఉపమానమైన అబ్దమునకూ, ఉపమేయం అయిన నిశాచరులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కా.ట్ట ‘రూపకాలంకారం’ ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఏ) దృష్టాంతాలంకారం :

లక్షణం :
ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం వర్ణించబడితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు.

లక్ష్యం (ఉదాహరణ) :
ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

సమన్వయం :
ఇందు రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది గనుక ఇది దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.
1) రాజే ధర్మపరుడు, బుద్ధుడే అహింసాపరుడు.
2) బాబా ఆమేనే విజ్ఞాని, రమణ మహర్షియే జ్ఞాని.

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు కవుల పరిచయం

ఈ పాఠంలోని ప్రతి పద్యమూ ఒక విలువైన రత్నమే. ఈ పద్యాలన్నీ వేర్వేరు కవులు రాసిన శతకాల్లోనివి. ఆయా కవుల వివరాలు చదవండి.

1. ‘శ్రీకర రాజశేఖరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘రాజశేఖర శతకం’ లోనిది. దీని కర్త ‘సత్యవోలు సుందరకవి.” 20వ శతాబ్దానికి చెందినవారు. భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించారు.

2,3. ‘సర్వేశ్వరా ! అనే మకుటంతో ఉన్న పద్యాలు ‘సర్వేశ్వర శతకం’లోనివి. వీటిని ‘యథావాక్కుల అన్నమయ్య’ రచించారు. ఇతడు 12వ శతాబ్దానికి చెందిన శివకవి. భక్తిభావబంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట.

4. ‘భర్గా ! పార్వతీ వల్లభా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కూచిమంచి తిమ్మకవి’ రచించిన ‘శ్రీ భర్గశతకం’ లోనిది. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వారు. ‘నీలాసుందరీ పరిణయం’ అనే ప్రబంధాన్ని కూడా రచించారు.

5. ‘భూషణ వికాస శ్రీధర్మ పురనివాస ! దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కాకుత్సం శేషప్ప కవి’ రాసిన ‘నరసింహ శతకం’లోనిది. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. గోదావరీ తీరంలో కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో వెలసిన నరసింహస్వామిని ప్రస్తుతిస్తూ రాసిన శతకం ఇది.

6. ‘నారాయణా !’ అన్న మకుటంతో ఉన్న పద్యం నారాయణ శతకం లోనిది. రాసింది బమ్మెర పోతన. 15వ ఆ శతాబ్దానికి చెందిన భక్త కవి. మనస్సుకు ఆహ్లాదకరమైన, అందమైన పద్యాలు చెప్పిన సహజపండితులు.

7. ‘దాశరథీ ! కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకం లోనిది. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకే రామదాసు అనే పేరుంది.

8. ‘శ్రీకాళహస్తీశ్వరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘ధూర్జటీ’ కవి రచించిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోనిది. వీరు 17వ శతాబ్దానికి చెందినవారు.

9. ‘కుమారా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కుమార శతకం’ లోనిది. కవి ‘పక్కి అప్పలనర్సయ్య’. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు.

10. ‘సుమతీ !’ అన్న మకుటంతో ఉన్న పద్యం ‘సుమతీ శతకం’ లోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి ! చెందినవారు.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : – కంఠస పదం
*ఉ॥ కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్
జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు హానిఁ గాంతు రా
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెళ్లినన్
గ్రూర భుజంగమున్ గవయఁ గూడునె శ్రీకర రాజశేఖరా !
ప్రతిపదార్థం:
శ్రీకర = శుభాన్ని కలిగించే
రాజశేఖరా = చంద్రుని శిరస్సున ధరించే ఈశ్వరా !
కోరికతోన్ = కోరుకొని
ధనాఢ్యుడు + అని = అధిక ధనవంతుడని
కుత్సితున్ = మోసకారియైన
అల్పునిన్ = తక్కువవాడైన
దుష్టచిత్తునిన్ = చెడ్డబుద్ధికలవాణ్ణి
చేరినవారలు = చేరినవారు (ఆశ్రయించినవారు)
ఈప్సితమున్ = కోరిన కోరికను
చెంది = పొంది
సుఖింపరు = సుఖపడరు
హానిన్ = కీడును
కాంతురు = పొందుతారు
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము ; చారు = అందమైన
అగ్రభాగ = పై భాగము నందు
ఫణ = పడగయొక్క
విలసత్ = ప్రకాశించే
మణిరాజము = శ్రేష్ఠమైన మణిని
కల్గి = కలిగియుండి
వెల్గినన్ = ప్రకాశించినప్పటికీ (ఒప్పియున్నా)
క్రూర భుజంగమున్ = క్రూరమైన సర్పాన్ని
కవయఁగూడును + ఎ = కలిసి ఉండవచ్చా? (కలిసి ఉండరాదు)

భావం :
శుభాన్ని కల్గించే రాజశేఖరా ! మోసకారియైన ధనవంతుణ్ణి కోరి చేరితే, కోరికలు తీరకపోగా కీడు కూడా కలుగుతుంది. పడగ మీద విలువగల మణి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, భయంకరమైన పాముతో కలిసి యుండరు కదా !

2వ పద్యం: కంఠస్థ పద్యం
* మ॥ కుల శైలంబులు పొదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
జలధు ల్మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్
జలజాతప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం
దలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం:
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామి !
కుల శైలంబులు = కుల పర్వతాల
పాదు = మూలం (ఆలవాలం)
పెల్లగిలి = నశించి, ఊడిపోయి
దిక్కూలంబునన్ = దిక్కుల దగ్గర
(దిక్ + కూలంబునన్) (దిగంతముల వద్ద)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రాలు
మేరలన్ = సరిహద్దులను
ఆక్రమించి = దాటి (చేరి)
సముదంచత్ + భంగిన్ = మిక్కిలి చెలరేగిన విధంగా
ఉప్పొంగినన్ = పైకి పొంగినా
జలజాతప్రియ, శీతభానులు; జలజాతప్రియ = పద్మ బాంధవుడైన సూర్యుడూ,
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడూ
యథాసంచారముల్ = వారు నిత్యం తిరిగే దారిలో తిరగడం
తప్పి నన్ = తప్పిపోయినా (ప్రక్కదారిలో తిరుగుతున్నా)
భవద్భక్తుండు (భవత్ + భక్తుండు) = నీ యొక్క భక్తుడు
తలకండు = చలింపడు
ఉబ్బడు = గర్వపడడు
చొప్పు = నీతిమార్గాన్ని
తప్పడు = విడువడు (తప్పి సంచరింపడు)

భావం : సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై దిగంతాలలో కూలినా, సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు గతులు తప్పి చరించినా, నీ భక్తుడు అణుమాత్రం గర్వపడడు. నీతిమార్గాన్ని తప్పి సంచరింపడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

3వ పద్యం: కంఠస్థ పద్యంగా
* శా॥ సత్యం బెప్పుడు దప్పుడేనియు దురాచారుండు ‘గాడేని యౌ
చిత్యం బేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్తి సాం
గత్యం బాదట బాయడేని, మదనగ్రస్తుండు గాడేని నీ
భృత్యుండాతడు మూడు లోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం :
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వరా !
సత్యంబు = సత్యాన్ని
ఎప్పుడు = అన్నివేళలా
తప్పుడు + ఏనియున్ = తప్పకుండా ఉన్నట్లయితే
దురాచారుండు = చెడు నడతగలవాడు
కాడు + ఏనిన్ = కాకుండా ఉన్నట్లయతే
ఔచిత్యంబు = తగిన విధాన్ని (ఉచితత్వము)
ఏమరడు + ఏనిన్ = మరువనట్లయితే ఆ
దుర్జనులు = దుష్టుల (చెడ్డవారి యొక్క)
గోష్ఠిన్ : = కొలువును (సంఘమును)
పొందడు + ఏన్ – చేరనట్లయితే
భక్తిసాంగత్యంబు = భక్తులతో చెలియన
ఆదటన్ = వదలక
పాయడు + ఏని = విడువడేని
మదనగ్రస్తుండు = మన్మథీమోహాంలో చిక్కుకొన్నవాడు
కాడెనిన్ = కానివాడయితే
ఆతడు = అతడు
నీ భృత్యుండు = నీకు సేవకుడు అవుతాడు
మూడు లోకములలోన్ = ముల్లోకాలలోనూ
పెంపొందున్ = అభివృద్ధి పొందుతాడు.

భావం :
ఓ సర్వేశ్వరా ! ఈ మూడు లోకాల్లోనూ సత్యము తప్పనివాడు, చెడు నడతలేనివాడు, తగిన విధంగా మెలిగేవాడు, చెడ్డవాళ్ళతో చేరనివాడు, భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టనివాడు, సంసారమోహంలో చిక్కుకోనివాడూ ఎవడున్నాడో అతడే నీ సేవకుడు.

4వ పద్యం : కంఠస్థ పద్యం
* శా॥ గాజుంబూస యనర్ఘ రత్న మగునా ? కాకంబు రాయంచ’
నా ? జోరీగ మధువ్రతేంద్ర మగునా ? నట్టెన్ము పంచాస్యమౌ
నా ? జిల్లేడు సురావనిజమగునా ? నానాదిగంతంబులన్ ,
రాజౌనా ఘనలోభి దుర్జనుడు ? భర్గా ! పార్వతీ వల్లభా!
ప్రతిపదార్థం :
పార్వతీవల్లభా = పార్వతీపతీ !
భర్గా = ఓ ఈశ్వరా !
నానా దిగంతంబులన్ = అన్ని దిక్కుల చివరలలోనూ (ప్రపంచంలో ఎక్కడయినా)
గాజుంబూస (గాజున్ + పూస) = గాజుపూస
అనర్ఘ = వెలకట్టలేని
రత్నము = రత్నం
అగునా = అవుతుందా? (కాలేదు)
కాకంబు = కాకి
రాయంచ = రాజహంస
ఔనా ? = అవుతుందా ? (కాలేదు)
జోరీగ = పశువుల రక్తాన్ని త్రాగే ఒక జాతి ఈగ
మధువ్రతేంద్రము (మధువ్రత + ఇంద్రము) = శ్రేష్ఠమైన తుమ్మెద
అగునా = అవుతుందా ? (కాలేదు)
నట్టెను = దున్నపోతు
పంచాస్యమ = సింహం
ఔనా = అవుతుందా ? (కాలేదు)
జిల్లేడు = జిల్లేడు చెట్టు
సుర + అవనీజము = దేవతల వృక్షమైన కల్పవృక్షం
అగునా = అవుతుందా ? (కాదు)
ఘనలోబి = గొప్ప పిసినారి అయిన
దుర్జనుడు = దుర్మార్గుడు
రాజు + ఔనా = రాజు అవుతాడా ? (కాలేడు)

భావం :
భర్గా ! పార్వతీపతీ ! ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పటికీ గాజుపూస విలువైన రత్నం కాజాలదు. కాకి రాజహంస కాజాలదు. జోరీగ తేనెటీగ కాజాలదు. దున్నపోతు సింహం కాజాలదు. జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు. అలాగే పిసినారి యైన దుర్మార్గుడు రాజు కాలేడు.

5వ పద్యం :
సీ॥ సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు
కవులతో వైరంబు గాంచఁగీడు,
పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు,
భిక్షగాండ్రను దుఃఖపెట్టఁగీడు ”
నిరుపేదలను చూచి నిందఁ జేసినఁగీడు
పుణ్యవంతులఁ దిట్టఁ బొసగుఁగేడు
సద్భక్తులను దిరస్కారమాడివఁ గీడు,
గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు

తే॥గీ॥ దుష్టకార్యము లొనరించు దురమలకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!
ప్రతిపదార్థం :
భూషణ = అలంకారాల చేత
వికాస = శోభిల్లేవాడా !
శ్రీధర్మపుర = ధర్మపురి అనే గ్రామంలో
నివాస = నివసించేవాడా ! (వెలసినవాడా !)
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా!
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహ = ఓ నరసింహస్వామీ !
సాధుసజ్జనులతోన్ = మంచివారితో
జగడము + ఆడినన్ = కలహం పెట్టుకొంటే
కీడు = హాని (చెడుపు
కవులతోన్ = కవులతో
వైరంబు = శత్రుత్వం
కాంచన్ = పొందగా
కీడు = హాని
పరమదీనులన్ = మిక్కిలి దీమలను
(చిక్కఁబట్టి) చిక్కన్ + పట్టి = కట్టివైచి
కొట్టినన్ = కొడితే
కీడు = హాని
భిక్షగాండ్రను = ముష్టివారిని
దుఃఖ పెట్టన్ = ఏడ్పిస్తే
నిరుపేదలను = మిక్కిలి పేడవారిని
చూచి = చూచి
నిందన్ + చేసినన్ = తిట్టితే (నిందిస్తే)
కీడు = హాని
పుణ్యవంతులన్ = పుణ్యాత్ములను
తిట్టన్ = తిడితే
కీడు = హాని
పొసగున్ = సంభవిస్తుంది (సత్ + భక్తులను) = మంచి భక్తులయినవారిని
తిరస్కారము + ఆడినన్ = తిరస్కరిస్తే
కీడు = హాని
గురుని = గురువుగారి యొక్క
ద్రవ్యమున్ = సొమ్మును
దోచుకొనినన్ = దొంగిలిస్తే
కీడు = హాని
దుష్టకార్యములు = చెడ్డపనులు
ఒనరించు = చేసే
దుర్జనులకు = దుష్టులకు
ఘనతరంబు + ఐన = గొప్పదైన
నరకంబు = నరకలోకం
గట్టి ముల్లె = భద్రముగా కట్టుకొన్న మూట

భావం :
అలంకారాలచేత శోభించేవాడా ! ధర్మపురి గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా ! నరసింహా ! మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడు పనులు చేసేవారికి నరకం తప్పదు. (వారికి నరకం, భద్రంగా కట్టుకొన్న మూట వంటిది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

6వ పద్యం : కంఠస్త పద్యం
* శా॥ స్నానంబుల్ వదులందుఁ జేయుట గజ స్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడుగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యి చను
న్నీ నామోక్తియు నీ పదాబ్దరతియున్ లేకున్న వారాయణా !
ప్రతిపదార్థం :
నారాయణా = ఓ విష్ణుమూర్తీ ! నారాయణా!
నీ = నీ యొక్క
నామోక్తియున్ కీడు (నామ + ఉక్తియున్) = నామాన్ని స్మరించుటయు
నీ = నీ యొక్క
పదాబ్జ (పద + అల్ల) = పద్మముల వంటి పాదాల యందు
రతియున్ = ఆసక్తియును (అనురాగమును)
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకుంటే (లేకపోతే)
నదులందున్ = నదులలో (గంగ, గోదావరి వంటి పుణ్యనదులలో)
స్నానంబుల్ = స్నానములు
చేయుట = చేయడం
గజస్నానంబు = ఏనుగు చేసే స్నానం
చందంబు = వంటిది (పోలినది)
అగున్ = అవుతుంది.
మౌనంబు +ఒప్పన్ = పైకి ధ్వని వినబడకుండా
జపించు = జపించే
వేదము = వేదపారాయణం
అటవీ మధ్యంబులోన్ = అడవి మధ్యభాగంలో
ఏడ్పు + అగున్ = ఏడుపు వంటిది అవుతుంది.
నానాహోమములు = అనేక రకాలైన పుణ్యహోమాలు
ఎల్లన్ = అన్నియును
బూడిదలలోనన్ = బూడిద రాశులలో
వేల్చు = హోమం చేసే
నెయ్యె – (నెయ్యి + ఐ) = నేయివలె
చనున్ = పోతుంది (వ్యర్థం అవుతుంది)

భావం :
నారాయణా ! నీ నామం స్మరింపనివాడు, నీ పాదపద్మాలపై భక్తిలేనివాడు ఎన్ని నదులలో స్నానం చేసినా అది ఏనుగు స్నానం వంటిదే అవుతుంది. అతడు మంత్రాలను మౌనంగా జపించినా, అది అరణ్యరోదనమే అవుతుంది. ఎన్ని హోమాలు చేసినా, అది బూడిదలో పోసిన నెయ్యే అవుతుంది.

1) గజస్నానము :
గజస్నానము అంటే ఏనుగు స్నానం. ఏనుగు శుభ్రంగా నదులలో, మడుగులలో స్నానం చేసిన రంగ తరువాత గట్టుపైకి వచ్చి అక్కడ ఉన్న మట్టిని తొండంతో పీల్చి శరీరంపై చల్లుకుంటుంది. అంటే అది స్నానం చేసినా శుద్ధ దండుగ అని భావము.

2) అరణ్యరోదనం :
అరణ్యరోదనం అంటే అడవి మధ్యలో కూర్చుండి ఏడవడం. అడవిలో ఏడిస్తే ఎవరికీ వినబడదు. అందువల్ల ఎవరూ వచ్చి ఓదార్చరు. సాయం చేయరు. అదే జనులు ఉండే పల్లెలోనో, నగరంలోనో ఏడిస్తే ఎవరో ఒకరు వచ్చి ఓదారుస్తారు. అంటే అడవిలో ఏడవడం దండుగ అని భావం.

3) బూడిదలో నేయి హోమం :
సామాన్యంగా దేవతల ప్రీతికై అగ్నిజ్వాలల్లో నేతిని హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు, మంట మండేటప్పుడే హోమం చేయాలి. నిప్పులలో హోమం చేయరాదు. బూడిదలో హోమం చెయ్యడం శుద్ధ దండుగ అని భావం.

4) విష్ణుభక్తి లేనివాడు పుణ్యనదులలో స్నానం చేసినా, మౌనంగా వేదమంత్రాలు పారాయణ చేసినా, బూడిదలో నేతిని హోమం చేసినా దండుగ అని సారాంశం.

విశేషం :
‘జపం’ మూడు విధాలుగా ఉంటుంది.
1) మనస్సులో చేసే జపం ‘మానసికం’
2) పెదవులు కదుపుతూ చేసే జపం ‘ఉపాంశువు’
3) ఇతరులకు వినబడేటట్లు చేసే జపం ‘వాచికం’
ఈ పద్యంలో ‘మానసిక జపం’ గూర్చి చెప్పారు. ఇది జపాలన్నింటిలో ఉత్తమం.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* ఉ॥ రంగదరాతి భంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమః పతంగ, పరితోషితరంగ, దయాతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయసారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!
ప్రతిపదార్థం :
రంగత్ = ప్రకాశించుచున్న
అరాతి = శత్రువులను
భంగ = భంజించువాడా ! (సంహరించేవాడా !)
ఖగరాజ = పక్షిరాజయిన గరుత్మంతుడు అనెడి
తురంగ = గుఱ్ఱము కలవాడా !
విపత్ = ఆపదల యొక్క
పరంపరా = ఎడతెగని వరుస అనెడి
ఉత్తుంగ = మిక్కిలి అధికమైన
తమః = చీకటికి
పతంగ = సూర్యుడయినవాడా !
పరితోషిత = సంతోష పెట్టబడిన
రంగ = రంగస్వామి కలవాడా ! (రంగనాథస్వామి)
దయాంతరంగ (దయ + అంతరంగ) = దయగల మనస్సు కలవాడా!
సత్సంగ = సజ్జనులతో కూడిక కలవాడా!
ధరాత్మజా (ధర + ఆత్మజా) = భూదేవి కూతురైన సీతాదేవి యొక్క
హృదయ = మనస్సు అనెడి
సారస = పద్మమునకు
భృంగ = తుమ్మెద అయినవాడా !
నిశాచర = రాక్షసులనెడి
అబ్జ = తామరలకు
మాతంగ = ఏనుగు అయినవాడా !
శుభ + అంగ (శుభాంగ) = మంగళప్రదమైన
అవయవాలు కలవాడా !
భద్రగిరి = భద్రాచలంలో వెలసిన
దాశరథి = దశరథ పుత్రుడవయిన రామా!
కరుణాపయోనిధీ = దయా సముద్రుడా !

భావం :
భద్రగిరిపై కొలువున్న స్వామీ ! దశరథుని పుత్రుడా! సముద్రమంతటి దయగలవాడా ! నీవు యుద్ధరంగంలో శత్రువులను నాశనం చేసినవాడవు. గరుత్మంతుడినే వాహనంగా కలవాడవు. కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడవు. సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడవు. దయగల హృదయం కలవాడవు. సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెదవంటివాడవు. రాక్షసులనే పద్మాలను నాశనం చేసే ఏనుగువంటి వాడవు. మంగళప్రదమైన దేహం కలిగినవాడవు.

గమనిక : ఈ పద్యంలో “పరితోషితరంగ దయాంతరంగ” అనే సమాసాన్ని ఏకసమాసంగా తీసుకొని Text లో సంతోషము అనే అలలతో నిండిన దయగల హృదయం గలవాడవు అని భావం రాశారు – కాని ‘పరితోషితరంగ’ అనగా సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడా అని పూర్వవ్యాఖ్యలలో రాయబడింది.

‘Text లో ఇచ్చినట్లు భావం రాయాలంటే పరితోష తరంగ’ అని ఉండాలి. కాని ఇక్కడ ‘పరితోషితరంగ’ అని ఉంది. కాబట్టి ‘పరితోషతరంగ’ అని దిద్దుకోవాలి. (లేదా) Text లో ఉన్నట్లే ‘పరితోషిత’ అని ఉంటే, పూర్వ వ్యాఖ్యలలో వలె, సంతోషపెట్టబడిన రంగనాథుడు కలవాడని అర్థం చెప్పాలి.

8వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వవశ్యకరమౌ ! శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా (శ్రీకాళహస్తి + ఈశ్వరా) = శ్రీకాళహస్తీశ్వరా !
శివ = ఓ శివా !
అవనీమండలి లోపలన్ = భూమండలంలో
శివశివేతి (శివశివ + ఇతి) = శివ శివ అని
ఆభాషణోల్లాసికిన్ ఆభాషణ + ఉల్లాసికిన్ = స్మరిస్తూ ఆనందించే వాడికి
పవి = వజ్రాయుధము
పుష్పంబు + అగున్ = పుష్పం అవుతుంది
అగ్ని = కాల్చెడి అగ్ని
మంచు + అగున్ = చల్లని మంచు అవుతుంది
అకూపారంబు = సముద్రము
భూమీస్తలంబు + అవు = నేల అవుతుంది
శత్రుండు = శత్రువు
అతిమిత్రు డౌ (అతిమిత్రుడు + ఔ) : మంచి స్నేహితుడు అవుతాడు
విషము = విషము
దివ్య + ఆహారము = అమృతము
ఔన్ = అవుతుంది
ఎన్నగాన్ = ఎంచి చూడగా
నీ నామము = నీ నామోచ్చారణము
సర్వవశ్యకరము + ఔ = అన్నింటినీ సులభసాధ్యములుగా చేస్తుంది.

భావం :
శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన ఓ పరమేశ్వరా! నీ నామస్మరణం వల్ల అన్నీ సాధ్యం అవుతాయి. ఈ భూలోకంలో శివ ! శివ ! అని ఉత్సాహంతో పలికే వానికి వజ్రాయుధం – పుష్పంలా, నిప్పు – మంచులా, సముద్రం – నేలలా, పగవాడు – స్నేహితునిలా, విషం – అమృతంలా సులభసాధ్యాలుగా మారతాయి.

9వ పద్యం :
కం|| ఆచార్యున కెదిరింపకు
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !
ప్రతిపదార్థం :
అయ్య, కుమారా = ఓ నాయనా ! కుమారా !
ఆచార్యునకున్ , = చదువు చెప్పే గురువు మాటకు
ఎదిరింపకు = ఎదురు చెప్పవద్దు
ప్రోచిన = నిన్ను పోషించిన
దొర = యజమానిని
నింద + చేయన్ + పోకుము = నిందింపవద్దు
కార్యాలోచనములు (కార్య + ఆలోచనములు) = పనిని గూర్చి ఆలోచనలు
ఒంటిన్ + చేయకు = ఒంటరిగా చేయవద్దు.
ఆచారము = మంచి నడవడికను
విడువఁబోకుము (విడువన్ + పోకుము) = వదలిపెట్టవద్దు.

భావం :
ఓ కుమారా ! చదువు చెప్పే గురువుమాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని . నిందించవద్దు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపవద్దు. మంచి నడవడికను వదలి పెట్టవద్దు. (ఇలా చేయడం వల్ల నీకు ఎంతో మేలు కలుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

10వ పద్యం :
కం|| ఉడుముండదె నూటేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
జీవించియుండదా? మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! |
ప్రతిపదార్థం :
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
ఉడుము = ఉడుము
నూఱేండ్లునున్ (నూఱు + ఏండ్లునువ్) – వంద సంవత్సరాలపాటు
ఉండదె = జీవించియుండదా ?
పేర్మిన్ = అభివృద్ధితో
పాము = పాము
పదినూటేండ్లున్ = వేయి సంవత్సరాలపాటు
పడియుండదె = (పడి + ఉండదు + ఎ) = ఉంటుంది కదా !
మడువునన్ = చెఱువులో
కొక్కెర = కొంగ
ఉండదె (ఉండదు + ఎ) = చాలాకాలం
ఇలన్ = భూమిపై
కడున్ = మిక్కిలి
పురుషార్థపరుడు (పురుష + అర్ధపరుడు) – ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను సాధించేవాడు
కావలెన్ = కావాలి

భావం :
సుమతీ ! వంద సంవత్సరాలు జీవించే ఉడుము, వేయి సంవత్సరాలు జీవించే పాము, చెఱువు నందు చాలాకాలం బతికే కొంగ – ఎన్ని సంవత్సరాలు బతికినా ప్రయోజనం ఉండదు. మంచి చేయాలనే ఆలోచన కలిగి, ధర్మార్థ కామ మోక్షాలను సాధించేవాడే ఉత్తముడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 4 ప్రేరణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 4th Lesson ప్రేరణ

9th Class Telugu 4th Lesson ప్రేరణ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తి కోసం ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజున విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు:
నాకు శాస్త్రవేత్తలంటే చాలా ఇష్టం. నేను కూడా మీలా శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు:
“నువ్వు కూడా శాస్త్రవేత్తవు కావచ్చు. ముందు విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదువు. శాస్త్రంలోని ప్రాథమికాంశాలు బాగా అర్థమైతేనే పై తరగతుల్లో వచ్చే జటిలమైన విషయాలు అర్థమవుతాయి. కాబట్టి కష్టపడి కాక ఇష్టపడి చదువు” అని శాస్త్రవేత్త ప్రజ్ఞకు చెప్పి ఉంచాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు:
నేను వైద్యుణ్ణి కావాలనుకుంటున్నాను. ఇందుకోసం విజ్ఞాన శాస్త్రాన్ని, ప్రత్యేకంగా ‘జీవశాస్త్రాన్ని’ ఇష్టంతో చదువుతాను. ఇంకా పెద్దల సలహా, సూచనల ప్రకారం నా అధ్యయనాన్ని కొనసాగిస్తాను.

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు:
డాక్టర్|| ఏ.పి.జె. అబ్దుల్ కలామ్.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది విషయాలను చర్చించండి.

ప్రశ్న 1.
ప్రేరణ అని ‘పాఠం’ పేరు వినగానే మీకేమనిపించింది?
జవాబు:
మాకేదో కొత్త అంశాన్ని నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ పాఠం తప్పక కలిగిస్తుందనిపించింది. మహానుభావుల జీవితంలోని అనుభవాలను మాకిది అందిస్తుందనిపించింది. మాలో నిగూఢంగా ఉన్న కోరికలను, భావాలను తట్టిలేపేదిగా, వాటిని సాధించే దిశగా మమ్మల్ని సన్నద్దుల్ని చేసేదిగా ఈ పాఠంలోని అంశం ఉంటుందనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలామ్ చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
నాడున్న బ్రిటిష్ విద్యా విధానంపై భారతీయ విద్యార్థులకు సరైన అవగాహన లేదనిపిస్తుంది. పదవతరగతి పూర్తవగానే గుమస్తా ఉద్యోగాలను పొందడానికి అర్హత కలగడంతో ఎక్కువమంది చదువుకి అదే ముగింపు అయ్యేది. నాటి గురుశిష్య సంబంధం ఎంతో ఆత్మీయతతో కూడి ఉండేదని అన్పిస్తుంది. వృత్తివిద్యల మీద అవగాహన గలవారు తక్కువమంది. నాటి విద్యావిధానం నేటి విద్యావిధానానికి చాలా దగ్గరగా ఉంది. నేటికి వలెనే పదవతరగతి వరకు మాధ్యమిక విద్యగాను, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు కళాశాల విద్యగాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యగా ఉంది. ఇంటర్మీడియట్ తరువాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశాలున్నాయి. కానీ అలా వెళ్ళవచ్చనే విషయం నాటి విద్యార్థుల్లో ఎక్కువమందికి తెలియదు. ఉన్నత విద్యల్లోను, కళాశాల విద్యలోను ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహంగా కొంత డబ్బును (స్కాలర్ షిప్) ఇచ్చేవారని తెలుస్తోంది. నాడు పేద విద్యార్థులలో ఎక్కువ మందికి ఉన్నత విద్యను చదివే పరిస్థితులు లేవు.
అది చాలా ఖర్చుతో కూడి ఉండేది.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

ప్రశ్న 1.
కలామ్ తత్వశాస్త్ర గ్రంథాలు చదవడం.
జవాబు:
“నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.”

ప్రశ్న 2.
విజయానికి సూత్రాలు మూడు.
జవాబు:
“నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు – “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్మి
ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూను.”

ప్రశ్న 3.
సోదరి సహాయం.
జవాబు:
“ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు సంపాదించడానికున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్ షిప్ సంపాదించుకోవడమే.

ప్రశ్న 4.
ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫొటో దిగడం.
జవాబు:
“ఎమ్. ఐ.టి.కి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్ కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని, నాకోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో నిల్చున్నాను. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిరాంతపోయాను. ‘నువ్వు నా బెసు స్టూడెంట్ వి.’ నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యతులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూచున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇ) కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

“భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న సైబెల్ లో జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్త్వవేత్తలను, వక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. (✓)
2. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి. (✗)
3. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు. (✓)
4. బిపిన్ చంద్రపాల్ కి స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ఉంది. (✓)
5. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (✓)

ఈ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారి తప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతన్ని దారిలో పెట్టేవి కదా ! ఆ మాటలు ఏవి?
జవాబు:
ఆ ఉత్తేజకరమైన మాటలివి – “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.”

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు ? వాటి ద్వారా ఏ స్పూర్తిని పొందాడు?
జవాబు:
కలాం బాల్యంలో పక్షుల ప్రయాణాన్ని గమనించేవాడు. ఆకాశంలో విహారించాలంటే అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం గమనిస్తూ తాను కూడా ఎగరాలనే స్ఫూర్తిని పొందేవాడు. ఆకాశ రహస్యాలను కనుక్కోవాలనే కోరిక పెంచుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు:
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసినది కలాం సోదరి జొహారా. ఆమె తన బంగారు గాజులూ, గొలుసూ కుదువ పెట్టి వచ్చిన డబ్బుని కలాంకు ఇచ్చింది.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
జవాబు:
వీడ్కోలు సమావేశంలో భాగంగా కలాం, ఇతర విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్లతో కలిసి గ్రూప్ ఫొటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నిలుచున్నారు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని కలాం కోసం కలియచూశాడు. కలాం మూడోవరుసలో నిల్చున్నాడు. కలాంతో ‘రా………. నాతోపాటు ముందు కూర్చో’ అని పిలిచాడు. కలాం ప్రొఫెసర్ గారి ఆహ్వానానికి నిర్ఘాంతపోయాడు. ‘నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అని అన్నాడు ప్రొఫెసర్. ఆ ప్రశంసకి కలాం సిగ్గుపడ్డాడు. తనకు లభించిన గుర్తింపునకు గర్విస్తూ ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోకోసం కూర్చున్నాడు. దేవుడే కలాం ఆశ, ఆశ్రయం, మార్గదర్శి కాగలడని, భవిష్యత్తులో కలాం ప్రయాణానికి దారి చూపే దీపం కాగలడని ప్రొఫెసర్ వీడ్కోలు పలికాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
జవాబు:
కోర్సు పూర్తి చేయగానే కలాం తన నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనను ఇతర మిత్రులు తీసుకున్నారు. ఒకరోజు వాళ్ళ డిజైనింగ్ ప్రొఫెసరైన శ్రీనివాసన్ వాళ్ళ ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని తేల్చాడు. కలాం ఎన్ని సాకులు చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఆ పనిని పూర్తి చెయ్యడానికి ఒక నెలరోజుల వ్యవధి కోరినా మూడు రోజులు మాత్రమే గడువిచ్చాడు. సోమవారం ఉదయానికి విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే స్కాలర్షిప్ ని ఆపెయ్యవలసివస్తుందని హెచ్చరించాడు.

కలాం రాత్రి భోజనం మానేసి, డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నుడైనాడు. మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని, ఏదో తిన్నాడనిపించి మళ్ళీ పనిలో పడ్డాడు. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి చేశాడు. ప్రొఫెసర్ ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
(లేదా)
ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అన్న కలాం తండ్రి మాటలపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనిషి సంఘజీవి. ప్రతి మనిషికీ తన పరిసరాలకు సంబంధించిన జ్ఞానం చాలా అవసరం. తనే గాక తన చుట్టు . ప్రక్కలవారి బాగోగులను గమనించాల్సిన బాధ్యత, తోటి మనిషికి సహాయపడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. తన ఇంట్లోనే గాక తన ఇంటి చుట్టుప్రక్కల చక్కని స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. తనకు ఉన్నదాంట్లోనే తోటి వారికి సహాయపడాలి. అలా ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని.

ప్రశ్న 2.
‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి?
జవాబు:
కలాం పాఠశాల ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఈ విజయ సూత్రాన్ని బోధించాడు. మనకేదన్నా సంభవించాలని అనుకుంటే ముందు దాన్ని గట్టిగా కోరుకోవాలి. అది తప్పక జరిగి తీరుతుందని నమ్మాలి. ఆ కోరిక ఎన్ని ఇబ్బందులెదురైనా జరిగి తీరుతుందనే ఆశను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఇలా చేయడం ద్వారా కోరిక తీరాక మన సంకల్పబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆశావహ జీవనం అలవడుతుంది. తద్వారా నిరాశానిస్పృహలను జయించవచ్చు. ఆత్మన్యూనతను గెలవవచ్చు. అందుకనే కోరిక – నమ్మకం – ఆశ పెట్టుకోవడం అనే మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాలి.

ప్రశ్న 3.
“తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే!” ఈ మాటలు ఎవరి నుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
కలాం ఎమ్.ఐ.టి.లో తన ప్రొఫెసర్లు అయిన స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావుగార్ల గురించి చెప్పిన మాటలివి. ఇందులో ప్రతి అక్షరం సత్యమే అని నా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఉపాధ్యాయుడు విసుక్కోకుండా ఓపికతో వివరించినప్పుడే విద్యార్థి మేధస్సు వికసిస్తుంది. ఉపాధ్యాయుడు నిరంతర విద్యాన్వేషి కావాలి. విద్యార్థుల ప్రశ్నలను పిచ్చివని కొట్టిపారేయకుండా, విజ్ఞానాత్మకంగా ఆలోచించి సమాధానాలను చెప్పాలి. అప్పుడే విద్యార్థుల జ్ఞానతృష్ణ సంతృప్తిపడుతుంది. లేకుంటే తెలివైన విద్యార్థి వేరొకరిని ఆశ్రయించడం ద్వారా తన విజ్ఞాన తృష్ణను తీర్చుకోగలడు. సాధారణ విద్యార్థులు దాన్ని అంతటితో విడిచిపెట్టడం ద్వారా నష్టపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతరం చైతన్యశీలిగా ఉండాలి. అకుంఠిత సంకల్పంతో విద్యార్థుల జ్ఞానతృష్ణను సంతృప్తి పరచాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 4.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు:
కలాం స్థానంలో నేనుంటే ముందు కంగారు పడే మాట వాస్తవం. క్రమంగా విచక్షణతో ఆలోచిస్తాను. అవసరాన్ని బట్టి మిత్రుల సహాయం తీసుకుంటాను. “అవసరమే అన్ని ఆవిష్కరణలకు జనని” అనే సామెతను గుర్తుకు తెచ్చుకొని నా అవసరం కూడా ఒక నూతనావిష్కరణకు దారితీయాలని దృఢంగా సంకల్పించుకుంటాను. తగినట్లు కష్టపడతాను. వీలైనంత త్వరగా పనిని పూర్తిచేసి, గురువుల మన్ననలందుకుంటాను.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యారు? మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రతి వ్యక్తికి ఆశయం ఉంటుంది. అది సఫలం చేసుకోవడానికి అందరూ కృషి చేస్తుంటారు. అదే విధంగా కలాం తన ఆశయ సాధన విషయంలో ఎలా కృతకృత్యుడయ్యాడో వివరించండి.
జవాబు:
రామనాథపురంలోని హైస్కూల్లో చేరిన కలాంకు ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. క్రమంగా వారి అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. జీవితంలో విజయం పొందాలన్నా, మంచి ఫలితాలు సాధించాలన్నా మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక – నమ్మకం – ఆశ అని సోలోమోన్ చెప్పే మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు” – అనే గురువు గారి మాట కలాంలో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించింది. సాధారణ గ్రామీణ బాలుడైన్పటికీ తాను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలడనే నమ్మకం బలంగా కలిగింది.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలనే దృఢసంకల్పం రెట్టింపయింది. ఆ రోజుల్లో వృత్తి విద్యాకోర్సుల గురించి ఊహ కూడా లేకపోవడంతో, ఉన్నత విద్య అంటే అప్పటికి కాలేజీ చదువే కావడంతో ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాడు. గణితశాస్త్ర ప్రొఫెసర్లైన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్లతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. సెంట్ జోసఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరి పూర్తి చేశాక గాని తన కిష్టమైన భౌతికశాస్త్రంలో తానేమీ చేయలేదని గుర్తించాడు. తన కలలు నిజం చేసుకోవాలంటే ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని గ్రహించాడు. తర్వాత “మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ”లో ప్రవేశానికి ఎంపిక అయ్యాడు. ఇక్కడే అసలు కష్టం మొదలైంది. ఆ సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయలన్నా అవసరమవుతాయని తెలిసింది. అది తన తండ్రికి అసాధ్యమైన పని. అప్పుడే కలాం సోదరి జొహారా తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ధన సహాయం చేసింది. తన సొంత సంపాదనతోనే ఆమె గాజుల్ని విడిపించాలని నిశ్చయించుకున్నాడు కలాం. డబ్బు సంపాదించాలంటే అతనికున్న ఒకే ఒక మార్గం స్కాలర్ షిప్ సంపాదించడం.

ఎమ్. ఐ. టి లో (కలాంను) అతణ్ణి అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శనగా ఉంచిన రెండు పాత విమానాల యంత్రాలు. వాటి పట్ల ఎంత ఆకర్షితుడైనాడంటే మిగిలిన విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళాక కూడా చాలా సేపు వాటి దగ్గరే కూర్చొనేవాడు. పక్షిలా ఆకాశంలో విహరించాలన్న తన కాంక్షని ఆరాధిస్తూ గడిపేవాడు. మొదటి సంవత్సరం పూర్తిచేశాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ను ఎంచుకున్నాడు. ఎలాగైనా విమానాల్ని నడపాలనే తన కోరికకు సాధారణ కుటుంబ నేపథ్యమేమీ అడ్డుకాలేదని భావించాడు.

అప్పుడే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. అప్పుడే కొన్ని వైఫల్యాలు, ఆశాభంగాలు చవిచూడాల్సి వచ్చింది. దారితప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తన తండ్రి మాటలు ఎప్పుడూ చెవులలో మారుమ్రోగుతూ సరైన మార్గంలో నడిపాయి. కలాం ఆలోచనల్ని ముగ్గురు ఉపాధ్యాయులు మలచారు. వారే ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావు గార్లు. తమ నిశిత బోధనల ద్వారా ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని కోరికను మేల్కొల్పారు. వారి మేధస్సు, ఆలోచనా స్పష్టత, కలాం శ్రద్ధను బలోపేతం చేశాయి. కోర్సు పూర్తిచేశాక నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. కాగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ వారి పురోగతేమీ లేదని తేల్చి మూడు రోజుల్లోనే డిజైన్ పూర్తిచేయకుంటే స్కాలర్షిప్ ఆపేస్తామని హెచ్చరించాడు. దానితో కలాం నిద్రాహారాలు మాని రెండు రోజుల్లోనే దానిని పూర్తిచేసి ప్రొఫెసర్ శ్రీనివాస గారి మన్ననలే గాక ఇతర అధ్యాపకుల ప్రశంసలందుకున్నాడు. ‘మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం’ అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాసి ఎమ్.ఐ.టి. తమిళ సంఘంవారు నిర్వహించిన వ్యాసరచన పోటీకి పంపాడు. ప్రథమ బహుమతిని పొందాడు.

ఎమ్.ఐ.టి. నుంచి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్ లో పనిచేశాడు. పిస్టన్, టర్బయిన్ ఇంజన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాడు. వాయు పదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలు అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు. అప్పుడు వైమానిక దళంలో ఉద్యోగం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లో ఉద్యోగ రూపంలో కలాం చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు లభించాయి. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు కూడా కలామే.

ప్రశ్న 2.
కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రామనాథపురంలో హైస్కూల్ లో చేరాడు కలాం. జిజ్ఞాసియైన కలాంకు ఇయదురై సోలోమోన్ అనే ఉపాధ్యాయుడు మార్గదర్శియై నిలిచాడు. ఆయన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. కోరిక – నమ్మకం – ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని, మంచి ఫలితాలను పొందవచ్చని ఇయదురై బోధించేవాడు. “విశ్వాసంతో నీ విధిని కూడా తిరిగి రాయగలవు” – అనే సోలోమోన్ మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. కలాంకు చిన్నప్పటి నుండీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఆసక్తి ఎక్కువ. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూస్తూ తాను కూడా ఎగరాలని కోరుకునేవాడు. సోలోమోన్ బోధనలతో ఎగరాలనే కోరిక పెంచుకున్నాడు. ఎగురుతానని గట్టిగా నమ్మాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశవీడలేదు. కాబట్టే రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడతడే అయ్యాడు.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకున్నాడు. వృత్తి విద్యాకోర్సుల గురించి అవగాహన లేకపోవడంతో ట్రిచీలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. పరీక్షల గ్రేడుల ప్రకారం చూస్తే ఏమంత తెలివైన విద్యార్థి కాడు కలాం. కళాశాలలో గణితశాస్త్రంలో ప్రొఫెసర్స్ అయిన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్ల ప్రేమకు పాత్రుడైనాడు. అక్కడే ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ అయింది. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల రచనల పట్ల ప్రత్యేకాసక్తి కలిగింది. ఉత్తమ రచనలన్నీ చదివాడు. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు కూడా చదివేవాడు. అప్పుడే భౌతికశాస్త్రం పట్ల విశేషమైన ఆసక్తి కలిగింది. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.

సెంట్ జోసెఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరాడు. నాటికి ఇంజనీరింగ్ విద్య గురించి అవగాహన కలాంకు లేదు. బి. ఎస్.సి. పూర్తిచేశాక గాని భౌతికశాస్త్రం తన ప్రధాన విషయం కాదని తెలియలేదు. తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ లో చేరాలనుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఎంపికయ్యాడు. కానీ అసలు కష్టం అప్పుడే మొదలైంది. అతడా సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయల దాకా కావాలి.

అప్పుడు కలాం సోదరి జొహారా తన బంగారు గాజుల్ని, గొలుసును కుదువబెట్టి ధనసహాయం చేసింది. తన సొంత డబ్బుతోనే వాటిని విడిపించాలని కలాం నిర్ణయించుకున్నాడు. చదువుకునే తనకి డబ్బు సంపాదించే ఒకే ఒక మార్గం కష్టపడి చదివి స్కాలర్ షిప్ సంపాదించడం.

మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎన్నుకున్నాడు. ఎలాగైనా తాను విమానాల్ని నడపాలనే బలమైన కోరిక అందుకు కారణమైంది. అక్కడే చాలా రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. దారితప్పే పరిస్థితులేర్పడ్డాయి. తండ్రి మాటలే కలాంని సరైన మార్గంలో నిలిపాయి. ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి పండలై, నరసింగరావుగార్లు ఎమ్.ఐ.టి. లో కలాంపై ప్రభావం చూపిన గురువులు. తమ నిశిత బోధనల ద్వారా వారు ఏరోనాటిక్స్ పట్ల కలాంలో తృష్ణని రేకెత్తించారు. పరిజ్ఞానం పెరగడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. కోర్సు పూర్తి అయింది. కోర్సులో భాగంగా నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన కలాం బాధ్యత కాగా చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనలు అతని మిత్రుల బాధ్యత.

ఒకరోజు వాళ్ళ డైరెక్టర్, డిజైనింగ్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాసన్ గారు వాళ్ళ ప్రగతిని చూసి, పురోగతి లేదని తేల్చేశాడు. పనిలో జాప్యానికి కలాం ఎన్ని కారణాలు చూపినా ఆయన అంగీకరించలేదు. చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరగా, నేటి నుండి మూడో రోజున డిజైన్ పూర్తిచేసి చూపాలని, లేకుంటే స్కాలర్ షిప్ ఆపేస్తామని నిరంకుశంగా చెప్పాడు. స్కాలర్ షిప్పే కలాంకు ఆధారం. మూడు రోజుల్లో పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. నిద్రాహారాలు మాని డ్రాయింగ్ కు పూనుకున్నాడు. రెండవ రోజు ఉదయానికల్లా డిజైన్ పూర్తిచేసి గురువుల ప్రశంసలందుకున్నాడు.

ఎమ్.ఐ.టి. లో కోర్సు పూర్తిచేసుకొని, బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ విమానాల ఇంజన్ ఓవరాలింగు చేశాడు. వాయుపదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలను అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్ కలాం ఏమి రాసి ఉంటారు?
జవాబు:
కలాంకి చిన్నప్పటినుండి పక్షిలా ఆకాశంలో ఎగరడమంటే ఇష్టం. ఇలాంటి కోరికతోనే మొదటిసారిగా యంత్రాన్ని నిర్మించి, ఆకాశంలో ఎగిరిన వారు రైట్ సోదరులు. కలాం తన ఇంజనీరింగ్ విద్యలో భాగంగా వివిధ విమాన యంత్రాలను నిశితంగా పరిశీలించాడు. ఇతర భాగాలను శ్రద్ధగా గమనించాడు. విమానాన్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడదీయడం, విడి భాగాలను కలిపి విమానాన్ని తయారు చేయడంలో ప్రజ్ఞ గడించాడు. తన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి పుణ్యమా అని సొంతంగా విమానయంత్రాన్ని డిజైన్ చేశాడు.

‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’- అనే వ్యాసంలో కలాం తన అనుభవాలను, విజ్ఞానాన్ని రంగరించి విమానాన్ని సులభంగా ఎలా తయారుచేయవచ్చో నిరూపించి ఉంటాడని అన్పిస్తుంది. ఇంకా వీలైనంత తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేయగల మార్గాలను సూచించి ఉంటాడు. ముందుగా చిన్న చిన్న యంత్రాలను తయారుచేయడం, వాటిని విమానం బొమ్మలకు అనుసంధానించడం వంటి విషయాలను ఆసక్తి గల బాలల కొరకు వివరించి ఉంటాడు. వివిధ రకాల విమాన యంత్రాలకు ఉపకరించే లోహాలను, వాటి స్వరూపాలను తెలిపి ఉంటాడు. సాధారణ యంత్రాలకు కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా విమాన యంత్రాలుగా ఎలా మార్చవచ్చో నిరూపించి ఉంటాడు.

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పాఠంలోని మూడవ పేరాను చదవండి. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అలాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి.
జవాబు:
“నాకూ రెక్కలు ఉంటే
నీలాకాశంలో విహరిస్తా
అవని అందాలను పరికిస్తా
చందమామను పలకరిస్తా
తారామండలానికి వెళ్ళిస్తా
గ్రహగతుల్ని వీక్షిస్తా
ఖగోళపు వింతల్ని పరిశీలిస్తా
విశ్వరహస్యాన్ని ఛేదిస్తా
గ్రహాంతర వాసులతో చెలిమిచేస్తా
భూగోళపు గొప్పదనం తెలియజేస్తా”
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం చెయ్యండి.
జవాబు:
కలాం సందేశం :
ప్రియ విద్యార్థులారా! భారత భవిష్య నిర్ణేతలారా!

మీ ఉత్సాహం, మీ ఆసక్తి చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం గమనిస్తే మీరంతా నా ప్రతిబింబాలలాగే ఉన్నారు. ఇప్పుడు వయసు ఉడిగి వృద్దుడినైనా మానసికంగా ఉత్సాహంగా, బలంగానే ఉన్నా. నా ఈ స్థితికి కారణం నా గురువుల సందేశాలే. మనం ఏదైనా సాధించాలంటే దాన్ని గురించిన కోరిక బలంగా ఉండాలి. సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితులెదురైనా ఆశను వీడకూడదు. అప్పుడే మనం దాన్ని సాధించగలం. జీవితంలో ఏరకమైన లక్ష్యాన్నైనా సాధించాలంటే ఇదే సులభమైన మార్గం. ముందు మీ కోరిక ఏదనే దానిపై ఒక స్పష్టత కలిగి ఉండండి. దాన్ని సాధించగలననే విశ్వాసాన్ని పెంచుకోండి. లక్ష్యం చేరేవరకు నిరాశను దగ్గరకు రానివ్వవద్దు. “విశ్వాసంతో మనం మన విధిని కూడా తిరిగి రాయగలం”. ఇది నిజం.

చిన్నారులారా! ఇతురుల్ని బాగా అర్థం చేసుకున్నవాడే విజ్ఞాని. తన గూర్చి తాను తెలుసుకున్నవాడే వివేకి. కానీ వివేకం లేని విజ్ఞానం ఏమాత్రం ప్రయోజనం లేనిది. నేడు విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు గాని వివేకాన్ని కోల్పోతున్నారు. అందువల్లే చాలా దేశాల మధ్య పరస్పర ద్వేషాలు రగులుతున్నాయి. యుద్ధాలకు కారణాలవుతున్నాయి. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మనిషి విజ్ఞాని, వివేకి కావాలి.

ఏకపాత్రాభినయం :
తేది: 17 – 05 – 1974.
రంగం : ఢిల్లీ నగరంలోని కలాం వసతి గృహంలో ప్రయోగశాల.
సమయం : రాత్రి 11.00
సన్నివేశం : ఏకాంతంగా ప్రయోగశాలలో సంచరిస్తూ, ఆలోచిస్తున్న సన్నివేశం.

కలాం అంతరంగ మథనం :
(దీర్ఘంగా నిట్టూర్చి) ఏమిటీ వింత స్థితి? ఎన్నడూ నా జీవితంలో లేదే ఈ పరిస్థితి? ఎందుకు నా హృదయస్పందన నాకే తెలుస్తోంది నా శరీరావయవాల కంపం ఆగటంలేదెందుకు? అవునులే! రేపు జరగబోయేదేమన్నా చిన్నకార్యమా? యావత్ ప్రపంచం విస్తుపోయే కార్యం! పొరుగుదేశాలే కాక, అవకాశం కోసం పొంచి ఉన్న గుంటనక్కల లాంటి పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు కన్నుకుట్టే సన్నివేశం. భారతీయులంతా సగర్వంగా తలలెత్తుకొని ఆనందంగా “వందేమాతరమ్” అని ఎలుగెత్తి నినదించే ఘటన. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కుళ్ళుకొని కుమిలిపోయే సంఘటన. నేపాల్, రష్యా వంటి మిత్రదేశాలు “శెహభాష్” అని ప్రశంసల జల్లు కురిపించే పని. టెక్నాలజీలో తామే గొప్పని విర్రవీగే జపాన్, జర్మనీ వంటి దేశాలు సిగ్గుతో చిమిడిపోయే ఘనకార్యం. అవును ఆ విషయాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆనందంతో శరీరం గాలిలో తేలుతున్నట్లుంది.

నా దేశం, నా భారతదేశం రేపు మొట్టమొదటిసారిగా అణు పరీక్షను జరపబోతోంది. తన అణుసామర్థ్యాన్ని ప్రదర్శించబోతోంది. పాక్, చైనా వంటి దేశాలు ఇక కవ్వింపు చర్యలాపి, తోక ముడవాల్సిందే. భారతమాత శక్తి యుక్తులను తలచి మోకరిల్లాల్సిందే. అగ్రరాజ్యాలిక ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాల్సిందే. నేపాల్, భూటాన్, బర్మా వంటి చిన్న దేశాలు భారతదేశం పంచన చేరాల్సిందే. ఇంతవరకూ శాంతికి ప్రతీకగా నిలిచింది నా దేశం. కానీ శాంతిని కోరడం చేతకానితనంగా భావించింది ప్రపంచం. తనకై తాను కయ్యానికి కాలు దువ్వనని, తన జోలికి వస్తే మాత్రం తాట తీయకుండా వదలనని ప్రపంచానికి చాటి చెపుతుంది నా దేశం.

కానీ ఇవన్నీ జరగాలంటే రేపటి అణుపరీక్ష విజయవంతం కావాలి. లేకుంటే ………… (చెవులు మూసుకొన్నట్లు నటించి), అపహాస్యాన్ని, ఎగతాళిమాటలను ………….. భరించాలి. నో………. అలా జరగడానికి వీలులేదు. దేశాన్ని అవమానాలపాలు చేయడం కంటే ఆత్మాహుతి మేలు.

మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కార్మికుని నుండి కార్యదర్శి దాకా అందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తును కోరి కష్టపడ్డాం. అయినా మానవాతీతమైనది కదా దైవం. దైవం ధర్మానికి బద్ధుడని భారతీయ తత్త్వశాస్త్రం ఘోషిస్తోంది. మేము మా ధర్మానికి కట్టుబడే ఈ ప్రయత్నం చేశాం. భారతదేశం కూడా ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాన్ని తయారుచేసుకుంది తప్ప వేరే దేశాలకు హానిచేయడం కోసం కాదు. కాబట్టి దైవం తప్పక భారతదేశానికి సహకరిస్తాడు.

అవును, నా మనస్సు దృఢంగా నమ్ముతోంది. రేపు తప్పక విజయం లభిస్తుంది. భారతదేశమంతా ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ చక్కని సన్నివేశాన్ని ఇప్పుడు దర్శిస్తా. రేపు కళ్ళతో చూసి హర్షిస్తా. ఇక విశ్రమిస్తా. (నిద్రకు ఉపక్రమిస్తాడు)

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

కలాం గురించి చాలా విషయాలు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! కలాం జీవితం నుండి మనం నేర్చుకోదగిన మంచి విషయాలేమిటి? వీటిలో మీరు వేటిని ఆచరణలో పెడతారు?
జవాబు:
కలాం జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా మొదలు పెట్టిన పనిని పూర్తిచేయడం వంటి ఎన్నో మంచిగుణాలు కలాంలో ఉన్నాయి. వీటిల్లో ఆయన ఆత్మ విశ్వాసాన్ని, కష్టాల్లో కూడా లక్ష్యాన్ని విడిచి పెట్టకపోవడాన్ని నేను ఆచరణలో పెడదామనుకుంటున్నాను. ఇలాగే జీవిత లక్ష్యానికి సంబంధించిన దాన్ని మనస్సులో బలంగా కోరుకోవడం, కోరుకున్నదాన్ని సాధించగలనని విశ్వసించడం, ఎన్ని అడ్డంకులెదురైనా ఆశ వీడకపోవడం అనే దాన్ని కూడా ఆచరణలో పెడతాను.

IV. ప్రాజెక్టు పని

* మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెలా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుకున్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. భౌతికశాస్త్రంలోను, జీవశాస్త్రంలోను భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త. ఈయన స్వేచ్ఛగా సంచరించే మనుషులకు, ఇతర జంతుజాలానికే కాక కదలని చెట్టుచేమలకు కూడా ప్రాణం ఉందని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త.

ఈయన చెట్టు, తీగలకు ప్రాణం ఉందని నిరూపించడంలో, మహాభారతంలోని శాంతిపర్వంలో భరద్వాజ – భృగుమహర్షుల సంభాషణ ఆయనకు మంచి ప్రేరణ ఇచ్చిందని ఆయన తాత్త్వికత గురించి తెలిసిన పెద్దలు చెప్తారు. ఆ సంభాషణ ఇది –
భృగుమహర్షి : బ్రహ్మ ఈ సృష్టి అంతటిని పంచమహాభూతాల సమ్మేళనంతో చేశాడు.

భరద్వాజ మహర్షి : స్థావరజంగమములలో ఈ పంచభూత ధాతువులు కనిపించడం లేదు గదా మహాత్మా ! అవి వినలేవు – చూడలేవు – వాసనను గ్రహించలేవు – స్పర్శలేదు గదా !

భృగుమహర్షి : బలమైన గాలులకు, అగ్నికి, ఉరుములకు, పిడుగులకు, ఫలాలు, పుష్పాలు చెదిరిపోతాయి. అంటే వాటినుండి వచ్చే ధ్వనిని గ్రహించే అవి అలా అవుతున్నాయి. కాబట్టి అవి వినగలుగుతున్నట్లే గదా!

“వాయ్వగ్యశని నిర్దోషైః ఫలం పుష్పం విశీర్యతే|
శ్రోత్రేణ గృహ్యతే శబ్దః తస్మాత్ శ్రుణ్వంతి పాదపాః ||

(అధ్యాయం – 184, శ్లో|| 12)
తీగలు చెట్లను అల్లుకొని పై పైకి పాకుతాయి. కొమ్మలు ఎటు వ్యాపించాయో చూడకుండా అవి అలా పాకలేవు గదా! కాబట్టి అవి చూడగలవు.

“వల్లీ వేష్టయతే వృక్షం సర్వతః చైవ గచ్ఛతి!
న హి అదృష్టశ్చ మార్గో 2 స్తి తస్మాత్ పశ్యంతి పాదపా?”|| (అ|| 184 – శ్లో|| 13)
చెట్లకు వచ్చే రకరకాల తెగుళ్ళను పోగొట్టడానికి సుగంధమైన, దుర్గంధమైన రకరకాల ధూపాలను వేస్తాం. అప్పుడు ఆ తెగుళ్ళు పోయి అవి పుష్పిస్తాయి. అంటే అవి వాసనను గ్రహించగలిగినట్లే గదా!

“పుణ్యాపుడ్యైః తథా గంధైః ధూ పైశ్చ వివిధైరపి
అరోగాః పుష్పితాః సంతి తస్మాత్ జిఝంతి పాదపాః”|| (అ|| 184 – శ్లో|| 14)
చెట్లు నీటిని స్వీకరిస్తున్నాయి. వాటికి వచ్చే రోగాలకు ఔషధాలు ఇవ్వడం ద్వారా నయం చేయగలుగుతున్నాము. కొమ్మను నరికేశాక కొన్నాళ్ళకు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. అవి కూడా సుఖదుఃఖాలకు స్పందిస్తున్నాయి. వాటికి జీవం ఉన్నట్లే కదా!

భారతీయ గ్రంథాలను ‘వైజ్ఞానిక దృష్టితో పరిశోధించే సుభాష్ చంద్రబోస్ మహాశయుణ్ణి ఈ సంభాషణ బాగా ఆకర్షించింది. తన పరిశోధనను ఈ వైపుగా కొనసాగించి క్రెస్కోగ్రాఫ్ ను ఆవిష్కరించాడు. దీని సహాయంతో మొక్కలకు జీవం ఉందని, తీవ్రమైన కాంతికి, ధ్వనికి అవి స్పందిస్తాయని, వాటిలో జీవలక్షణమైన పెరుగుదల ఉందని ఆధునిక ఆధును. ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశాడు. వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహునిగా కీర్తించబడినాడు.
(లేదా)
* శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించండి.
జవాబు:
పైన చెప్పిన పని మీరు మిత్రులతో కలసి పూర్తిచేయండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా :
వివేకానందుడు రామకృష్ణుని పథంలో పయనించాడు.
పథం = మార్గం
మహాత్ములు చూపిన మార్గంలో పయనించాలి.

1. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
జవాబు:
ఔత్సాహికుడు = ఉత్సాహం గలవాడు – ఉత్సాహం గలవాడికే ఉన్నత స్థితి త్వరగా లభిస్తుంది.

2. జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జవాబు:
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక గలవాడు.
జగదీష్ చంద్రబోస్ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక గలవాడు.

3. బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
జవాబు:
ప్రత్యామ్నాయము = ఇతర సౌకర్యం
నేడు మా నగరానికి గవర్నర్ వస్తున్న కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

4. వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
జవాబు:
ప్రభావితం చేయు = ప్రేరణ కలిగించు, ప్రకాశింపజేయు.
కలాం బోధనలు యువతలో ప్రేరణ కలిగించాయి.

5. సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష.
జవాబు:
ఆకాంక్ష = కోరిక
నేను ఇంజనీర్ ను కావాలని మా తల్లిదండ్రుల కోరిక.

6. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
జవాబు:
వాగ్దానం = మాట ఇవ్వడం
మాట ఇవ్వగానే సరికాదు, దాన్ని నిలుపుకోగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) పాఠం చదివి కింది పదాలను వివరించి రాయండి.
1. ఆకాశయానం : ఆకాశంలో ప్రయాణించడం, విమానాల్లో తిరగడం.
2. అణు భౌతికశాస్త్రం : అణువులు, వాటి విచ్ఛేదనం వలన ఉత్పన్నమయ్యే శక్తి మొదలైన వాటిని గురించి వివరించే శాస్త్రం.
3. సాంకేతిక విద్య : సాంకేతికత (Technology) ను బోధించే విద్యను సాంకేతిక విద్య అంటారు.
ఉదా :
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్
4. ప్రొఫెషనల్ చదువు : వృత్తికి సంబంధించిన చదువు.
5. జ్ఞానతృష్ణ : తృష్ణ అంటే కోరిక. జ్ఞానాన్ని సంపాదించాలనే కోరికను జ్ఞానతృష్ణ అంటారు.

ఇ) ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
ఉదా : ఎరోనాటికల్ ఇంజనియర్
1) ప్రొఫెషనల్
2) ఫిజిక్స్
3) ఇంజనీరింగ్
4) ఏరోనాటికల్ ఇంజనీరింగ్
5) ఏ ప్లేన్
6) డిజైన్
7) ఏరోడైనమిక్ డిజైన్
8) చోదనం
9) నిర్మాణం
10) అదుపు
11) ఉపకరణ సామాగ్రి
12) రూపకల్పన
13) డ్రాయింగ్
14) డ్రాయింగ్ బోర్డ్
15) ప్రాజెక్ట్
16) ఇంజన్ ఓవరహాలింగ్
17) విమానాల ఓవరాలింగ్
18) ప్రాక్టికల్
19) పిస్టన్
20) టర్బయిన్
21) ఇంజన్
22) వాయుపదార్థాల డైనమిక్స్

ఈ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలు సమానార్థాన్ని ఇస్తాయి. ఆ పదాలతో కొత్త వాక్యాలు రాయండి.

1. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో – ఇష్టం.
జవాబు:
ఆకాశంలో విమానాలు వెళతాయి. ఆ గగనంలోకే రాకెట్లు దూసుకెళతాయి. ఉపగ్రహాలన్నీ నింగి లోనే సంచరిస్తాయి.

2. భూమిమీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు:
భూమి మానవునికి నివాసం. వసుధ గురించి మానవుడెంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఈ ధరణిని నిర్లక్ష్యం చేస్తే మనుగడే ఉండదు.

3. ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలయింది. నెలకు దాదాపు నలభై వేలు సంపాదిస్తున్నాడు.
జవాబు:
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 66 సంత్సరాలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇంచుమించు 63 సంవత్సరాలు. మన పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టి దాదాపు 63 సంవత్సరాలు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఉ) కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి – వికృతి పదాలున్నాయి. వాటిని గుర్తించి పట్టికగా రాయండి. వాటితో కొత్త వాక్యాలు తయారుచేయండి.
1) ఆకాశం మేఘావృతమైనది. ఆకసం నిండా మబ్బులున్నాయి.
2) మా ఉపాధ్యాయుడు పాఠాలు బాగా చెప్తారు. అందుకే మా ఒజ్జ అంటే మాకిష్టం.
3) అగ్ని దగ్గర జాగ్రత్త అవసరం. అగ్గితో ఆటలాడగూడదు.
4) సముద్రంలో గవ్వలుంటాయి. సంద్రంలో అలలు వస్తుంటాయి.
5) ఆకాశంలో పక్షి ఎగురుతోంది. పక్కిలా ఎగరటమంటే పవన్ కు ఎంతో సరదా.
జవాబు:
ప్రకృతి-వికృతి పదముల పట్టిక :
1. ఆకాశం – ఆకసం
2. ఉపాధ్యాయుడు – ఒజ్జ
3. అగ్ని – అగ్గి
4. సముద్రం – సంద్రం
5. పక్షి – పక్కి

కొత్త వాక్యాలు :

  1. ఆకసంలో చందమామ వెలిగిపోతున్నాడు. ఆకాశంలో తారకల అందానికి మరేదీ పోటీ కాదు.
  2. బాల్యంలో కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్. ఆ ఒజ్జను 82 సం||ల వయస్సులో కూడా సంస్మరిస్తాడు కలాం.
  3. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఈ కాలంలో అగ్గిని ఆపాలంటే ఎక్కువ కష్టపడాలి.
  4. భారతదేశానికి దక్షిణాన హిందూమహాసముద్రం ఉంది. ఆ సంద్రం ఒడ్డున సూర్యాస్తమయ సన్నివేశాన్ని చూడటానికి యాత్రికులు పోటీపడతారు.
  5. మా బడి దగ్గర తుమ్మచెట్టుకు గిజిగాడు పక్షిగూడు వేలాడుతోంది. పక్కి ఆ గూటిని ఎంతో అందంగా నిర్మించింది.

వ్యాకరణం

అ) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.

2. “నేను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే తనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడని కలాం చెప్పాడు.

3. “నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడని కలాం చెప్పాడు.

4. “నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురంలో ఉన్న కాలంలో తమ అనుబంధం గరుశిష్య బంధాన్ని దాటి వికసించిందని కలాం చెప్పాడు.

5. “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాలి” చెప్పాడు సోలోమోన్.
జవాబు:
జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికీ అతడు మూడు అంశాల మీద పట్టు సాధించాలని సోలోమోన్ చెప్పాడు.

6. “నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తానని కలాం చెప్పాడు.

7. “నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి” కలాం చెప్పాడు.
జవాబు:
తనకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తని కలాం చెప్పాడు.

8. “కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి” చెప్పాడు కలాం.
జవాబు:
కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, తాను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణని కలాం చెప్పాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

9. ”నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మానని కలాం అన్నాడు.

10. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అనేవాడు సోలోమోన్.
జవాబు:
విశ్వాసంతో అతడు తన విధిని కూడా తిరిగి రాయగలడని సోలోమోన్ అనేవాడు.

11. “నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు మా అన్నయ్య” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా తనను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు తన అన్నయ్య అని చెప్పాడు కలాం.

12. “నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం , నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి” అన్నాడు కలాం.
జవాబు:
తాను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి అని కలాం అన్నాడు.

13. “మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా తనను వదలిపెట్టగానే తన తమ్ముడు కాశిం మహమ్మద్ తనని అతని ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడని కలాం చెప్పాడు.

14. “నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను సెంట్ జోసె లో తన చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నానని కలాం అన్నాడు.

15. “దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది” చెప్పాడు కలాం.
జవాబు:
దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల తనకు అమితమైన ఆసక్తి ఏర్పడిందని కలాం చెప్పాడు.

16. “నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది” అన్నాడు కలాం.
జవాబు:
తనకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చిందని కలాం అన్నాడు.

17. “ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు” చెప్పాడు కలాం.
జవాబు:
ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా తనకేమీ తెలియదని కలాం చెప్పాడు.

18. “బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను” అన్నాడు కలాం.
జవాబు:
బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం తన సబ్జెక్ట్ కాదని గ్రహించానని కలాం అన్నాడు.

19. “నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన కలలు నిజం కావాలంటే తాను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నానని కలాం చెప్పాడు.

20. “ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు” అన్నాడు కలాం.
జవాబు:
ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే తాను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చని కలాం అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

21. “అప్పుడు నా సోదరి ఊహారా నాకు తోడు నిలబడింది” చెప్పాడు కలాం.
జవాబు:
అప్పుడు తన సోదరి జొహారా తనకు తోడు నిలబడిందని కలాం చెప్పాడు.

22. “నేను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి” అన్నాడు కలాం.
జవాబు:
తను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, తన సామర్థ్యంపై ఆమె నమ్మకం తనను గాఢంగా చలింపచేశాయని కలాం అన్నాడు.

23. “నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
తాను తన సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నానని కలాం పేర్కొన్నాడు.

24. “నా మొదటి సంవత్సరం పూర్తయ్యాకజకు ప్రత్యేక విషయాన్ని పంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నానని కలాం చెప్పాడు.

25. “లక్ష్యం నా మనస్సులో స్పష్టంగానే ఉండింది” అన్నాడు కలాం.
జవాబు:
లక్ష్యం తన మనస్సులో స్పష్టంగానే ఉండిందని అన్నాడు కలాం.

26. “ఎమ్.ఐ.టి. లో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
ఎమ్.ఐ.టి. లో తన విద్యాభ్యాసంలో తన ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని కలాం పేర్కొన్నాడు.

27. “విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యింది” చెప్పాడు కలాం.
జవాబు:
విస్తృత పరిజ్ఞానం తన మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యిందని కలాం చెప్పాడు.

28. “ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారు” అన్నాడు కలాం.
జవాబు:
ఒకరోజు తమ డైరెక్టర్, తమకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ తమ పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారని కలాం అన్నాడు.

29. “ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయాను” చెప్పాడు కలాం.
జవాబు:
ఆ రాత్రి తాను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయానని కలాం చెప్పాడు.

30. “నేను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నానని కలాం అన్నాడు.

31. “రా నాతోపాటు ముందు కూర్చో” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
తనతో పాటు ముందు కూర్చొనుటకు రమ్మని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

32. “నువ్వు నా బెస్టు స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
అతడు తన బెస్టు స్టూడెంట్ అని, అతని పరిశ్రమ అతని ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుందని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

1. పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెలరోజుల వ్యవధి అవసరం లేదు.

2. నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను.

ఇ) కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు

1. కర్తరి వాక్యం :
క్రియ చేత కర్త చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. ఇది సూటిగా అర్థమవుతుంది. ఇది తెలుగు భాషకు సహజసిద్ధమైంది.
ఉదా :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలను చెప్పారు.

2. కర్మణి వాక్యం :
క్రియ చేత కర్మ చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. ఇది కాస్త చుట్టు తిప్పి చెప్పినట్లుంటుంది. ఈ వాక్యాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులో ఏర్పడ్డాయి. ఇంగ్లీషులో ఇటువంటి వాక్య పద్ధతి ఉంది.
ఉదా :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇలాగే మీరు మార్చండి.
1. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భారతం రమేష్ చే చదవబడింది. (కర్మణి వాక్యం)

2. నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. (కర్మణి వాక్యం)

9th Class Telugu 4th Lesson ప్రేరణ రచయిత పరిచయం

ఆ అందరూ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలామ్ 1931 అక్టోబర్ 15 న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.

శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని | విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి.

కఠిన పదాలకు అర్థాలు

జిజ్ఞాసి = తెలిసికోవాలనే కోరిక కలవాడు
మేల్కొను = ముందు జాగ్రత్తపడు
జీవితావకాశాలు = జీవితంలో వచ్చే అవకాశాలు
ప్రత్యామ్నాయాలు = బదులుగా చేసే పనులు
ఔత్సాహికుడు = ఉత్సాహం కలవాడు
ఆదర్శపథము = ఆదర్శ మార్గం
నిర్దేశకుడు = ఉపదేశించేవాడు ; చూపించేవాడు
ఉదార = గొప్పదైన
దృక్పథము = ఆలోచనా ధోరణి లేదా సరళి
అనుబంధం = సంబంధం
గురుశిష్య బంధము = గురుశిష్యుల సంబంధం
సాహచర్యం = కలిసి ఉండడం
జీవిత గమనం = జీవితం నడవడి
ప్రభావితం = ప్రభావము పడినది
పట్టు = ఊత
ఆశ పెట్టుకోవడం = కోరిక కలిగి ఉండడం
సంభవించాలని = జరగాలని ; కలగాలని
ఆకాంక్షించాలని = కోరాలని
ప్రగాఢంగా = మిక్కిలి అధికంగా
విశ్వసించాలి = నమ్మాలి
అమితాసక్తి (అమిత+ఆసక్తి) = అంతులేని ఆసక్తి
స్పృహ = ఇచ్ఛ, కోరిక
విధిని = భాగ్యమును (విధి రాతను)
దృఢ సంకల్పం = గట్టి లక్ష్యము
ఇనుమడించింది = రెట్టింపు అయ్యింది
ప్రొఫెషనల్ చదువులు = వృత్తి విద్యలు
క్లుప్తంగా = సంక్షిప్తంగా
అదృశ్యం = కనబడనిది
కష్టార్జితం (కష్ట + ఆర్జితం) = కష్టంతో సంపాదింపబడినది
కంచి పరమాచార్య = కంచిలో గల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ శంకర మఠం అధ్యక్షులు)
అనుచరులు = సహాయకులు
త్యాగనిరతి = దానము చేయుటయందు మిక్కిలి ఆసక్తి
కేంపస్ = ప్రాంగణం
దృశ్యం = చూడదగినది
ఉద్వేగభరితుణ్ణి = కలతతో నిండినవాణ్ణి
మక్కువ = ప్రేమ
సర్వశ్రేష్ఠకృతుల్ని = అన్నింటికంటె గొప్ప కావ్యాల్ని
అంశము = విషయం
విజ్ఞానశాస్త్ర పథం = సైన్సు మార్గం
భవిష్య అవకాశాలు = రాబోయే కాలంలో వచ్చే అవకాశాలు
సమాచారం = వార్త
సబ్జెక్ట్ (subject) = విషయం
సాంకేతిక విద్య = యాంత్రిక విద్య
తలమానికం = శిరోరత్నం
దరఖాస్తు = అభ్యర్థన పత్రం
ఎంపిక = ఎన్నుకొను
ప్రతిష్టాత్మక సంస్థ = పేరుపొందిన సంస్థ
తలకు మించిన విషయం = తన వల్ల కాని విషయం
తోడు నిలబడింది = సహాయంగా నిలబడింది (సాయం చేసింది)
కుదువబెట్టి = తాకట్టుపెట్టి
ఆకాంక్ష = గాఢమైన కోరిక
చలింపచేశాయి = కదిలించాయి
స్కాలర్‌షిప్ = ఉపకార వేతనం (scholarship)
మిన్నగా = అధికంగా
ఆరాధిస్తూ = పూజిస్తూ (గౌరవిస్తూ)
ఏరోనాటికల్ ఇంజనీరింగు = విమానాలను నడపడానికి సంబంధించిన ఇంజనీరింగు
లక్ష్యం = గురి
సాధ్యము = సిద్ది
నేపథ్యం = తెరవెనుక విషయము (పూర్వ రంగం)
వైఫల్యాలు = ప్రయత్నము జయప్రదం కాకుండా పోవడం, (Failures)
ఆశాభంగాలు = కోరిక భగ్నం కావడాలు
ఉత్తేజకరము = ప్రేరణను ఇచ్చేది
వివేకి = విచారణ చేయువాడు
ప్రయోజన శూన్యం = ఉపయోగం లేనిది
వ్యక్తిత్వం = వ్యక్తికి సంబంధించిన స్వభావం
ఆశయము = అభిప్రాయం
జ్ఞానతృష్ణ = జ్ఞాన సంపాదనమందు ఆసక్తి
చైతన్యం = జ్ఞానం (తెలివి)
అకుంఠిత సంకల్పం = మొక్కవోని కోరిక (తిరుగులేని అభిప్రాయం)
ఉవ్విళ్ళూరించే = మిక్కిలి ఆశించే ; (త్వరపడే)
వ్యత్యాసము = భేదం
నిశిత బోధన = మెఱుగు పెట్టబడిన బోధన
ఏరోనాటిక్స్ = వైమానిక సంబంధమైనది
తృష్ణ = పేరాస
జాగరితం = మేల్కొనడం
మేధాగరిమ = గొప్ప తెలివి

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

సమగ్రత = సంపూర్ణం
బలోపేతం = బలంతో కూడినది
సమీకరింపబడటం = ఒకటిగా చేయబడటం
ఏరోప్లేన్ = విమానం (Aeroplane)
సమగ్రవంతం = సంపూర్ణము కావడం
సహకరించారు = సాయం చేశారు
కోర్సు (course) = పాఠ్య ప్రణాళిక
డిజైన్ (design) = నమూనా, ప్రణాళిక (Design)
ప్రగతి = అభివృద్ధి
సమీక్షించి = పరామర్శించి
పురోగతి = ముందుకు నడచుట
నిరాశాజనకం = నిరాశను పుట్టించేది
సాకులు = వంకలు
వ్యవధి = మేర,ఎడమ
భాగ్య రేఖ = అదృష్ట రేఖ
నిమగ్నుడు = మునిగినవాడు
కావలించుకొని = ఆలింగనం చేసుకొని
ప్రశంసాత్మకంగా = పొగడబడే విధంగా
వెన్నుతట్టు = ధైర్యము చెప్పు
నెడుతున్నాను = గెంటుతున్నాను
ఆసక్తి = అపేక్ష
మార్గదర్శి = మార్గాన్ని చూపేవాడు
మహామేధావి = గొప్ప తెలివి కలవాడు
వీడ్కోలు = పోవడానికి అంగీకారం తెల్పడం
ఇంజన్ ఓవర్ హాలింగ్ = ఇంజనను పరిశుభ్రం చేయడం
ప్రాక్టికల్స్ (practicals) = ప్రయోగాలు
ఉద్వేగాన్ని = కలతచెందిన మనస్సును
పసిగట్టడం = సూచనగా తెలిసికొను
డైనమిక్స్ = ఇది ఫిజిలో ఒక భాగం ప్రతిభ = తెలివి
అంశాలు = విషయాలు
బోధపడ్డాయి = అర్థమయ్యాయి
గ్రాడ్యుయేట్ (graduate)=పట్టభద్రుడు
చిరకాల స్వప్నం = చాలాకాలం నుండి ఉన్న కల
ఉపాధి అవకాశాలు = బ్రతుకు తెరువుకు దారులు
ఆధ్వర్యం = పెత్తనం
కాల్ లెటర్లు (call letters) = రమ్మని పిలిచే ఉత్తరాలు
కోరమాండల్ తీరం = భారతదేశానికి తూర్పు వైపున క్రింది భాగాన ఉన్న సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.

కోరమాండల్ తీరబాలుడు అంటే తూర్పు సముద్ర తూర్పు తీరాన పుట్టిన ‘కలాం’

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 3 శివతాండవం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట నా గానపు మధురిమలకు కృష్ణమురళి మోగిందట నా గానపు రసఝరిలో ప్రకృతి నాట్య మాడిందట

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పంక్తులు దేని గురించి చెబుతున్నాయి?
జవాబు:
గాన మహిమ గురించి చెబుతున్నాయి.

ప్రశ్న 2.
ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలేవి?
జవాబు:
తాండవం, నర్తించడం, నాట్యమాడటం.

ప్రశ్న 3.
ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి?
జవాబు:
గానం యొక్క గొప్పదనానికి ఒళ్ళు పులకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 4.
ఇలాంటి గేయం మీకు తెలుసా?
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” గేయం రాశారనీ, అందులో గేయ పంక్తులు ఇలాగే ఉంటాయనీ మా గురువులు చెప్పగా విన్నాను. శివతాండవంలోని కొన్ని గేయ పంక్తులు ఇవి.
ఉదా :
1) బంగరు పులుగుల వలె మబ్బులు విరిసినవి.
2) వియచ్చర కాంతలు జలదాంగనలై వచ్చిరొయేమో.
3) అలలై బంగరు కలలై.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
మీకు తెలిసిన నాట్యరీతుల గురించి చెప్పండి.
జవాబు:
కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథాకళి, మోహినీ అట్టం.

ప్రశ్న 2.
‘శివతాండవం’ గేయాన్ని లయబద్దంగా పాడండి. ఇది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
జవాబు:
అచ్చ తెలుగు పదాల అందం తెలిసింది. గేయం వినసొంపుగా ఉండి, తెలియని ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 3.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని “నల్లకలువలు విచ్చుకొన్నట్లు, నల్లని కొండలు పగిలినట్లు, చీకట్లు వ్యాపించినట్లు” – ఇలా ఎన్నో అంశాలతో పోల్చారు కదా ! ఇలాంటి పోలికల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
ప్రకృతిని కవి చక్కగా వర్ణించాడు. ఈ వర్ణన ద్వారా శివుని తాండవాన్ని మన కన్నులకు కట్టేలా చూపగలిగాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) గేయంలో అంత్యప్రాస పదాలు ఏమున్నాయి? పాఠ్యభాగంలో గుర్తించి కింద గీత గీయండి.
జవాబు:
శివుడు భవుడు; పూయ ఘోయ; విధాన; అట్లు

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

మహాశివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని 14 మార్లు మోగించాడు. ఆ ధ్వని విశ్వవ్యాప్తమైంది. పాణిని అలా వెలువడ్డ శబ్దాలను స్వీకరించి సంస్కృత భాషలో సూత్రమయమైన వ్యాకరణాన్ని రచించాడు. “అ ఇ ఉణ్, ఋ, ఇక్ ……. అంటూ 14 మాహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ రచన ఆరంభించాడు. ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 1.
శివుడు డమరుకం ఎందుకు మోగించాడు?
జవాబు:
శివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని మోగించాడు.

ప్రశ్న 2.
పాణిని వ్యాకరణం గొప్పతనం ఏమిటి?
జవాబు:
ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 3.
పై సన్నివేశం దేనికి ప్రారంభంగా చెప్పవచ్చు?
జవాబు:
పాణిని సంస్కృత వ్యాకరణ రచనకు ప్రారంభంగా చెప్పవచ్చు.

ఈ) కింది ప్రశ్నలకు పాఠ్యాంశం నుండి సంక్షిప్తంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠంలో గేయంలోని మొదటి చరణం చదవండి. శివతాండవాన్ని కవి ఎలా వర్ణించాడో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా, అందమైన పూలను కుప్పపోసినట్లుగా, తెల్లని విబూదితో పూత పెట్టినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచి పెట్టినట్లుగా, పచ్చ కర్పూరాన్ని తెచ్చి కలియజల్లినట్లుగా, మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు వెల్లివిరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
‘తమ్ములై’ – అంటూ సాగిన గేయంలో శివుని నాట్యాన్ని కవి కొన్ని పూలతో పోల్చాడు. వాటిని తెలపండి.
జవాబు:
శివుని తాండవం తామరపూలు విప్పారినట్లుంది. శుభాలనిచ్చేదిగా ఉంది. అప్పుడే విచ్చిన తాజా పూమొగ్గల్లా, వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలచే కప్పబడిన తామరలా ఉంది. కొత్త రత్నాల్లాగా ఉంది.

ప్రశ్న 3.
తెల్లదనాన్ని తెలిపే కొన్ని అంశాలతో శివతాండవాన్ని పోల్చారు. ఉదాహరణకు ‘వెన్నెల కురుస్తున్నట్టు’ మొదలైనవి. ఇలాంటి అంశాలను కొన్నింటిని రాయండి.
జవాబు:
శివుని తాండవం స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లు, తెల్లని విబూదితో పూత పెట్టినట్లు ఉంది. జాజిపూలను కుప్పలుగా పోసినట్లు, మంచును కుప్పలుగా పేర్చినట్లుంది. మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లు, పచ్చ కర్పూరం కలియజల్లినట్లుగా ఉంది. ఇంకా ఆనందం కన్నుల నుండి కారుతున్నట్లుగా, అమృతాన్ని పంచినట్లుగా ఉంది.

ప్రశ్న 4.
శివుని నాట్యాన్ని వర్ణించే కొన్ని పంక్తులను రాసి, వాటిని వివరించండి.
జవాబు:
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు

శివుని తాండవం మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి, అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకే చోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒక చోట చేరి ముసిరి ఉన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకున్నట్లుగా శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళనుంచి కారిపోతున్నట్లుగా, మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కనిపిస్తున్నట్లుగా ఉంది. చురుకు నీలపు కళ్ళలో కాంతులు వికసిస్తుండగా పాదాలకున్న గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

ఇందులో నలుపే ఎక్కువగా వర్ణించబడింది. సాధారణంగా, నలుపును అశుభసూచకంగా లోకం భావిస్తుంది. కానీ నలుపు కూడా దైవ స్వరూపమే అని కవి చెప్పడం వలన లోకంలో దైవ స్వరూపం కానిదేదీ లేదనే భావన కలుగుతుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వసంతశోభ ఎలా కమ్ముకుందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వసంత ఋతువు ఆరంభం కాగానే ఎండిన చెట్లకు జీవం వచ్చి క్రమంగా లేజిగురాకులు రాసాగాయి. చెట్లు, తీగలు, పూలతో నిండి కొత్త శోభను వెదజల్లుతున్నాయి. లేజిగురాకుల ఎర్రని సోయగం వింత కాంతిని విరజిమ్ముతుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. పూలపై నుంచి వచ్చే పరిమళాలతో కూడిన గాలులు జనాలను ఉత్సాహ పరుస్తున్నాయి. మామిడి చిగుళ్ళను తిని మదించిన కోయిలల కుహూ రాగాలతో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
ఈ పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో మీకు బాగా నచ్చిన అంశమేది? అది ఎందుకు నచ్చింది? వివరించండి.
జవాబు:
పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే – శివుని తాండవం అలలు కదలినట్లుగా, చిరుగాలికి ఆకులు కదలినట్లుగా ఉంది. తామర పూలు కదలినట్లు, పూలలోని సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. తెరపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళ వీణలు మోగినట్లు, నెమలి అందమైన తన పింఛాన్ని విప్పినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదిలినట్లు, నవ్వులో లేత వలపు జాలువారినట్లుంది. చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూస్తుండగా, ఘల్లు ఘల్లుమని పాదాలకున్న చిలిపి గజ్జెలు మోగేలా శివుడు ఆడుతూ పాడుతున్నాడు. నెమలి పురివిప్పి ఆడడం, అలలు కదలడం, సువాసనలు వ్యాపించడం, గాలికి ఆకులు కదలడం, తెరపై బొమ్మలు నటించడం, నవ్వులో ప్రేమ ఒలకపోయడం ఇవన్నీ నిత్య జీవితంలో మన కెదురయ్యే అనుభవాలు. ఇలాంటి వాటితో శివతాండవాన్ని పోల్చడం వలన అది మన కనుల ముందు కన్పిస్తున్న భావన కలుగుతుంది. అందువలన ఈ భాగం నాకు బాగా నచ్చింది.

ప్రశ్న 3.
“శివుని తాండవం కర్పూరం చల్లినట్లుంద”ని కవి భావించాడు. దాని ఆంతర్యాన్ని మీరు ఏమని భావిస్తున్నారు?
జవాబు:
పచ్చకర్పూరం తెల్లగా ప్రకాశిస్తుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇంతేగాక వింత పరిమళాన్ని వెదజల్లుతుంది. శివతాండవాన్ని కవి పచ్చకర్పూరంతో పోల్చడం వలన తెల్లదనం ఎలా అంతా వ్యాపిస్తుందో అలా తాండవం దిక్కులంతా వ్యాపించింది. ఎంతసేపు చూసినా కళ్ళకు అలసట కలుగకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది. తాండవ సమయంలో శివుని ఒంటికి పూసుకున్న విబూది ఆ ప్రాంతమంతా రాలిపడడం వలన కవి దాన్ని ‘ఘనసారం’ తో పోల్చి ఉంటాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి పంక్తుల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శివతాండవం గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
సత్వరజస్తమీగుణ ప్రధానంగా సాగిన శివతాండవాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
పుట్టపర్తి వారు శివుని తాండవాన్ని ఏ విధంగా వర్ణించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరియబూసినట్లుగా, అందమైన జాజిపూలను కుప్పలుగా పోసినట్లుగా, తెల్లని విభూతి పొరలు పొరలుగా ఉన్నట్లు మంచి ముత్యాలను ఏరి కూర్చినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచిపెట్టినట్లుగా, పచ్చకర్పూరాన్ని తెచ్చి కల్లాపు జల్లినట్లుగా శివతాండవం ఉంది. మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతూ పాడుతున్నాడు.

శివుని తాండవం మబ్బులన్నీ నీటిఆవిరితో కూడి అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒకచోట చేరి ముసిరికొన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొన్నట్లు శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళ నుంచి కారిపోతున్నట్లుగా ఉంది. మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కన్పిస్తున్నట్లుంది.

తామరపూలు విప్పారినట్లుంది. పూర్వజన్మ పుణ్యం ఆకారం దాల్చినట్లుంది. శాస్త్ర సంపదను పెంచేదై ఉంది. అప్పుడే వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలు ముసిరిన పద్మాలలా ఉంది. చక్కని హావ భావాలతో కూడి ఉంది. కొత్త హారాలలాగా, మంచి నవ్వులాగా ఉంది. కనుకొలకుల సోకులా ఉంది. ఎర్రని లేజిగురాకులా ఉంది. అనురాగపు గుర్తులతో కూడి ఉంది. మైమరపును (తంద్రను) కలిగించేదిగా ఉంది.

ఇంకా శివుడు అలలు కదలినట్లుగా, చిరు గాలికి ఆకులు కదిలినట్లుగా పాడుతూ తాండవం చేస్తున్నాడు. శివతాండవం తామర పూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళాలు వెల్లివిరిసినట్లుంది. నెమలి పురివిప్పి ఆడినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమంతా ఒలకబోసినట్లుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
శివుడు నర్తించిన విధానంలో ప్రత్యేకతలు ఏమున్నాయి? (లేదా) త్రిగుణాలను తన నాట్యంలో ఆవిష్కరించినట్లు పుట్టపర్తివారిచే వర్ణించబడిన శివతాండవాన్ని గూర్చి రాయండి.
జవాబు:
శివుడు చేసిన ఆనంద తాండవంలో ప్రత్యేకతలను కవి సంకేతాలతో సూచించాడు. ఆ వెన్నెల విరబూసినట్లుందన్నాడు. కాంతికి, చల్లదనానికి ఇది సంకేతం. జాజిపూలు పరిమళానికి, విబూది స్వచ్ఛతకు గుర్తులు. మంచు నిర్మలత్వానికి, మంచి ముత్యాలు అందానికి చిహ్నాలు. పచ్చకర్పూరం రోగనిర్మూలనం కోసం వాడతాం. అమృతం దైవత్వానికి గుర్తు. ఇక -ఇవన్నీ తెల్లదనాన్ని కలిగి ఉన్నాయి. తెలుపు సత్వగుణానికి గుర్తుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు.

తామరలలో కొన్ని ఎర్రవి ఉంటాయి. చిగురాకులు ఎర్రగా ఉంటాయి. కనుకొలకులు ఎర్రగా ఉంటాయి. మాణిక్యాల వంటి రత్నాలు ఎర్రగా ఉంటాయి. అనురాగం (ప్రేమ) వలన ముఖంలోని బుగ్గలు వంటి భాగాలు ఎర్రబడతాయి. వీటినే “రక్తిచిహ్నాలు” అని అంటారు. తండ్రి అంటే బద్దకంతో కూడిన మైమరపు. ఇది రజోగుణ సంబంధమైనది. ఎరుపు రజోగుణానికి గుర్తు. తాండవం క్రమంగా ఉదృతంగా మారుతుందని చెప్పడం దీని ప్రత్యేకత.

నల్లని మబ్బులు కమ్ముకొన్నట్లుగా, నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా, తుమ్మెదలు ఒకే చోట చేరినట్టుగా తాండవం ఉంది. కాటుక కొండ పగిలిపోగా కాటుకంతా చెదరిపోయినట్లుగా చీకట్లు ఒక్కసారిగా కమ్మినట్లు, అజ్ఞానం కన్నుల నుండి కారినట్లుంది. ఇంకా మనస్సులోని వంకరలు కళ్ళలో కనిపించినట్లుంది. ఇవన్నీ నల్లదనాన్ని కలిగి ఉన్నాయి. నలుపు తమోగుణానికి గుర్తు.

సత్వ – రజ – తమోగుణాల కలయిక వలన సృష్టి ఏర్పడింది. పరమాత్మ పరమశివుడు గనుక ఆయన తాండవంలో ఈ మూడు గుణాలు వ్యక్తమైనట్లు వర్ణించబడటం ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కవి శివుని నాట్యాన్ని ఏయే ప్రకృతి అంశాలతో పోల్చాడో వివరంగా రాయండి.
జవాబు:
కవి శివుని నాట్యాన్ని చాలా ప్రకృతి అంశాలతో అందంగా పోల్చాడు. స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా ఉందన్నాడు. జాజిపూలను కుప్పలుగా పేర్చినట్లు, మంచును కుప్పలుగా చేసినట్లుందన్నాడు. మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి ఆకాశమంతా పరచుకొన్నట్లు, నల్ల కలువలు దిక్కులంతా .వికసించినట్లుందన్నాడు. తుమ్మెదలన్నీ ఒకే చోట ముసిరికొన్నట్లు, కాటుక కొండ పగిలినట్లుందన్నాడు. .చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొచ్చినట్లు శోభాయమానంగా ఉందన్నాడు. తామరలు విప్పారినట్లు, అప్పుడే వికసించిన పూలలా ఉందన్నాడు. తుమ్మెదలు ముసిరిన పద్మాలలాగా, ఎర్రని లేజిగురాకులాగా ఉందన్నాడు. సముద్రంలో అలలు కదిలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లుందన్నాడు. తామరపూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుందన్నాడు. కమ్మని కస్తూరి పరిమళంలా, నెమలి అందంగా తన పింఛాన్ని విప్పినట్లుందన్నాడు. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లుందన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
ఈ గేయంలో “పొరలు లేచినయట్లు”, “విరులు కదలినయట్లు” మొదలైన అంత్యప్రాసలున్నాయి కదా ! ఇవి చదువుతుంటే లయాత్మకంగా ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాటిని కొన్నింటిని గ్రహించి వాటితో చిన్న కవిత గాని, గేయం గాని రాయండి.
జవాబు:
కవిత :
తెలుగుభాషా భవిష్యత్తు

తెలుగు భాషా భవిష్యత్తు
చేస్తుందోయి కసరత్తు
ఇతర భాషల సరసన
చూపుతుందా తన సత్తు
పోషకులే కరువై
పీక్కుంటుందా తన జుత్తు
తెలుగు బాలల సహకారంతో
వదిలిస్తుందా పరభాషల మత్తు
చేస్తుందా ఎన్నటికైనా
అన్యభాషలను చిత్తు
కోరుతున్నా దేవుణ్ణి
చేయాలని ఈ గమ్మత్తు!! – యస్. కె. చక్రవర్తి.

గేయం :
(హెచ్చరిక!!)
హెచ్చరిక! ఆంధ్రుడా హెచ్చరిక!
వినకుంటే నీ మనుగడ సాగదిక!
తల్లిపాలను నేలపాలు చేస్తూ
దాదిపాలకై అర్రులు చాపావంటే
నీ భాషా సంస్కృతులను విస్మరిస్తూ
పరభాషా సంస్కృతులకై పరుగులిడినావంటే
|| హెచ్చరిక||

నీ మాన ప్రాణాలను పణంగా పెడుతూ
పరులను పరమోన్నతులుగా పరిగణిస్తే
నీ భాషా జాతులను పరాభవిస్తూ
పరుల పదోన్నతికై పరిశ్రమిస్తే
నీ భాషా జాతీయాలను నట్టేట కలుపుతూ
అన్యభాషా సంస్కృతులతో అద్వైతసిద్ధి సాధిస్తే
|| హెచ్చరిక||

నిన్ను నీవే నిన్నాకరిస్తూ
పరసేవా పరాయణుడవైతే
నీ నీతి నీ జాతిరీతులను నిప్పుల గుండంలో నిలిపితే
నీవనేదీ నీదనేదీ నీకేదీ మిగలదిక || 2 ||
విన్నపము నీకిదే వినుమో వివేక శూన్యుడా !
వినకుంటే నీకిదే మరణశాసన మాంధ్రుడా !!
– యస్. కె. చక్రవర్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అంత్యప్రాసలతో శివతాండవాన్ని, దాని సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసిన విధానాన్ని చూశారు కదా ! దీనివల్ల మీరు పొందిన అనుభూతిని మీ ‘దినచర్య’ లో రాయండి. ఉపాధ్యాయులకు చూపండి.
జవాబు:
ఈ రోజు పాఠశాలలో “శివతాండవం” – అనే పాఠం చెప్పారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” అనే గేయకావ్యాన్ని రచిస్తే దానిలో కొద్ది భాగం మాకు పాఠ్యాంశంగా ఉంచారని తెలుగు భాషోపాధ్యాయులు గారు చెప్పారు. గేయాన్ని లయబద్దంగా పాడుతూ మాచేత కూడా పాడించారు.

ఈ గేయం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులో వాడిన అచ్చ తెలుగు పదాలు ఊరిన మాగాయ ముక్కల్లా రసవత్తరంగా, రుచికరంగా ఉన్నాయి. ఇందులోని పదాలలో నేను చదవని కొత్త పదాలే ఎక్కువ. కానీ విచిత్రంగా పదాల అర్థం తెలియకపోయినా భావం అర్థమవుతూ తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. సత్త్వ – రజ – తమో గుణాలకు చిహ్నాలైన తెలుపు – ఎరుపు – నలుపు రంగులను తాండవానికి అన్వయిస్తూ చెప్పిన తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. “తమ్ములై, ఘటిత మోదమ్ములై” – వంటి అనుప్రాసలతో కూడిన పదాలు గేయానికి ఒక కొత్త ఊపును ఇచ్చాయి.

అలలు కదలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లు, తామరపూలు కదలినట్లు, సువాసన వ్యాపించినట్లు, తెరపై బొమ్మలు నటించినట్లు, చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమ జాలువారినట్లు – ఇలాంటి ఉపమానాలు మన రోజువారీ జీవితంలో కనిపించేవే, మనల్ని తెలియని లోకాలకు తీసుకెళ్ళేవే. మన శ్రమని, కాలాన్ని మరచేలా చేసేవే. ఇలాంటి వాటితో ‘శివతాండవాన్ని’ పోల్చడం వల్ల మన ఊహకు అందేలా, మనో నేత్రాలకు కనిపించేలా కవి చేయగలిగాడు. ఈ గేయం చదివినప్పుడూ, మిత్రులు చదువుతుంటే విన్నప్పుడూ, శివునిలా తాండవం చేయలేకపోయినా, కనీసం చిందువేయాలనైనా మనస్సుకు బలంగా అనిపిస్తుంది. ఒక చిన్న గేయభాగమే వినే వారిలో లేక చదివే వారిలో ఇలాంటి కదలిక తీసుకురాగలిగిందంటే, వింతైన అనుభూతిని కలిగించిందంటే కవి ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ రాశాడో అని అన్పిస్తున్నది.

కవికి తెలుగు పదాల మీద మంచి పట్టు ఉంది. అచ్చ తెలుగు పదాలతో ఆయన గేయాన్ని నడిపించిన తీరు ‘శివతాండవాన్ని’ తలపిస్తుంది. అందుకనే ఆ మహానుభావుణ్ణి “సరస్వతీ పుత్రుడు” అనే బిరుదుతో గౌరవించారేమో పెద్దలు. ఈ గేయం చదివాక నాలో తెలియకుండానే ప్రకృతి ప్రేమ, తెలుగు భాషాభిరుచి పెరిగాయి. చక్కని పదాలతో గేయాలు అల్లాలనే ఉత్సుకత ఉరకలేస్తున్నది.

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలో/ పట్టణంలో రకరకాల కళాకారులుంటారు. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, చిందు భాగవతులు, హరికథలు చెప్పేవారు…… ఇలాంటి వారి వివరాలు సేకరించండి. వారి ప్రదర్శనల గురించి వివరాలు అడిగి తెలుసుకోండి, రాయండి.
జవాబు:
1) బుర్రకథలు :
బుర్రకథలను తంబుర కథలని, డక్కీ కథలని వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో వీరగాథలకు సంబంధించిన కథలే ఎక్కువ ఉంటాయి. బుర్రకథను చెప్పడానికి ముగ్గురు వ్యక్తులు కావాలి. మధ్య వ్యక్తి కథ చెపుతూ తంబురా వాయిస్తాడు. ఆయనకు రెండు ప్రక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను ‘వంతలు’ అని అంటారు. వంతలు డక్కీలు వాయిస్తారు. కథకునికి ఒక ప్రక్క వ్యక్తి హాస్యంగా మాట్లాడుతుంటే, రెండవవైపు వ్యక్తి కథకు తగిన వివరణ చెపుతుంటాడు.

బుర్రకథలో మొదట కథకుడు సరస్వతిని, మహాలక్ష్మిని, దుర్గనూ ప్రార్థిస్తాడు. దీనిలో సాధారణంగా ‘వినరా భారత వీరకుమారా విజయం మనదేరా ……. తందాన తాన, తందాన, తానే తందనాన’ అంటూ వంతలు పాడుతారు. కథ పూర్తి అయ్యాక మంగళం పాడతారు. బుర్రకథలలో అల్లూరి సీతారామరాజు – ఝాన్సీ లక్ష్మీబాయి – బాలచంద్రుడు మొదలైన కథలు ప్రసిద్ధి పొందాయి. ‘నాజర్’ బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు.

జానపదకళల్లో బుర్రకథ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ పోరాట సమయంలో బుర్రకథ ప్రజలను చైతన్యపరచింది.

2) తోలుబొమ్మలాట :
ఈ ఆటను ఊరి బయట వేదిక పైన రాత్రి సమయంలో ప్రారంభించి తెల్లవారే వరకు ఆడతారు. మూడు వైపుల మూసి ఉన్న పందిరి వేస్తారు. ముందువైపు తెల్లని తెర లాంటి పల్చని గుడ్డను కడతారు. పూర్వం ఈ ఆటలాడేటప్పుడు తెరవెనుక ఆముదపు దీపాలు వెలిగించేవారు. తరువాత పెట్రోమాక్స్ దీపాలు, విద్యుద్దీపాలు వచ్చాయి. ఈ దీపాల కాంతి వల్ల చీకటిలో కూర్చున్న వారికి తోలుబొమ్మలు సజీవంగా ఉన్నట్లు కనబడతాయి.

పురుష పాత్రల వెనుక మగవారు, స్త్రీ పాత్రల వెనుక ఆడవారు ఉండి పాత్రలకు అనుగుణంగా మాట్లాడతారు. రామాయణం, భారతం కథలను ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల నిద్రమత్తు పోవడానికి ఆట మధ్యలో హాస్యగాళ్ళు అయిన జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు పాల్గొని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.

ఈ బొమ్మలను తెరమీద సులభంగా ఆడించేందుకు సన్నటి వెదురు బద్దలను బొమ్మల మధ్యలో కడతారు. బొమ్మల సంభాషణకు తగినట్లుగా ఆడించాలంటే ఆ వెదురు బద్దే ఆధారం. ఆ బద్ద సహాయంతో బొమ్మలను అటు ఇటు తిప్పుతూ ఆడిస్తారు.

ముఖ్యంగా ఈ బొమ్మలను తయారు చేసేటప్పుడు రాముడు, కృష్ణుడు, సీత వంటి పవిత్రమైన పాత్రలకు ఒక రకమైన చర్మాన్ని; రావణాసురుడు, కంసుడు వంటి ప్రతినాయక పాత్రలకు వేరొక రకమైన చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఆడేవారిని ‘దేశదిమ్మరులు’ అంటారు. వీరు దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తారు. ‘రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథలనే ఎక్కువగా ప్రదర్శిస్తారు. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఈ జానపదకళ కనుమరుగైందనే చెప్పవచ్చు.

3) హరికథ :
హరికథ అంటే విష్ణుకథ. హరికథలు భక్తికి సంబంధించినవి. ఈ కథ చెప్పేవారిని భాగవతార్ అని, హరిదాసని పిలుస్తారు. హరికథ చెప్పేవారు పట్టుపంచె కట్టుకొని నుదుట నామం, మెడలో పూలదండ వేసుకుంటారు. చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. నడుముకు ఉత్తరీయం బిగించుకుంటారు. “శ్రీమద్రమారమణ గోవిందోహరి” అని గోవింద కొట్టించి కథ ప్రారంభిస్తారు. ఎన్నో గంటల పాటు కథకుడు అన్ని పాత్రలలో జీవిస్తూ, అభినయం చేస్తూ ప్రేక్షకులు విసుగు చెందకుండా మధ్యమధ్య పిట్టకథలు చెప్తూ హరికథా గానం చేస్తాడు.

ఆదిభట్ల నారాయణదాసు గారిని “హరికథా పితామహుడ”ని అంటారు.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు సమానార్ధక పదాలను పాఠం నుండి గ్రహించి రాయండి. వాటితో వాక్యాలు రాయండి.
1. తామరలై : తమ్ములై, తమ్మివిరులై
1) పగడాలతో చేసిన ఆభరణాలు తమ్ములై (పద్మాలై) భాసిస్తున్నాయి.
2) ఈత కొలనులో అందం కోసం ఉంచిన ప్లాస్టిక్ పూలు నిజమైన తమ్మివిరులై శోభిస్తున్నాయి.

2. సంతోషాలై : సంతసములై, మోదమ్ములై
1) మా ఊరి యువకుడు కలెక్టరుగా ఉద్యోగాన్ని పొందడం, అతడు మా పాఠశాల పూర్వ విద్యార్థి కావడం సంతస – (కారణ) ములైనాయి.
2) అన్నయ్య ప్రభుత్వోద్యోగాన్ని పొందడం, అక్కకు మెడిసిన్లో సీటు రావడం అమ్మానాన్నలకు మోదమ్ములైనాయి.

3. మొగ్గలై : నవకోరకమ్ములై, కోరకములై
1) మల్లె చెట్టుపై ఉన్న మంచు బిందువులు నవకోరకమ్ములై రాజిల్లుతున్నాయి.
2) ప్లాస్టిక్ జాజి తీగకు ఉన్న మొగ్గలు సహజమైన కోరకములై శోభిస్తున్నాయి.

4. హొయల నడకలై : వగలువోయినట్లు
1) గాలికి చిగురుటాకులు వగలు వోయినట్లుగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) కింది వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాల్ని గుర్తించి, వేరు చేసి రాయండి.

1. వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్నిస్తుంది. మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
జవాబు:
వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్ని ఇస్తుంది. మన కవులు. అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
వెన్నెల – కౌముది – చంద్రికలు

2. సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ కమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
జవాబు:
సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ తమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
అంధకారం – తమస్సు – చీకటి.

3. ఆహా ! ఏమి తావి! బహుశా ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
జవాబు:
ఆహా ! ఏమి తావి ! బహుశా, ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
తావి – పరిమళం – సౌరభము

ఇ) కింది పదాలకు పాఠం ఆధారంగా వికృతి పదాల్ని గుర్తించి రాయండి.
1) అపూర్వం – అబ్బురం
2) మౌక్తికం – ముత్తెం
3) సంతోషం – సంతసం

ఈ) కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.
1) చలికొండ – మంచుకొండ, హిమవత్పర్వతం
2) పుష్పం – విరి, కుసుమం, సుమం, పువ్వు
3) మోదం – సంతోషం, ఆనందం, ప్రమోదం
4) కిసలయం – చిగురాకు, లేతాకు
5) తరగలు – అలలు, తరంగాలు

వ్యాకరణం

ఆ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. విడదీసి, సంధి సూత్రం రాయండి.

1. ఉత్వసంధి:
ఆడెను + అమ్మా = ఆడెనమ్మా
పాడెను + అమ్మా = పాడెనమ్మా
1) మబ్బుగములు + ఉబ్బికొని = మబ్బుగములుబ్బికొని
2) తమ్ములు + ఐ = తమ్ములై
3) మోదమ్ములు + ఐ = మోదమ్ములై
4) రూపమ్ములు + ఐ = రూపమ్ములై
5) భాగ్యమ్ములు + = భాగ్యమ్ములై
6) కోరకమ్ములు + ఐ = కోరకమ్ములై
7) పుష్పమ్ములు + ఐ = పుష్పమ్ములై
8) మంద్రమ్ములు + ఐ = మంద్రమ్ములై
9) ఫుల్లమ్ములు + ఐ = ఫుల్లమ్ము
10) హారమ్ములు + ఐ = హారమ్ములై
11) హాసమ్ములు + ఐ = హాసమ్ములై
12) సొమ్ములు + ఐ = సొమ్ములై
13) కిసలమ్ములు + ఐ = కిసలమ్ములై
14) చిహ్నమ్ములు + ఐ = చిహ్నమ్ములై
15) గమనమ్ములు + ఐ = గమనమ్ములై
16) దిక్కులు + ఎల్ల = దిక్కులెల్ల

ఉత్వ సంధి సూత్రం:
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2. సరళాదేశ సంధి:
1) పూతన్ + పెట్టుట = పూతఁబెట్టుట
2) కనులన్ + జారు = కనులజారు
3) ఘనసారమును + తెచ్చి = ఘనసారమునుదెచ్చి
4) కలయ + చల్లు = కలయజల్లు
5) కనులన్ + తీరు = కనులఁదీరు
6) కండ్లన్ + తళుకు = కండ్లఁదళుకు
7) తళుకున్ + చూపులు = తళుకుఁజూపులు
8) కాళ్ళన్ + చిలిపి = కాళ్ళఁజిలిపి
9) మొల్లముగన్ + తుమ్మెదలు = మొల్లముగఁదుమ్మెదలు
10) గొప్పగన్ + కప్పెడు = గొప్పగఁగప్పెడు
11) కనులన్ + తీరు = కనులఁదీరు
12) గెడన్ + కూడి = గెడఁగూడి
13) తరగలను + చిరుగాలి = తరగలఁజిరుగాలి
14) చిరుగాలిలోన్ + తమ్మివిరులు = చిరుగాలిలోఁదమ్మివిరులు
15) కన్ + కొనల = కల్గొనల

సరళాదేశ సంధి సూత్రం :
1) ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
2) ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

3. యడాగమ సంధి :
1) వక్రత + ఎ = వక్రతయె
2) లేచిన + అట్లు = లేచినయట్లు
3) కదలిన + అట్లు = కదలినయట్లు
4) పరిఢవించిన + అట్లు = పరిఢవించినయట్లు
5) విరిసిన + అట్లు = విరిసినయట్లు
6) విప్పిన + అట్లు = విప్పినయట్లు
7) పోయిన + అట్లు = పోయినయట్లు
8) జారిన + అట్లు = జారినయట్లు

యడాగమ సంధి సూత్రం :
1) సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4. గసడదవాదేశ సంధి :
1) పూత + పెట్టుట = పూతబెట్టుట
2) దెట్టులు + కట్టిన = దెట్టులుగట్టిన
3) కుప్పలు + కూర్చిన = కుప్పలుగూర్చిన
4) చూపులు + పూయ = చూపులుబూయ
5) విరులు + కదలిన = విరులుగదలిన
6) వీణా + కడగి = వీణెగడగి
7) నెమ్మి + తన = నెమ్మిదన
8) వగలు + పోయిన = వగలు వోయిన

గసడదవాదేశ సంధి సూత్రం :
1) ప్రథమము మీది పరుషములకు గసడదవలగు.

ఆ) టుగాగమ సంధి : కింది పదాలను పరిశీలించండి.
ఉదా :
1) నిలువు + అద్దం = నిలువుటద్దం
2) తేనె + ఈగ = తేనెటీగ
3) పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా వచ్చి చేరుతుంది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.

అట్లే కింది పదాలను కూడా పరిశీలించండి.
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు, రాకపోవచ్చు. ‘ట్’ వస్తే టుగాగమం అవుతుంది. ‘ట్’ రాకుంటే ఉత్వసంధి అవుతుంది.

సూత్రం :
కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. కింది పదాలను విడదీసి రాయండి.
1) పడకటిల్లు = పడక + ఇల్లు
2) కరకుటమ్ము = కరకు + అమ్ము
3) నిక్కంపుటుత్తర్వు = నిక్కంపు + ఉత్తర్వు
4) నిగ్గుటద్దం = నిగ్గు + అద్దం

ఇ) లు,ల,న, ల సంధి :
లు – ల – న – లకు జరిగే సంధిని లు, ల, న, ల సంధి అంటారు.

సూత్రం :
లు, ల, న లు పరమైనపుడు, ఒక్కొక్కప్పుడు ము వర్ణానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
ఉదా :
1) పుస్తకము + లు = పుస్తకాలు
2) దేశము + ల = దేశాల
3) జీవితము + న = జీవితాన
4) గ్రంథము + లు = గ్రంథాలు
5) రాష్ట్రము + ల = రాష్ట్రాల
6)వృక్షము + న = వృక్షాన

మరి కొన్ని ఉదాహరణలు :
1) వజ్రము + లు = వజ్రాలు
2) రత్నము + ల = రత్నాల
3) వాచకము + ల = వాచకాల
4) కేసరము + లు = కేసరాలు
5) గ్రంథము + లు = గ్రంథాలు
6) హారము + న = హారాన
7) విషయము + లు = విషయాలు
8) చుట్టము + లు = చుట్టాలు

ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ప్రస్తుత పాఠంలో వెతికి రాయండి.

కర్మధారయ సమాసం :
విశేషణానికి, విశేష్యానికి (నామవాచకానికి) చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
నల్లకలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో పూర్వ (మొదటి) పదం విశేషణమైతే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
చిలిపి గజ్జెలు – చిలిపివైన గజ్జెలు – చిలిపి (విశేషణం) – గజ్జెలు (నామవాచకం)

ప్రస్తుత పాఠంలోని ఉదాహరణలు :
1) తరితీపు వెన్నెలలు – తరితీపులైన వెన్నెలలు
2) నెరజాజులు – నెరయైన జాజులు
3) తెలిబూది – తెల్లనైన బూది
4) చలికొండ – చల్లనైన కొండ
5) ఘనసారము – ఘనమైన సారము
6) నీలపుగండ్లు – నీలమైన కండ్లు
7) అబ్బురపు నీలములు – అబ్బురమైన నీలములు
8) నల్లకలువలు – నల్లనైన కలువలు
9) లేవలపు – లేతయైన వలపు
10) నవకోరకమ్ములు – నవమైన కోరకమ్ములు
11) వికచపుష్పములు – వికచములైన పుష్పములు
12) నూత్నహారమ్ములు – నూతనమైన హారమ్ములు
13) వల్గుహాసమ్ములు – వల్గులైన హాసమ్ములు
14) రక్తకిసలయములు – రకములైన (ఎర్రనైన) కిసలయములు
15) తంద్రగమనమ్ములు – తంద్రమైన గమనమ్ములు
16) చిరుగాలి – చిరుత (కొంచమైన) యైన గాలి
17) కమ్మకస్తురి – కమ్మనైన కస్తురి
18) చిగురుటాకులు – చిగురులైన ఆకులు

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఉ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘సంభావన’ అంటే ‘సంజ్ఞ’ అని అర్థం. అంటే పేరు మొదలైనవి. కర్మధారయ సమాసంలో మొదటి పదం ‘సంజ్ఞా వాచకమైనట్లైతే దాన్ని సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం’ అంటారు.

‘తమ్మి విరులు’ అనే సమాసంలో మొదట పదమైన ‘తమ్మి ‘ ఏ రకం విరులో (తామరపూలు) తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం నదులూ, వృక్షాలూ, ప్రాంతాలూ మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) మర్రిచెట్టు – మర్రి అనే పేరుగల చెట్టు
2) గంగానది – గంగా అనే పేరుగల నది
3) భారతదేశం – భారతం అనే పేరు గల దేశం

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి మరికొన్ని ఉదాహరణలు.
1. వింధ్య పర్వతం – వింధ్య అనే పేరు గల పర్వతం
2. కృష్ణానది – కృష్ణ అనే పేరు గల నది
3. అరేబియా సముద్రం ‘అరేబియా’ అనే పేరు గల సముద్రం
4. విజయవాడ నగరం – విజయవాడ అనే పేరు గల నగరం
5. తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
6. హిమాలయ పర్వతం – హిమాలయమనే పేరు గల పర్వతం అని
7. నర్మదానదం – నర్మద అనే పేరు గల నదం.

9th Class Telugu 3rd Lesson శివతాండవం కవి పరిచయం

పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే! వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

గేయాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ గేయం :
ఆడెనమ్మా ! శివుడు
పాడెనమ్మా ! భవుడు
తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన
తెలిబూది పూత చెట్టులు గట్టిన విధాన
చలికొండ మంచు కుపులు గూర్చిన విధాన
పొసగ ముత్తెపు సరుల్పోహళించు విధాన
అసదృశము నమృతంబు నామతించు విధాన
ఘనసారమును దెచ్చి కలయజల్లు విధాన
మనసులో సంతసము గనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా ! భవుడు
ప్రతిపదార్థం :
తరితీపు = స్వచ్ఛమైన
వెన్నెలలు = చంద్రుని తెల్లని కాంతులు
విరిసికొన్న విధాన = ఉప్పొంగినట్లు (కురిసినట్లు)
నెరజాజులు + అవి = ఆ అందమైన జాజిపూలు
కుప్ప నెరసికొన్న విధాన = కుప్పలు పోసినట్లుగా
తెలిబూదిపూత = తెల్లని విభూతి (విబూది) పూత
దెట్టులు + కట్టిన విధాన = అతిశయించిన విధంగా (మిక్కిలి ఎక్కువగా ఉన్నట్లు)
చలికొండ = హిమాలయము ( హిమగిరి)న
మంచు = మంచును
కుప్పలు + కూర్చిన విధాన = ప్రోగులు పెట్టినట్లు
పొసగన్ = సరిపడేటట్లు (పొత్తుగా, తగిన విధంగా)
ముత్తెము + సరుల్ = ముత్యాలహారాలు
పోహళించు విధాన = కూర్చినట్లుగా
అసదృశమున్ = అనన్య సామాన్యమైన
అమృతంబున్ = అమృతమును
ఆమతించు విధాన = విందు చేసినట్లు (పంచినట్లు)గా
ఘనసారమును + తెచ్చి = పచ్చ కర్పూరమును తెచ్చి
కలయన్ + చల్లు విధాన = అంతటా చల్లే రీతిగా
మనసులోన = మనస్సులో గల
సంతసము = సంతోషం (ఆనందం)
కనులన్ + జారువిధాన = కన్నుల నుండి జారుతున్నట్లుగా
కులుకు = ఒప్పెన (చురుకైన)
నీలపు గండ్ల (నీలము +కండ్ల) = నీలవర్ణము గల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘల్లుఘల్లుమని = ఘల్లుఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టుకొన్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు; (చిన్నగజ్జెలు)
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
నిర్మలమైన వెన్నెల కురుస్తున్నట్లుగా, అందమైన జాజిపూలు కుప్పపోసినట్లుగా, తెల్లని విబూది చెట్టులు కట్టి నట్లుగా, మంచుకొండపై మంచు కుప్పలు పోసినట్లుగా, మృదువైన ముత్యాల హారాలను కూర్చినట్లుగా, అనన్య సామాన్యమైన అమృతాన్ని విందు చేసినట్లుగా (పంచినట్లుగా), పచ్చ కర్పూరాన్ని తెచ్చి అన్ని వైపులా చల్లినట్లుగా, మనస్సులోని సంతోషం కళ్ళల్లోంచి జారునట్లుగా, చురుకైన నీలపు కన్నుల తళుకు చూపుల కాంతులు విరబూసినట్లుగా, ఘల్లు ఘల్లుమని చిరుగజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
దీనిలో చెప్పిన పోలికలన్నీ తెల్లదనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తెలుపు యొక్క సంకేతం స్వచ్ఛతకూ, పవిత్రతకూ నిదర్శనం. శివుడి తాండవం వల్ల ఆనందం అంతటా నిండిందని కవి తలంపు. శివునిలో సత్త్వగుణం వెల్లివిరిసిందని భావం. సత్త్వగుణం. తెలుపు రంగును సూచిస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2వ గేయం :
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బి కొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
మబ్బుగములు = మేఘాల యొక్క సమూహాలు
ఉబ్బికొని = అతిశయించి (దట్టముగా)
ప్రబ్బికొన్న విధాన = అలముకొన్న విధంగా
అబ్బురము + నీలములు = అపూర్వమైన ఇంద్రనీలమణులు
లిబ్బి + చేరు విధాన = కుప్ప పోసినట్లుగా (ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా)
నల్ల కలువలు = నల్ల కలువపూలు
దిక్కులు + ఎల్ల = దిక్కులంతటా
విచ్చు విధాన = విచ్చుకున్నట్లుగా (విరిసిన విధంగా)
మొల్లముగ = గుంపుగా (ముసురుకొని)
తుమ్మెదలు = తుమ్మెదలు
మొనసికొన్న విధానన్ = శోభిల్లిన విధంగా
అగలు = పగిలే
కాటుక కొండ = నల్లని కొండ
పగిలి, చెదరు విధాన = బ్రద్దలయి, చెల్లాచెదరయినట్లు
తగిలి = సంభవించి (కలిగి)
చీకటులు = చీకట్లు
గొప్పగ = అధికంగా
కప్పెడు విధాన = వ్యాపించినట్లుగా
తనలోనన్ = తనలోనున్న
తామసము = తమస్సు అనే గుణము
కనులన్ = కన్నుల నుండి
జారువిధాన = జారే విధంగా
తనలోని వక్రతయె (వక్రత + ఎ) = తనలోనున్న వక్రత్వములే
కనులన్ + తీరువిధాన = కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా
కులుకు నీలము + కండ్లన్ = ఒప్పెన (చురుకైన), నీలవర్ణముగల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకున్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
మేఘాలన్నీ ఒక్కసారిగా అలముకున్నట్లుగా, అద్భుతమైన నీలమణులు ఒకచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులన్నిటా విచ్చుకున్నట్లుగా, తుమ్మెదలు ముసురుకొని శోభిస్తున్నట్లుగా, నల్లని కొండలు పగిలి ముక్కలయినట్లుగా, ఒక్కసారి చీకట్లు వ్యాపించినట్లుగా, తనలోని తమస్సు కళ్ళల్లోంచి జారుతున్నట్లుగా, తనలోని వక్రతలు కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూయగా, పాదాల గజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
ఇందులో వర్ణించబడినవి అన్నీ నీలవర్ణము గలవి. సృష్టిలో నలుపురంగు కూడా అద్భుతమైనదని కవి చెప్పారు. శివునిలో తమోగుణం (నల్లనిది) వ్యాపించిందని భావం.

3వ గేయం :
తమ్ములై, ఘటిత మోదమ్ములై, సుకృత రూ
పమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచ పుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావ మంద్రమ్ములై, హావపు
ల్లమ్ములై, నూత్నహారమ్ములై, వల్గు
హాసమ్ములై, కనల సొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై, రక్తి చి
హ్నమ్ములై, తంద్ర గమనమ్ములై, గెడగూడి
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తమ్ములు + ఐ = తామర పూలై
ఘటిత మోదమ్ములు + ఐ = కలిగింపబడిన, సంతోషము కలవై (సంతోషాన్ని కలించేవై)
సుకృత రూపమ్ములు + ఐ = మంగళప్రదమైన రూపము కలవై
శాస్త్ర భాగ్యమ్ములు + ఐ = శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంపదతో నిండినవై
నవ కోరకమ్ములు + ఐ = క్రొత్త పూలమొగ్గలై
వికచ పుష్పమ్ములు + ఐ = వికసించిన పుష్పముల వలెనై
తుమ్మెదల తమ్ములు + ఐ = తుమ్మెదలు వాలిన తామరలై
భావ మంద్రమ్ములు+ ఐ = భావ గంభీరములై
హావ ఫుల్లమ్ములు + ఐ = వికసించిన శృంగార భావము కలవై
నూత్న హారమ్ములు + ఐ = క్రొత్త హారాలై
వల్గు హాసమ్ములై = చక్కని నవ్వులై
కల్గొనల సొమ్ములై = కంటికొలకుల సోకులై
విశ్రాంతి దమ్ములై = విశ్రాంతి నిచ్చేవై
రక్త కిసలమ్ములై = ఎఱ్ఱని చివుళ్ళె
రక్తి చిహ్నమ్ములై = అనురాగానికి గుర్తులై
తంద్ర గమనమ్ములై = తూగు నడకలు కలవై
కెడగూడి = జతగూడి
కులుకు నీలపుగండ్ల = చురుకైన, నీలవర్ణంగల కన్నుల
తళుకుచూపులు + పూయ – తళతళ కాంతులు విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ = కాళ్ళకున్న చిరుగజ్జెలు ధ్వని చేస్తుండగా
ఆడెనమ్మా! శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా! భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
శివుని నాట్యం తామరపూవులవలె గొప్ప సంతోషాన్ని చేకూర్చింది. ఆ నాట్యం శుభప్రదరూపంతో, శాస్త్రీయ సంపదతో నిండి ఉంది. కొత్త పూల మొగ్గల్లా, వికసించిన పువ్వుల్లా, తుమ్మెదలు వాలిన తామరల్లా, భావ గంభీరములై, వికసించిన హావభావములై, కొత్త హారములై, చక్కని నవ్వులై, కనుగొలకుల సోకులై; విశ్రాంతి నిచ్చేవై, ఎఱ్ఱని చిగురులై, అనురాగ చిహ్నాలై, తూగు నడకలతో జతగలసి, చురుకైన నీలపు కన్నుల కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరు గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం : ఈ గేయంలో వర్ణించబడినవన్నీ ఎఱుపు రంగుతో నిండినవి. అనగా శివుడు చేసే తాండవ నృత్యం రానురానూ ఉద్ధృతమై, ఆనందాన్ని ఇస్తోందని వర్ణించడం ఈ వర్ణనలోని ప్రత్యేకత. ఎఱుపు రజోగుణానికి ప్రతీక. కవి శివునిలో రజోగుణ ఉద్ధృతిని ఇక్కడ వర్ణించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4వ గేయం:
తరగలను జిరుగాలి పొరలు లేచిన యట్లు
చిరుగాలిలో దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నును తావి తెరలు లేచినయట్లు
తెరలపై చిత్రాలు పరిఢవించిన యట్లు
కమ్మ కస్తురి వీణె గడగి విరసిన యట్లు
నెమ్మి దన పింఛమ్ము నెమ్మి విప్పిన యట్లు
చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారినయట్లు
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తరగలను = అలలలో (కెరటములలో నుండి)
చిరుగాలి = నెమ్మదిగా గాలి
పొరలు లేచిన + అట్లు = పొరలు పొరలుగా పైకి లేచిన విధంగా
చిరుగాలిలో = మంద వాయువులో
తమ్మి విరులు = పద్మములు (తామర పద్మములు అనే పూలు)
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టబడిన
చిలిపి గజ్జెలు = చిరు గజ్జెలు
తెరలు లేచిన + యట్లు = తెరలు తెరలుగా వ్యాపించినట్లు
తెరలపై = తెరలపై
చిత్రాలు = బొమ్మలు
పరిఢవించిన + అట్లు = అతిశయించిన విధంగా
కమ్మ కస్తురి వీణా = శ్రావ్యమైన పరిమళ వీణ
కడగి విరసిన + అట్లు = మ్రోగిన విధంగా
నెమ్మి = నెమలి
తన పింఛమ్మున్ = తన పింఛాన్ని
నెమ్మి = ప్రీతితో (సంతోషంతో)
విప్పిన + అట్లు = విప్పిన విధంగా
చిగురుటాకులు (చిగురు + ఆకులు) = చిగురాకులు (త ఆకులు)
గాలిన్ = గాలికి
వగలు + పోయిన + అట్లు = ఒయ్యారాలు పోయిన విధంగా
నగవులో = నవ్వులో
లేవలపు = లేత కోరిక
బిగువుజారిన + అట్లు = బింకము తగ్గిన విధంగా
కులుకు = చురుకైన
నీలపుగండ్ల (నీలము +కండ్ల) = నీలికన్నుల
తళుకు + చూపులు = తళతళ కాంతులు
పూయన్ = విరబూయగా
కదలిన + అట్లు = కదలిన విధంగా
విరులలో = పూలలో
నునుతావి = చిరు సువాసన
మ్రోయన్ = ధ్వనిస్తుండగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
అలలపై చిరుగాలి పొరలు లేచినట్లు, చిరుగాలికి పద్మములు కదలినట్లు, పూలలో నుండి సువాసనలు తెరలు తెరలుగా పైకి వ్యాపించినట్లు, తెరలపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లు, శ్రావ్యమైన పరిమళ వీణలు మ్రోగినట్లు, నెమలి తన అందమైన పింఛాన్ని విప్పినట్లు, గాలికి చిగురుటాకులు ఒయ్యారాలు పోయినట్లు, లేత నవ్వులు ఒలికినట్లు, చురుకైన నీలపు కళ్ళు కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరుగజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
శివతాండవంలో అలలు కదలడం అనేది గంభీరతకు గుర్తు. పరిమళాలు వ్యాపించడం, నెమలి నాట్యం చేయడం, చిగురాకుల ఒయ్యారాలూ సౌకుమార్యానికి ప్రతిబింబాలు. శివుని తాండవంలో గంభీరత, సౌకుమార్యమూ కలగలసి అద్భుతంగా అందాన్ని ఆవిష్కరించడమే ఇక్కడి విశేషం. మొత్తంగా శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది. ప్రకృతి వర్ణన పదాల కూర్పు, అలంకారాలతో కూడి మరింత సౌందర్యాన్ని చేకూర్చింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 2 స్వభాష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Textbook Questions and Answers

ఆలోచించండి-చెప్పండి

ప్రశ్నలు జవాబులు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 1
ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి దేన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని మీరనుకుంటున్నారు?
జవాబు:
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్నా, జంఘాలశాస్త్రి నిర్ఘాంతపోవడానికి కారణమేమై ఉంటుంది?
జవాబు:
తన ఉపన్యాస సారాంశాన్ని ఏ మాత్రం గ్రహించకుండా తనని ఆంగ్ల భాషలో పొగిడినందుకు.

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి వ్యాస సంకలనం’ లోని ఒక పాత్ర.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది వాటి గురించి సొంతమాటల్లో చెప్పండి.

ప్రశ్న 1.
మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
మాతృభాషలోనే మాట్లాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. మాతృభాషలో మన భావాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలము. పరభాషలను ఎంతోకాలంగా అభ్యసించినప్పటికి అటువంటి సౌలభ్యాన్ని పొందలేము. పరభాషలలో ఉపన్యసించగల శక్తి గలవారైనా, గ్రంథాలను రచించగల సమర్థులైనా, ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు దిగదుడుపే గదా ! ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధుడైన ‘మిల్టన్’ మహాశయుడు లాటిన్ భాషలో పద్యాలను రాశాడు. లాటిన్ భాష మాతృభాషగాగల కవులలో తక్కువ స్థాయిగల కవులు రాసిన పద్యాలకంటే ‘మిల్టన్’ మహాకవి పద్యాలు తక్కువ స్థాయికి చెందినవని పరిశోధకులు చెబుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ?

పరభాషాపదాలకర్థం తెలుసుకున్నంతమాత్రాన అందు పండితులమయ్యామనుకోకూడదు. ఆయా భాషలలోని జీవాన్ని, తత్త్వాన్ని, కళను కనిపెట్టగలగాలి. అది ఆయా భాషలు మాతృభాషలుగా గలవారికే సాధ్యము. ఇతరులకది ఎన్ని సంవత్సరాలు అభ్యసించినా అసాధ్యమే. మాతృభాషలోనే మాట్లాడటం వలన ఆ భాషలోని జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు, సామెతలు, జీవాన్ని పొంది భాషకు జీవాన్ని, బలాన్ని కలిగిస్తాయి. మనోభావాలను ఆవిష్కరించడానికి భాషకై వెదుక్కోవాల్సిన పని ఉండదు. ఎదుటివారికి కూడా మనం చెప్పదలచిన విషయాన్ని సందేహరహితంగా, నిర్దోషంగా సవివరంగా చెప్పగలము. ఈ సౌలభ్యం ఒక్క మాతృభాషవల్లే సాధ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఈ కింది అంశం గురించి విభేదిస్తూ లేదా సమర్థిస్తూ మాట్లాడండి. “మాతృభాషలో విద్య”
జవాబు:
“మాతృభాషలో విద్య” విభేదించడం లేక ఖండన :

నేటి సమాజం శరవేగంతో ప్రయాణిస్తోంది. ప్రపంచం మొత్తం “గ్లోబలైజేషన్” పుణ్యమా అని కుగ్రామమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఎన్ని ఎక్కువ భాషలు అధ్యయనం చేస్తే అంత త్వరగా పోటీ ప్రపంచంలోకి దూసుకుపోవచ్చు. చిన్నప్పటినుండే ఆంగ్లభాషా మాధ్యమంలో విద్యార్థులు విద్యను అభ్యసించినట్లైతే ఉన్నత విద్యలకు వెళ్లేటప్పటికి ఆ భాషపై పట్టు, సాధికారతను సాధించవచ్చు. నేటి ఆధునిక సౌకర్యాలన్నింటిని ఉపయోగించుకోవాలంటే ఆంగ్ల భాషే శరణ్యం. ఉదాహరణకు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ నేడు లేదు. దాన్ని సమర్థతతో నిర్వహించాలంటే ఆంగ్ల భాషాజ్ఞానమెంతో ఆవశ్యకం.

కాదు, కూడదని మాతృభాషలో విద్యనభ్యసిస్తే దాని ప్రభావం నుండి బయటపడటానికి చాలాకాలం పడుతుంది. ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించేటప్పుడు ఇది ఇబ్బందికరమవుతుంది. వేరే భాషలలో మాట్లాడాల్సివచ్చినప్పుడు మనస్సులో మాతృభాషలో ఆలోచించుకొని దాన్ని ఆయా భాషలలోనికి అనువదించినప్పుడు ఆ సంభాషణ చాలా కృతకం గాను, అసహజంగాను, హాస్యాస్పదంగాను తయారవుతుంది. ఇదే ఆయా భాషలలోనే ఆలోచించినట్లైతే సంభాషణ నిర్దోషంగాను, సహజ సుందరంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇది సాధించాలంటే చిన్నప్పటి నుండి ఆయా భాషలను శ్రద్ధతో అభ్యసించాల్సి ఉంటుంది. దీనిని గుర్తించే మన ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మండల ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీనివలన ప్రైవేటు పాఠశాలలలో ఖర్చుల కోర్చి చదవలేని పేద విద్యార్థులు సైతం లబ్ధి పొందవచ్చు.

శాస్త్ర సంబంధిత సాంకేతిక పదాలను, అంశాలను, మాతృభాషలోనికి అనువదించుట సాధ్యం కాదు. ఒక్కోసారి అలా అనువదించడం వలన విపరీతార్థాలు ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మూలభాషలో తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆయాశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయవచ్చు. తద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందవచ్చు. ఇవన్నీ సాధించబడాలంటే “మాతృభాషలో విద్య” బోధించబడకూడదు.

సమర్దన:
మాతృభాషలో విద్యాబోధన ద్వారా అనేక లాభాలున్నాయి. చిన్న వయస్సులో విద్యార్థుల బుద్ధివికాసం తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో వారు మాతృభాషలో బోధించిన అంశాలను సులభంగా గ్రహించగలుగుతారు. కంఠస్థం చేయాల్సిన పనిలేకుండా ఆయా అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అన్యభాషలను సైతం ప్రాథమిక దశలో మాతృ భాష ద్వారా బోధించడం వలన ఆయా భాషలపై విద్యార్థులు ఒక అవగాహనకు రాగలుగుతారు. వాటి పై భయాన్ని వీడి అభ్యసించడానికి సంసిద్ధులవుతారు.

మాతృభాషలో విద్యను బోధించడం వలన విద్యార్థుల మనోవికాసం ఎక్కువగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కఠిన శాస్త్రాలను అభ్యసించేటప్పుడు భాష కూడా కొత్తదైనట్లైతే కొద్ది సేపటికే విషయం అర్థంకాక, విసుగు కలిగి, ఆయా శాస్త్రాలపై శాశ్వతంగా అనిష్టత పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాతృభాషలో బోధన ద్వారా ఈ ఇబ్బందిని దాటవచ్చు. ఇతర భాషలలోని ఆయా అంశాలను, సాంకేతికపదాలను, మాతృభాషలోకి ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని రాలేకపోవచ్చు. ఇటువంటివి చాలా కొద్దివి మాత్రమే కష్టంగా అన్పిస్తాయి. అంతమాత్రాన మొత్తం ఆయా భాషలలోనే బోధించాలనుకోవటం ఎంత బుద్ధి తక్కువ పనో విజ్ఞులు గ్రహింతురు గాక !

మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఒడిశా మొదలైన రాష్ట్రాలు మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి దాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మనం “పొరుగింటి పుల్లకూర రుచి” అన్న చందంగా మన మాతృభాష తప్ప తక్కినవన్నింటిని తలపై పెట్టుకొంటున్నాం. త్వరలో అంతరించే భాషల్లో మన తెలుగు కూడా ఉందని తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. “చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు” కదా !

ఇక ‘మాతృభాషలో అన్నింటినీ బోధించడం సాధ్యం కాదు’ అనే మాట ఒట్టిమాటే. మాతృభాషాభిమానం లేనివారు సాకుగా చెప్పేమాటిది. తమిళనాడు రాష్ట్రంలో సాంకేతికశాస్త్ర విద్య (ఇంజనీరింగ్), వైద్య విద్య (మెడిసన్) లు సైతం మాతృభాషలో బోధించబడుతున్నాయి. న్యాయాలయాలలో వాద ప్రతివాదాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుమతులు మొదలైనవన్నీ మాతృభాషలోనే కొనసాగుతున్నాయి. వీటి అన్నింటికీ కారణం మాతృభాషలో విద్యాబోధనే. కాబట్టి మనం కూడ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మాతృభాష గొప్పదనాన్ని గుర్తించి, దానిలో విద్యాబోధన ద్వారా భాషను బతికించుకొందాం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) పాఠం చదవండి. కింది అంశాలను గుర్తించండి.

ప్రశ్న 1.
ఆంగ్లభాష గురించి ప్రస్తావించిన అంశాలు.
జవాబు:
పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషే. అందులో ఎంతోకాలం కష్టపడి ఎంత జ్ఞానమార్జించినా ఆ భాష మాతృభాషగా గలవారి ముందు ఈ పాండిత్యం దిగదుడుపే. ఆంగ్లభాషలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి స్వతంత్రత లేనివే. ఆ భాషలో పూర్వులు చెప్పినవే. వాటిలో సహజత లేదు. ఆంగ్లేయ భాషలో వ్యాసరచనలో ఉత్తమోత్తముడని అనిపించుకున్న “మిల్టన్” మహాశయుడు లాటిన్ భాషలో కొన్ని పద్యాలను రచించాడు. లాటిన్ మాతృభాషగాగల పండితులు వాటిని చదివి, లాటిన్ భాషలో ఇంతకన్నా అథమమైన పద్యాలు లేనేలేవని నిగ్గుతేల్చారు.

“కన్నింగ్ హామ్స్ ఎవిడెన్సు యాక్ట్”ను చదువుట వలన న్యాయవాదిగా మన కడుపును నింపుకోగలం కాని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం చదవడం వలన మన మనస్సు సంతోషంతో నిండుతుంది.

ప్రశ్న 2.
పాఠంలోని ఆంగ్లపదాలు.
జవాబు:

  1. ఎం.ఏ.,బి.యల్. పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు.
  2. విల్ ఎనీ జెంటిల్మన్ కం ఫార్వర్డు టు స్పీక్
  3. బర్కు, సిసిరో, డెమా సైనీసు, గ్లాడ్ట్స్
  4. ఇంగ్లీషు మీడియం
  5. ఒరిజినాలిటీ
  6. మిల్టన్
  7. లాటిన్
  8. ప్యారడైజు లాస్ట్
  9. కాలేజీ
  10. వర్నాక్యులర్ సూపరింటెండెంట్
  11. అయాంబికుమీటరు
  12. ది వెల్ నోన్ తెలుగు స్కాలర్
  13. బ్రౌను
  14. ఇన్ మెమోరియం
  15. మ్యూజిక్
  16. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
  17. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ
  18. కన్నింగ్ హామ్స్ ఎవిడెన్స్
  19. జస్టిస్ హాలోవే
  20. సివిల్ ప్రొసీజర్ కోడ్
  21. ఇంగ్లీషు
  22. పార్టీ
  23. బాయ్ రూమ్, పాట్, రైస్, కెన్ డ్లీ గెటిట్ హియర్
  24. థ్యాంక్యూ
  25. ఇన్ ఆంటిసిపేషన్
  26. డియర్ ఫ్రెండ్
  27. యువర్సు ట్రూలీ

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి సందేశ వాక్యాలు.
జవాబు:
ఆంధ్రదేశంలో ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి ఆంధ్రభాష రాదని చెప్పడం ఎంతో హస్యాస్పదం. మ్యావుమని కూయ లేని పిల్లి, కిచకిచలాడలేని కోతి ఎక్కడా ఉండవు. పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకు సందేహించాలా? ఆంధ్రదేశంలో పుట్టి తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా ఆంధ్రంలో మాట్లాడి, ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన తెలుగు రాదనుట ఎంత ఆశ్చర్యకరం? ఆంగ్లంలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అందు భాషా సౌకర్యం ఏమీ ఉండదు. ఆంగ్లం మాతృభాషగా గలిగిన వ్యక్తికి గల సౌలభ్యం 50 సంవత్సరములు ఆంగ్లభాషను అభ్యసించిన మనకు కలుగదు గదా ! సంపూర్ణ భాషోచ్చారణ పట్టువడదు కదా ! ఇట్లే ఆంగ్లేయుడు 18 సంవత్సములు సంస్కృత భాషను నిరంతర దీక్షతో నేర్చుకున్నా, నేర్చుకున్నంత కాలమూ మనస్సులో మననం చేసినా “హగుం సశ్యుచిషత్” అనే ఉపనిషత్ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పలకలేడు. ఇక మనం 24 సంవత్సరాలు ఆంగ్లభాషను నేర్చుకున్నా “ఇన్ మెమోరియం” లో ఉన్న సంగీతాన్ని కనిపెట్టలేం. పరభాషా పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం లభించినట్లు కాదు. భాషలోని కళను, ప్రాణాన్ని, ఆత్మను కనిపెట్టగలగాలి. అది మాతృభాషలోనే సాధ్యం.

పొలాలను అమ్మి, అమ్మ మెడలోని పుస్లెపూసలమ్మి, ఇంట్లో సామానులమ్మి, దైన్యంగా ముష్టియెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషా పాండిత్యం వలన మనకేమి ఒరిగింది ? అటు స్వభాషకు దూరమై, పరభాషను సంపూర్ణంగా నేర్చుకోలేక రెండింటికి చెడుతున్నాం. పరభాషకై వెచ్చించిన ధనంలో పడిన శ్రమలో, ఉపయోగించిన కాలంలో, పొందిన బాధలో 14వ వంతైనా అవసరం లేకుండా స్వభాషలో పండితులు కావచ్చు. అక్షరాభ్యాసం నుండే మన స్వభాషను అభ్యసిస్తున్నాం అనుకోనక్కరలేదు. నిజానికి తల్లి కడపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఉపాధ్యాయుడైనా అవసరం లేకుండా గ్రంథాలను ఊరకనే చదువుకుంటూ పోయినా కూడా భాషాజ్ఞానాన్ని సంపాదించవచ్చు.

తెలుగుభాష అసలు రానివానితోనే ఆంగ్లభాషలో మాట్లాడండి. మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేటప్పుడు ‘డియర్ ఫ్రెండ్’ అని మొదలు పెట్టి ‘యువర్స్ ట్రూలీ’ అని ముగించవద్దు. ‘బ్రహ్మశ్రీ’ అనో ‘మహారాజ శ్రీ’ అనో మొదలుపెట్టి ‘చిత్తగింపవలయును’ అని ముగించండి. ఇక తెలుగుభాష అసలు తెలియని వానికే ఆంగ్లంలో ఉత్తరం రాయండి. కొత్తగా వస్తున్న ఆంధ్ర పుస్తకములను విమర్శన బుద్ధితో చదవండి. తొందరపడి నిందించవద్దు. శనివారం మరియు ఆదివారం రాత్రిపూట తప్పకుండా రెండు గంటలు పురాణాలను చదవండి. తెలుగు భాషలోని వివిధ పత్రికలను చదవండి. ఆంగ్లేయ భాషా గ్రంథాలను చదివేటప్పుడు వాటిల్లో మన భాషకు పనికివచ్చే అంశాలను తదేక దృష్టితో వెతకండి. వాటిని గుర్తుంచుకోండి. ఇలా నియమంగా పట్టుదలతో ఉన్నప్పుడే కేవలం పుట్టుక చేత ఆంధ్రులం అనిగాక, బుద్ధిచేత, స్వభావం చేత, యోగ్యతచేత కూడా ఆంధ్రులమని అనిపించుకొంటాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఇ) పాఠం చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్తి ఎవరు?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సాక్షి’ అనే పేరుతో అనేక సంఘ సంస్కరణ వ్యాసాలను రాశారు. అందులో జంఘాలశాస్త్రి, బొర్రయ్య సెట్టి, కాలాచార్యులు, సాక్షి వంటివి కొన్ని పాత్రలు. స్వభాష గొప్పదనాన్ని జంఘాలశాస్త్రి చేత ఉపన్యాసరూపంగా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి ఆవేదనతో పలికిన మాటలేవి?
జవాబు:
హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట? ఎంతమాట? మీరు కూడా విన్నారా? నేనొక్కడినే విన్నానా? ఏదో విని ఇంకేదో అని భ్రమపడ్డానా ? భ్రమపడితే అదృష్టవంతుడినే ! నేనొక్కడనే కాదు ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! కాని అంతటి అదృష్టమెక్కడిది? ఆంధ్రదేశంలో, ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి, ఆంధ్ర సంప్రదాయాల్ని నేర్చుకొని, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి పొంది, ఆంధ్రభాషలో పండితులై, గ్రంథములను రచించి, భాషకు చక్కని అలంకారాలుగా అర్పించిన, సేవించిన తమ శరీరాల్ని, ప్రాణాల్ని, ఆత్మల్ని పవిత్రంగా చేసుకుని ప్రాణాలు విడిచి స్వర్గాన్ని చేరిన ప్రాచీనులైన ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! అయ్యయ్యో ! అంత అదృష్టం పట్టునా? పట్టదు. విన్నాను. నిజంగానే విన్నాను. నాది భ్రమ కాదు. నాతోపాటు మీరూ విన్నారు. వినక చెవులేమైనా చిల్లులు పడ్డాయా ? బుద్ధి తక్కువైందా? గుండెలు పగిలేలా విన్నాం. మనస్సు మండేలా విన్నాం. సిగ్గుపోయేలా విన్నాం. ప్రాణాలు పోతుండగా విన్నాం. బతికి ఉంటే ఎన్నటికైనా సుఖాలు పొందవచ్చని కవి చెప్పాడే. జీవించి ఉన్నందుకు మనకిదే ఫలమా? ఇదే సుఖమా?

ఆహాహ ! మన అధ్యక్షులవారు చెప్పినదేమి? వారి శ్రీ సూక్తి ఏమిటి? వారి నోటి నుండి వెలువడ్డ సూత్రం ఏమిటి? చెప్పేదా? తెలుగువాడు చెప్ప గూడనిదే ! చెప్పక తప్పదు గదా ! మన అధ్యక్షుల వారికి తెలుగుభాష రాదట. ఆయన తెలుగులో మాట్లాడలేరట. వారేమీ మూగవారు కారే. నత్తిగా మాట్లాడేవారు కారే. ఆంగ్లేయ భాషలో పండితులే. బర్కు, సిసిరో, డెమోస్టెనీసు, గ్లాడ్స్ వంటి గొప్ప ఉపన్యాసకుల ఉపన్యాస వైభవాన్ని అర్థం చేసుకొనడమే గాక, ఒంటబట్టించు కున్నవారే. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై నల్లని కోటు ధరించి, న్యాయమూర్తుల ఎదుట కాకిని గట్టిగాను, గద్దను కాకిగాను నిరూపించగల, సమ్మోహనం చేయగల సంభాషణ గలవారే. అటువంటి వారు తెలుగులో మాట్లాడలేకపోవడం ఏమిటి? తెలుగుదేశంలో పుట్టిన పక్షుల సైతం నిరంతరం వినడం వలన తెలుగు మాట్లాడుతుంటే అయ్యయ్యో ! మనుషుడై తెలుగువారికి పుట్టి, తెలుగు ప్రాంతపు నీరు, ఆహారం, గాలి స్వీకరిస్తున్నవాడే. తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా తెలుగులో మాట్లాడినవాడే. అట్టివాడు ఆంగ్లేయ భాషను నేర్చుకున్నంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేనంటున్నాడే? ఎంత ఆశ్చర్యం ! నమ్మదగని విషయం. పెద్ద అబద్ధం.

తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా చేసింది అశక్తి కాదు. అనిష్టత, అసహ్యం. ఇది రాతితో చెక్కిన మాట. ఎందుకని ఇష్టం లేదు? తెలుగు భాషలాంటి దిక్కుమాలిన భాషలేదని ఇతని నమ్మకం. పద్దతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, దిక్కుమాలినవాడు- ఇలాంటివారే తెలుగులో మాట్లాడతారని ఇతని అభిప్రాయం కాకుంటే ఎందుకు మాట్లాడడు? అయ్యయ్యో ! తెలుగులో మాట్లాడడం అంత చేయగూడని పనా? మకరంద బిందువులను స్రవించే సుందరమైన భాషే. ఇట్టి భాషను విడచి పరభాషను ఆశ్రయిస్తున్నారే.

పోనీ పరభాషలో సాధించిన పాండిత్యమేమైనా గొప్పదా అంటే ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు నిలువలేకుందే ! మన రాజధానిలో ఉన్న ఒక కాలేజీలో ‘వర్నాక్యులర్ సూపరింటెండెంటు’ గా ఒక సంస్కృత భాషా పండితుడగు ఆంగ్లేయుడున్నాడు. అతడు ‘యం బ్రహ్మ వేదాంత’ మొదలైన శ్లోకాలను చదివాడు. ఆ సంగతి చెప్పనక్కరలేదు. అలాగే గొప్ప తెలుగు పండితునిగా పేరొందిన బ్రౌను దొరగారు ఆంధ్రభాషలో ఏమాత్రం పండితులో మనకు తెలియకపోయినా నాటి ఆంధ్రులకు తెలియదా?

ఇలా పరభాషా వ్యా మోహంతో స్వభాషకు దూరమై “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారవుతున్నాం. ఈ విధంగా జంఘాలశాస్త్రి ఆవేదనతో పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి ఎవరిని అదృష్టవంతులంటున్నాడు?
జవాబు:
సభాధ్యక్షుడు పలికిన తనకు తెలుగులో మాట్లాడటం రాదనే మాట ఒకవేళ భ్రమైతే తాను అదృష్టవంతుణ్ణి అని అన్నాడు. ఇంకా ఆంధ్రులంతా అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశం కూడా అదృష్టవంతమైనదని భావించాడు. తెలుగు ప్రాంతంలో పుట్టినవారు, తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవారు, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి చెందినవారు అదృష్టవంతులని పేర్కొన్నాడు. ఆంధ్రభాషలో పండితులై, ఆంధ్రభాషలో గ్రంథాలను రచించి, ఆంధ్రభాషా దేవికి వెలకట్టలేని అలంకారాభరణాలుగా సమర్పించినవారు అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశ సేవచేసి- తమ శరీరాలను, ప్రాణాలను, ఆత్మలను పవిత్రులుగా జేసుకున్న వారిని అదృష్టవంతులన్నాడు. ప్రాణాలు విడచి పరమపదాన్ని చేరిన పూర్వకాలపు ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే అని సంభావించాడు.

ఈ) కింది అంశానికి భావం ఏమిటి? దీన్ని ఏ సందర్భంలో మాట్లాడాడు?
ప్రశ్న 1.
“కావు కావుమని యనవలసిన కాకులన్నిటిలో నొక కాకికొక్కొరోకోయని యఱచిన యెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో బొడిచివేయక మానునా?”
జవాబు:
భావం :
కాకులు, సహజంగా కావు కావుమని అరుస్తాయి. ఇది వాటి జాతి లక్షణం. కాకులలో ఉన్న ఒక కాకి అలా అరవక కోడిలా ‘కొక్కొరోకో’ అని అరిస్తే మిగిలిన కాకులు దాన్ని కాకిగా భావించక, వేరే పక్షి తమలో చేరిందని భావించి కోపంతో పొడిచి చంపేస్తాయి గదా ! అని భావం.

సందర్భం :
ఈ వాక్యాన్ని జంఘాలశాస్త్రి సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడాడు. అందరూ తెలుగు మాట్లాడవలసిన చోట, ఇంతమందిలో నీవొక్కడివే ఇంగ్లీషులో మాట్లాడావు. మేము నీలాంటి వారిని చాలామందిని చూశాము. ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడ్డాం గనుక సరిపోయింది. లేకుంటే కాకులన్నీ కలిసి తోటికాకిని పొడిచినట్లు నిన్ను హింసించక విడిచేవారమా? అని పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“మకరంద బిందుబృందరస స్యందన మందరమగు మాతృభాషయే”.
భావం :
తేనె బిందువులను కార్చే మందర పర్వతమువంటిదైన స్వభాష.

సందర్భం :
సభాధ్యక్షుడు ఆంగ్లంలోనే సంభాషించుటకు గల కారణాలను వెదుకుతూ జంఘాలశాస్త్రి ఈ వాక్యాన్ని పల్కాడు. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవం లేనివాడు. దిక్కులేనివాడు. తెలివి తక్కువవాడు అని అధ్యక్షుల వారి అభిప్రాయం. కాబట్టే తేనె లాంటి మధురభాషను విడచి పరభాషలో ఉపన్యసిస్తున్నాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కావ్యభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వీటి మధ్య భేదాలు ఏమిటి?
గ్రాంథికభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వాటి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
కావ్యభాష :
కావ్యాలలోను, గ్రంథాలలోను ఉపయోగించే, వ్యాకరణంతో గూడిన భాషను ‘కావ్యభాష’ అంటారు.

వ్యావహారికభాష :
రోజువారీ వ్యవహారాలను జరుపుకోవడానికి ఉపయోగించే భాషను ‘వ్యావహారిక భాష’ అంటారు. ఇందులో భావానికే ప్రాధాన్యం. వ్యాకరణ నియమాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

భేదాలు :

కావ్యభాష వ్యావహారికభాష
1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలకు అతీతంగా అందరిచే ఒకేలా ప్రయోగించబడుతుంది. 1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలను బట్టి అనేక విధాలుగా మారిపోతుంది.
2. దీనిలో మార్పులు చేరవు. ఎప్పటికీ ఒకేలా నిలచి ఉంటుంది. 2. దీనిలో మార్పులు సహజం. కాలం, ప్రాంతం, జనాల అవసరాలను బట్టి ఇది పలు రకాలుగా మారిపోతుంది.
3. నన్నయ-తిక్కన -ఎర్రనలు రాసిన భారతాన్ని ఇంకా ఇతర ప్రబంధ కవులు రాసిన కావ్యాలను గ్రంథాలను నేటికీ చదివి అర్థం చేసుకోగలుగుతున్నా మంటే కారణం కావ్యభాషలో ఉండటం. 3. ఇది ఆయా ప్రాంతాల వర్ణాల వారి స్వభావాన్ని, సహజతను తెలుపుతుంది. కాబట్టే అన్నమయ్య సంకీర్తనలలో చాలావరకు రాయలసీమ ప్రాంతపు యాస వాడబడినా “అన్నమయ్య పదసర్వస్వం” వంటి గ్రంథాల ద్వారా ఆయన సంకీర్తన సౌరభాలను ఆస్వాదించగలుగు తున్నాం.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మంచివక్తకు ప్రధానంగా సభలో పిరికితనం పనికిరాదు. కొత్త ప్రదేశమైనా, కొత్త మనుషులైనా చొరవగా చొచ్చుకుపోగలగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగల నేర్పు ఉండాలి. జంఘాలశాస్త్రికి అటువంటి చొరవ, నేర్పు ఉన్నాయి. చెప్పదలచుకొన్న అంశం పై సాధికారత ఉండాలి. సందర్భానుగుణంగా మాట్లాడే ఇతర అంశాలపై కూడా పట్టు ఉండాలి. భావానుగుణంగా భాష తడబాటు లేకుండా నదీ ప్రవాహంలా ఉరకలెత్తాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని పక్షపాతం చూపకుండా నిర్భయంగా, స్పష్టంగా చెప్పగలగాలి. ఈ గుణాలన్నీ జంఘాలశాస్త్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జంఘాలశాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
సభాధ్యక్షుడు తెలుగు మాట్లాడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
తెలుగులో అతడు మాట్లాడలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం కాదు. ఇష్టం లేకపోవడం. తెలుగంటే చులకన భావం. తెలుగు భాషకన్నా దిక్కుమాలిన భాషలేదని అతని నమ్మకం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, ఇంకా దిక్కు మాలినవాడని అతని అభిప్రాయమై ఉంటుంది. తెలుగులో మాట్లాడటం సిగ్గుచేటని అతని విశ్వాసం కాబోలు. సభాధ్యక్షుడు తెలుగులో మాట్లాడకపోవడానికి ఇవన్నీ కారణాలై ఉంటాయి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో సొంతమాటల్లో రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. ఆంగ్లవిద్యను అభ్యసించినా అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాన్ని వాడడానికి ఇష్టపడడు. తెలుగును ఎవరైనా కించపరిచేలా మాట్లాడినా, ప్రవర్తించినా సహించలేనివాడు. తోటి తెలుగువారైనా సరే చీల్చి చెండాడుతాడు. భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి ప్రచారం చేయడానికి ఉద్యమించాడు. మంచి వక్త, ఏ సభలోకైనా దూసుకొని వెళ్ళే స్వభావం కలవాడు. ప్రాచీన శాస్త్రాలను , నవీన శాస్త్రాలను కూడా ఒంటబట్టించుకున్నవాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో నేర్పరి. ఎదుటివారి మనసులోకి దూసుకొని వెళ్లేలా సూటిగా, స్పష్టంగా మాట్లాడగలడు. చిన్న తప్పును సైతం సహించలేని స్వభావం గలవాడు.

ప్రత్యేకించి తెలుగులో విద్యనభ్యసించేవారిని, తెలుగు సంభాషించేవారిని, తెలుగుదనం కోరేవారిని అభిమానిస్తాడు. ఇతని ఉపన్యాసం ద్వారా ఇతనికి ఆధునిక న్యాయశాస్త్రంపై చక్కని అవగాహన ఉందని తెలుస్తుంది. ఆధునిక ఆంగ్ల సాహిత్యం పై కూడా మంచిపట్టు ఉంది. నిష్కర్షగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా మాట్లాడతాడు. చక్కని ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా విషయాన్ని వివరించగల నేర్పు, ఓర్పు గలవాడు. తెలుగు, సంస్కృత భాషలను అనర్గళంగా మాట్లాడగలవాడు. పురాణ పరిజ్ఞానం, నవీన విజ్ఞానం, ఆంధ్ర సాహిత్య జ్ఞానం సమపాళ్లలో గల మేధావి. ప్రాచీనతను ఆధునికతతో మేళవించగలిగిన వ్యవహారదక్షుడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటి గలవాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“ఆంగ్లభాషయే కాదు. ఇంకననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచడానికే ఈ వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు ? దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఆధునిక కాలంలో కేవలం మాతృభాషాధ్యయనం వలన అన్నీ సాధించుకోలేం. కాబట్టి అన్యభాషలను అధ్యయనం చేయక తప్పదు. దేశీయ భాషలనే కాక అంతర్జాతీయ భాషలైన ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి వాటిని సైతం నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పరభాషల మత్తులో పడి మాతృభాషను మరువకూడదు. ఒకే మాతృభాష మాట్లాడేవారున్నచోట పరభాషలో మాట్లాడకూడదు. ఇంకా పరభాషలను అధ్యయనం చేసి, ఆయా భాషలలోని పదాలను మాతృభాషలోకి తీసుకువచ్చి స్వభాషలోని పదసంపదను పెంపొందించుకోవాలి. పరభాషలలోని గ్రంథాలలో ఉన్న ఉత్తమాభిప్రాయాలను, భావాలను గ్రహించి మాతృభాషలో వాటిని వినియోగించుట ద్వారా మాతృభాషకు వన్నె పెట్టుకోవాలి.

ఇతర భాషలలోని ఉత్తమ గ్రంథాలను, కవితా సంపుటాలను మాతృభాషలోకి అనువదించుట ద్వారా వాటి సౌందర్యాన్ని తోటివారికి పరిచయం చేసి ఆనందం కలిగించవచ్చు. స్వభాషను పరిపుష్టం చేసుకోవచ్చు. పరాయి భాషలలోని నూతన సాహిత్యపు పోకడలను, కొత్తగా పుడుతున్న శాస్త్రాలను, పారిభాషిక పదాలను స్వీయభాషలోకి తర్జుమా చేయడం ద్వారా సాహిత్య శాస్త్ర సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా మాతృభాషను కలకాలం నిలిచి ఉండేలా చేసుకోవచ్చు. అన్య భాషా గ్రంథాలను అభ్యసించేటప్పుడు మన భాషకు ఉపయోగపడే అంశాలేమైనా ఉన్నాయా అని తదేక దృష్టితో గమనించాలి. అట్టి వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని అవసరమైన చోట వినియోగించాలి.

ఇలా పరభాషా జ్ఞానాన్ని స్వభాషాభివృద్ధికి నిరంతరం వినియోగించడం ద్వారా భాష జీవత్వాన్ని కోల్పోదు. జవసత్వాలను కోల్పోదు. తద్వారా అమృతభాషయై నిలుస్తుంది.

ప్రశ్న 3.
తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారు ఎదురై, మీతో ఆంగ్లంలోనే మాట్లాడితే, మీకెలా ఉంటుంది? మీరేం చేస్తారు?
జవాబు:
నేడు ఆంగ్లంలో సంభాషించడం నాగరికతకు గుర్తుగా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడం మొరటైపోయింది. దూరదర్శన్లలోను, చలన చిత్రాలలోను ఆంగ్లభాషా ప్రభావం అధికంగా కన్పిస్తుంది. రోజువారీ వ్యవహారాలలోను ఆంగ్ల పదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుభాష క్రమక్రమంగా కృంగి కృశించిపోతోంది. చాలామంది తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. అలాంటి వారు నాకు ఎదురై ఆంగ్లంలో మాట్లాడితే నాకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. ఏం రోగం చక్కగా తెలుగులో మాట్లాడవచ్చు కదా అని అన్పిస్తుంది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంద’నే సామెత గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. భాషపై ఉన్న నిర్లక్ష్య భావానికి కోపం వస్తుంది.

నేను మాత్రం తప్పక తెలుగులోనే మాట్లాడతాను. వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడినదానికి తగ్గట్లు సందర్భోచితంగా తెలుగులో మాట్లాడతాను. దానివల్ల నాకు కూడా ఆంగ్ల పరిజ్ఞానం తగినంత ఉందని, కావాలనే నేను తెలుగులో మాట్లాడుతున్నానని వాళ్లు గ్రహించేలా చేస్తాను. తెలుగులో మాట్లాడటం తక్కువతనమేమీ కాదని నిరూపిస్తాను. ఏయే భావాలను, పదాలను తెలుగులో మాట్లాడలేమని కేవలం ఆంగ్లంలోనే మాట్లాడగలమని భావిస్తారో అటువంటి వాటిని మాతృభాషోపాధ్యాయుని సాయంతో, ఇతర పెద్దల సాయంతో తెలుగులో మాట్లాడి చెప్పుతో కొట్టినట్లు చేస్తాను. తెలుగు భాష సత్తాను చాటిచెపుతాను. తెలుగులో మాట్లాడటం వలన కలిగే సౌలభ్యాన్ని తెలియజేస్తాను. తద్వారా ప్రభావితులై కొంతమందైనా తెలుగులో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాను.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

జంఘాలశాస్త్రి పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
చెవులు మూసుకున్నట్లు అభినయిస్తూ ….

“హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట విన్నాను ! ఎంతమాట విన్నాను ! సరిగ్గానే విన్నానా? లేక ఏదో విని మరేదో అని భ్రమపడ్డానా? ఇది భ్రమే అయితే అంతకన్నా అదృష్టమేముంది ? నేనొక్కడినే కాదు యావదాంధ్రులూ అదృష్టవంతులే గదా ! ఆంధ్ర భాషా యోష (స్త్రీ) ను తమ గ్రంథాలచే అలంకరించిన పూర్వులందరూ అదృష్టవంతులే. అయ్యో ! అయ్యయ్యో ! అంతటి అదృష్టం కూడానా? ఇది భ్రమకాదు నిజమే. వినకపోవడమేమి? చెవులేమైనా చిల్లులు పడ్డాయా? గుండెలు పగిలేలా విన్నాను. మనస్సు మండేలా విన్నా ! సిగ్గు చిమిడిపోయేలా విన్నా? ప్రాణాలు ఎగిరిపోయేలా విన్నా ! “జీవన్ భద్రాణి పశ్యతి” – బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలు బడయవచ్చని కదా ఆదికవి వాల్మీకి వాక్యం. ఇంకా బతికి ఉన్నందుకు ఇదా ఫలం ! ఇదా సుఖం !!

ఆహాహా! ఏమి ? అతని ఆలాపకలాపం? ఏమా శ్రీసూక్తి? అతని వదనం నుండి వెలువడిన వాగమృతమేమి? ఆంధ్రుడు చెప్పదగినదికాదే? ఆలోచనలలో సైతం అనుకోకూడనిదే? కాని …… (సాలోచనగా) అంత నిర్లజ్జగా ఎలా చెప్పగలిగాడు తనకాంధ్రభాష రాదని ! తాను తెలుగులో మాట్లాడలేనని ! కృష్ణాతీరంలో ఆంధ్రులైన దంపతులకు పుట్టి, తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాలైనా తెలుగులో మాట్లాడి, ఏమ్.ఏ.,బి.ఎల్. చేసి, న్యాయవాద వృత్తిని నిరాఘాటంగా, నిరంకుశంగా నిర్వహిస్తున్నవాడే. కాలాంబర కవచధారియై న్యాయమూర్తుల ఎదుట గ్రద్దను కాకిగాను, కాకిని గ్రద్దగాను నిరూపించగల కర్కశతర్కంతో, వాగ్విలాసంతో సర్వులనూ సమ్మోహితుల్ని జేయజాలినవాడే. అట్టివాడు ఆంగ్లభాషను అభ్యసించినంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేడా ? మూగవాడేమీకాదే – నంగి నంగి మాటలాడువాడు కాదే? మెమ్మెపెప్పె అనేవాడు కాదే ? మాట్లాడలేకపోవటం అంటే నాకేమీ బోధపడటం లేదు. మ్యావుమని అరవని పిల్లెక్కడైనా ఉంటుందా ? కిచకిచలాడని కోతినెక్కడైనా చూశామా? తెలుగు గడ్డపై పుట్టిన పక్షులు సైతం అనవరత శ్రవణం వల్ల తెలుగులో మాట్లాడుతుంటే మనిషై పుట్టి, అందునా ఆంధ్రుడిగా పుట్టి తెలుగు ప్రాంతమందలి నీటిని, గాలిని, ఆహారాన్ని వినియోగించుకుంటూ, ఆ మాత్రం విశ్వాసం కూడా చూపక నీచాతినీచంగా తెలుగురాదని అంటాడా ? ఇంతకన్నా విశ్వాసఘాతుకం ఉందా?

హా ! తెలిసింది! ఇప్పటికి కారణం దృగ్గోచరమైంది. తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా జేసింది అశక్తి కాదు. అనిష్టత – అహ్యతత – ఇది శిలాక్షరమైన మాట. తెలుగు బాసంత దిక్కుమాలిన బాసే లేదని ఈతని అభిప్రాయం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవము లేనివాడు. గతిలేనివాడు. బుద్ధిమాలినవాడు. తెలుగులో మాట్లాడుట సిగ్గుసిగ్గు. ఇది ఇతని అభిప్రాయం మాత్రమే కాదు. ఏ కొద్దిపాటి ఆంగ్లం అభ్యసించిన తెలుగువారందరి అభిప్రాయమని కూడా తోస్తుంది.

తెలుగులో మాట్లాడటం అంత సిగ్గుమాలిన పనా ? అయ్యో ! మన భాషకు, మకరంద బిందు బృందరస స్యందన మందరమగు మాతృభాషకు, తేనెలూరు తేట తెలుగుకు ఎంతటి దురావస్థ పట్టింది ? మాన్యాలమ్ముకొని, సొమ్ము వ్యయపరచి, ఎంతోమందిని ఆశ్రయించి, ఎన్నో బాధలుపడి దైన్యంతో సంపాదించిన ఆంగ్లభాష వలన ఒరిగినదేమున్నది ? అర్ధ శతాబ్దం ఆంగ్లభాషను అభ్యసించినా సంపూర్ణ భాషోచ్చారణా సౌష్ఠవం పట్టుపడ్డదా ? భాషా సౌలభ్యం అలవడిందా? లేదే ! గ్రంథజ్ఞాన శూన్యుడైన జన్మమాత్రాంగ్లేయునికి ఉన్న సౌలభ్యంలో సాబాలైనా సిద్ధించలేదే ? ఇక సంస్కృతాంధ్రాలను అభ్యసించిన ఆంగ్లేయులు వేదమంత్రాలను, చిత్ర కావ్యాలలోని శ్లోకాలను, తెలుగు జానపద గీతాలను చక్కగా ఆలపించగలరా? ఎన్నటికి చేయలేరు గదా ! పరభాషా పదాలకు అర్థాలు తెలిసినంతమాత్రాన పండితులమయ్యామనుకుంటే ఎలా ? ఆ భాషలోని కళను, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి. అది ఆ భాష మాతృభాషగా గలవారికి మాత్రమే సాధ్యం. మిగతా వారందరికీ అది నేల విడిచిన సామే. స్వభాషను విడిచి పరభాషకై పాకులాడటం వలన రెండింటికి చెడ్డ రేవడిలా అయింది.

స్వభాషను నేర్చుకోవటంలో కష్టమేముంది ? నిజానికి ఇష్టం లేదుగాని. విద్యాభ్యాసానికి ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవటం మొదలైంది గదా ! పరభాషకై వెచ్చించిన ధనంలో, పడిన శ్రమలో, వ్యర్థపరచిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పులో 14వ వంతైన అక్కరలేకుండా మాతృభాషలో పండితులమవుతాం గదా ! ఈ వాస్తవాన్ని నా తెలుగు వారెన్నటికి గ్రహిస్తారో గదా ! నా తెలుగు ఎన్నటికి మహోన్నత వైభవాన్ని పొందుతుందో గదా !! (భారంగా నిట్టూరుస్తాడు.)

అయినా నా భావాలను ఆలోచనల రూపంలో మాత్రమే ఉంచితే లాభం లేదు. తెలుగు భాషోన్నతికై నడుం బిగించి ఉద్యమించాలి. యావదాంధ్రదేశంలో సంచరిస్తూ, మాతృభాషా విషయమై జాగరూకుల్ని చేయాలి. ఇదే కర్తవ్యం. అవును. ఇదే తక్షణ కర్తవ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగుపదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
అభినందన పత్రం
జవాబు:
ప్రియమైన మిత్రులకు,

శుభాభినందనలు. నేను చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు తెలుగులో మాట్లాడటం నన్ను బాగా ఆకర్షించింది. నిజానికి మనం రోజూవాడే మాటలలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలే లేవని నేను అనుకొన్నాను.

నా ఊహ తప్పని మీరు నిరూపించారు. తరగతి గది, తుడుపు గుడ్డ, సుద్దముక్క, ఉపస్థితి పట్టిక వంటి చక్కని తెలుగు పదాలను ఉపయోగిస్తూ తెలుగు వాతావరణాన్ని ఏర్పరచారు. మీలాంటి వారు నా మిత్రులని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.

మీ వలన నేను తెలుగు భాష గొప్పదనాన్ని, మాధుర్యాన్ని గుర్తించాను. ఇంతకుముందు నేను తెలుగు మాధ్యమంలో చదువుతున్నందుకు సిగ్గుపడ్డాను. కాని నేడెంతో గర్వపడుతున్నాను. తెలుగుని అభిమాన విషయంగా చదువుతున్నాను. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తున్నాను. గేయాలను చక్కగా గానం చేయడానికి కృషి చేస్తున్నాను. రోజువారీ వ్యవహారంలో మనం ఉపయోగించే ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలను మాతృభాషోపాధ్యాయుని సహాయంతో, ఇతర పెద్దల సహాయంతో సేకరించి, తగినచోట్ల వినియోగిస్తున్నాను. వీటి అన్నింటికి ప్రేరకులు మీరే. ధన్యవాదాలు.

ఇలా తెలుగులో నా కార్యకలాపాలకు తగిన భాషను వినియోగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంట్లోని పెద్దవారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా తాతయ్య – నాయనమ్మల ఆనందానికి అవధులు లేవు. “నీలా నీ మిత్రులందరూ, రాష్ట్రంలోని విద్యార్థులందరూ తెలుగును అభిమానిస్తూ తెలుగు భాషనే వినియోగిస్తూ ఉంటే మన తెలుగుభాష అమృత భాషగా నిలుస్తుంది. మీ వలన పెద్దలలో కూడా తప్పక మార్పు వస్తుంది. ఇది ఒక శుభపరిణామం. నీలో మార్పునకు కారకులైన నీ స్నేహితులకు శుభాశీస్సులు. వీలైతే ఎప్పుడైనా వారిని మనింటికి అతిథులుగా తీసుకొనిరా” అని చెప్పారు. తప్పక మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. మీ రాకకై మేమందరం ఎదురు చూస్తున్నాం. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

(లేదా)
పాఠంలోని ఏవైనా రెండు పేరాలను వ్యవహార భాషలోకి మార్చి రాయండి.
1. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 4వ పేరా :
“స్వభాష యిదివఱకు మీచేతఁజావనే చచ్చినది. మీగతి యెంత యుభయభ్రష్టమైనదో చూచుకొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాలవవంతైన నక్కఱలేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుటకే మంత శ్రమమున్నది ? అక్షరాభ్యాస దినమునుండియే మీరు స్వభాష నభ్యసించుచున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు.
పై పేరా వ్యవహారభాషలో రాయడం :
జవాబు:
స్వభాష ఇదివరకే మీ చేతిలో చచ్చింది. మీ గతి ఎలా ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా ? మీరు వెచ్చించిన ధనంలో, పడ్డ శ్రమలో, వినియోగించిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పుల్లో పద్నాలుగవ వంతైనా అక్కర్లేకుండా, మీరు దేశభాషలో పండితులయ్యేవారు. స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏమంత శ్రమ ఉంది ? అక్షరాభ్యాస దినం నుంచే మీరు స్వభాషను అభ్యసిస్తున్నారని అనుకోవద్దు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోడం (మొదలెట్టారు.) మొదలుపెట్టారు.

2. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 7వ పేరా :
“నాయనలారా ! మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁగొట్టితిని. నన్ను మీరు క్షమింపవలయును. మఱి యెప్పుడైన నీసభ తిరుగఁజేసికొనుడు. (‘అప్పుడు మీరధ్యక్షులుగా రావలయును’ కేకలు) నాయనలారా ! అటులే-మీరంత యాంధ్రభాషాభిమానంతోఁ బ్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను జేయనా? ఇఁక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధ్యమున నెన్నఁడు మాటాడవలదు.
వ్యవహారభాషలో పై పేరాను రాయడం :
జవాబు:
నాయనారా ! మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను. నన్ను మీరు క్షమించాలి. మరెప్పుడైనా ఈ సభ తిరిగి చేసికోండి. (అప్పుడు మీరధ్యక్షులుగా రావాలి. సభలో కేకలు …) నాయనారా ! అలాగే, మీరంత ఆంధ్రభాషాభిమానంతో ప్రవర్తిస్తున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా ? ఇక నాలుగు మాటలు మాత్రం చెప్తాను. ఆంధ్రభాష బొత్తిగా, రానివాడితో కాని, మీరాంగ్లంలో ఎన్నడూ మాట్లాడొద్దు.

IV. ప్రాజెక్టు పని

తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే వ్యాసాలను, పద్యాలను సేకరించండి. వాటి గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, ఆ పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

1. శిశువుల మాటలు చిలుక పలుకుల్లా ఉంటాయి.
జవాబు:
చిలుక పలుకులు – అర్థం తెలియకుండా అనే మాటలు.
వాక్యప్రయోగం :
మా తమ్ముడు హిందీ వ్యాసాన్ని చదువుతుంటే అర్థం తెలియకుండా అనే మాటల్లా ఉంది.

2. తొందరపడి ఎవరినీ అధిక్షేపించ గూడదు.
జవాబు:
అధిక్షేపించుట = ఎగతాళి చేయుట
వాక్య ప్రయోగం :
వికలాంగులను (దివ్యాంగులను) చూసి ఎగతాళి చేయగూడదు.

ఆ) కింది పట్టికలో ప్రకృతి వికృతుల పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 2
జవాబు:

ప్రకృతి – వికృతి

1. భాష – బాస
2. పక్షి – పక్కి
3. విద్య – విద్దె
4. రాత్రి – రాతిరి
5. ఆశ్చర్యము – అచ్చెరువు
6. గృధ్రము – గద్ద

వ్యాకరణం

అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని ‘సంక్లిష్ట వాక్యం’ అంటారని మీరు తెలుసుకున్నారు కదా !
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచున్నారు.
ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ, ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.

2. నన్ను మీరు క్షమింపవలయును.
మఱి యెప్పుడైన ఈ సభ తిరుగ జేసికొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి, మఱి యెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) సమాన ప్రాధాన్యం గల సామాన్యవాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్తవాక్యమంటారని తెలుసుకున్నారు కదా!
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు.
జవాబు:
ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణాతీరమున పుట్టినవాడు.

2. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకొంది.
జవాబు:
మోహిని కూచిపూడి నృత్యం మరియు భావన భరతనాట్యం నేర్చుకొన్నారు.

క్వార్థకం :
భూతకాలంలోని అసమాపక క్రియను ‘క్త్వార్థకం’ అంటారు. ‘క్వా’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థమే క్వార్థకం.
ఉదా :
వచ్చి, తిని

చేదర్థకం :
సంస్కృతంలో ‘చేత్’ అనే ప్రత్యయానికి ‘అయితే’ అని అర్థం. ఇలా తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికి చేరితే దాన్ని ‘చేదర్థకం’ అంటారు.
ఉదా :
కురిస్తే

శత్రర్థకం :
‘శత్రచ్’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థం శత్రర్థకం. ‘శతృ’ ప్రత్యయం వర్తమానకాలమందలి అసమాపక క్రియకు చేరుతుంది. కాబట్టి వీటిని శత్రర్థకాలు అంటారు.
ఉదా :
చేస్తూ, తింటూ

ఇ) కింది వాక్యాలు చదవండి. వీటిలో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి.

1. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. – చేదర్థకం
2. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. – క్వార్థకం
3. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. – శత్రర్థకం
4. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. – చేదర్థకం
5. రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు. – చేదర్థకం
6. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకొంటున్నది. – శత్రర్థకం

ఈ) కింది పేరాలో అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి.
మనము చూడనే లేదయ్యా మన జంఘాలశాస్త్రియే యయ్యా యని వారిలో వారనుకొనుచు ఎప్పుడు వచ్చినారు ఎక్కడి నుండి వచ్చినారు మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కల లేదా ఏమి న్యాయమయ్యా యని యేవేవో అసందర్భములాడి నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.
జవాబు:
విరామచిహ్నములతో వ్రాయుట :
‘మనము చూడనేలేదయ్యా. మన జంఘాలశాస్త్రియేయయ్యా’, యని వారిలో వారనుకొనుచు, “ఎప్పుడు వచ్చినారు? ఎక్కడి నుండి వచ్చినారు? మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కఱలేదా ? ఏమి న్యాయమయ్యా?”, యని యేవేవో అసందర్భములాడి, నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఉ) ప్రత్యక్ష, పరోక్ష కథనాలు
ప్రత్యక్ష కథనం :
ఒక వ్యక్తి చెప్పిన మాటలను అలాగే ఉన్నది ఉన్నట్లుగా (ఉద్ధరణ చిహ్నాలలో ఉంచి) చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

కింది వాక్యాలు చదవండి.
1) “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
2) “నన్ను మీరు క్షమింపవలయును.”

పై వాక్యాలన్నీ జంఘాలశాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !
నేను, మేము, …….. ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా, ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి. అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా )
“నేను రా” నని నరేశ్ రఘుతో అన్నాడు.

పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు ?
మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటల్ని, రెండవదాంట్లో నరేష్ అన్న మాటల్ని “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టడ్ కామాలు) ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష కథనం అంటారు.

పాఠం చదవండి. ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

  1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడే.
  2. “నాయనలారా ! మీరు కూడా వింటిరి కాదా ! నేనొక్కడినే వింటినా? ఏదో విని మటియేదో యని భ్రమపడితినా?”
  3. ‘నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ? ఆంధ్రులందఱదృష్టవంతులే కదా!”
  4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు.”
  5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట.”
  6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?”
  7. “మా భాష మాకు రాదు.” 8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను.”
  8. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును.”
  9. “మన భాష కక్కఱకు వచ్చు నంశము లేమియా” యని తదేక దృష్టితో జూడండి.

పరోక్ష కథనం :
ఒకరు చెప్పిన మాటలను యథాతథంగా అట్లే చెప్పక ఇంకొకరు చెపుతున్నట్లుగా చెప్పడాన్నే పరోక్ష కథనం అంటారు. ఇందులో వాక్యాలు ఉత్తమ పురుషలో ఉండవు. ఉద్ధరణ చిహ్నాల అవసరమూ ఉండదు.

కింది వాక్యాలు చదవండి.

  1. నరేష్ తాను రానని రఘుతో అన్నాడు.
  2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
  3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.

పాఠం చదవండి. పరోక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
పాఠంలో గుర్తించిన పరోక్ష కథనంలోని వాక్యాలు :

  1. ఆయన యాంధ్రుడు. కృష్ణాతీరమున బుట్టినవాడు.
  2. న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా, నిరంకుశముగా నిర్వర్తించుచున్నవాడు.
  3. ఆయన ఆంధ్రమున మాటలాడనేలేరట.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు

  1. ప్రత్యక్ష కథనంలోని మాటల/వాక్యాల భావం మాత్రమే పరోక్ష కథనంలో తీసుకొనబడుతుంది.
  2. ఉద్దరణ చిహ్నాలు తొలగించబడతాయి పరోక్ష కథనంలో.
  3. ‘అని’ అనే పదం పరోక్ష కథనంలో చేరుతుంది.
  4. ప్రత్యక్ష కథనంలోని ఉత్తమ పురుష పదాలైన – నేను – మేము – మన – మా వంటి పదాలు – తాను – తాము – తమ – అనే పదాలుగా పరోక్ష కథనంలో మారుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

1) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడు.
జవాబు:
బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు అని కవి చెప్పినాడు.

2. “మీరు కూడ వింటిరి కాదా? నేనొక్కడనే వింటినా? ఏదో విని మఱియేదో యని భ్రమపడితినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
మీరు కూడ వింటిరి కాదా? తానొక్కడే విన్నాడా? ఏదో విని మటియేదో యని భ్రమపడినాడా? అని జంఘాలశాస్త్రి అన్నాడు.

3. “నేనొక్కడనే అదృష్టవంతుడనా? ఆంధ్రులంద అదృష్టవంతులే కదా ! ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తానొక్కడే అదృష్టవంతుడా ? ఆంధ్రులందరు అదృష్టవంతులే కదా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి.

4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తనది భ్రమము కాదని, తాత్కాలికోన్మాదము కాదని అన్నాడు జంఘాలశాస్త్రి.

5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట అని అన్నాడు జంఘాలశాస్త్రి.

6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?” అన్నాడు శాస్త్రి.
జవాబు:
అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారని అన్నాడు శాస్త్రి.

7. “మా భాష మాకు రాదు” ఇలా అనకూడదేవరు.
జవాబు:
తమ భాష తమకు రాదని అనకూడదెవరు.

8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నేధిక్షేపింపనా” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని తానధిక్షేపింపనని అన్నాడు జంఘాలశాస్త్రి.

9. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పెదనని అన్నాడు జంఘాలశాస్త్రి.

10. “మన భాషకక్కఱకు వచ్చు నంశము లేమియా’యని తదేక దృష్టి జూడుడి” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ భాష కక్కల వచ్చు నంశము లేమియాయని తదేక దృష్టి జూడండని అన్నాడు జంఘాలశాస్త్రి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2) మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.
1. “నేను బాగా చదువుతాను” అన్నాడు రఘు, రాజుతో.
జవాబు:
తాను బాగా చదువుతానని రఘు రాజుతో అన్నాడు.

2. “నేను అందగత్తెనని” చెప్పింది రాణి.
జవాబు:
తాను అందగత్తెనని రాణి చెప్పింది.

3. “మేము రేపు ఊరికి వెళ్ళుతున్నాం”చెప్పాడు విష్ణు.
జవాబు:
తాము రేపు ఊరికి వెళ్ళుతున్నామని విష్ణు చెప్పాడు.

4. “మన మందరం అమెరికా వెళ్తున్నాం” ఆనందంగా చెప్పింది రోజి.
జవాబు:
తామందరం అమెరికా వెళ్తున్నారని రోజి ఆనందంగా చెప్పింది.

5. ” మా అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చింది” అన్నాడు రాము నిఖిల్ తో సంతోషంగా.
జవాబు:
తన అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చిందని రాము నిఖిల్ తో సంతోషంగా అన్నాడు.

6. “మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది” అని మేరి రమణతో అంది.
జవాబు:
తమ ఇల్లు చాలా విశాలంగా ఉంటుందని మేరి రమణతో అంది.

7. “మా అన్నయ్య కవితలు బాగా రాస్తాడు” అంది సుమ రమతో.
జవాబు:
తన అన్నయ్య కవితలు బాగా రాస్తాడని సుమ రమతో అంది.

8. “మా చెల్లెలు బాగా పాటలు పాడుతుంది” అన్నాడు రమేష్.
జవాబు:
తన చెల్లెలు బాగా పాటలు పాడుతుందని రమేష్ అన్నాడు.

9. “నేను మా తమ్ముడితో ఆటలు ఆడను” తెగేసి చెప్పింది వాణి.
జవాబు:
తాను తమ తమ్ముడితో ఆటలు ఆడనని వాణి తెగేసి చెప్పింది.

10. “మా అబ్బాయి చదరంగం బాగా ఆడతాడు” చెప్పింది గిరిజ నీరజతో.
జవాబు:
తమ అబ్బాయి చదరంగం బాగా ఆడతాడని గిరిజ నీరజతో చెప్పింది.

9th Class Telugu 2nd Lesson స్వభాష రచయిత పరిచయం

పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో 1 జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నత విద్య వరకూ | రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా | కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో | సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా :
హరహరా = ఈశ్వరా ! ఈశ్వరా !
శంభూ = ఓ శివా !
భ్రమపడితిని = భ్రాంతి చెందితిని
ఆంధ్ర మాతాపితలు = తెలుగువారైన తల్లిదండ్రులు
ఉద్భవించి = పుట్టి
అభ్యసించి = నేర్చి
అమూల్య + అలంకారములు = విలువ కట్టరాని అలంకారాలు
అర్పించి = ఇచ్చి
ఆచరించి = చేసి
అంగములు = అవయవాలు
అసువులు = ప్రాణాలు
పాసి = విడిచి
పరమ పదము = వైకుంఠము లేక కైలాసము
తాత్కాలికోన్మాదము (తాత్కాలిక + ఉన్మాదము) = అప్పుడు మాత్రమే ఉండిన వెఱ్ఱి
చెవులు చిల్లులుపడు = పెద్ద ధ్వనిచే చెవులు చిల్లులు పడినట్లగుట

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2వ పేరా :
ఆలాప కలాపము = మాటల సమూహం
సాయించిన = చెప్పిన
శ్రీ సూక్తి = మంగళకరమైన నీతివాక్యము
ఆస్యగహ్వరము = గుహ వంటి నోరు
అవతరించిన = పుట్టిన
ఆగమ సూత్రము = వేద సూత్రం
వచింపదగినది = చెప్పదగినది
అగ్రాసనాధిపతి (అగ్ర + ఆసన + అధిపతి) = అధ్యక్షుడు
ఆంగ్లేయ భాషా పండిత + అగ్రణులు = ఇంగ్లీషు భాషా పండితులలో శ్రేష్ఠుడు
వక్తృ, వావదూకతా వైభవము = మాటలాడే వ్యక్తి యొక్క ఉపన్యాస వైభవం
కబళించి = ముద్దగా మ్రింగి
కడతేఱ్ఱి = కృతార్థులయి
కాలాంబర కవచధారి = నల్లని వస్త్రాన్ని కవచంగా ధరించినవాడు (నల్లకోటు ధరించిన వకీలు)
కర్కశ తర్క వాగ్వాహినీ = కఠినమైన తర్కవాక్కుల ప్రవాహం
మోహినీకరణ దక్షులు = ‘మోహింపజేయడంలో సమర్థులు
వాగ్దోరణీ ధీరులు = మాట్లాడే తీరులో గొప్పవారు
అనవరత శ్రవణము = ఎల్లప్పుడూ వినడం
మనుజుడు = మనిషి
వాయునీరాహారపారణము = గాలిని, నీటినీ ఆహారంగా తినడం
ఒనర్చినవాడు = చేసినవాడు
అవిశ్వసనీయము = నమ్మదగనిది

3వ పేరా :
అనిష్టత = ఇష్టము లేకపోవడం
శిలాక్షరము (శిల + అక్షరము) = రాతిపై చెక్కిన అక్షరం (శాశ్వతం)
ఆంగ్లేయ తేజస్సు = ఇంగ్లీషు ప్రకాశం
అకార్యకరణము = చేయరాని పనిని చేయడం
మకరంద, బిందు, బృంద, రస = పూదేనె, బిందువుల యొక్క సమూహం యొక్క రసం
స్యందన మందరము = స్రవించే మందారము అనే కల్పవృక్షం
మాతృభాష = తల్లి భాష
పరిత్యజించి = విడిచి
పఠించినవారు = చదివినవారు
మాన్యములు = శ్రీమంతులు పన్నులు లేకుండా గౌరవం కోసం పూజ్యులకు ఇచ్చే పొలాలు
వ్యయపఱచి = ఖర్చు చేసి
చిత్తక్లేశము = మనస్సునకు కష్టం
సౌలభ్యము = సులభత్వము
గ్రంథజ్ఞాన శూన్యుడు = పుస్తక జ్ఞానం లేనివాడు
సాబాలు = సగము
అర్ధశతాబ్దము = ఏబది సంవత్సరాలు
అలవడినది = అబ్బినది
భాషోచ్చారణ (భాషా + ఉచ్చారణ) = భాషను పలుకుట
సౌష్ఠవము = నిండుదనం
విశేషజ్ఞులము = బాగా తెలిసినవారం
ఉపజ్జా సహితములు = ఇతరుల ఉపదేశం లేకుండానే, మొట్టమొదటనే కలిగే జ్ఞానము ‘ఉపజ్ఞ’ – దానితో కూడినవి.
వాగ్దోరణులు = మాటతీరులు
చిలుక పలుకులు = సొంతముగా ఆలోచింపక పలుకు మాటలు
ఒరిజినాలిటీ (originality) = ఉపజ్ఞ, నవీన కల్పనాశక్తి
ధీమంతులు = బుద్ధిమంతులు
వ్యాసపీఠాధిపత్యము = వ్యాసరచన పీఠానికి అధికారిత్వము

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

4వ పేరా :
ఈనాము = బహుమానంగా ఇచ్చిన భూభాగం, మాన్యం
దైన్యపడి = దీనత్వమును పొంది

5వ పేరా :
ఉభయభ్రష్టము = రెండిటికీ చెడినది

6వ పేరా :
కంఠోక్తి (కంఠ + ఉక్తి) – = గట్టిగా చెప్పడం
అనర్హవాక్యము = తగని మాట
అనుచిత వాక్యము = ఉచితము కాని మాట
నిస్సందేహము = సందేహము లేకుండా
అవకతవక = అసందర్భం

7వ పేరా :
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ = ఆస్తులను బదలాయించే చట్టం
యథార్థము (యథా + అర్థము) = సరియైనది
రవంత (రవ + అంత) = రేణువు అంత
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ = నేరాలకు శిక్షించు విధిని నిర్ణయించు గ్రంథం

8వ పేరా:
ఎవిడన్సు యాక్ట్ = సాక్ష్య చట్టం
లేటెస్టు ఎడిషన్ = కడపట అచ్చువేసిన ప్రతి
జడ్జిమెంటు = తీర్పు

9వ పేరా :
అధిక్షేపించు = ఆక్షేపించు
ప్రశస్తము = మేలయినది
వన్నెపెట్టుట = మెఱుగు పెట్టుట
అక్కఱములు = అక్షరములు
ఉపచరింపదలచితివి = సేవింపదలచితివి
బాయ్ ! రూములోనున్న పాట్ లో = అబ్బాయీ ! గదిలోని కుండలో
రైస్ = బియ్యం
క్రైండ్లీ గెటిట్ హియర్ = దయతో ఇక్కడకు వాటిని తెండి
థాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ = ముందుగా కృతజ్ఞతలు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

10వ పేరా:
డియర్ ఫ్రెండ్ = ప్రియమైన స్నేహితుడా !
యువర్సు ట్రూలీ = మీ విశ్వసనీయమైన
అక్కఱ = అవసరం
తదేకదృష్టి (తత్ + ఏక దృష్టి) = అది ఒక్కటే చూపు
మెదటిలో = మెదడులో
పదిలపటపుడు = స్థిరపరచండి

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 1 శాంతికాంక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

అది 1945 వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవైఆరు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. డెబ్బై వేలమంది క్షతగాత్రులయ్యారు. నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా చదివాక మీకేమర్థమైంది?
జవాబు:
యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది.

ప్రశ్న 2.
మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది?
జవాబు:
మానవ వినాశనానికి దారితీసింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
ఆధునిక కాలంలో యుద్ధాలవల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
జవాబు:
ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను, అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది. దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది.

ప్రశ్న 4.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి. సోదర భావంతో మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి చర్చించండి.

ప్రశ్న 1.
శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు గదా! అలా ఎందుకన్నాడో చర్చించండి.
జవాబు:
పాండురాజు మరణిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని పాండవులకు సూచించాడు. పాండవులను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు అనేక కష్టాల నుండి రక్షించాడు. లక్క ఇంటి ప్రమాదం నుండి, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో, అరణ్యవాస సమయంలో, ఇలా పలు సందర్భాల్లో శ్రీకృష్ణుడు కాపాడటం ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజు ధర్మాన్నే ఆశ్రయించినవాడు కాగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు.

యుద్ధం లేకుండా, బంధునాశనం కాకుండా, తమ రాజ్యం తమకు రావాలని ధర్మరాజు కోరిక. దాన్ని నెరవేర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడని అతని విశ్వాసం. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే దానికి కారకుడిగా దుర్యోధనుడినే లోకం నిందించాలి తప్ప తమని నిందించకూడదనేది ధర్మజుడి కోరిక. అలా “కర్ర విరగకుండా పాము చావకుండా” – కార్యం సాధించగల నేర్పరి శ్రీకృష్ణుడు. కాబట్టే కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కృష్ణుణ్ణి కీర్తించాడు.

ఎదుటివారి మనోభావాలను చక్కగా గ్రహించి, తదనుగుణంగా వ్యూహాన్ని పన్నగల మేధావి శ్రీకృష్ణుడు. దక్షుడు కాబట్టే ఈ అసాధ్య కార్యాన్ని సాధించగలడని, రాయబార సమయంలో దుర్యోధనాదులు ఏవైనా ఇబ్బందులు కలిగించినా తప్పుకొనిరాగల ధీరుడని ధర్మరాజు నమ్మకం. పాండవుల హృదయాల్ని లోకానికి తెలియబరచగలిగిన వాక్చాతుర్యం, అవసరమైతే తగిన సమాధానం చెప్పగల నేర్పు, తగినంత ఓర్పు గల మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు.

శ్రీకృష్ణుడు తాను చిన్నప్పటి నుండే మానవాతీత శక్తుల్ని ప్రదర్శించాడు. పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులను చంపడం, కాళీయుని పడగలపై నాట్యం చేయడం వంటి అతిమానుష శక్తుల్ని కలిగి ఉన్నాడు. గోవర్ధనగిరిని పైకిలేపుట వంటి కార్యాల ద్వారా తాను పరమాత్ముడనే సత్యాన్ని వెల్లడి చేశాడు. కుంతీదేవి కూడా కృష్ణుడిని మేనల్లునిగా గాక భగవంతునిగానే సంభావించింది. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, ఎల్లప్పుడు శుభాలను కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టే కృష్ణునికి శరణాగతుడైనాడు ధర్మరాజు.

ప్రశ్న 2.
యుద్ధాల వల్ల కలిగే నష్టాలు, అనర్దాలు చెప్పండి.
జవాబు:
యుద్దాల వల్ల సంపదలు కలిగినా ప్రాణహాని కూడా జరుగుతుంది. బలహీనులు బలవంతుని చేతిలో చనిపోతారు. ఒక్కొక్కసారి బలవంతులు సైతం బలహీనుల చేతిలో సమసిపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిశ్చయించి చెప్పలేము. ఒకవేళ సంగ్రామంలో అపజయం కలిగితే అది చావు కంటే భయంకరమైనది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధానికి మూలం పగ. పగ కారణంగానే యుద్ధజ్వాల రగులుతుంది. పగ తగ్గితే యుద్ధ ప్రవృత్తి సహజంగానే తొలగిపోతుంది.

ఒకసారి పగ సాధింపునకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. సంధికి అవకాశం ఉండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రుసంహారమే కొనసాగుతుంది. లక్ష్యం కొద్దిమందికే అయినా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. చాలామంది వికలాంగులవుతారు. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి కుటుంబాలు వీధినబడతాయి. తమ పిల్లల్ని కోల్పోయిన వృద్ధులు అనాథలవుతారు. దేశంలో కరవుకాటకాలు విలయతాండవం చేస్తాయి.

పూర్వకాలంలోని యుద్ధాలకు నీతినియమాలుండేవి. కానీ ఆధునిక కాలంలో యుద్ధాలకు అవి వర్తించడం లేదు. పూర్వం యుద్ధాలు సూర్యోదయం తర్వాత ఆరంభమై సూర్యాస్తమయంతో ముగిసేవి. నేడు రాత్రివేళల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మానవుని విజ్ఞానం బాగా పెరిగి, అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు కనుగొనబడి యుద్ధాల్లో ప్రయోగించబడుతున్నాయి. వీటివల్ల దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుండి మాయమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాలకే కాక ఇతర ప్రపంచ దేశాలకు సైతం నేడు అనర్థాలు కలుగుతున్నాయి.

బాంబుల విస్ఫోటనాల వల్ల జలకాలుష్యం, వాయు కాలుష్యాలేర్పడి ప్రక్కనున్న దేశాలు కూడా నష్టమౌతున్నాయి. పరిసరాల కాలుష్యం వలన యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోని దుస్థితులేర్పడుతున్నాయి. గ్రామాలలో, కొండలలో నక్కిన శత్రువులను చంపడం కోసం చేసే వైమానిక దాడుల్లో ఎందరో అమాయక ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యుద్ధ సమయంలో అరబ్బు దేశాల్లో పెట్రోలు బావుల పై బాంబులు పడి మంటలు రేగి కలిగిన నష్టం ఎప్పటికీ తీర్చలేనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఆ) గుర్తున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రయును = ఆ కొలదియైనను
చేయన్ = చేయడానికి
చాలడు + ఓ = ఇష్టపడడేమో
కాని = కాని
పెంపు = అభివృద్ధి
ఏదన్ = నశించునట్లుగా
క్రూరతకున్ = క్రౌర్యమునకు
ఓర్వరాదు = సహించగూడదు
సిరి = రాజ్యం (సంపద)
నాకున్ + ఏల = నాకెందుకు
అందున్ + ఏ =అని అందునా
నా + అరయు = నేను బాగోగులు చూసుకోవలసిన
ఈ చుట్టాలకున్ = ఈ ఆశ్రితులకు (పరివారానికి, బంధువులకు)
గ్రాస = తిండికి
వాసః = బట్టకు (నివాసానికి)
దైన్యంబులు = దురవస్థలు
వచ్చు = కల్గుతాయి
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = కౌరవులును
ఏమున్ = మేమును
పొంది = సంధి చేసుకొని
శ్రీన్ = రాజ్యాన్ని
పొందినన్ = పొందినట్లైతే (పంచుకున్నట్లైతే)
మోదంబు = (అందరికీ) సంతోషం
అందుట = పొందుట
కల్గున్ = జరుగుతుంది
అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

సూచన : పాఠంలోని పద్యాలు అన్నింటికీ ప్రతిపదార్థాలు, భావాలు ముందు ఇవ్వబడ్డాయి. * గుర్తుపెట్టిన పద్యాల ప్రతిపదార్థాలు చదవండి.

ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు. కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే, స్వేచ్చగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.

ప్రశ్నలు:
1. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ‘ఎలా’ చేస్తారు?
2. కఠినంగా మాట్లాడితే పిల్లలకు ఎందుకు నచ్చదు?
3. కఠినంగా మాట్లాడే వారితో పిల్లలు ఎలా ఉంటారు?
4. పిల్లలు ‘ఏలా’ ఆలోచిస్తారు?
5. కొందరు తల్లిదండ్రులు ‘ఎందుకు’ బాధపడుతూ ఉంటారు?
6. ఎలా ఉన్నచోట పిల్లలు నిర్భయంగా ప్రశ్నిస్తారు?
7. ఎందుకు స్వేచ్ఛగా ఉంటారు?
8. స్వేచ్ఛ ఉన్నచోట పిల్లలు ఎలా మాట్లాడతారు?

ఈ) పాఠం చదవి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు?
జవాబు:
క్షత్రియ ధర్మాన్ని పాటించడం ఎంతో కష్టం. అలాగని రాజు వేరే ధర్మాలను పాటించకూడదు. కాబట్టి ఆయుధాలను చేపట్టి రాజ్యసంపదను పొందాలి. పోనీ రాజ్యసంపద తనకెందుకని కౌరవులను అడగటం మానితే, తననే ఆశ్రయించుకొని ఉన్న తన తమ్ములకు, బంధుజనాలకు కూటికీ, గుడ్డకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టే ధర్మరాజు రాజ్యసంపదను కోరాడు.

ప్రశ్న 2.
శత్రుత్వ భావనను కవి దేనితో పోల్చాడు?
జవాబు:
శత్రుత్వ భావనను కవి పామున్న ఇంటిలో కాపురం ఉండడంతో పోల్చాడు. అంటే పామున్న ఇంట్లో ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తామో అలా శత్రుత్వమున్న చోట కూడా ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాలని కవి భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహా ఇచ్చాడు?
జవాబు:
కృష్ణా ! మా విషయంలో పక్షపాతం చూపించకు ! ధర్మం – నీతి వాటిననుసరించి ఇరుపక్షాలకూ మేలు, అభివృద్ధి జరిగేలా మాట్లాడు. విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ, అవసరమైనచోట కఠినమైన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. న్యాయం పట్టించుకోకుండా దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించు. తొందరపాటుతో సభను విడిచిరాకు. పెద్దలమాటను సుయోధనుడు వినలేదనే నింద అతనికే ఉంచు. మనం గౌరవంగా పెద్దలమాటను, ఉద్దేశాన్ని సాగనిస్తున్నామని లోకులు మెచ్చుకునేలా చేయి.

ఆ ధృతరాష్ట్రుడు సుతపక్షపాతియై సూటిగా ఏ అభిప్రాయాన్ని చెప్పక, అవినీతితో ప్రవర్తిస్తే సంధి కుదరదని సాహసించి పలుకకు. సాహసం చేయాల్సివస్తే జనులంతా మెచ్చుకునేటట్లు ధర్మానికి నిలచి, మాకు విచారం లేకుండా చేయి. నీకంతా తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాణ్ణి ? హస్తినాపురానికి వెళ్ళిరా !

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“పామున్న ఇంటిలో కాపురమున్నట్లే” అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఇంట్లో పాము ఎప్పుడు కాటువేసి ప్రాణాలు తీస్తుందో తెలియదు కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో గడపాలి.

యుద్ధానికి మూలం పగ. ఎడతెగని పగే యుద్ధాన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో మోసంతో, రాజ్యాన్ని కాజేశారనే పగతో పాండవులలో యుద్ధజ్వాల రగుల్కొంది. బలవంతులైన పాండవులు బతికి ఉంటే రాజ్యం దక్కదని అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్ధానికి సిద్ధపడ్డారు. పగ తగ్గితే యుద్ధం చేయాలనే కోరిక అణగారి పోతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. శత్రుత్వం వలన ఎప్పుడూ అశాంతితో ఉండాల్సి వస్తుందని ధర్మరాజు ఈ వాక్యాన్ని చెప్పాడు.

ప్రశ్న 2.
“ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు” దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పగ ఒకసారి ప్రవేశిస్తే ఇక శాంతి ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించడం, తొలగించడం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువకాలం పగను మనసులో ఉంచుకోకుండా నిర్మూలించడమే మంచిది. ఎందుకంటే మనసు త్వరగా శాంతిస్తుంది. ఉద్వేగం లేకపోవడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది. పగబట్టినవారు ప్రతిరోజూ దుఃఖంతోనే నిద్రిస్తారు. పగ లేకుంటే ప్రశాంత చిత్తంతో సుఖంగా నిద్రిస్తారు. పగ వలన సుఖంలేనివాడు తన సర్వస్వాన్నీ తానే నాశనం చేసుకుంటాడు. అంతకుముందున్న మంచిపేరు కూడా పోతుంది.

దీర్ఘకాల విరోధం వలన కుటుంబాలే గాక వంశాలు కూడా నశించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విరోధం రెండుగాని అంతకన్న ఎక్కువ దేశాల మధ్యగాని ఉండేటట్లయితే ప్రపంచశాంతికే భంగం కలుగుతుంది. ఆయా దేశాలు నిరంతరం అశాంతితో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలిక వైరం మంచిది కాదు.

ప్రశ్న 3.
“కార్యసాధన” అంటే అనుకొన్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి?
జవాబు:
కార్యాన్ని సాధించదలచుకున్నవాడికి ఎంతో ఓర్పు, తగిన నేర్పు ఉండాలి. ఇతరులను బాధించకుండా, తాను బాధపడకుండా తెలివిగా పనిని సాధించుకోవాలి. ఒకవేళ జనాలు విమర్శించే పని అయినట్లైతే ఆ నింద తనపై పడకుండా అందరూ ఎదుటి వారినే నిందించేలా పనిని చాకచక్యంగా నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా కార్యాన్ని సాధించాలి. కోరిన ప్రయోజనాన్ని పాపం రాకుండా, కీర్తి కలిగేలా సాధించుకోవాలి.

ప్రశ్న 4.
మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
జవాబు:
స్ఫుటంగాను, స్పష్టంగాను, సూటిగాను మాట్లాడాలి. వాదాంశాన్ని క్రమంగా ప్రతిపాదించాలి. నాటకీయ ధోరణిలో మాట్లాడే విధంగా ఉంటే సహజంగా మనసుకు హత్తుకుంటుంది. ఇలా చక్కగా ఆకర్షించేలా పనిని సాధించుకునేలా మాట్లాడటాన్నే మాట్లాడే విధం అంటారు. ఇక కార్యసాధకుడైనవాడు తన శక్తిని, ఎదుటివారి శక్తిని చక్కగా అంచనా వేయగలిగి ఉండాలి. వినయంతో ఉంటూ అవసరమైనప్పుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. సమయానుకూలంగా తనని తాను మలచుకోగలిగి ఉండాలి. ధననష్టం, ప్రాణనష్టం వంటివి జరగకుండా తన కార్యాన్ని నేర్పుగా చేయగలిగి
ఉండాలి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రపంచ శాంతిని కాంక్షించడం అందరి కర్తవ్యం కదా ! అలాంటి శాంతిని కోరుతూ ధర్మజుడు ఏం చెప్పాడో మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ధర్మరాజు కృష్ణనుద్దేశించి శాంతి పట్ల తనకు గల ఆకాంక్షను ఏ విధంగా వెల్లడించాడో మీ స్వంత మాటల్లో రాయండి.
(లేదా )
శాంతిని కోరుకోవడం అందరికి అభిలాష మరి ధర్మజుడు శాంతిని కోరుతూ ఏ విధంగా శ్రీకృష్ణునితో చెప్పాడు?
జవాబు:
ఓ కృష్ణా ! అర్ధరాజ్యం బదులు ఐదూళ్ళు ఇచ్చినా చాలని – నీవు, బంధువులు ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పాను. కానీ ఆ ఔదార్యం కూడా కౌరవుల వలన బూడిదలో పోసిన పన్నీరైంది. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే సిరిసంపదలకు నెలవైన రాజ్యం అసలు ఉండదు. పోనీ సిరిని కోరకుండా వైరాగ్యజీవితం గడపటానికి సిద్ధమైతే నన్నాశ్రయించుకున్న వారికి కనీస అవసరాలైన కూడు – గుడ్డ – గూడులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చంపాల్సి వస్తే లోకంలో పరాయివారిని, శత్రువులను ఎన్నుకోవడం సహజం. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకోవడం అహింసా ధర్మం కాదు. అది యుద్ధనీతి అవుతుంది గాని ధర్మనీతి కాదు. ఇక బంధుమిత్రులను చంపటం న్యాయం కాదు గదా !

విజయం పొందని యుద్ధం కంటే చావే మేలు. కాని యుద్ధంలో జయాపజయాలను ఎవరూ నిశ్చయించలేము. యుద్ధం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇక శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే. మనశ్శాంతికి చోటే ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాల వైరం పనికిరాదు. విరోధాన్ని అణచివేయడం మంచిది. విరోధం వలన విరోధమెప్పుడూ సమసిపోదు. ఒకడు వైరంతో వేరొకరికి బాధ కలిగిస్తే బాధపడినవాడు ఊరుకోడు. అవకాశం రాగానే పగ సాధిస్తాడు. సాహసించి పగను నిర్మూలించదలిస్తే దారుణకార్యాలు చేయాల్సి వస్తుంది. పగ వలన కీడే గాని వేరొక ప్రయోజనం లేదు.

కృష్ణా ! సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశ నాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎలాగైనా బాగుపడటం మంచిది కదా ! ధర్మం, నీతి – వాటిని బట్టి రెండు వర్గాల వారికీ మేలు, అభివృద్ధి జరిగేలా చూడు. విదురుడు మొదలైన మహానుభావులు సమ్మతించేలా తగినంత మెత్తదనంతోను, అవసరమైనచోట కఠిన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు కుమారుడి మీది ప్రేమతో ఏ విషయం తేల్చి చెప్పకుంటే ధర్మబద్ధుడవై తగిన నిర్ణయం తీసుకో. మా ఇరువర్గాలకూ కావాల్సినవాడివి. నీతి తెలిసిన వాడివి, నీకు నేను చెప్పగలవాడినా ? హస్తినాపురానికి వెళ్ళిరా ! … అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో శాంతి వచనాలను పలికాడు.

ప్రశ్న 2.
ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా ! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
జవాబు:
నేటి కాలంలో కూడా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన భారతదేశంపై పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించడంతో తప్పక “కార్గిల్ యుద్ధాన్ని” చేయాల్సి వచ్చింది. అయినా బుద్ధి తెచ్చుకోక పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సిద్ధపడుతున్నది. మరొక ప్రక్క చైనా కూడా యుద్ధాన్మాదంతో ఊగిపోతోంది. మన సరిహద్దు రాష్ట్రాలను ఆక్రమించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది.

అమెరికా ధన మదంతో, అధికార దాహంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలను కొంతవరకు అదుపు చేయగలిగినా అగ్రరాజ్యా లైన అమెరికా, బ్రిటన్లకు సూచనలను చేయడానికి కూడా సాహసించలేని దుస్థితిలో ఉంది. తమ ఇష్టానుగుణంగా ప్రవర్తిస్తున్న అగ్రరాజ్యాల అహంకారం ముందు ప్రపంచశాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి సైతం బానిసలాగా తలొంచుకొని నిలుచుందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు.

యుద్దాలను ఆపాలనుకొంటే ముందు ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో శాంతి ఒడంబడికలు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను అన్ని దేశాలూ శిరసావహించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను, పరిగణించక సోదరులుగా భావించాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధికి అన్ని దేశాలూ సహకరించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగుదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఇప్పటికే రగులుతున్న సమస్యలైన కాశ్మీర్ సమస్య, వివిధ దేశాల సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సామ్యవాద భావనలు వెల్లివిరియాలి. స్వార్ధ భావాలను విడిచి పెట్టాలి. ప్రక్క దేశాలపై కవ్వింపు చర్యల్ని కూడా మానాలి. విశ్వశాంతికై చిత్తశుద్ధితో పాటుపడాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పగ, ప్రతీకారం మంచివి కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రునకు / మిత్రురాలికి,

నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగానే చదువుకుంటున్నావని తలుస్తాను. ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వలన చాలామంది చనిపోతున్నారు. గ్రామాలలో కుల వివాదాలు, ఇతర పొలాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాల వలన రక్తపాతాలు జరుగుతున్నాయి. వీటి వలన పెద్దవారు, పిల్లలు అనాథలవుతున్నారు.

వీటి అన్నింటికి మూలమైన పగ, ప్రతీకారాలు మంచివి కాదు. చదువుకున్నవారు, ఉన్నతస్థితులలో ఉన్నవారు సైతం వీటి ప్రభావానికి లోనవుతున్నారంటే, చదువుకున్న మూర్ఖులులా ప్రవర్తిస్తున్నారంటే ఇవి ఎంత చెడ్డవో తెలుస్తుంది. పగ, ప్రతీకారాల వల్ల ఎల్లప్పుడూ అశాంతితో, భయంతో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. వీటి ద్వారా ఆరోగ్యం దెబ్బతిని, చిన్నవయస్సులోనే మధుమేహ వ్యాధి (షుగర్) వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఎక్కువ. పూర్వకాలంలో సమాజాలలో అన్ని కులాలవారు, మతాలవారు ఒకరినొకరు బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడూ, చెల్లెమ్మ లాంటి వావి-వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా మెలగేవారు. ఒక్కడి కోసం అందరూ, అందరికోసం ఒక్కడుగా నిలచేవారు. అటువంటి స్థితి నేడు రావాలి. దానికి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సహకరిస్తాయి. ఉమ్మడి కుటుంబ భావన అందరికీ కలిగించాలి.

నగరాలలో, పట్టణాలలో బహుళ అంతస్థుల భవనాలు (అపార్ట్ మెంట్స్) పెరిగిపోతున్నాయి. వీటిల్లో నివసించేవారు వేరు వేరు కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తారు. కొన్నిచోట్ల వేరు వేరు భాషలు మాట్లాడేవారు సైతం ఒకచోట జేరతారు. అలాంటి చోట అన్ని మతాల పండుగలను అందరూ కలసి జరుపుకోవడం, వంటకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కుటుంబ భావన పెరుగుతుంది. దాని ద్వారా పరమత సహనం అలవడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కలుగుతుంది. మానసిక ఉద్వేగాలు అణగారి పోయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యం వలన ఆయువు పెరిగి సుఖశాంతులతో జీవించవచ్చు.

మీ అమ్మగారిని, నాన్నగారిని ఇతర కుటుంబ సభ్యులను అడిగినట్లు చెప్పు. శాంతియుత సమాజ నిర్మాణాన్ని గూర్చి నీ భావాలను నాకు లేఖ ద్వారా తెలియజేయి. నీ లేఖకై ఎదురుచూస్తూ ఉంటాను.

ధన్యవాదములు

ఇట్లు,
నీ మిత్రుడు / మిత్రురాలు,
బి. రాజు | బి. రాణి,
9వ తరగతి, క్రమసంఖ్య – 12/6,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రాజాగారి తోట,
గుంటూరు (పోస్టు) (మండలం), వేమవరం (పోస్టు),
గుంటూరు జిల్లా.

చిరునామా :
షేక్ రసూల్ / షేక్ రేష్మ,
తొమ్మిదవ తరగతి,
క్రమసంఖ్య – 18,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మాచవరం (మండలం),
గుంటూరు జిల్లా.

(లేదా)
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారుచేయండి.
(లేదా)
ధర్మరాజు లాగ శాంతిని కాంక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
శాంతి నీవెక్కడ ? (కరపత్రం)

శాంతమే రక్ష
దయ చుట్టము
మనకి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, ఇంకా దేశంలో అశాంతి పూరిత, ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. అగ్రరాజ్యాలే నేటికీ అంతర్జాతీయ అంశాల్ని నిర్ణయించేవిగా ఉన్నాయి. ఉగ్రవాదం ఉరకలు వేస్తోంది. స్థానిక ఉద్యమాలు, కులమత లింగ వివక్షలు, ప్రజావిప్లవాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్వార్థపూరితమైన జీవనం, అనారోగ్యకరమైన పోటీతత్వం, ప్రపంచీకరణ విధానాలు అంటువ్యాధుల్లా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.

కేవలం మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. చాలా చోట్ల ప్రచ్ఛన్న యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అణుబాంబుల్ని మించిన వినాశకర ఆయుధాలెన్నో అగ్రరాజ్యాలు సమకూర్చుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ అశాంతి, అభద్రత, అసంతృప్తి నెలకొంటున్నాయి. ప్రతివారి మనస్సు శాంతికోసం పరితపిస్తుంది. కానీ శాంతి ఎక్కడా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వెతుకుతున్నా ఎక్కడా కనిపించడం లేదు.

అవును, ఎక్కడని కనిపిస్తుంది? ‘శాంతిని’ మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, సామ్రాజ్యవాదంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ప్రపంచమంతా అశాంతితో నింపి, ఇప్పుడు శాంతి పాఠాలు వల్లిస్తే మాత్రం వస్తుందా? ‘శాంతి’ నీవెక్కడ ? అని ఆక్రోశిస్తే వచ్చేస్తుందా?

ఎప్పుడైతే మనం పరమత సహనాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సోదరభావంతో అందరినీ కలుపుకుంటామో, ఎప్పుడైతే సహృదయతను, నిస్వార్థాన్ని అలవరచుకుంటామో, ఎప్పుడైతే పరోపకార పరాయణులమవుతామో, ఎప్పుడైతే పగ – ప్రతీకారాల్ని విడుస్తామో, అంతర్యుద్ధాలను అసహ్యించుకుంటామో, యుద్ధాలను విడిచి పెడతామో, ఆయుధాలను ప్రేమించడం మాని, మానవులను ఇష్టపడతామో, ప్రేమతత్వంతో మెలగుతామో అప్పుడు – సరిగ్గా అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. మనం తనని మనస్ఫూర్తిగా కోరుతున్నామని నమ్మిన రోజున తనకైతానే ప్రత్యక్షమవుతుంది. అంతదాకా మానవజాతి అంతా ‘శాంతి’ నీవెక్కడా ? అని దీనంగా, హీనంగా విలపించక తప్పదు.

ఈ)
ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రపంచశాంతి కోసం పాటుపడిన ‘నెల్సన్ మండేలా’, ‘గాంధీ’, ‘యాసర్ అరాఫత్’ వంటి వారి వివరాలు సేకరించి, వారిని అభినందిస్తూ ఒక వ్యాసం రాయండి. దాన్ని చదివి వినిపించండి.
జవాబు:
1) మహాత్మాగాంధీ :
మన దేశ ‘జాతిపిత’గా అందరిచే ప్రేమగా ‘బాపూజీ’ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 1869వ సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక లండన్ వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగివచ్చాడు. 1893వ సంవత్సరంలో ఒక వ్యాజ్యం విషయంగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ భారతీయులు, ఇతర నల్ల జాతీయులు పడే అగచాట్లన్నీ గమనించాడు. రైళ్ళలో మొదటి తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలులేదు. శ్వేత జాతీయులు, పెద్ద కుటుంబాలు ఉండే చోట్లకు భారతీయులను, ఇతర నల్లజాతి వారిని అనుమతించరు. చివరకు తలపై టోపీని ధరించి కోర్టులో వాదించడానికి కూడా అనుమతి లభించలేదు.

ట్రాముల్లోనూ, రైళ్ళలోనూ శ్వేత జాతీయులతో కలసి ప్రయాణించే యోగ్యత లేదు. బానిసలుగా చూస్తూ ‘కూలీ’ అని సంబోధించేవారు. ఈ దురాగతాలను ఆపడానికై గాంధీజీ ప్రయత్నించాడు. 1869వ సంవత్సరంలో ట్రాన్స్ వాల్ లో ఇంగ్లీషు, డచ్చి వారికి జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటిషు వారిని వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించాడు. గాంధీ సేవను గుర్తించక వారు దక్షిణాఫ్రికా భారతీయులకు నాయకుడై, ప్రభుత్వ ఉత్తర్వులను ఎదిరిస్తున్నాడన్న వంకతో ఆయన్ని జైలుకు పంపి, వెట్టిచాకిరీ చేయించారు. కానీ శాంతి, ఓర్పు, అహింసలతో వాటిని ఎదుర్కొని ఐకమత్యంతోను, పత్రికల సహాయంతోను పోరాడి విముక్తిని సాధించాడు. దక్షిణాఫ్రికా వీడి వచ్చేటప్పుడు అక్కడి అభిమానులు తనకు ఇచ్చిన బహుమతులను, ధనాన్ని “దక్షిణాఫ్రికా భారతీయుల సంక్షేమ నిధి”గా ఏర్పాటుచేసిన నిస్వార్థపరుడు, పరోపకార పరాయణుడు, శాంతి కాముకుడు “గాంధీ మహాత్ముడు” !

భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, జైల్ బరో వంటి ఉద్యమాలను సమర్థతతో నిర్వహించి బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి వారు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. అలా భారతదేశం 1947వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఆ మహాత్ముడు, శాంతమూర్తి, అహింసా పరాయణుడు, నిరంతర కార్యశీలి స్వేచ్ఛావాయువులను పూర్తిగా ఆస్వాదించకుండానే 30-1-1948వ తారీఖున కీర్తిశేషుడయ్యాడు.

2) నెల్సన్ మండేలా :
నెల్సన్ మండేలా మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికాకు ఎన్నికైన నల్లజాతికి చెందిన ప్రెసిడెంటు. ఈయన పూర్తి పేరు రోలిహలాహలా మండేలా. ‘నెల్సన్’ అనే పేరు ఆయన పాఠశాలలో జేరినప్పుడు ఆంగ్ల ఉపాధ్యాయురాలైన మిసెస్ మిడిగేన్ పెట్టినది. నాటి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటిష్ వారి నియమాలలో పేరు మార్చడం ఒకటి. నల్ల జాతీయులను పాఠశాలలో చేర్చేటప్పుడు ఒక ఆంగ్లభాషా పేరు వారికి పెడతారు. ఇది బ్రిటిష్ వారి జాత్యహంకారానికి మచ్చుతునక.

మండేలా దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతమైన ట్రాన్స్ కి ప్రాంతంలో 18-07-1918వ తేదీన టెంబు జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు. వీరి భాష హోసా. మండేలా పాఠశాల విద్యను పూర్తి చేసుకొని, కళాశాల విద్యకై ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ. ప్రథమ సంవత్సరంలో చేరాడు. కానీ విద్యార్థి సంఘాలలో చేరి తన ప్రవేశం అధికారులచే రద్దు చేయబడటంతో బయటకు వెళ్ళాల్సివచ్చింది. జోహన్స్ బర్గ్ ప్రాంతాన్ని చేరుకొని దూర విద్య ద్వారా చదివి బి.ఎ. డిగ్రీని పొందాడు. తర్వాత బారిష్టరు విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే ఆయన ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్సులో (A.N.C.) సభ్యునిగా చేరాడు. తన మిత్రులైన వాల్టర్ సిస్లూ, ఆలివర్ టాంబో, విలియమ్ కోమో వంటి వారి సహాయంతో ఏ.ఎన్.సి. విస్తరించడం లోను, కార్యశీలకమైన సంస్థగా మలచడంలోను విశేష కృషి సల్పాడు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ పౌరులందరినీ మూడు వర్గాలుగా విభజించింది. శ్వేత జాతీయులు మొదటివరం. తల్లిదండ్రులలో ఒకరు శ్వేత జాతీయులు, వేరొకరు నల్లజాతీయులైన వారు రెండవ వర్గం. ఇక నల్ల జాతీయులు మూడవ వర్గం. మూడు వర్గాలకు ప్రత్యేకమైన వసతి ప్రదేశాలుంటాయి. ఎవరికి వారికే ప్రత్యేకమైన మరుగుదొడ్లు. ఉద్యానవనాలు, సముద్రతీర ప్రాంత విహారాలు, పాఠశాలలు, ఉద్యోగాలు ఉంటాయి. శ్వేతజాతీయులకే పూర్తి రాజకీయ అధికారాలుంటాయి. 1960 – 80 ల మధ్య ప్రభుత్వం శ్వేత జాతీయుల కోసం మిగిలిన రెండు వర్గాల వారిని ఖాళీ చేయించి మూరుమూల ప్రాంతాలకు పంపింది. ముప్పై లక్షలమంది తమ నివాస ప్రాంతాలను విడిచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది.

ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ.ఎన్.సి. పోరాటానికి నడుం కట్టింది. ఐతే అహింసాయుత మార్గంలో సహాయనిరాకరణ, ధర్నాలు చేయటం, అధికారుల పట్ల అవిధేయతను ప్రదర్శించడం వంటి వాటి ద్వారా ఉద్యమించింది. పూర్తి పౌరసత్వాన్ని పొందడం, శాసనసభలో చోటు సంపాదించడం, మిగిలిన వర్గాలతో సమానమైన హక్కులను పొందడం లక్ష్యంగా నిరంతరం పోరాటం సల్పింది. మండేలా దేశమంతా సంచరిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఎంతోమంది మద్దతుదారులను కూడగట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా మద్దతును సాధించగలిగాడు కూడా. దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురై 27 సంవత్సరాలు కఠిన కారాగారవాసాన్ని అనుభవించాడు.

చివరకు ప్రభుత్వం తలవొగ్గి ఏ.ఎన్.సి కోరిన వాటిని ఆమోదించింది. మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనాడు. 1993వ సంవత్సరంలో మండేలా, అతని సహచరుడైన డిక్లార్క్ లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1999 సంవత్సరం దాకా అధ్యక్షునిగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం చేసి, స్వగ్రామానికి చేరుకున్నాడు. హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ రోగ విషయంలో తన వారిని జాగరూకులను చేయడానికి పెద్ద పెద్ద శిబిరాలను నడిపాడు. ప్రపంచవ్యాప్త సదస్సులలో పాల్గొన్నాడు.

దారుణమైన వర్ణ వివక్షకు లోనైనా, దృఢసంకల్పంతో ఎన్నో కష్టాలకు, కారాగారవాస శిక్షలకు ఓర్చి తోటివారికై పరిశ్రమించి కృతార్థుడైనాడు నెల్సన్ మండేలా మహాశయుడు.

3) యాసర్ అరాఫత్ :
యాసర్ అరాఫత్ గా ప్రసిద్ధిచెందిన ఆయన అసలు పేరు మొహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రౌఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేని. ఈయన 1929వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన పాలస్తీనాలో జన్మించాడు. అరాఫత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇస్రాయేల్ దేశీయులతో పాలస్తీనీయుల స్వీయ నిర్ధారణ అనే పేరుతో పోరాటం జరిపాడు.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (P.L.O) కు చైర్మన్ గాను, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (P.N.A) కి అధ్యక్షునిగాను, ఫాత్ రాజకీయ పార్టీ సభ్యునిగాను పనిచేశాడు. అరాఫత్ తన ఉద్యమాన్ని వివిధ అరబ్ దేశాల నుండి కూడా నిర్వహించాడు. ఇస్రాయేల్ దేశానికి ఇతని ఫాత్ పార్టీ ప్రధాన లక్ష్యం అయింది. ఇస్రాయేల్ దేశీయులు అతన్ని టెర్రరిస్టుగాను, బాంబు దాడులలో వందలమందిని చంపిన దుర్మార్గుడుగాను చిత్రీకరించారు. పాలస్తీనీయులతణ్ణి ఒక గొప్ప దేశభక్తునిగా సంభావించారు. అగ్రరాజ్యాల నెదిరించి, పాలస్తీనాకు సంపూర్ణ స్వేచ్చను సాధించిన ఘనత అరాఫత్ దే. పాలస్తీనాకు మొదటి అధ్యక్షుడుగా చేశాడు. 1994 వ సంవత్సరంలో అరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి కోసం పోరాడిన ఈ యోధుడు 11 – 11 – 2004వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి మరణించాడు.

ఈ ముగ్గురు మహానుభావులను గమనించినట్లైతే నిస్వార్థంగా ప్రపంచశాంతికై కృషిచేశారని తెలుస్తుంది. కుల – మత – వర్ణ వివక్షలకు లోనైన ఎందరో సామాన్యులకు మానసిక స్టెర్యాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆయా బంధనాల నుంచి విముక్తుల్ని చేసిన ఘనులని తెలుస్తుంది. తమ జాతీయుల స్వాభిమానాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వీరు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

(లేదా)
మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి, గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్ద వాళ్ళ గురించి, ‘నలుగురూ శాంతియుతంగా సహజీవనం చేయాలి’ అని ‘శాంతికోసం’ పాటుపడేవాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
మా ఊరిలో కుటుంబ కలహాలు గాని, చిన్న చిన్న తగాదాలు గాని, గొడవలు గాని జరిగితే మా ఊరి ప్రెసిడెంటు గారి వద్దకు తీసుకెళ్తారు. ఆయన ఇరుపక్షాల వారి వాదాలను ఓపికగా విని, నేర్పుగా ఎవరివైపు తప్పు ఉన్నదో గ్రహించి, వారి తప్పుని సున్నితంగా తెలియజేస్తారు. తగాదాలు మాని శాంతంగా ఉండాలని ఇద్దరికీ చెప్పి తగవు తీరుస్తారు. రామయ్య తాత ఊర్లో జరుపుకునే అన్ని మతస్థుల పండుగలకు అందరం పాల్గోవాలని, కులమత భేదాలు పట్టించుకోకుండా అందరం కలసి ఉండాలని చెపుతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంజమ్మ అత్త మాలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెపుతూ ఉంటుంది.

ఆ కథల్లో ఎక్కువ శాంతికి సంబంధించినవే ఉంటాయి. మేము అందరం పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో కలసిమెలసి మధ్యాహ్న భోజనం చేయాలని కోరుకుంటుంది. రహీమ్ బాబాయి వాళ్ళ పండుగలకు మాలాంటి పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మిఠాయిలు పెడతాడు. ఊళ్ళోని ముస్లిం కుటుంబాలకు నాయకత్వం వహిస్తూ, హిందువులతోను, క్రైస్తవులతోను సన్నిహితంగా ఉంటాడు. తనవారు ఇతరులతో గొడవపడకుండా, ఇతరుల వలన తన వారికి ఇబ్బందిరాకుండా చూస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉండబట్టే మా ఊళ్ళో కులాల పోర్లు లేవంటే అతిశయోక్తి ఏమీకాదు. ఇక డేవిడ్ అన్నయ్య మంచి ఆటగాడు. ఊళ్ళో పిల్లలందరినీ పోగుచేసి, సాయంత్రం పూట మంచి మంచి ఆటలు ఆడిస్తాడు. అందరూ ఒక్కటే. అందరం ఎప్పుడూ కలసి ఉండాలని దానికి ఆటలు ఎంతో సహకరిస్తాయని ఎప్పుడూ చెపుతుంటాడు. అతని వల్ల పిల్లలం అందరం ధనిక – పేద, కుల-మత, స్త్రీ-పురుష భేదాలు మరచి సంతోషంగా ఆటలు ఆడుతున్నాం . అతను లేకుంటే మాలో ఇలాంటి ఐకమత్యం వచ్చేది కాదు.

ప్రాజెక్టు పని

ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వారి వివరాలు సేకరించండి. వారి గురించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 7

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

1. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు.
జవాబు:
శుభంబైన = మంచిదైన
పెద్దలు మంచిదైన పనినే చేస్తారు.

2. దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు.
జవాబు:
దీర్ఘ వైరవృత్తి : ఎక్కువ కాలం పగతో ఉండడం.
ఎక్కువకాలం పగతో ఉండడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

3. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు.
జవాబు:
ఎఱుక = జ్ఞానం
రాముకు తెలుగుభాషా జ్ఞానం ఎక్కువ.

ఆ) కింది వాక్యాలను పరిశీలించి, గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు
దిక్కు: దిశ, శరణం

2. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు నొక రాజు రాత్రిని యేలు నిజము.
రాజు : ఇంద్రుడు, టేడు, చంద్రుడు

3. వైరి పక్షములోని పక్షి, పక్షమునకు గాయమై, పక్షము రోజులు తిరుగలేకపోయెను.
పక్షము : ప్రక్క, టెక్క 15 రోజులు.

4. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి, పై విధంగా వాక్యాలలో ప్రయోగించండి.

అ) సమయము లేకున్నా మనము సమయమించక తప్పదు. ఎందుకంటే ఇదే ధర్మమైన సమయము కాబట్టి.
సమయము : కాలము, శపథము, బుద్ధి.

ఆ) మనకు పూర్ణము లేకున్నా జలపాత్ర పూర్ణము ఐనది.
పూర్ణము : శక్తి నిండినది.

ఇ) తగవుకు పోతే తగవు కలిగి, తగవు జరగలేదు.
తగవు : తగిన, తగాదా, న్యాయం.

ఈ) నేను దోష సమయంలో కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేవాడి దోషానికి గాయమై, పెద్ద దోషం జరిగింది.
దోషము : రాత్రి, భుజము, తప్పు, పాపం.

ఉ) శరీరాన్ని పాముట వలన ఏర్పడిన మట్టి పాములా ఉంది.
పాము : రుద్దు, సర్పము.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు.

అ) స్రవంతికి సంగీత, రాధికలు మంచి నేస్తాలు.
ఆ) మిత్రులు ఆపద్బాంధవులు.

1. అనుకున్నది సాధించినపుడు మోదం కలుగుతుంది.
అ) పిల్లలు బహుమతులను పొందినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఆ) పిల్లల సంతోషమే పెద్దలు కోరుకుంటారు.

2. ధరిత్రి పుత్రిక సీత.
అ) భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు వెదకుతున్నారు.
ఆ) ధరకు ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు.

3. పోరితము నష్టదాయకం.
అ) తగాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.
ఆ) యుద్ధం మూలంగా ధననష్టం, జననష్టం జరుగుతుంది.

వ్యాకరణం

అ) పాతం చదవండి. కింద తెల్సిన సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెదికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1) సవర్ణదీర్ఘ సంధి
2) సరళాదేశ సంధి
3) ఇత్వసంధి
4) యడాగమ సంధి

1. సవర్ణదీర్ఘ సంధి:
1) జనార్ధన : జన + అర్ధన
2) విదురాది : విదుర + ఆది

సూత్రం :అ, ఇ, ఉ, ఋ లకు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. సరళాదేశ సంధి సూత్రం:
1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఉదాహరణలు :
1) చక్కన్ = చేయ = చక్కఁజేయ
2) ఇచ్చినను + చాలు = ఇచ్చిననుజాలు
3) చేయన్ + చాలడో = చేయంజాలడో
4) ఏమున్ + పొంది = ఏముంబొంది
5) ఒకమాటున్ + కావున = ఒకమాటుఁగావున
6) పగన్ + పగ = పగంబగ
7) కడున్ + తెగ = కడుందెగ
8) ఏమిగతిన్ + తలంచిన = ఏమిగతిఁదలంచిన
9) శాంతిన్ + పొందుట = శాంతిఁబొందుట
10) సొమ్ములున్ + పోవుట = సొమ్ములుంబోవుట
11) చక్కన్ + పడు = చక్కఁబడు
12) ఒప్పున్ + చుమీ = ఒప్పుఁజుమీ
13) మనమునన్ పక్షపాత = మనమునఁబక్షపాత
14) తగన్ + చెప్ప = తగంజెప్ప
15) తెగన్ + పాఱకు = తెగంబాఱకు

3. ఇత్వ సంధి సూత్రం :
సూత్రం – 1: ఏమ్యాదులందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది.
సూత్రం – 2 : మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది.

1) అదియొప్పది = అది + ఒప్పదె
2) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
3) అదియజులు = అది + అట్టులు

4. యడాగమ సంధి సూత్రం :
సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.
ఉదాహరణలు:
1) మా + అంశమగు = మాయంశమగు
2) నా + అరయు = నాయరయు
3) అది + ఒప్పదే = అదియొప్పది
4) పామున్న + ఇంటిలో = పామున్నయింటిలో
5) ఉన్న + అట్ల = ఉన్నయట్ల
6) పగ + అడగించుట = పగయడగించుట
7) పల్కక + ఉండగ = పల్కకయుండగ
8) అది + అట్టులుండె = అదియట్టులుండె
9) పల్కిన + ఏని = పల్కినయేని
10) పొంది + ఉండునట్లు = పొందియుండునట్లు

అ) కర్మధారయ సమాసం :
వివరణ :
‘నల్ల కలువ’ అనే సమాసపదంలో నల్ల, కలువ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.

1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు. ఉదా : తెల్లగుర్రం – తెల్లదైన గుర్రం తెల్ల – విశేషణం (పూర్వపదం – మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం – రెండోపదం)

2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.
‘మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ – నామవాచకం. రెండోపదం (ఉత్తరపదం) ‘గున్న’ విశేషణం. ఐతే విశేషణమైన ‘గున్న) ‘ఉత్తరపదం’గా (రెండోపదంగా) ఉండడం వల్ల దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచివాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) కార్మికవృద్ధుడు – వృద్ధుడైన కార్మికుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) తమ్ముగుజ్జలు – తమ్మువైన గుజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) ఛందస్సు:
1. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో తెల్పి, లక్షణాలను రాయండి.

i) కావున శాంతిఁబొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 1
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.
ఉత్పలమాల – లక్షణం:

  1. ఈ పద్యానికి నాలుగు పాదములు ఉంటాయి.
  2. ప్రతి పాదములో భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు పదవ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమము ఉంది.
  5. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ii) పగయడగించు టెంతయు శుభం బదిలెస్సయడంగునే పగం
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 2
ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
చంపకమాల – లక్షణం :

  1. చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతిపాదములోనూ న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు 11వ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమం ఉంది.
  5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.

2. శార్దూలం:
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 3
పై గణవిభజనను పరిశీలించండి. ఇలా మ-స-జ-స-త-త-గ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తే అది ‘శార్దూల’ పద్యం అవుతుంది. అన్ని వృత్త పద్యాలలాగా దీనికి ప్రాసనియమం ఉంటుంది. ‘యతి’ 13వ అక్షరానికి చెల్లుతుంది (ఆ-య).
మిగిలిన పాదాలకు గణ విభజన చేసి లక్షణాలను సరిచూడండి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 4
1) దీనిలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘పే’ లోని ఏ కారానికి 13వ అక్షరమైన ‘కే’ లోని ఏ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 5
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘సో’ లోని ఓ కారానికి, 13వ అక్షరమైన ‘చు’ లోని ఉ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 6
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘మో’లోని మకారానికి, 13 వ అక్షరమైన ‘ము’ లోని మ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

ఈ) అలంకారాలు :

I. ఇంతకుముందు తరగతులలో ‘ఉపమాలంకారం’ గురించి తెలుసుకున్నారు కదా ! ఈ పాఠంలోని ఉపమాలంకారానికి సంబంధించిన ఉదాహరణను రాసి, వివరించండి.
ఉపమాలంకార లక్షణం :
ఉపమానానికి, ఉపమేయానికి మనోహరమైన పోలిక వర్ణించినట్లైతే దాన్ని ఉపమాలంకారం అంటారు.
ఉదాహరణ :
పగ అంటూ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.

సమన్వయం :
‘పగ’ ఉపమేయం. పామున్న ఇల్లు ఉపమానం ఉండటం సమాన ధర్మం. ఉపమావాచకం లోపించడం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

II. గతంలో తెలుసుకున్న ‘వృత్త్యనుప్రాస’ను గూర్చి ఆ అలంకార లక్షణం రాసి, ఉదాహరణలు రాయండి.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణము : ఒక పద్యంలో గాని, వాక్యంలో గాని ఒకే అక్షరం పలుమార్లు వచ్చేలా ప్రయోగించడాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ -1:
1) లక్ష భక్ష్యములు భక్షించు ఒక పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా?
పై వాక్యంలో ‘క్ష’ కారము ‘క్ష్య’ వర్ణము పలుమార్లు ప్రయోగించబడి ఒక అద్భుతమైన సౌందర్యము తీసుకురాబడినది కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 2:
2) కాకి కోకిల కాదు కదా !
పై వాక్యంలో ‘క’ కారం పలుమార్లు ప్రయోగించబడి, వినసొంపుగా ఉంది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 3:
3) లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది.
పై వాక్యంలో ద్విత్వచకారం పలుమార్లు అందంగా ప్రయోగింపబడినది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష కవిపరిచయం

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు (ముగ్గురు కవులు) రచించారు. వారిలో తిక్కన రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ‘మహాభారతం’. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు.

మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఆ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలడాన్ని ‘రసాభ్యుచిత బంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవి బ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం :
తే॥ సమయమిది మిత్రకార్యంబు చక్కఁజేయ
నీకతంబున నే మవినీతుఁడైన
యా సుయోధను తోడి పోరాట దక్కి
యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.
ప్రతిపదార్థం :
మిత్రకార్యంబున్ = స్నేహితుల పనిని
చక్కన్ + చేయన్ = చక్కబెట్టడానికి
సమయము + ఇది = తగిన కాలమిది
నీ కతంబునన్ = నీ మూలంగా
ఏము = మేము
అవినీతుడు + ఐన = అయోగ్యుడైన
ఆ సుయోధను = ఆ దుర్యోధనునితో
తోడి పోరాట = యుద్ధం
తక్కి = మాని
మా + అంశము + అగు ధరిత్రిన్ = మా వంతు రాజ్యాన్ని
అనుభవింతుము = మేము అనుభవిస్తాము.

భావం :
కృష్ణా ! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇదే తగిన కాలం. నువ్వే రాయబారానికి వెళితే, అయోగ్యు డయిన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన పని లేదు. మా వంతు రాజ్యం మాకు వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

2వ పద్యం :
కం॥ ఇచ్చటి బంధులు నీవును
నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలునంటిని
బొచ్చెముగా దింతపట్టు పూర్ణము సుమ్మీ !
ప్రతిపదార్ధం :
ఇచ్చటి = ఇక్కడ ఉన్న
బంధులు = చుట్టాలు
నీవును = నీవు కూడ
అచ్చెరువడి = ఆశ్చర్యంతో
వినుచున్ + ఉండన్ = వింటూ ఉండగా
మాకున్ = అన్నదమ్ములమైన మాకు
అయిదు + ఊళ్ళును = ఐదు గ్రామాలను
ఇచ్చినను = ఇచ్చినప్పటికీ
చాలున్ + అంటిని = సరిపోతాయని అన్నాను
పొచ్చెము + కాదు = తక్కువ కాదు
ఇంతవట్టు = నే పల్కిన ఈ మాట
పూర్ణము సుమ్మీ ! = సంపూర్ణమైనది (నిజమైనది) సుమా !

భావం :
ఓ కృష్ణా ! ఇక్కడున్న చుట్టాలూ, నీవూ ఆశ్చర్యంతో వింటూండగా, ‘సక్రమంగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే మేముండటానికి ‘ఐదూళ్ళిచ్చినా చాలు’ అని సంజయుడితో నేనింతవరకూ చెప్పిన మాటలలో దాపరికం లేదు. అంతా నిజమే సుమా!

విశేషం :
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం అని పేర్కొన్నాడు. కానీ తెలుగు మహాభారత కర్తలలో ఒకడైన తిక్కన అవస్థలం, వృక (కుశ) స్థలంగాను, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా పేర్కొన్నాడు. బహుశా తిక్కన కాలానికి ఆయా నగరాల పేర్లు మారి ఉండవచ్చు లేక ఇంకేదైనా కారణం ఉండవచ్చు.

3వ పద్యం : కంఠస్థ పద్యంలో
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రమును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, పిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీపొందివన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రమును = అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా)
చేయన్ + చాలండో = ఇస్తాడో, ఇవ్వడో
కాని = కాని
పెంపు + ఏదన్ = గౌరవం చెడేటట్లు
క్రూరతకున్ + ఓర్వన్ రాదు = క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను
సిరి = రాజ్యసంపద
నాకున్ + ఏల + అందునేన్ = నాకెందుకని విడిస్తే
నా + అరయు = నేను చూసే
ఈ చుట్టాలకున్ = ఈ బంధువులకు
గ్రాసవాసః + దైన్యంబులు= తిండికీ, బట్టకూ కరవు
వచ్చున్ = ఏర్పడుతుంది
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = దుర్యోధనాదులు

భావం :
ఆ సుయోధనుడు అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా) ఇస్తాడో ? ఇవ్వడో ? కాని గౌరవం చెడేటట్లు క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను. రాజ్యసంపద నాకెందుకని విడిస్తే నేను చూసే ఈ బంధువులకు తిండికీ, బట్టకూ కరవు ఏర్పడుతుంది. కాబట్టి దుర్యోధనాదులు, మేము కలిసి సంపదలను పొందితే సంతోషం కలుగుతుంది.

విశేషం :
తన కుమారుల, బంధువుల పోషణ, రక్షణ ధృతరాష్ట్రునికి ఎంతముఖ్యమో తన తమ్ముల, ఆశ్రయించిన వారి పోషణ, రక్షణ తనకు ముఖ్యం అని ధర్మరాజు గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ పద్యంలో చక్కని మనోవిశ్లేషణ చేయబడింది.

4వ పద్యం : -కంగస్థ పద్యం
ఉ॥ అక్కట ! లాతులైనఁ బగజైనను జంపన కోరనేల ? యొం
డొక్క తెలుగు లేదె ? యది యొప్పదె ? బంధు సుహృజ్జనంబు లా
దిక్కున మన్నవారు, గణుతింపక సంపదకై వధించి దూ
ఱెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం :
అక్కట ! = అయ్యో !
లాంతులు + జనన్ = పరాయివారైనా
పగఱు + ఐనన్ = విరోధులైనా
చంపన్ + అ + కోరన్ + ఏల = చంపాలనే ఎందుకు కోరాలి?
ఒండు + ఒక్క + తెఱంగులేదే ? = మరొక మార్గం లేదా?
అది + ఒప్పదా? = ఆ మార్గం సరైంది కాదా ?
ఆ దిక్కునన్ = ఆ కౌరవులలో
బంధుసుహృద్ + జనంబులు = చుట్టాలు, మిత్రులు
ఉన్నారు = ఉన్నారు
గణుతింపక = ఆ వైపున ఉన్న మా బంధువులను లెక్కించక
సంపదకై = రాజ్య సంపద కోసం
వధించి = చంపి
దూఱు + ఎక్కుట = నిందల పాలవటం
దోషము + అందుట = పాపం పొందటం
అను = అనే
దుర్ + అవస్థలకున్ = చెడు స్థితిని
ఓర్వన్ + వచ్చునే – సహింపదగునా?

భావం :
అయ్యో ! పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి ? మరొక మార్గం లేదా ? ఆ మార్గం సరైంది కాదా ? ఆ కౌరవులలో చుట్టాలు, మిత్రులు ఉన్నారు. ఆ వైపున ఉన్న బంధువులను లెక్కించక రాజ్యసంపద కోసం చంపి, నిందల పాలవటం, పాపం పొందడమనే చెడు స్థితిని సహింపదగునా ? (కూడదని భావం).

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

5వ పద్యం :
ఆ||వె|| పగయ కలిగినేనిఁ బామున్న యింటిలో
నున్న యట్ల కాక యూజడిల్లి
యుండునెట్లు చిత్త మొకమాటుగావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి
ప్రతిపదార్థం :
పగ + అ + కలిగెనేనిన్ = శత్రుత్వమే ఏర్పడితే
పాము + ఉన్న + ఇంటిలోన్ = సర్పమున్న ఇంటిలో
ఉన్న + అట్ల + కాక – ఉన్నట్లే గాని
ఒక మాటున్ = ఒకసారి అయినా
చిత్తము = హృదయం
ఊఱడిల్లి = ఊరట పొంది
ఎట్లు + ఉండున్ = ఎట్లా ఉండగలదు?
కావునన్ = కాబట్టి
అధిక దీర్ఘ వైర వృత్తి = చిరకాల విరోధంతో మెలగటం
వలవదు. = కూడదు

భావం :
శత్రుత్వము ఏర్పడితే, పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే గాని, ఒకసారైనా హృదయం ఊరట పొందదు. కాబట్టి చిరకాలం విరోధంతో ఉండకూడదు.

6వ పద్యం : కంఠస్థ పద్యం
చం|| పగయడఁగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే సగం
బగ ? పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే ? కడుం
చెగ మొదలెత్తి పోవఁ బగ దీర్పగ వచ్చినఁ శౌర్యమొందు, నే
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు దేశవా!
ప్రతిపదార్థం :
కేశవా = శ్రీ కృష్ణా !
పగ + అడంగించుట = శత్రుత్వాన్ని అణచి వేయడం
ఎంతయున్ శుభంబు = ఎంతో మేలు
అది లెస్స = అదే మంచిది
పగన్ = పగతో
పగ + అడంగునే = పగ సమసిపోదు
పగ + గొన్నన్ = (ఒకరి) పగవలన (మరొకరు) బాధపడితే
మార్కొనక = అతడిని ఎదిరించక
పల్కక + ఉండగన్ = ఊరక ఉండడం
వచ్చునే = సాధ్యమా?
కడున్ + తెగన్ = గొప్ప సాహసంతో
మొదలు + ఎత్తిపోవన్ = తుదముట్టే విధంగా
పగన్ + తీర్పగన్ = విరోధాన్ని రూపుమాపడానికి
వచ్చినన్ = సిద్ధపడితే
క్రౌర్యము + ఒందున్ = దారుణమైన పనులు చేయాల్సివస్తుంది
ఏమిగతి + తలంచినన్ = ఏ విధంగా ఆలోచించినా
పగకున్ = విరోధం వలన
మేలిమిలేమి = మంచి జరగదు
ధ్రువంబు = ఇది నిజం

భావం :
శ్రీ కృష్ణా ! శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో మేలు. అదే మంచిది. పగతో పగ సమసిపోదు. ఒకరి పగ వలన మరొకరు బాధపడితే అతడిని ఎదిరించక ఊరకుండటం సాధ్యమా ? గొప్ప సాహసంతో తుదముట్టే విధంగా విరోధాన్ని రూపుమాపడానికి సిద్ధపడితే దారుణమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏ విధంగా ఆలోచించినా విరోధం వలన మంచి జరగదు. ఇది నిజం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

7వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ॥ కావున శాంతిఁ బొందుటయ కర్ణము, దా నది యట్టులుండె, శ్రీ
గావలెనంచు, బోరితము గామియుఁ గోరెద, మెల్ల సొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై
వేవిధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁజుమీ జనార్థవా !
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
శాంతిన్ = శాంతిని
పొందుట + అ = పొందుటే
కర్ణము = చేయాల్సిన పని
తాన్ + అది = ఆ విషయం
అట్టులు + ఉండెన్ = అలా ఉండనీ
శ్రీ = సంపద
కావలెన్ + అంచున్ = కావాలని
పోరితము = యుద్ధం
కామియున్ = వద్దని
కోరెదము = కోరుతున్నాం
ఎల్ల = అన్ని
సొమ్ములున్ = సంపదలు
పోవుటయున్ = నశించడం
కులక్షయము = వంశనాశనం
వుట్టుటయున్ = కలగడం
వెలికాగన్ = జరగకుండ
ఒండుమైన్ = వేరొకవిధంగా
ఏ విధిన్ + ఐనన్ = ఎలాగోలా
చక్కన్ + పడుట = బాగుపడుట
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ + చుమీ = తగినది గదా !

భావం :
కాబట్టి శాంతిని పొందుటీ చేయాల్సిన పని. ఆ విషయం అలా ఉండనీ. సంపద కావాలని, యుద్ధం వద్దని కోరుతున్నాం. అన్ని సంపదలు నశించడం, వంశ నాశనం కలగడం జరగకుండా వేరొక విధంగా ఎలాగోలా బాగుపడుట మిక్కిలి తగినది గదా!

8వ పద్యం : కంఠస్థ పద్యంగా
చం॥ మనమువఁ బక్షపాతగతి మాడెన మామము ధర్మనీతి వ
రవముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రామచితంబు తోడి మె
ల్పునఁ బరుసందనంబువను భూపతులెల్ల వెఱుంగ వాడుమీ !
ప్రతిపదార్థం :
మనమునన్ = నీ మనస్సులో
మాదెసన్ = మాపై
పక్షపాతగతిన్ = అభిమానం చూపడం
మానుము = విడిచిపెట్టు
ధర్మనీతివర్తనములన్ = ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో
రెండు దిక్కులన్ = ఇరువురికి
హితంబును = మేలును
పెంపును = అభివృద్ధియు
కల్గునట్టి = కలిగే
చొప్పునన్ = విధంగా
విదుర + ఆది = విదురుడు మొదలయిన
సజ్జనుల = మంచివారి
బుద్ధికిన్ + రాన్ = మనస్సులకు అంగీకారమయ్యేలా
ఉచితంబు తోడి = అనువుగా
మెల్పునన్ = మెత్తగా
పరుసందనంబునన్ = పరుషంగా
భూపతులు = రాజులు
ఎల్లన్ = అందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
ఆడుము = మాట్లాడు

భావం :
నీ మనస్సులో మాపై అభిమానం చూపడం విడిచి పెట్టు, ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో ఇరువురికీ మేలు, అభివృద్ధి కలిగే విధంగా, విదురుడు మొదలైన మంచివారి మనస్సులకు అంగీకారమయ్యేలా అనువుగా, మెత్తగా, పరుషంగా రాజులందరూ తెలుసుకునేలా మాట్లాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

9వ పద్యం :
మ॥ సుతువాఁడై వినయంబు పేకొనక యే చొప్పుం దగం జెప్ప కా
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాలకు చెంపు సేయునెడ లోకం బెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ !
ప్రతిపదార్థం :
ఆ ధృతరాష్ట్రుండు = ఆ ధృతరాష్ట్ర మహారాజు
సుతువాడు + ఐ = కొడుకు మాటే వినేవాడై
వినయంబు = విధేయతను
చేకొనక = చూపక
ఏ చొప్పుం = ఏ మార్గాన్ని
తగన్ + చెప్పక = తేల్చి చెప్పక
అవినీతిన్ చేసినను = అవినీతితో ఉన్నట్లయితే
సంధింపగన్ = సంధి చేయటం
రాదు + అంచున్ = కుదరదని
వేగ = వెంటనే
తెగన్ + పాలుకు = సాహసించకు
తెంపు + చేయు + ఎడన్ = సాహసించాల్సి వస్తే
లోకంబు + ఎల్లన్ = లోకమంతా
మెచ్చన్ = మెచ్చుకునేలా
ప్రకాశిత ధర్మస్థితిన్ = ధర్మానికి నిలచి
మా మనమున్ = మా మనస్సుల్ని
నిశ్చింతంబుగాన్ = విచారం లేనట్టివిగా
చేయుమీ = చేయాల్సింది

భావం :
ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమాటే వినేవాడై | విధేయతను చూపక, ఏ మార్గాన్ని తేల్చి చెప్పక, అవినీతితో – ఉన్నట్లయితే సంధిచేయటం కుదరదని వెంటనే సాహసించి వచ్చేయకు. సాహసించాల్సి వస్తే ధర్మానికి నిలచి లోకమంతా మెచ్చుకునేలా, మా మనస్సుల్ని విచార రహితంగా చేయి.

10వ పద్యం :
కం॥ మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు
నెమ్మి యెటుఁగు దగ్గ సిద్ది నెట్ యెటుఁగుదు నా
క్యమ్ముల పద్ధతి వెఱుఁగుదు
పొమ్మోవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పవ్.
ప్రతిపదార్థం :

మమ్మున్ + ఎఱుఁగుదు = మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడవు
ఎదిరిన్ = కౌరవులను గూర్చి
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నెమ్మిన్ + ఎఱుఁగుదు : కూర్మి అంటే ఎలాంటిదో తెలిసినవాడవు
అర్ధ సిద్ధి నెటి + ఎఱుగుదు = కార్యసాధన పద్ధతి తెలిసినవాడవు
వాక్యమ్ముల పద్ధతిన్ = మాటలాడే విధం
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నీకున్ = నీకు
బుద్ధులు + చెప్పన్ = ఉపాయాలు చెప్పడానికి
నేను + ఎవ్వడన్ = నేనేమాత్రం వాడిని
పొమ్ము = హస్తినాపురానికి వెళ్ళిరా !

భావం:
మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడివి, కౌరవులను గూర్చి తెలుసు. కూర్మి అంటే ఏమిటో తెలుసు. కార్యసాధన పద్ధతి కూడా తెలుసు. మాటలాడే విధం తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాడిని ? హస్తినాపురానికి వెళ్ళిరా !