AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

These AP 8th Class Social Important Questions 18th Lesson హక్కులు – అభివృద్ధి will help students prepare well for the exams.

AP Board 8th Class Social 18th Lesson Important Questions and Answers హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 1.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించుము.
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 2
ఇది వర్షాలు కురవని సంవత్సరం
జవాబు:
ఈ చిత్రం చాలా ఏళ్ళనాటిదని వృద్ధురాలి వస్త్రధారణను, ఇంట్లోని మట్టిబానలను, కుండలను చూసి చెప్పవచ్చు. ఒకప్పుడు ధాన్యం దాచుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఒక పాత్రలో బియ్యంలో ఎక్కడో అడుగున ఉన్నాయి. వృద్ధురాలు కూడా సరియైన తిండిలేక వడలిపోయి ఉన్నది. అది కరవు కాలం అని భావించవచ్చు.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

13 సంవత్సరాల పవన్ అనే బాలుడు వాళ్ల అమ్మతో కలిసి ఎంతోమంది భక్తులు సందర్శించే ఒక పుణ్యస్థలంలో ఉంటాడు. పవన్ గుడి బయట నిలబడి భక్తుల కాళ్లమీద పడి అడుక్కుంటాడు. అతడికి కొంతమంది మిగిలిపోయిన పాచి పదార్థాలు తినటానికి ఇస్తారు. కొన్నిసార్లు అతడు బరువైన సామాను మోస్తాడు, అందుకు వాటి యజమానులు కొంత డబ్బు ఇస్తారు.

అతడి తల్లి వేరొకరి ఇంటిలో పనిచేస్తుంది. ఆమె రోజుకి 12 గంటలపాటు, నెలలో 30 రోజులూ పనిచేస్తుంది. యజమానురాలే కాకుండా, చిన్న పిల్లలు సైతం ఆమెను ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంటారు. అందరూ తిన్న తరవాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు. యజమానుల ముందు ఆమె కూర్చోటానికి వీలులేదు. వాళ్లతో భయభక్తులతో మాట్లాడాలి. చిన్న చిన్న తప్పులకు, ఆలస్యానికి ఆమెను తరచు అవమానిస్తుంటారు. ఆమె కన్నీళ్లతోపాటు కోపాన్ని కూడా దిగమింగుకోవాలి. లేదంటే పని నుంచి తీసేస్తారు.
1. పవన్ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
జవాబు:
13 సంవత్సరాలు.

2. పవన్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు?
జవాబు:
అతడు బరువైన సామాను మోసినందుకు ఇస్తారు.

3. అతడి తల్లి ఏమి చేస్తుంది?
జవాబు:
వేరొకరి ఇంటిలో పని చేస్తుంది.

4. ఆమెకున్న ఇబ్బందులను లేదా కష్టాలను రెండింటిని చెప్పండి.
జవాబు:
1. యజమానుల ముందు కూర్చోడానికి వీలులేదు.
2. అందరూ తిన్న తరువాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు.

5. పవన్ కాళ్ల మీద పడి ఎందుకు అడుక్కుంటాడు?
జవాబు:
వారికి జాలి కలిగి డబ్బులు ఇస్తారని

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
కింది పేరాను చదివి జవాబులు వ్రాయుము.

ప్రజా విచారణ :
‘జన్ సునావాయి’ (అంటే ప్రజా విచారణ) పేరుతో MKSS (మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్) సమావేశాలు నిర్వహించేది. పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదవలేరన్నది వాస్తవం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పత్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి వీటిని పైకి చదివి వినిపించేవాళ్లు, వివరించేవాళ్లు. చేతిపంపు వేయటానికి ఎవరెవరికి కూలీ చెల్లించారో మస్టర్/హాజరు జాబితా తెలియచేస్తుంది. మస్టర్ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు ఆ సమయంలో ఊళ్లో ఉన్నారో, లేక వలస వెళ్లారో ప్రజలు చెప్పగలుగుతారు, లేదా మస్టర్‌లో పేర్కొన్న మొత్తం వాళ్లకు చెల్లించారో లేదో చెప్పగలుగుతారు. దీని ద్వారా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది వెల్లడవుతుంది. ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్లు. పత్రాలలో ఉన్న సమాచారం గురించి వివరించటానికి, సమర్ధించుకోటానికి అధికారులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్లు. ఈ సమావేశాల్లో జిల్లా పాలనా యంత్రాంగం, పంచాయితీ అధికారులు కూడా పాల్గొనేవాళ్లు. అవినీతిని గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేవాళ్లు.
1. ‘జన్ సునావాయి’ అంటే తెలుగులో ఏమిటి?
జవాబు:
ప్రజా విచారణ.

2. పత్రాలను పైకి చదివి ఎందుకు వినిపించేవారు?
జవాబు:
పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను చదవలేరు. అందుకే వాటిని పైకి చదివి వినిపించేవారు.

3. ‘మస్టర్’ అంటే ఏమిటి?
జవాబు:
కూలీవాళ్ళు లేదా చేతిపనులు చేసేవాళ్ళు ఆ రోజు పనికి హాజరయ్యారో లేదో ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. దానినే మస్టర్ అంటారు.

4. సమావేశాల ద్వారా ప్రజలు ఏం చేసేవారు?
జవాబు:
సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్ళు.

5. కేసులు ఎప్పుడు నమోదు చేసేవాళ్ళు?
జవాబు:
అవినీతిని గుర్తించినప్పుడు కేసులు నమోదు చేసేవాళ్ళు.

ప్రశ్న 4.
‘సమాచారాన్ని వెల్లడి చేయడం పై ప్రజల వాదనలు ఏవి?
జవాబు:
వారి వాదనలు :

  1. మానవ అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కులకు సమాచారం కీలకమైనది. అధికారిక పత్రాల రూపంలో తగినంత సమాచారం ఉన్నప్పుడే ప్రజలు పాలనలో భాగస్వాములై, న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు.
  2. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటంవల్ల ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరును పర్యవేక్షించటం, అవినీతి జరగకుండా చూడటం సాధ్యమవుతుంది.
  3. పేదల మనుగడకు సమాచారం కీలకమైనది.
  4. సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటాన్ని అరికట్టవచ్చు.

ప్రశ్న 5.
విద్యా హక్కు చట్టంలోని ఏవేని 6 ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 :
6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు :

  1. పిల్లలందరికి అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
  2. పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి.
  3. పిల్లలందరిని వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి.
  4. వయస్సుకు తగ్గ రీతిలో చేర్చిన తరవాత వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.
  5. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతోపాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాటు చేయాలి.
  6. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము, ఛార్జీలు వసూలు చేయరాదు.

ప్రశ్న 6.
సమాచారం వెల్లడి కోసం ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
రాజస్థాన్లో కొంతమంది మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (MKSS) పేరుతో సంఘటితమై ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు, స్థానికసంస్థలు డబ్బులు ఎలా ఖర్చు చేశామో తనిఖీ లేదా MNREGA వంటి సమాచారం అడగసాగారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సమాచారం పొందటానికి ఎటువంటి చట్టబద్ధ హక్కులేదు. మొదట్లో కొంతమంది అధికారుల సహాయంతో సంబంధిత పత్రాలను సేకరించి బహిరంగ సమావేశాల్లో ప్రజలు వీటిని తనిఖీ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలం తరవాత ఈ వివరాలు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఈ విషయమై మూడు సంవత్సరాల పాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో ఉద్యమించారు. ఈ విధంగా ఉద్యమం మొదలైంది.

ప్రశ్న 7.
విద్యా హక్కు చట్టం గురించి తెలపంది.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 : 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 8.
86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది.

ప్రశ్న 9.
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
జవాబు:
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది.

ప్రశ్న 10.
ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడింది.

ప్రశ్న 11.
జీవించే హక్కు అంటే?
జవాబు:
మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు.

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 12.
జాతీయస్థాయిలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
2005లో

ప్రశ్న 13.
స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలకృష్ణ గోఖలే ఏ వర్గానికి చెందినవాడు?
జవాబు:
మితవాదులు.

ప్రశ్న 14.
భారతదేశంలో, సమాచార హక్కు చట్టం – 2005, అవినీతి నిర్మూలనకు మరియు పేదల కోసం అమలు చేసే కార్యక్రమాల ప్రయోజనాలను వారికి సక్రమంగా చేరవేసేందుకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
సమాచార హక్కు చట్టం పై లక్ష్యాలు సాధించడంలో విజయవంతమయిందా? మీ అభిప్రాయాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం కొన్ని అంశాలలో విజయాలను సాధించింది.

నా అభిప్రాయం ప్రకారం సమాచార హక్కు చటు, కొన్ని విషయాలలో ఇంకా విజయాన్ని సాధించలేదు అని చెప్పవచ్చు అవి ఏమనగా

పేదరికం :
పేదలు ఎక్కువగా క , భారతదేశంలో వారి హక్కుల గురించి పోరాడటానికి తగిన సమయం లేదు. వారు తమ రోజు వారి కార్యక్రమాలలో పోరాడుతూ తలమునకలై ఉన్నారు.

అవినీతి :
నేటికీ భారతదేశంలో అవినీతి ఎక్కువగా ఉండటం, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా ఉపయోగించడం లేదనే స్పష్టమౌతుంది.

భయం :
ప్రభుత్వాన్ని, అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడానికి భయపడుతూ ఉండటం కూడా కారణం.

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

These AP 8th Class Social Important Questions 17th Lesson పేదరికం – అవగాహన will help students prepare well for the exams.

AP Board 8th Class Social 17th Lesson Important Questions and Answers పేదరికం – అవగాహన

ప్రశ్న 1.

“పేదరికం ఎందుకు ఉంది? దాన్ని ఎలా నిర్మూలించవచ్చు” అనే శీర్షిక కింద పేరాను చదివి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి.
పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవటం అని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఉపాధి అవకాశాలు లేకపోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల కొనుగోలు శక్తి (ఆదాయం ) తగ్గుతుంది. కనీస . కొనుగోలు శక్తి లేనప్పుడు వాళ్లు తీవ్ర ఆకలికి గురవుతారు.

పేదరికానికి గల ఇతర కారణాలు ఏవి?
జవాబు:
పేదరికానికి గల ఇతర కారణాలు :

  1. కుటుంబంలో వ్యక్తులు ఎక్కువగా ఉండటం.
  2. ఒక్కరే పనిచేసి, ఎక్కువమంది కూర్చొని తినాల్సి రావటం.
  3. సామర్థ్యానికి తగిన అవకాశాలు రాకపోవటం.
  4. వేతన కూలీ రేట్లు చాలా తక్కువగా ఉండటం మొ||నవి.

ప్రశ్న 2.
క్రింది గ్రాఫుని చూసి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 2
1) ఎవరు ఎక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
ధనికులు.

2) ధనికులకు రెండవ పాతిక శాతానికి మధ్యన గల కాలరీల తేడా ఎంత?
జవాబు:
621 కాలరీలు.

3) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగువారు.

4) ఈ చిత్రాన్ని బట్టి నీకు ఏమి అర్థం అయింది?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహార స్థాయిని నిర్దేశిస్తుంది.

ప్రశ్న 3.
వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయంపై ఆధారపడిన వారికి మద్దతుగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఈ కింద ఉన్నాయి. ప్రతిదాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. అది ఎందుకు ముఖ్యమో తెలియచేయండి. మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
1. రైతులు వ్యాపారస్తులు/దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలి. ఇవి నాణ్యతగా ఉండేటట్టు, సరసమైన ధరలకు దొరికేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జవాబు:
రైతులు వ్యవసాయంపై సంపాదించినదే తక్కువగా ఉంటుంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందకపోతే వారు యిబ్బందుల పాలవుతారు. దళారీల దగ్గర ఎక్కువ ధరలకు కొనలేరు. ఇందులో ఏవి లేకపోయినా వారు పెట్టుబడి మొత్తాన్ని నష్టపోతారు.
ఉదా :
ఇటీవలే కొన్ని జిల్లాల్లో ప్రత్తి విత్తనాలు నాసిరకం యివ్వడం మూలంగా ప్రత్తి రైతులు కోలుకోలేనంతగా దెబ్బ తిన్నారు.

2. చిన్నతరహా సాగునీటి పథకాలు.
జవాబు:
భారతదేశంలో వ్యవసాయం వర్షాధారం, ఇవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు. వాటి మీద ఆధారపడితే రైతు పరిస్థితి దీనస్థితి.
ఉదా :
గతంలో ఒకసారి వర్మాలు లేవని రైతులు నారు పోయలేదు. జులై నెలలో విపరీతంగా వర్షాలు పడి వాగులు, వంకలు నిండిపోయాయి. అపుడు వారు ఎక్కువ ధరకు నారు కొని తెచ్చి నాట్లు వేశారు. చేను ఏపుగా ఎదిగి మంచిగా పండింది. నవంబర్‌లో తుఫాను వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసేసింది. ఆ కాబట్టి చిన్న తరహా సాగు నీటి పథకాలు ఉండాలి.

3. న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకు ద్వారా రుణాలు.
జవాబు:
న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకులు ఋణాలివ్వకపోతే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళతారు. హెచ్చువడ్డీలు వారికి చెల్లించాల్సి వస్తుంది. రైతులు అప్పుల పాలయిపోతారు.

4. ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరికేలా మార్కెటింగు సౌకర్యాలు.
జవాబు:
ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరకాలి. లేదంటే వారికి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అవుతుంది. అందుకే ప్రభుత్వంవారు కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు.

5. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచటం.
జవాబు:
రోడ్డు, రవాణా సౌకర్యాలు లేకుంటే పండిన పంటను గ్రామం నుండి మార్కెట్టుకు చేర్చడం కష్టమవుతుంది. కొన్ని పంటలు త్వరగా పాడయిపోయేవి ఉంటాయి. అవి ఎందుకూ పనికి రాకుండా అయిపోతాయి.
ఉదా :
గతంలో ఒకసారి లారీల స్వంతదారులు సమ్మె చేశారు. ఆ సమయంలో చెరకు పంట. కోసి ఫ్యాక్టరీకి పంపడం కొంతమంది రైతులకు వీలవలేదు. ఆలస్యమయ్యేసరికి చెరుకు ఎండిపోయి దాని విలువను కోల్పోయింది. రైతులు పూర్తిగా నష్టపోయారు.

6. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు సహాయం అందించటం.
జవాబు:
పంటలు నష్టపోయినపుడు బ్యాంకువారు, తరువాత పంటకి అప్పులివ్వటం, కొంత వడ్డీని మాఫీ చేయడం లాంటివి చేయాలి. లేదంటే రైతులు ఉన్న అప్పును తీర్చలేరు, మళ్ళీ పంటని పండించలేరు. ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే రైతులంతా ఈ బాపతువారే.

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 4.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానము లిమ్ము.
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.

  • నీటి నిల్వ, సంరక్షణ
  • కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
  • షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
  • చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ

1. మీ ఉపాధ్యాయుల సహాయంతో పైన ఇచ్చిన పనులు ఏమి సూచిస్తాయో తెలుసుకోండి.
జవాబు:
పైన యిచ్చిన పనులు వ్యవసాయావసరాలను తీరుస్తాయి. గ్రామాలు వాటి వనరులను అవే సమకూర్చుకునేలా చేస్తాయి. ఈ పనులు గ్రామాభివృద్ధిని సూచిస్తాయి.

2. మీ ఊరు/పట్టణానికి దగ్గరలో ఉపాధి హామీ చట్టం కింద జరుగుతున్న పని స్థలాన్ని సందర్శించండి. అక్కడ వాళ్లతో మాట్లాడి దాని గురించి రాయండి.
జవాబు:
మా ఊరు కోరుట్లలో ఉపాధి హామీ చట్టం క్రింద కాలువగట్లు బాగు చేస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. చెరువులో పూడిక తీస్తున్నారు. దీనిమూలంగా ఇక్కడి పనివారికి వేసవికాలంలో అంటే పనులు లేని కాలంలో కూడా కూలీ పనులు లభిస్తున్నాయి అని సంబరపడుతున్నారు.

3. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతను ఇస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం కొంత సొమ్మును రిజర్వు చేసి ఉంచుతుంది. చాలా సం||రాల నుండి ఈ సొమ్ము వాడక నిల్వ ఉండిపోయింది. కాబట్టి వీటిని వెంటనే వారికి సాగునీరు, తాగునీరు అందించటానికి ఉపయోగిస్తున్నారు. దీనివలన వారు స్వయం సమృద్ధిని సాధించుకోగలుగుతారు.

4. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధుల రక్షణలో ఉపాధి హామీ చట్టాన్ని ఒక పెద్ద ముందడుగుగా ఎందుకు పేర్కొంటున్నారు?
జవాబు:
ఈ చట్టం లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వారి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. వారి కుటుంబాలు అల్లల్లాడేవి. ఈ చట్టం మూలంగా వారికి సం||రానికి 150 రోజులు పని దొరకటమే కాక గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇది ఒక పెద్ద ముందడుగుగా పేర్కొనబడింది.

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానము లిమ్ము.

అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేశారు. వాళ్లకంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ పేదవాళ్లుగా పరిగణించబడే వాళ్లకు (BPL) (తెల్ల) కార్డులు ఇచ్చారు. మిగిలిన వాళ్లకి ఎపిఎల్ (గులాబీ) కార్డులు ఇచ్చారు.

ఒక్కొక్కరికి చౌకధరల దుకాణం నుంచి లభించే సరుకుల మొత్తం, వాటి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమ) ఇస్తారు. BPL కారు ఉన్నవాళ్లకి తెలంగాణలో ప్రతి వ్యక్తికీ నెలకి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహారధాన్యాలు ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి, వయసుమళ్లిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.

1. అంత్యోదయ కార్డులు ఎవరికి జారీ చేశారు?
జవాబు:
అత్యంత పేద కుటుంబాలకు.

2. BPL వారికి ఏ రంగు కార్డులిచ్చారు?
జవాబు:
తెల్లకార్డులు.

3. BPL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకు దిగువున అని అర్థం.

4. APL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకి ఎగువున అని అర్థం.

5. APL వారికి ఏ రంగు కార్డులు యిచ్చారు?
జవాబు:
గులాబీ రంగు కార్డులు.

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 6.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతనిస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ నిధులు మిగిలిపోతాయి. ఈ నిధులతో త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 7.
పేదరిక నిర్మూలనకు సంబంధించి రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. పేదరికము అనేది శాపం కాదు, ఇది ఒక పరిస్థితి మాత్రమే.
  2. విద్యను సాధించు, పేదరికాన్ని తొలగించు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 33% నుండి 5 సం||లోపు పిల్లలు వయస్సుకు తగ్గ బరువు లేరు. 31% మంది స్త్రీలలో, 25% మంది పురుషులలో పోషకాహార లోపం వుంది”.
పైన చెప్పిన పోషకాహార లోపాన్ని అధిగమించుటకు ప్రభుత్వం తీసుకోవలసిన ఏవైనా రెండు చర్యలను సూచించండి.
జవాబు:
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు :

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కాయకూరలు లాంటి అనేక రకాల వస్తువులను అందించటం.
  2. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే ఆహారం సంపూర్ణ పోషక విలువలు కలిగి ఉండేటట్లు చూసుకోవాలి.
  3. బాల్య వివాహాలు జరగకుండా చట్టాలను పకడ్బందిగా అమలు చేయడం.

ప్రశ్న 9.
BPL ద్వారా అసమానతలు ఎలా తొలగించబడుతాయో, రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. BPL కార్డు కలిగినవారు రేషన్ షాపు నుంచి చౌక ధరకు ఆహార ధాన్యాలను పొందవచ్చు.
  2. BPL కుటుంబాల వారు ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్య భీమాను పొందవచ్చు.
  3. BPL కుటుంబాలను గుర్తించడం ద్వారా వారికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయవచ్చు.

ప్రశ్న 10.
రేఖాపటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) రోజువారీ పనులు చేయడానికి కావలసిన శక్తి మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఆ శక్తిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
బి) గ్రామీణ భారతంలో అట్టడుగు పాతికశాతం మంది ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారు?
జవాబు:
ఎ) రోజూ మనం తీసుకునే ఆహారాన్ని కేలరీలలో కొలుస్తారు.
బి) గ్రామీణ భారతంలో అట్టడుగు పాతిక శాతం మంది 1624 కాలరీల ఆహారాన్ని మాత్రమే రోజుకు తీసుకుంటున్నారు.

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

These AP 8th Class Social Important Questions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 16th Lesson Important Questions and Answers జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 1.
మొదటి భూదాన భూమిని అందుకున్న మైసయ్యగా మిమ్మల్ని ఊహించుకోండి. ప్రార్థనా సమావేశంలో మీకు భూమి లభించినప్పుడు మీ భావాలను వివరించండి.
జవాబు:
“అయ్యా ! వినోబాజీ ! మీ పుణ్యమా అని నా జీవిత కల నెరవేరి భూమికి యజమానిని అయ్యాను. మీరు, రామచంద్రారెడ్డి కుటుంబీకులు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చల్లంగా ఉండాలి. నా కుటుంబం అంతా రెండు పూటలా అన్నం తింటాం.

మాకు ఈ రోజు నిజమైన పండగొచ్చిన రోజు.

గాంధీ గారికి జై
భారత మాతాకి జై
“ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నంద నందనా ” ||ఉందిలే !||

ప్రశ్న 2.
అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించడానికి ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
క్రింది ఇవ్వబడిన ఫ్లోచార్ట్ లోని సమాచారం ఆధారంగా జమీందారీ వ్యవస్థ గురించి మీరు గ్రహించిన విషయాలను తెలపండి.
AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1
జవాబు:
ఈ ఫై ఫ్లోచార్టు ప్రకారం నేను గ్రహించిన విషయాలు ఏమిటంటే

  1. గ్రామీణ ప్రాంతాలు కడు పేదరికంలో ఉన్నాయి కారణం ఏమిటంటే సాగుచేసే భూమి అంతా భూస్వాముల ఆధిపత్యంలోనే ఉన్నది.
  2. వ్యవసాయం చేసేవారికి సొంతభూమి లేదు.
  3. భూమిశిస్తు వసూలు, సాగు భూమిపై నియంత్రణ, అటవీ భూములపై నియంత్రణ ఇవి అన్ని భూస్వాముల చేతులలోనే ఉండేది.
  4. భూస్వాముల ఆధిపత్యమే సమాజంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
1972-75 భూ పరిమితి చట్టంలోని ముఖ్యాంశాలను రాయండి?
జవాబు:

  1. అయిదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా చట్టం ప్రకటించింది.
  2. అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 10-27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 35 -54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు.
  3. దానికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వం తీసుకుంటుంది.
  4. ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు.
  5. వీటిల్లో 6,41,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అందులో 5,82,000 ఎకరాలను 5,40,000 మంది భూమిలేని, పేద సన్నకారు రైతులకు పంచి పెట్టింది.

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 5.
‘దున్నేవానికి భూమి’ అన్న నినాదం ఎల్లప్పుడూ ఒక మంచి ప్రేరణ వివరించండి.
జవాబు:
‘దున్నేవానికి భూమి’ అన్న నినాదం ఎల్లప్పుడూ ఒక మంచి ప్రేరణాత్మక అంశమే ఎందుకనగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతదేశ ప్రజానీకం కడు పేదరికంలో ఉంది.

‘దుక్కేవానికే భూమి’ అనే నినాదం వలన స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ అంశం మీద దృష్టిపెట్టి భూసంస్కరణలు అమలు చేసి భూములు లేని కౌలుదారులకు భూములను ఇవ్వడం జరిగింది.

ఇప్పటికీ కూడా చాలా ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో భూ సంస్కరణలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ సంస్కరణల వలన పేద ప్రజల జీవితాలను మెరుగుపడ్డాయి అని చెప్పవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

These AP 8th Class Social Important Questions 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 15th Lesson Important Questions and Answers చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 1.
పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాలి? భద్రత దృష్ట్యా కొన్ని సూచనలు చేయండి.
జవాబు:
పిల్లల పట్ల పెద్దలు ప్రేమ పూర్వకంగా మరియు స్నేహభావంతో మెలగాలి. పిల్లల చదువుల విషయంలో వారికి ఒక స్నేహితుడిలాగ అవగాహన కలిగించి వారు సరియైన దారిని ఎంచుకునే లాగ ప్రోత్సహించాలి. వారు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసి చూపకుండ వారు చేసిన తప్పును సరిదిద్ది మరలా వారు దానిని చేయకుండా చూడాలి. వారికి చదువు ఒక్కటే కాదు ఆటలు, పాటలు అనేవి కూడా వారి జీవన విధానంలో ప్రధానమని ప్రోత్సహించాలి. పిల్లలకు పెద్ద వారిని గౌరవించడం నేర్పాలి. వారు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో గమనించాలి. పిల్లలకు లోకజ్ఞానమును నేర్పించాలి. వారికి వాహనములను నడపడం పట్ల మరియు రోడ్డు భద్రత అంశాల మీద అవగాహన కలిగించాలి. సోషల్ మీడియాను పిల్లలు సరియైన దారిలో ఉపయోగించేలాగ చూడాలి.

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 2.
నిన్ను ఒకరు వేధిస్తున్నారని ఊహించుకోండి. దానికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరుస్తూ పోలీస్ అధికారికి . ఫిర్యాదు రాయండి.
జవాబు:

మహరాజశ్రీ, విజయవాడ వటౌన్ పోలీస్ స్టేషన్ S.I. గారి దివ్య సుముఖమునకు పంజాగుట్ట కాలనీవాసురాలిని మరియు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ‘నేహ’ అనే విద్యార్థిని చేసుకుంటున్న విన్నపము.

అయ్యా ,
గతకొంతకాలంగా నేను పాఠశాలకు నడచి వెళ్తున్న సమయంలో మా వీధిలోని కొంతమంది పనిచేయకుండా ఖాళీగా ఉన్న యువకులు టీజింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గర పెద్దవారికి చెప్తే వారు వచ్చి ఆ యువకులను మందలించగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మరలా ఒక నెల రోజుల నుండి టీజింగ్ చేయడమే కాకుండా, అసభ్య పదజాలమును వాడటం, నా వెనకాల స్కూలుదాగ రావడం చేస్తున్నారు. దీని వలన నా చదువు దెబ్బతింటుంది. నాకు పాఠశాలకు వెళ్ళాలంటే భయము వేస్తుంది. కావున దయ ఉంచి మీరు నన్ను వారి బారీ నుండి కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
తమ విధేయురాలు,
నేహ.

అడ్రసు :
నేహ
D/O. శ్రీనివాసరావు
పంజా సెంటర్
4వ నెంబరు వీధి
133-1/11

ప్రశ్న 3.
గ్రామాలలో / కుటుంబాలలో తరచు తగాదాలు ఎందుకు వస్తాయి? దానికి కారణాలు ఏవి? అవి రాకుండా ఉందాలంటే మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావాలి?
జవాబు:
గ్రామస్తులు ఒకరితో ఒకరు కలసిమెలిసి ఉంటారు. ఇంకొకరి విషయాలలో వారి అనుమతి లేకుండానే తలదూరుస్తారు. ‘వ్యక్తిగతం’ అనేదాన్ని విస్మరిస్తారు. కావున తగాదాలు వస్తాయి. కాబట్టి వారు పట్టణ/నగర నాగరికతను అలవరుచుకుంటే మంచిది.

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

బెయిలు :
రవిది క్రిమినల్ కేసు కాబట్టి నేరారోపణ పత్రం (చార్జిషీటు దాఖలు చేసిన తరవాత లాకప్ లో నిర్బంధించారు. క్రిమినలు కేసులలో నిందితులను జైలులో ఉంచుతారు. అయితే ఇది శిక్షకాదు. ఇది నేర విచారణలో దోహదపడటానికి, లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండటానికి, లేదా సాక్షులను బెదిరించకుండా ఉండటానికి ఉద్దేశించినది. పోలీసు లాకప్ లో కొన్ని రోజులు ఉన్న తరువాత రవి కుటుంబం బెయిలు కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు దొరకకపోవచ్చు. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఆస్తులు కావచ్చు లేదా పూచీకత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు. బాండు కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడని బాండు హామీ ఇస్తుంది. బెయిలు మంజూరు చేయాలో, లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిర్ణయిస్తారు.
అ) రవిని ఎందులో నిర్బంధించినారు?
జవాబు:
రవిని లాకప్ లో నిర్బంధించినారు.

ఆ) క్రిమినల్ కేసులలో నేర విచారణలో దోహదపడటానికి ఏం చేస్తారు?
జవాబు:
నిందితులను జైలులో ఉంచుతారు.

ఇ) బెయిలు కోసం ఎవరికి దరఖాస్తు చేశారు?
జవాబు:
న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు.

ఈ) బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో ఏమి ఇవ్వాలి?
జవాబు:
న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి.

ఉ) బెయిల్ ను ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:
న్యాయమూర్తి

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి జవాబులిమ్ము.

ఇంతకు ముందు అధ్యాయాలలో మనం భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకున్నాం. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరు చేయటం. దీని అర్థం ఒక రంగంలో మిగిలిన రంగాలు అంటే ఉదాహరణకు న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ అధీనంలో లేవు. ప్రభుత్వం తరపున పని చేయవు.

పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. వాళ్లు కార్యనిర్వాహక రంగానికి చెందినవాళ్లు. గత సంవత్సరం మీరు జిల్లాస్థాయి పరిపాలన గురించి చదివారు. జిల్లాస్థాయిలో కలెక్టరు మాదిరిగా శాంతి, భద్రతల నిర్వహణకు జిల్లాస్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.
అ) రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం ఏది?
జవాబు:
రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయడం.

ఆ) న్యాయస్థానాలు ఎవరి ఆధీనంలో లేవు?
జవాబు:
న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు.

ఇ) పోలీసులు ఏ రంగానికి చెందినవారు?
జవాబు:
పోలీసులు కార్యనిర్వాహక రంగానికి చెందినవారు.

ఈ) పోలీసుశాఖ ఎవరి క్రింద పనిచేస్తుంది?
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.

AP 8th Class Social Important Questions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

AP 8th Class Social Important Questions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

These AP 8th Class Social Important Questions 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 14th Lesson Important Questions and Answers పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 1.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

ప్రశ్న 2.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది?
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 3.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా?
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

ప్రశ్న 4.
ఎంత శాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఇది ఓటింగు సరళిని తెలియజేస్తుంది. ఎన్నికల పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది ముఖ్యం.

AP 8th Class Social Important Questions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల స్వామ్యమని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్థం.

ప్రశ్న 6.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు?
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రశ్న 7.
మొదటి లోకసభ ఎన్నికలు ‘చీకటిలో ముందుకు దూకడం వంటిది. భారతదేశం లాంటి దేశానికి ఇది అనువైనది కాదు. భారతదేశం కులప్రాతిపదిక ఏర్పడిన సమాజం, అందరు సమానమనే భావనను అధిక శాతం ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపడం సాధ్యం కాదు అని కొంతమంది అన్నారు.
ప్రశ్న : ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? లేదా? ఎందుకు?
జవాబు:
పై అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు, ఎందుకనగా, భారతదేశం కులప్రాతిపదిక మీద ఏర్పడలేదు. మనదేశం లౌకికవాదాన్ని అనుసరిస్తున్న దేశం. అందురూ సమానులే అనే భావన కూడా మన సమాజంలో ఉంది. పాకిస్తాన్ దేశం మాత్రమే కులాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడింది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రజలలో కులం, మతం అనే అంశాలలో వారి భావాలు కూడా మారాయి. ప్రస్తుతం మన ప్రజలందరూ ఒకటే అని, ‘అందరం’ సమానమే అని భావన కూడా ఉంది.

కావున మనదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపటం సాధ్యమే.

అంతేకాకుండా మనకు అత్యున్నత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రజలందరూ సమానులే అని తీర్మానిస్తూ వయోజన ఓటుహక్కును 18 సం||లు నిండిన ప్రతి ఒక్క భారతీయుడికి ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికలలో పోటీచేసే అవకాశాన్ని కూడా కల్పించింది.

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

These AP 8th Class Social Important Questions 13th Lesson భారత రాజ్యాంగం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 13th Lesson Important Questions and Answers భారత రాజ్యాంగం

ప్రశ్న 1.
రాజ్యాంగ పీఠికలో ఉపయోగించిన పదాలలో కల, హామీలలో ఏ అంశాలను గుర్తించారు? వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఒక పటం తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 1

ప్రశ్న 2.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయుము.

వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను, ఒక చోట పొందుపరచాలనుకున్నారు. వీటిని ‘భారత రాజ్యాంగం’ అనే పుస్తకంలో పొందుపరిచారు.

రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ల హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
అ) ఎవరి పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది?
జవాబు:
వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది.

ఆ) మనం, నమ్మిన సిద్ధాంతాల్ని దేంట్లో పొందుపరిచారు?
జవాబు:
భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు.

ఇ) రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ఈ) దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 3.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

రాజ్యాంగ నిర్మాతల చిత్రాలలో ఒకరి చిత్రం లేకపోవటం మీలో కొందరు గమనించి ఉంటారు మహాత్మాగాంధీ. అతడు రాజ్యాంగసభలో సభ్యుడు కాదు. అయితే అతడి దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేకమంది ఉన్నారు. 1931లో ‘యంగ్ ఇండియా’ అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.

భారతదేశాన్ని అన్నిరకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమనీ, దాని నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నతవర్గ, నిమ్నవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం. అన్ని మతాల వాళ్లు, జాతుల వాళ్లు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను. – మహాత్మా గాంధీ
అ) రాజ్యాంగ నిర్మాతలలో ఎవరి చిత్రం లేదు?
జవాబు:
మహాత్మాగాంధీ చిత్రం

ఆ) ఈ కల దేంట్లో రాయబడినది?
జవాబు:
1931లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాయబడింది.

ఇ) ఇది ఎవరి కల?
జవాబు:
ఇది మహాత్మాగాంధీ కల.

ఈ) ఈ కలలో భవిష్యత్తులో ఏమి ఉండవు?
జవాబు:
భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు.

ఉ) మహిళలకూ …………………….. హక్కులు ఉంటాయి.
జవాబు:
మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి.

ప్రశ్న 4.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు. ఈ రెండూ ఏమిటి?
జవాబు:

  1. దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
  2. ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.

ప్రశ్న 5.
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని నెహ్రూ కోరారు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. ఆయన ఎవరి గురించి చెబుతున్నారు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని ఆయన కోరారు.
ఆ) ఆయన గాంధీజీ గురించి చెబుతున్నారు

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 6.
రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 7.
దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

ప్రశ్న 8.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయడానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.

ప్రశ్న 9.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకున్నారు?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు.

ప్రశ్న 10.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.

ప్రశ్న 11.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.

ప్రశ్న 12.
రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను, ఉద్దేశాలను పీఠిక తెలియజేస్తుంది. పీఠికలోని ముఖ్యమైన భావనలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన భావనలు :
“భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ‘ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”

భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని, చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్, 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసికొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం.

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 13.
భారత రాజ్యాంగ పీఠికలోని కీలకపదాల భావాన్ని వివరించండి.
జవాబు:
‘భారత రాజ్యాంగంలోని కీలక పదాల భావాలు :
భారతదేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా రాసి, చట్టంగా చేశారు. అంతేకానీ దానిని రాజులో, బయటి శక్తులో వాళ్ళకి ఇవ్వలేదు. మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని ఇది చాటి చెపుతుంది.

గణతంత్రం :
ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. అంతేకాని రాజ్యాలలో మాదిరి వారసత్వంగా అధికారం రాదు.

సర్వసత్తాక :
అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోటానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవీ భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు.

సామ్యవాదం :
తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి.

లౌకికతత్వం :
ఏ మత ఆధారంగా ప్రభుత్వం నడవదు. ఏ మతాన్ని అనుసరించటానికైనా, ఏ మతాన్ని అనుసరించక పోవటానికైనా ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాముఖ్యతను ఇవ్వదు.

ప్రజాస్వామ్యం :
ఇది ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వ విధానం. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. న్యాయం : ప్రతి పౌరునికి వారికి చెందింది దక్కాలి. అన్యాయానికి గురైన ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు.

సమానత్వం :
మన రాజ్యాంగం అన్ని అంశాలలో సమానతను ఇవ్వటం లేదు. కానీ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి.

స్వేచ్చ :
పౌరులు వాళ్ళు ఆలోచించే దానిమీద, వాళ్లు అనుసరించే మతం, లేక మతాన్నే అనుసరించకపోవటం, తమ భావాలను వ్యక్తపరిచే విధానం లేదా భావాలను చర్యలలో చేపట్టటం, అందరూ కలిసి సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది.

సౌభ్రాతృత్వం :
ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలి. తోటి పౌరులను పరాయివారిగా భావించకుండా, వారిని తక్కువ చేయకుండా ఉండాలి.

ప్రశ్న 14.
భారత రాజ్యాంగం ప్రవేశిక గురించి రాయండి.
జవాబు:
భారత రాజ్యాంగం ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది.

ప్రశ్న 15.
భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య పదాలను భారతదేశ పరిస్థితుల ఆధారంగా వివరించండి.
జవాబు:
సర్వసత్తాక :
సర్వసత్తాక అనగా భారతదేశం ఏ ఇతర దేశం నియంత్రణ క్రింద ఉండకపోవడం మరియు భారతదేశం తన పౌరుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోవడం. ఉదాహరణకు భారతదేశం తన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నది. చట్టాల విషయంలో కూడా ఏ ఇతర దేశాల జోక్యం ఉండదు.

సామ్యవాద :
దేశ సంపదను, వనరులను అందరికీ సమానంగా పంపిణీ చేయటం. ధనికులకు, పేదవారికి మధ్య ఉన్న అంతరాలను తొలగించటం.
ఉదా :
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూత అందించడం రిజర్వేషన్లను కల్పించడం.

లౌకిక :
ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రోత్సాహించక పోవడం. ఉదా : భారతదేశంలో ప్రజలు తమకు నచ్చిన మతాన్ని – స్వీకరించడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండటం,

ప్రజాస్వామ్యం :
ఈ ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలందరూ సమాన రాజకీయ హక్కులు కలిగి ఉంటారు.
ఉదా :
పౌరులు ప్రభుత్వ తీరును ప్రశ్నించే హక్కును కలిగి ఉంటారు.

AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 16.
కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 13 భారత రాజ్యాంగం 1
ఎ) పై చిత్రంలో భారత ప్రభుత్వం యొక్క ఏ మూల సూత్రం వివరించబడింది?
బి) ఏ ప్రభుత్వం “విద్య”పై చట్టాలు చేయడానికి బాధ్యత కలిగి వుంది? కేంద్రమా లేదా రాష్ట్ర ప్రభుత్వమా?
జవాబు:
ఎ) సమాఖ్య వ్యవస్థ.
బి) విద్యపై చట్టాలు చేసే బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి పై కలదు.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

These AP 8th Class Social Important Questions 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 12th Lesson Important Questions and Answers భారత ఎన్నికల వ్యవస్థ

8th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఎన్నికల నియమావళిని ఎవరు రూపొందిస్తారు?
జవాబు:
దేశంలో ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ సంఘం రాజకీయ పార్టీల కోసం “ఎన్నికల నియమావళి”ని రూపొందిస్తుంది.

ప్రశ్న 2.
భారతదేశం ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
భారతదేశం ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది.

ప్రశ్న 3.
సార్వజనీన ఓటుహక్కు అంటే ఏమిటి?
జవాబు:
ఎన్నికల కమీషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సం||లు నిండినవారు కుల, జాతి, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే ‘సార్వజనీన ఓటు హక్కు’ అంటారు.

ప్రశ్న 4.
ఎలక్ట్రే ట్ అంటే ఏమిటి?
జవాబు:
ఓటర్లందరినీ కలిపి ‘ఎలక్ట్రేట్’ అంటారు.

ప్రశ్న 5.
ప్రాంతీయ పార్టీగా గుర్తించాలంటే ఎన్ని ఓట్లు రావాలి?
జవాబు:
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం ఎలా?
జవాబు:
సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.

ప్రశ్న 7.
ఎన్నికల ప్రచారం ఎప్పుడు నిలిపివేయాలి?
జవాబు:
ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం నిలిపివేయాలి. ఎస్ఎంన్లు కూడా నిషిద్ధం, మద్యం పంపిణీ చేయకూడదు.

ప్రశ్న 8.
ఓ రాజకీయ పార్టీ ఎలా ఆవిర్భవిస్తుంది?
జవాబు:
మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది.

ప్రశ్న 9.
రిటర్నింగ్ అధికారి అంటే ఎవరు?
జవాబు:
ప్రతి నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి నియమించబడే అధికారే ‘రిటర్నింగ్ అధికారి’.

ప్రశ్న 10.
ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ స్థాయి అధికారి?
జవాబు:
పోలింగ్ బూతులో నియమించబడే అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్.

ప్రశ్న 11.
సాధారణ ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
5 సం||లకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను ‘సాధారణ ఎన్నికలు’ అంటారు.

ప్రశ్న 12.
ఉప ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు’ అంటారు.

ప్రశ్న 13.
మధ్యంతర ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
5 సం||ల పూర్తికాలం గడవకముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 14.
NOTA అంటే ఏమిటి?
జవాబు:
None of the above

ప్రశ్న 15.
రాజకీయ పార్టీ అనగానేమి?
జవాబు:
ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి ఉండి రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని రాజకీయ పార్టీ అంటారు.

ప్రశ్న 16.
స్వతంత్ర అభ్యర్థులు అంటే ఎవరు?
జవాబు:
ఏ రాజకీయ పార్టీ తరఫున కాక వేరేగా పోటీ చేసే వారిని స్వతంత్ర అభ్యర్థులు అంటారు.

8th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఎన్నికల కమీషన్ చిహ్నంను చిత్రించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 1

ప్రశ్న 2.
టి.ఎన్. శేషన్ సిఫార్సులు ఏవి?
జవాబు:

  1. ప్రచార సమయాన్ని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుండి 14 రోజులుగా నిర్ణయించారు.
  2. ఒక అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయరాదు.
  3. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 ఏండ్లు శిక్ష అనుభవిస్తే 6 ఏండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి.
  4. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కానీ రద్దు చేయకూడదు.
  5. ప్రచారం పూర్తి అయిన తరువాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.

ప్రశ్న 3.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ఏవేని రెండు అంశాలు వ్రాయండి.
జవాబు:

  1. పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
  2. ఇతర రాజకీయ పార్టీలను, అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజాజీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయకూడదు.

ప్రశ్న 4.
దా॥ సుబ్రమణ్య స్వామి కేసు గురించి రాయండి.
జవాబు:
డా|| సుబ్రమణ్య స్వామి కేసులో 2013లో సుప్రీంకోర్టు, ఓటరు తన ఓటును వినియోగించుకున్న తరువాత తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపరు పొందడానికి వీలుగా ఈవీఎంలలో ఓటర్ -వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వి.వి.పి.ఏ.టి.) ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ప్రశ్న 5.
ఓటరు ప్రతిజ్ఞను రాయండి.
జవాబు:
భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
రాజకీయ పార్టీలు ఎన్నికలలో చేయకూడనివి (ఏవేని రెండు) ఏవి?
జవాబు:

  1. అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనాయంత్రాంగాన్ని వినియోగించకూడదు.
  2. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు.

ప్రశ్న 7.
ఈ క్రింది పేరాను చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు.
ప్రశ్నలు :
1) ఎన్నికల సిబ్బంది ఎందుకు అవసరం?
జవాబు:
ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బంది అవసరం.

2) ఎన్నికల సిబ్బంది ఎవరి అధీనంలో ఉంటారు?
జవాబు:
ఎన్నికల కమిషన్ అధీనంలో ఉంటారు.

ప్రశ్న 8.
భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల కమీషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది, కాని టి.ఎన్.శేషన్ (1990 – 1996) కాలం నుండి గణనీయమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నది. శేషన్ భారత ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అతని తరువాతనే ఎన్నికల కమీషన్ అధికారాల గురించి దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది.
1) T.N. శేషన్ పదవీకాలం ఏది?
జవాబు:
1990 – 1996

2) ఈ కాలం ఎందుకు ప్రజాభిమానాన్ని చూరగొంది?
జవాబు:
అవినీతిని అంతం చేయాలన్న TN శేషన్ ప్రయత్నం మూలంగా ఈ కాలం ప్రజాభిమానాన్ని చూరగొంది.

ప్రశ్న 9.
ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని, బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
1) ఏవేని రెండు జాతీయ, ప్రాంతీయ పార్టీల పేర్లు చెప్పండి.
జవాబు:

  1. భారత జాతీయ కాంగ్రెసు
  2. భారతీయ జనతా పార్టీ
  3. తెలుగుదేశం
  4. ద్రవిడ మున్నేట్ర కజగం

2) ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం సాధించాలి?
జవాబు:
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు సాధించాలి.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 10.
EVM ల గురించి వ్రాయండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 2
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను భారతదేశంలో మొట్టమొదటగా 1989-90 దేశంలోని 16 శాసనసభా నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా వాడారు. EVM ల విశ్వసనీయత మీద అనేక మంది సందేహాలు లేవనెత్తారు. కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈ EVM లలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నది.

8th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారత ఎన్నికల సంఘం గురించి రాయండి.
జవాబు:
భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 26న ఏర్పడింది. ఇది ఒక స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. తన అధికారంతో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యత దానిపై ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించి దేశంలో లోకసభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు.

ప్రశ్న 2.
ప్రధాన ఎన్నికల కమీషనర్ గురించి రాయండి.
జవాబు:
ప్రధాన ఎన్నికల కమీషనర్ : ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమీషను అధిపతి, జాతీయ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరపడానికి ఇతనికి రాజ్యాంగబద్ధంగా పలు అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇతను సాధారణంగా భారత సివిల్ సర్వీసుకు చెందినవాడై వుంటాడు. ఇతని పదవీ కాలం 6 సం||రాలు లేదా 65 సం||లు నిండేవరకు పదవిలో ఉంటాడు. మొదట ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా అనగా ఒక ప్రధాన ఎన్నికల అధికారితో మాత్రమే పనిచేసింది. దీన్ని 1993లో త్రిసభ్య సంస్థగా మారుస్తూ ఇద్దరు కమీషనర్లను అదనంగా నియమించారు.

ప్రశ్న 3.
ఎన్నికలలో రాజకీయ పార్టీల గురించి రాయండి.
జవాబు:
ఎన్నికలలో రాజకీయ పార్టీలు :
మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమీషన్ దగ్గర రిజిష్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో , పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓటు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్ సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.

ప్రశ్న 4.
అభ్యర్థుల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన అంశాలు ఏవి?
జవాబు:

  1. పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
  2. ఇతర రాజకీయ పార్టీలను, అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజాజీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయవద్దు.
  3. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి, కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు.
  4. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్ధన, పవిత్ర స్థలాల్లో, పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు.
  5. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం గానీ, బెదిరించడం గానీ చేయకూడదు.
  6. ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించరాదు.
  7. పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు.
  8. గడువు దాటాక ప్రచారం చేయకూడదు.
  9. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధం.
  10. ప్రశాంత జీవనం గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి భంగం కలిగేలా ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు, పికెటింగ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం.
  11. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదు.

ప్రశ్న 5.
ఎన్నికలు : కోర్టు తీర్పులు’ కు సంబంధించి ఏవేని రెండు విషయాలను రాయండి.
జవాబు:

  1. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటా (NOTA)ను ఏర్పాటు చేసింది.
  2. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేరచరిత్ర, జీవితభాగస్వామి, పిల్లలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణపత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఏమేమి చేయరాదు?
జవాబు:

  1. అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు, పార్టీ పనులకు పాలనాయంత్రాంగాన్ని వినియోగించకూడదు.
  2. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండరాదు.
  3. ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడరాదు.
  4. సెక్యూరిటి వాహనాలు మూడుకు మించితే దాన్ని ఎన్నికల వ్యయంలో చూపెట్టాలి.
  5. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటి నుండి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
  6. ప్రభుత్వ వసతి గృహాలు, ఆఫీసులు మొదలైన ప్రభుత్వ ఆస్తులు ఏవికూడా పార్టీలు, ప్రచారానికి వినియోగించకూడదు.
  7. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
  8. పత్రికల్లో, టీవీల్లో ఇచ్చే పార్టీ ప్రకటనలు ముందుగా ఎన్నికల సంఘానికి చూపించి అనుమతి తీసుకోవాలి.
  9. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు.

ప్రశ్న 7.
ఓటింగ్ ప్రక్రియ రోజు జరిగే తంతును వివరించండి.
జవాబు:
జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ‘ప్రిసైడింగ్ ఆఫీసర్’ను నియమిస్తారు. ఇతనికి సహాయంగా మరికొంత మందిని ‘పోలింగ్ ఆఫీసర్స్’ గా నియమిస్తారు. ఇంకొంత మందిని పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమిస్తారు. పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న ఓటర్లందరినీ ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు. ఓటుహక్కును వినియోగించుకోబోతున్నవారి ఎడమచేతి చూపుడువేలిపై చెరిగిపోని (ఇండెలిబుల్) సిరాగుర్తు పెడతారు. ఈ.వి.యం.లు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడుతుంటే బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ (2) ముద్రవేసి, నిర్ణీత విధంగా మడిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు.

పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవియం/బ్యాలెట్ పెట్టెలకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.

ప్రశ్న 8.
ఎన్నికలలో ఉపయోగించే ఇండెలిబుల్ ఇంక్ గురించి రాయండి.
జవాబు:
ఎన్నికల సిరా :
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 3
ఎన్నికలలో అక్రమాలు, ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు చూపుడు వేలిపై చెరిగిపోని సిరాతో గుర్తు పెట్టే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ సిరాను ఎన్నికల కమిషన్ అన్ని పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ సిరా లేనిదే ఎన్నికల తంతు ముగియదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది. థాయ్ లాండ్, సింగపూర్, నైజీరియా, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మనదేశంలో తయారయ్యే ఇండెలి బుల్ ఇంకును సరఫరా చేస్తున్నారు. మన దేశంలో మైసూరు, హైదరాబాద్ నగరాల్లో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.

ప్రశ్న 1.
మొదటి లోకసభ ఎన్నికలు, 1952

పార్టీలు గెలుపొందిన సీట్లు
కాంగ్రెస్ 364
కమ్యూనిస్టు మరియు మిత్ర పార్టీలు 23
సోషలిస్టులు 12
కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ 9
జనసంఘ్ 3
హిందూ మహాసభ 4
రామ రాజ్య పరిషత్ 3
ఇతర పార్టీలు 30
స్వతంత్రులు 41
మొత్తం 489

ఎ. మొదటి లోకసభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
బి. సమానమైన సంఖ్యలో సీట్లు గెలుపొందిన పార్టీలు ఏవి?
సి. లోక్ సభ ఎన్నికల్లో రెండవ స్థానం పొందిన పార్టీ ఏది?
డి. మొదటి లోకసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది?
జవాబు:
ఎ) మొదటి లోకసభ ఎన్నికలు 1952వ సం||లో జరిగాయి.

బి) సమానమైన సంఖ్యలో సీట్లు గెలుపొందిన పార్టీలు

  1. జనసంఘ్
  2. రామరాజ్య పరిషత్

సి) లోక్ సభ ఎన్నికలలో రెండవ స్థానంలో ఉన్న పార్టీ – స్వతంత్ర అభ్యర్థులు

డి) మొదటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది.

ప్రశ్న 2.
కింది సమాచారాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

లోకసభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఓటుహక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం
1952 46%
1957 48%
1962 55%
1967 61%
1971 55%
1977 60%
1980 57%
1985 64%
1989 62%
1991 56%
1996 58%
1998 62%
1999 59%
2004 58%
2009 58%

ఎ) ఓటు హక్కును ఉపయోగించుకున్న ఓటర్ల శాతం సంతృప్తికరంగా ఉన్నదా? మీ అభిప్రాయం రాయండి.
బి) ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లశాతం పెరిగేటందుకు తీసుకోదగిన కొన్ని చర్యలను సూచించండి.
సి) 16వ లోకసభ ఎన్నికలు ఏ సం||లో జరిగాయి?
డి) 1977 ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలనాకాలం గురించి మీ పరిశీలన తెలపండి.
జవాబు:
ఎ) ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లశాతం సంతృప్తికరంగా లేదు. 80% మంది ఓటర్లు అన్నా తమను పరిపాలించే నాయకులను ఎన్నుకోవాలి అనేది నా అభిప్రాయం.
బి) ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల శాతం పెరగాలంటే ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి. మరియు ఓటు యొక్క ప్రాధాన్యతను, విలువను వివరించాలి.
సి) 2014లో 16వ లోకసభ ఎన్నికలు జరిగాయి.
డి) 1977లో ఎన్నుకోబడిన ప్రభుత్వ పరిపాలనా కాలం కేవలం 3 సం||లు మాత్రమే. ఎన్నుకోబడిన పార్టీల నాయకులలో ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణం.

ప్రశ్న 3.

సంవత్సరం ప్రాముఖ్యత
1931 కరాచీ సమావేశం
1937 బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు
1946, జులై రాజ్యాంగసభకు ఎన్నికలు
1947, ఆగష్టు 15 భారతదేశ స్వాతంత్ర్యం
1947, ఆగష్టు 29 రాజ్యాంగ రచనా సంఘం ఏర్పాటు
1949, నవంబర్ 26 రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదం
1950, జనవరి 26 రాజ్యాంగం అమలులోకి రావటం
1952 తొలి సాధారణ ఎన్నికలు

పట్టికను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
2) 1946 – 1950 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలు ఏవి?
3) భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
4) ఎవరి ఆమోదంతో రాజ్యాంగం అమలులోకి వచ్చింది?
జవాబు:

  1. రాజ్యాంగ సభకు ఎన్నికలు 1946, జులైలో జరిగాయి.
  2. 1946-50 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలు
    1. రాజ్యాంగ సభకు ఎన్నికలు
    2. భారతదేశ స్వాతంత్ర్యం
    3. రాజ్యాంగ రచనా సంఘం ఏర్పాటు
    4. రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదం
  3. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుండి అమలులోనికి వచ్చింది.
  4. రాజ్యాంగ సభ ఆమోదంచే రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
వివిధ రాష్ట్రాలలో ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి గుర్తులు, ఆయా పార్టీ నాయకులు మొదలగు వివరాలతో కూడిన ఆల్బమ్ ను తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 4 AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 5

ప్రశ్న 2.
స్వతంత్ర భారతదేశంలో లోకసభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్టీలు, నిర్వహించిన ఎన్నికల సంఘం అధికారి సమాచారాన్ని సేకరించి పట్టికలో రాయండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 6

AP 8th Class Social Important Questions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

AP 8th Class Social Important Questions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

These AP 8th Class Social Important Questions 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 will help students prepare well for the exams.

AP Board 8th Class Social 11Bth Lesson Important Questions and Answers జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 1.
భగత్ సింగ్ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు సేకరించి ఒక వ్యాసం రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం మలి దశ 1919 – 1947 3
భగత్ సింగ్ : జననం: 28-9-1907, మరణం : 23-3-1931

భగత్ సింగ్ భారతదేశంలో జాతీయవాది, తిరుగుబాటుదారుడు, విప్లవవాది. ఈయనను షహీద్ అని పిలిచేవారు. ఈయన ఐరోపా విప్లవాలను చదివి ప్రభావితుడైనాడు.

లాలాలజపతిరాయను చంపినందుకు ప్రతీకారంగా బ్రిటిషు పోలీసు అధికారి ‘శాండర్’ ను కాల్చి చంపాడు. తన స్నేహితుడైన భటుకేశ్వర్‌తో కలిసి కేంద్ర విధానసభలో రెండు బాంబులను, కరపత్రాలను జారవిడిచాడు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాన్ని అరచి చెప్పాడు.

తరువాత కోర్టులో తమ వారిని విడిపించడానికి తనే స్వచ్చందంగా అరెస్టు అయ్యాడు. ఈ సమయంలో జైలుకెళ్ళి అక్కడ 116 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఈ సమయంలో షహీదకు భగత్ సింగ్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. కాని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దానిని కూడా 23 సం||రాల వయస్సులో నవ్వుతూ భరించాడు.

ప్రశ్న 2.
ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.

రెండవ ప్రపంచ యుద్ధం (1939 – 1945)

హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యాలతో అమెరికా చేతులు కలిపింది. (వీటిని మిత్ర కూటమి అంటారు). జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. మానవ చరిత్రలోనే అతి దారుణమైన ఈ యుద్ధం 1939లో మొదలయ్యి 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ ని చేజిక్కించుకోవటంతో, జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్చల పక్షాన ఉన్న ప్రజలందరూ హిట్లరిని వ్యతిరేకించి మిత్ర కూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులలో ఇది సందిగ్ధతలను నెలకొల్పింది.

1. హిట్లర్ పార్టీ పేరు?
జవాబు:
నాజీ పార్టీ.

2. మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.

3. ఇటలీ మద్దతు ఎవరికుంది?
జవాబు:
ఇటలీ మద్దతు జర్మనీకి ఉంది.

4. జపాన్లో అణుబాంబులు పదిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.

5. హిట్లర్ ప్రజాస్వామ్యవాదా లేక నిరంకుశుడా?
జవాబు:
హిట్లర్ నిరంకుశుడు.

AP 8th Class Social Important Questions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 3.
భారతదేశంలో 1906 నాటి నుండి బయలుదేరిన హిందూ-ముస్లిం భేదభావాలు విభజన జరిగాక సమసిపోయాయా? నీ సమాధానానికి కారణాలు రాయండి.
జవాబు:
భారతదేశం విభజనకు గురి అయినా, ఈ భేదభావాలు సమసిపోలేదు అని నా అభిప్రాయం.

కాశ్మీరు ఆక్రమణ, కార్గిల్ యుద్ధం, పార్లమెంట్ పై దాడి, ముంబయిపై దాడులు, హైదరాబాదులోని లుంబినీ పార్కు గోకుల్ ఛాట్, దిల్‌షుఖ్ నగర్ పై దాడులు ఈ విషయాన్ని ఋజువు చేస్తున్నాయి.

ప్రశ్న 4.
రెండవ ప్రపంచ యుద్ధం భారతీయులలో ఎందుకు సందిగ్ధత నెలకొల్పింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రకూటమి, మిత్రరాజ్యాలు అని ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి యుద్ధం చేశాయి. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛనీ బలపరిచే ప్రజలందరూ హిట్లర్ ను వ్యతిరేకించి మిత్రకూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులు సందిగ్ధంలో పడ్డారు.

ప్రశ్న 5.
మతతత్వం, లౌకికవాదంలోని సున్నితమైన అంశాలను వివరించండి.
జవాబు:
అందరి ప్రయోజనాల గురించి కాక ఒక ప్రత్యేక మతస్తుల ప్రయోజనాలను మతతత్వం ప్రోత్సహిస్తుంది. ఆ మతస్తుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని నడపాలని అది నమ్ముతుంది. ఇందుకు విరుద్ధంగా చిన్న సమూహాలకంటే జాతి పెద్దదని, ఏ మతమూ లేనివాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను జాతీయతావాదం కోరుకుంటుంది. ఈ దృక్పథాన్ని “లౌకిక” దృక్పథం అంటారు. మతసంబంధ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోగూడదు. అలాగే ప్రభుత్వంలో మతాలు జోక్యం చేసుకోగూడదని ఇది భావిస్తుంది. ఏ ఒక్క మతానికో ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈ విధంగా లౌకిక దృక్పథం, మతతత్వం విరుద్ధ అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మతతత్వం ఒక ప్రత్యేక మత ప్రయోజనాల కోసం పాటుపడుతుంది. ఆ మతం అవసరాల , ప్రకారం ప్రభుత్వం కూడా నడుచుకోవాలని కోరుతుంది.

ప్రశ్న 6.
సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:
సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని’ (ఐఎన్ఏ) ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. 1943 అక్టోబరు 21న సింగపూర్‌లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి’ నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది.

1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగరవేశారు. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవటంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుంచి టోక్యో 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.

ప్రశ్న 7.
బ్రిటిషువారు భారతదేశంను వదలిపోవటానికి విప్లవవాదులు, వారి యుగం సహకరించింది. వివరించండి.
జవాబు:
1940ల తరువాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాల వంటి విప్లవవాద సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇవి పేదలు, సన్నకారురైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులను సమీకరించి బ్రిటిషు పాలన పైనే కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, కర్మాగార యజమానులు, ఉన్నతకుల భూస్వాములు వంటి స్థానిక దోపిడీదారులకు వ్యతిరేకంగా సంఘటిత పరచసాగారు. నూతన స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల ప్రయోజనాలకు సరైన చోటు కల్పించాలని, తరతరాల వాళ్ల కష్టాలు అంతం కావాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఈ సంస్థలు కోరుకున్నాయి. అప్పటివరకు ధనిక వర్గాలు అధికంగా ఉన్న స్వాతంత్ర్యోద్యమం వీళ్ల చేరికతో కొత్త కోణాన్ని, శక్తినీ సంతరించుకుంది. బ్రిటిషు పాలకులు అంతిమంగా దేశం వదిలి వెళ్లటానికి ఇది. సహకరించింది.

ప్రశ్న 8.
సుభాష్ చంద్రబోస్ ఎవరు?
జవాబు:
ఆయన స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది.

ప్రశ్న 9.
‘ఆజాద్ హింద్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
స్వతంత్ర భారతం అని అర్ధం.

AP 8th Class Social Important Questions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 10.
మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.

ప్రశ్న 11.
జపాన్లో అణుబాంబులు పడిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.

ప్రశ్న 12.
క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్రాయండి.
జవాబు:
భారతదేశ ప్రజలను, సంపదను రెండవ ప్రపంచ యుద్ధానికి ఉపయోగించుకోవాలని బ్రిటన్ అనుకుంది. యుద్ధంలో మద్దతుకు బదులుగా భారతదేశానికి స్వయంపాలనా అధికారాన్ని ఇవ్వాలని కాంగ్రెసు కోరుకుంది. ఈ కోరికను అంగీకరించటానికి బ్రిటన్ ఎంత మాత్రమూ సిద్ధంగా లేదు. 1942 ఆగష్టు 8న బొంబాయిలో కాంగ్రెసు కార్యవర్గం సమావేశమయ్యి భారతదేశంలో బ్రిటీషు పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి గాంధీజి ఎంతో విలువైన సందేశమిచ్చాడు. ‘ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి. స్వతంత్రులైనట్లు వ్యవహరించాలి. సంపూర్ణ స్వాతంత్ర్యం తప్పించి మరి దేనికీ నేను సిద్ధంగా లేను. అందరం ఉద్యమించి భారతదేశాన్ని విముక్తం చేద్దాం లేదా ఆ ప్రయత్నంలో చనిపోదాం”.

1942 ఆగస్టు 9 ఉదయానికే గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా అజాద్, ఆచార్య కృపలనీ, రాజేంద్ర ప్రసాద్ వంటి అనేకమంది కాంగ్రెసు నాయకులను ప్రభుత్వం జైలుపాలు చేసింది. దేశవ్యాప్తంగా హర్తాళ్ లు, సమ్మెలు, ప్రదర్శనల రూపంలో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఉద్యమం హింసాత్మక మలుపు తీసుకుంది. శ్రామికవర్గం కర్మాగారాలను బహిష్కరించింది. పోలీసుస్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రభుత్వ ఆస్తులపై విద్యార్థులు దాడులకు దిగారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను కోసేశారు. రైల్వే పట్టాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, సైనిక వాహనాలు, రైల్వే బోగీలను తగలబెట్టారు. ఈ సమయంలో మద్రాసు, బొంబాయి తీవ్రంగా ప్రభావితమయ్యా యి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో బ్రిటిషు అధికారం కనపడకుండా పోయింది. 1942-44 మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు.

ప్రశ్న 13.
గాంధీ, జిన్నా వంటి నాయకులు రౌలట్ చట్టాన్ని “రాక్షసచట్టం”గా విమర్శించారు. ఎందువలన?
జవాబు:
గాంధీ, జిన్నా వంటి నాయకులు రౌలట్ చట్టాన్ని రాక్షస చట్టంగా విమర్శించారు. ఎందుకంటే 1919లో బ్రిటిషు ప్రభుత్వం చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చాడు. భావ ప్రకటన స్వేచ్ఛవంటి మౌలిక హక్కులను కాలరాసే విధంగా పోలీసులకు అధికారాలను ఈ చట్టం కల్పించింది. ఎవరినైనా ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్ళను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. ఒకవేళ విచారణ జరిగినా అది చాలా రహస్యంగా సాగి తనకు వ్యతిరేకంగా రుజువులు ఏమున్నాయో ఆరోపణలకు గురైన వ్యక్తికి కూడా తెలియదు. ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, ఇతర నాయకులు భావించారు. ఇది చాలా నిరంకుశత్వ, రాక్షస’ చట్టమని వాళ్ళు విమర్శించారు.

AP 8th Class Social Important Questions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 14.
సహాయనిరాకరణ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ అర్ధాంతరంగా ఆపివేశాడు. దీనికి గల కారణాన్ని తెలపండి.
జవాబు:
1922వ సం||లో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుచున్న కాలంలో చౌరీచౌరాలో రైతుల గుంపు పోలీస్ స్టేషనుకు నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ అర్థాంతరంగా ఆపివేశారు. దానికి కారణం మహాత్మా హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకి.

AP 8th Class Social Important Questions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

AP 8th Class Social Important Questions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

These AP 8th Class Social Important Questions 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 will help students prepare well for the exams.

AP Board 8th Class Social 11Ath Lesson Important Questions and Answers జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 1.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

మరుసటి సంవత్సరం (1905) కాంగ్రెస్ సమావేశంలో అతివాద జాతీయ నాయకులైన తిలక్, బిపిన్ చంద్రపాల్, లజ్ పత్ రాయ్ వంటి వాళ్లు, బెంగాల్ విభజన రద్దు చేయమనే కాకుండా సంపూర్ణ స్వాతంత్ర్యం, అంటే ‘స్వరాజ్యం’ కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని భావించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను’ అనే ప్రఖ్యాత నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చాడు. ఇంతకు ముందులాగా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వటం కాకుండా బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి దేశం విడిచి వెళ్లిపోయేలా చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంతకు ముందు చేపట్టిన విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల వాళ్లని ‘అతివాద జాతీయవాదులు’ అని పిలవసాగారు.
1. ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
జవాబు:
తిలక్, బిపిన్ చంద్రపాల్.

2. స్వరాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.

3. తిలక్ నినాదం ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను.

4. మితవాదుల విధానాన్ని వీరు ఎలా వర్ణించారు?
జవాబు:
వీరు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.

5. మితవాదులు ఏం చేశారు?
జవాబు:
వారు బ్రిటిషు వారికి వినతిపత్రాలు సమర్పించారు.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి ఒక అర్థవంతమైన ‘ప్రశ్న’ను రాయుము.

7వ తరగతిలో మీరు 1857 తిరుగుబాటు గురించి చదివారు. దీంట్లో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా సైనికులు, సాధారణ రైతులు, చేతివృత్తుల వాళ్లు, రాజులు సైతం చేతులు కలిపారు. ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనను వ్యతిరేకించింది కానీ దేశానికి ఒక కొత్త దార్శనికతను అది ఇవ్వలేకపోయింది. వాస్తవానికి అది పాతకాలపు రాజులు, రాణుల పాలనను, కుల ఆధారిత సమాజాన్ని కోరుకుంది.
జవాబు:
ప్రశ్న : 1857 విప్లవం ఎందుకు విఫలమయ్యింది?

AP 8th Class Social Important Questions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 3.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

మచిలీపట్నం నుండి కృష్ణా పత్రిక.

కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. దాని స్థాపకులలో ముట్నూరు కృష్ణారావు ఒకరు. అతను 1902లో ఆ పత్రికకు ఉపసంపాదకుడిగా చేరాడు. 1907లో దాని సంపాదకుడై 1945లో అతడు చనిపోయే దాకా పత్రిక కోసం కృషి చేసాడు. వందేమాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసింది.
1. కృష్ణా పత్రికను ఎక్కడ స్థాపించారు?
జవాబు:
మచిలీపట్నంలో

2. కృష్ణా పత్రిక స్థాపకులెవరు?
జవాబు:
ముట్నూరు కృష్ణారావు.

3. ఉపసంపాదకుడిగా కృష్ణారావు ఎప్పుడు పనిచేశారు?
జవాబు:
1902

4. కృష్ణారావు ఎప్పుడు చనిపోయాడు?
జవాబు:
1945

5. స్వాతంత్ర్య ఉద్యమంలో కృష్ణా పత్రిక పాత్ర?
జవాబు:
క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రజా చైతన్యం.

ప్రశ్న 4.
‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు?
జవాబు:
‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 5.
స్వదేశీ వల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి?
జవాబు:

  1. రాజకీయ రంగం
  2. సామాజికరంగం
  3. వ్యాపారరంగం (జాతీయ)
  4. పారిశ్రామికరంగం
  5. విదేశీ వ్యాపారరంగం
  6. ఆధ్యాత్మికరంగం
  7. విద్యారంగం
  8. సాంస్కృతికరంగం
  9. న్యాయ రంగం

ప్రశ్న 6.
ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
జవాబు:
తిలక్, బిపిన్ చంద్రపాల్.

ప్రశ్న 7.
స్వరాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.

ప్రశ్న 8.
తిలక్ నినాదం ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరతాను.

ప్రశ్న 9.
మితవాదుల విధానాన్ని అతివాదులు ఎలా వర్ణించారు?
జవాబు:
అతివాదులు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.

ప్రశ్న 10.
మితవాదులు ఇద్దరి పేర్లు రాయండి?
జవాబు:
గోపాలకృష్ణ గోఖలే, సుబ్రమణ్యం అయ్యంగార్.

AP 8th Class Social Important Questions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 11.
హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు.
జవాబు:
తిలక్ మరియు అనిబి సెంట్.

ప్రశ్న 12.
ఫ్లో చార్టు
AP 8th Class Social Important Questions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 1
ఎ) అతివాదుల ముఖ్య లక్ష్యం ఏమిటి?
బి) జాతీయోద్యమంలో విన్నపాలు, అర్జీలు అనే విధానాలు అనుసరించిన నాయకులు ఎవరు?
సి) స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదించినది ఎవరు?
డి) స్వాతంత్ర్య సమపార్జనకు గాంధీజీ అనుసరించిన విధానాలు ఏవి?
జవాబు:
ఎ) సంపూర్ణ స్వరాజ్యం సాధించడం అతివాదుల లక్ష్యం. .
బి) జాతీయోద్యమంలో విన్నపాలు, అర్జీలు అనే విధానాలు అనుసరించినవారు మితవాద నాయకులు.
సి) ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని చాటినవారు బాలగంగాధర్ తిలక్.
డి) స్వాతంత్ర్య సముపార్జనకు గాంధీజీ అనుసరించిన విధానాలు :

  1. సత్యం
  2. అహింస
  3. సత్యాగ్రహం.

ప్రశ్న 13.
వందేమాతరం ఉద్యమం గురించి వివరించండి.
జవాబు:

  1. 1903లో బెంగాల్ ను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని కర్జన్ చేసిన ప్రతిపాదన జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది.
  2. బెంగాల్ ప్రజలను విడదీసి, జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు.
  3. పెద్ద ఎత్తున సామూహిక నిరసనలు, అభ్యర్థనలు, ప్రచారం జరిగాయి. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 1905లో బెంగాలను విభజించింది.
  4. విదేశీ వస్త్ర, ఉప్పు బహిష్కరణకు పిలుపునిచ్చారు. దేశమంతటా ప్రధాన పట్టణాలు, నగరాలలో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ వంటివి సర్వసాధారణమై పోయాయి.
  5. ప్రభుత్వ సంస్థలయిన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు
  6. బెంగాల్ విభజింపబడిన 1905 అక్టోబరు 16న విషాద దినంగా పాటించారు. ఆ రోజు బెంగాల్ లో ఎవరూ వంట చెయ్యలేదు. దుకాణాలు అన్నింటిని మూసివేశారు.
  7. కలకత్తాలో హర్తాళ్ ప్రకటించారు. ప్రజలు గంగానదిలో స్నానం చేసి ‘వందేమాతరం’ పాడుతూ వీధుల్లో ఊరేగారు.
  8. బెంగాల్ రెండు భాగాల ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు.

AP 8th Class Social Important Questions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

AP 8th Class Social Important Questions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

These AP 8th Class Social Important Questions 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 10th Lesson Important Questions and Answers బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 1.
శిస్తు అనగానేమి?
జవాబు:
శిస్తు :
వ్యక్తులు రైతులు తమ స్వంత భూమిలో పంట పండించి దానికిగాను జమీందార్లకు, ప్రభుత్వానికి చెల్లించే దానిని ఆశిస్తు అంటారు.

ప్రశ్న 2.
కౌలు అనగానేమి?
జవాబు:
కౌలు :
వ్యక్తులు రైతులు ఇతరుల భూములను తీసుకుని పంట పండించుతారు. దీనికి గాను వారు భూమి యజమానికి చెల్లించే దానిని కౌలు అంటారు.

ప్రశ్న 3.
దొరలు అని ఎవరి అంటారు?
జవాబు:
పెద్ద పెద్ద భూస్వాములను దొరలు అంటారు. వీరు గ్రామానికి పెద్ద దిక్కులు. అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు వీరికి ఉండేవి.

AP 8th Class Social Important Questions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 4.
భూస్వాములు అంటే ఎవరు?
జవాబు:
భూస్వాములు దొరల అధికారానికి లోబడి పని చేసేవారు. భూస్వాములు దొరల మాటని విని తీరవలసిందే.

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

These AP 8th Class Social Important Questions 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 9th Lesson Important Questions and Answers ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 1.
“మౌలిక ప్రజా సౌకర్యాలు” శీర్షిక కింద గల మొదటి పేరా చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

జీవనానికి, మంచి ఆరోగ్యానికి నీళ్లు తప్పనిసరి. మన రోజువారీ అవసరాలకు నీళ్లు కావాలి. రక్షిత మంచినీటి ద్వారా అనేక రోగాలను నివారించవచ్చు. నీళ్ల వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి రోగాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజూ నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతే, అందులో చాలామంది 5 సంవత్సరాల లోపు పిల్లలే. ప్రజలకు రక్షిత మంచినీరు అందుబాటులో ఉంటే ఇలాంటి మరణాలు నివారించవచ్చు. మీ ప్రాంతంలో ఏదైనా రక్షిత మంచినీటి సదుపాయం ఉందా? వివరించండి. మా ఊరు ఖానాపూర్’ మండలంలో ఉన్న హుస్నాబాద్ గ్రామం. ఇక్కడ రెండు చెరువులున్నాయి. ఒక చెరువులో ఉన్న నీరును శుద్ధిచేసి ట్యాంకుకు ఎక్కిస్తారు. అక్కడి నుండి ఊరందరికీ మంచినీరు సరఫరా అవుతుంది. ఇలా చేయడం మూలంగా మేమందరం నీటి వలన వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడబడుతున్నాం. ఈ సరఫరా మొత్తంను మా పంచాయితీ వారే చూసుకుంటారు.

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, ఒక ప్రశ్నను తయారుచేయుము.

ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 ఆధారంగా మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. “ఆకలి, పోషకాహారలోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి. మానవజాతి పురోభివృద్ధికి ఇది ఎంతో అవసరం. మెరుగైన పోషకాహారం ఉంటే రోగనిరోధకశక్తి బాగా ఉంటుంది, రోగాలు తక్కువగా ఉండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో అయిదేళ్లలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలలో రెండింట ప్రతి ఒకదానికి (53 శాతానికి) పోషకాహారలోపమే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయిదు సంవత్సరాల లోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్లు 33 శాతం ఉన్నారు….. 31 శాతం మహిళలు, 25 శాతం పురుషులు పోషకాహారలోపానికి గురవుతున్నారు,” అని ఈ నివేదిక పేర్కొంటోంది.
ప్ర. మానవజాతి పురోభివృద్ధికి ఏది అవసరం?

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 3.
ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ప్రభుత్వ ఆసుపత్రులు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీచేసి ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయిస్తోంది. దీన్ని ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకుని ఉండవచ్చు.

ప్రశ్న 4.
మలేరియా నివారణకు తీసుకోవలసిన రెండు చర్యలు రాయండి.
జవాబు:

  1. మలేరియా నివారణకు ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. దోమ తెరను వాడాలి.
  3. ‘ఓడోమాస్’ లాంటి క్రిములను ఒంటికి రాయాలి.

ప్రశ్న 5.
మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల జాబితా రాయండి. (వీటిల్లో ఏదో ఒకదానికి వెళ్లి) మీ అనుభవంలో అక్కడ లభ్యమయ్యే సదుపాయాలు, దానిని నిర్వహించే వాళ్ల గురించి రాయండి.
జవాబు:
మాకు దగ్గరలో ఇందుపల్లిలో ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఇంకొంచెం దూరంలో ఉంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. మా ఊరిలో ఒక RMP నడిపే ఆసుపత్రి ఉన్నది.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక ప్రజాసౌకర్యాలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు

  1. మంచినీటి సరఫరా
  2. ఆరోగ్య సేవలు
  3. పారిశుద్ధ్యం
  4. విద్యుత్తు
  5. ప్రజా రవాణా
  6. పాఠశాలలు మొ||నవి.

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
గ్రామీణ ప్రాంతంలో వైద్యం కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చర్చించండి?
జవాబు:
గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వైద్యం కోసం ఈ క్రింది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

  1. గ్రామీణ ప్రాంతంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు.
  2. ప్రాథమిక చికిత్సా కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు ఏమీ లభించవు.
  3. రక్త పరీక్ష, ఎక్సరే, మొదలగు సదుపాయాలు కూడా ఏమీ ఉండవు.
  4. మందులు కూడా అన్ని రకాలు లభించవు.
  5. అత్యవసర పరిస్థితులలో కూడా అంటే ప్రాణాపాయస్థితిలో కూడా వారు దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్ళాలి.
  6. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు కూడా ఉండవు.

AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

These AP 8th Class Social Important Questions 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 8th Lesson Important Questions and Answers జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 1.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించండి.
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 4
తాడికాయను వత్తుతున్న కోయ స్త్రీ, పురుషుడు
జవాబు:
ఈ చిత్రంలో ఉన్నవారిద్దరు ఒక కోయ జంట. పురుషుని ఒంటి మీద వస్త్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్త్రీ ఒంటి మీద కూడా తక్కువగా ఉన్నాయి. ఇది వారి పేదరికాన్ని తెలియచేస్తోంది. వారు కోయవారని తెలుస్తోంది. వారు గుడిసెలో నివసిస్తారని, ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉందని తెలుస్తోంది. వారు కోళ్ళను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది. స్త్రీ రెండు దుంగల మధ్య తాటిపండును ఉంచింది. పురుషుడు తన బలం కొద్దీ పై దుంగను కిందకి వత్తుతున్నాడు. దీని మూలంగా తాటిపండులోని రసం కింద నున్న కుండలోనికి జారుతుంది. దీనినుపయోగించి వారు తాటి తాండ్రను తయారుచేస్తారు.

ప్రశ్న 2.
ఈ పాఠంలోని సాంకేతిక అంశాల్లో నిమగ్నమైన అనేక మహిళల చిత్రాలున్నాయి. పై చిత్రంలో వలె అనేక మంది మహిళలు ఇంజనీరింగ్ డిగ్రీ లేనివాళ్లే. మహిళలు ఇంజనీరింగ్ విద్య చదవటం పట్ల గల భిన్నాభిప్రాయాలపై తరగతి గదిలో చర్చించండి. ఉంటుందో అనే అంశంపై చర్చను తరగతి గదిలో నిర్వహించండి.
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 5
జవాబు:
“మహిళల చదువు భవితకు వెలుగు”.

డిగ్రీ అనేది వాళ్ళ జ్ఞానాన్ని నిర్ధారించడానికి ఇచ్చే రశీదు. అది లేనివాళ్ళు ఎంతోమంది ఎన్నోరంగాల్లో నిపుణులై ఉన్నారు. ఉదా : వ్యవసాయ విద్య నభ్యసించిన వాళ్ళ కన్నా ఎక్కువ జ్ఞానం పల్లెటూరు రైతుకి ఉంటుంది. వీరిది అనుభవం నుండి వచ్చిన జ్ఞానం.

ఇక మహిళలు విద్యావంతులైతే వారు ఇంకా పై స్థాయికి ఎదుగుతారు. ఉన్నత ఉద్యోగాలను, పదవులను అలంకరిస్తారు. వారి కుటుంబానికి అంతటికీ చదువునిస్తారు. సంసారాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి నడిపిస్తారు.

ప్రశ్న 3.
ఈ కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానమిమ్ము.

ఆవిరియంత్రం వల్ల కర్మాగారంలో పని విధానం పూర్తిగా మారిపోయింది. ఆ తరవాత విద్యుత్తు వంటి కొత్త ఇంధన వనరుల వల్ల ఈనాడు మనం చూస్తున్న కర్మాగారాలు ఆవిర్భవించాయి. ఒక కొత్త యంత్రాన్ని, లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు. అయితే ఈ ఆలోచనలు రోజువారీ ఉపయోగంలోకి రావటానికి ఎంతో సమయం పడుతుంది. ఇది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి సాంకేతిక విజ్ఞానం మెరుగుపరచటం కావచ్చు, కొత్త విధానాలు ఖర్చు తగ్గించటం కావచ్చు లేదా కొత్త ఉత్పత్తులకు, విధానానికి ఆమోదం లభించటం కావచ్చు. సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి లేదా పెరుగుదల పూర్తిగా కొత్త యంత్రాల వల్ల (ఎక్స్ రే యంత్రాలు, మర మగ్గాలు) రావచ్చు, ముడిసరుకులలో (రబ్బరుకు బదులు ప్లాస్టిక్) మార్పు వల్ల రావచ్చు, లేదా, ఉత్పత్తి ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ వల్ల రావచ్చు.
1. ఆవిరియంత్రం వల్ల ఏం జరిగింది?
జవాబు:
ఆవిరియంత్రం వల్ల కర్మాగారంలో పని విధానం మారిపోయింది.

2. కర్మాగారాల ఆవిర్భవానికి కారణమేమి?
జవాబు:
విద్యుత్తు వంటి కొత్త ఇంధన వనరులు కర్మాగారాల ఆవిర్భవానికి కారణం.

3. ఆవిష్కరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.

4. ఏవేని రెండు యంత్రాల పేర్లను రాయండి.
జవాబు:
ఎక్స్ రే యంత్రాలు, మర మగ్గాలు.

5. రబ్బరుకు బదులుగా ఏది వాడవచ్చు?
జవాబు:
రబ్బరుకు బదులుగా ప్లాస్టిక్ ను వాడవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 4.
సేవారంగంలోకి వచ్చే అంశాలు ఏవి? దీనిలో సాంకేతిక విజ్ఞానం మార్పు ఏమి?
జవాబు:

  1. వ్యవసాయం, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవి. సేవారంగంలోనికి వస్తాయి.
  2. అన్ని వ్యాపార కార్యకలాపాలు సేవారంగంలోనికి వస్తాయి.
  3. నేరుగా ఉతుతికి దోహదం చేయని అత్యవసర కార్యక్రమాలు కూడా సేవారంగం కిందకి వస్తాయి.
  4. సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవారంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
  5. సాంకేతిక విజ్ఞానంలో మార్పువల్ల సమాచారం వేగంగా అందుతుంది. అందరికీ తేలికగా అందుబాటులోకి వస్తుంది.

ప్రశ్న 5.
మొబైల్ ఫోన్ల వలన 2 లాభాలు, 2 నష్టాలు పేర్కొనుము.
జవాబు:
లాభాలు:

  1. ఇవి మనుషులను దగ్గర చేస్తున్నాయి.
  2. అత్యవసర సమాచారాల్ని సెకన్లలో తెలుసుకోగలుగుతున్నారు.

నష్టాలు :

  1. వీటి వినియోగం బాల్యాన్ని కలుషితం చేస్తోంది.
  2. వీటి వినియోగం శరీరానికుండే విద్యుదయస్కాంత తరంగాలకు అంతరాయం కలిగిస్తుంది.

ప్రశ్న 6.
ఈ కింది మహిళలను ప్రశంసించండి.
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 6
జవాబు:
ఎడమవైపు చిత్రంలోని మహిళలు తమ సాంప్రదాయ వేషధారణలోనే ఉండి రేడియోలను మరమ్మతు చేస్తున్నారు. వీరు తమ పని సమయంలో తమ పిల్లలను కూడా తమ వెంట ఉంచుకున్నారు. వారు పనిలో, చూపే ఏకాగ్రత చాలా బాగుంది.

కుడివైపు చిత్రంలో మహిళలందరూ తెల్లని వస్త్రాలు, టోపీలు ధరించి శాంతికి మారు పేరులా ఉన్నారు. వారు ఎంతో పద్ధతిగా ఒక వరుసలోనే కూర్చుని పనిచేసే విధానం పని పట్ల వారికున్న నిబద్ధతను తెలియచేస్తోంది.

“మహిళా శక్తి జిందాబాద్ !”

ప్రశ్న 7.
వరికోత యంత్రాలు వినియోగించటంలో గల రెండు ప్రయోజనాలను రాయండి.
జవాబు:
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు:

  1. ఇది సకాలంలో పంటను కోస్తుంది.
  2. ధాన్యం నూర్పిడి చేసి, పోత పోసి గింజ – పొల్లును వేరుచేస్తుంది.
  3. పంటకోత తక్కువ కాలంలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో యువతకు కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు, టెలిఫోన్ బూత్ లలో ఆపరేటర్లు, మొబైల్ ఫోన్ల అమ్మకందారులు, మరమ్మతుదారులు, రీచార్జ్ / టాప్-అప్ చేయువారు మొదలైన కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 9.
ఆవిష్కరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.

ప్రశ్న 10.
ఏవేని రెండు యంత్రాల పేర్లను రాయండి.
జవాబు:
ఎక్స్ రే యంత్రాలు, మరమగ్గాలు.

ప్రశ్న 11.
రబ్బరుకు బదులుగా ఏది వాడవచ్చు?
జవాబు:
రబ్బరుకు బదులుగా ప్లాస్టిక్ ను వాడవచ్చు.

ప్రశ్న 12.
మొబైల్ ఫోన్ల వలన రెండు లాభాలు పేర్కొనుము.
జవాబు:
లాభాలు :

  1. ఇవి మనుషులను దగ్గర చేస్తున్నాయి.
  2. అత్యవసర సమాచారాల్ని సెకన్లలో తెలుసుకోగలుగుతున్నారు.

AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 13.
మొబైల్ ఫోన్ల వలన రెండు నష్టాలు పేర్కొనుము.
జవాబు:
నష్టాలు :

  1. వీటి వినియోగం బాల్యాన్ని కలుషితం చేస్తోంది.
  2. వీటి వినియోగం శరీరానికుండే విద్యుదయస్కాంత తరంగాలకు అంతరాయం కలిగిస్తుంది.

ప్రశ్న 14.
సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ జీవితంలో మార్పులు వచ్చాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానం వలన మానవ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.

  1. సాంకేతిక విజ్ఞానాన్ని మన జీవితంలో మనం ప్రతిక్షణం వినియోగించుకుంటూనే ఉన్నాం.
  2. టి.వి. పెట్టినా, మొబైల్ ఫోన్లో మాట్లాడినా, కంప్యూటర్ పై పని చేసినా, పెన్సిలు చెక్కినా, కూరగాయలు తరిగినా, కోసినా వేరువేరు పాత్రలలో వంట చేసినా మనం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించు కుంటున్నాం.

చివరిగా మనం చేసే పనిలో, మన జీవితంలో వచ్చే మార్పులన్నీ సాంకేతిక పరిజ్ఞానం ఫలితమే.

ప్రశ్న 15.
భారత,టెలి కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల వచ్చిన మార్పులను గురించి వివరించండి?
జవాబు:
భారత టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు

  1. ప్రభుత్వ కంపెనీయే కాకుండా అనేక ప్రైవేటు కంపెనీలు, లాండ్ లైన్, మొబైల్ ఫోను సేవలను అందిస్తున్నాయి.
  2. టెలీకమ్యూనికేషన్ సేవలలో ప్రైవేటు కంపెనీల వాటా పెరుగుతూ ఉంది.
  3. మొబైల్ ఫోనులు తయారుచేసే అనేక కంపెనీలు భారతదేశంలో నెలకొల్పబడుతున్నాయి.
  4. ఈ కంపెనీలు వీటిని ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
  5. టెలిఫోన్ మొబైల్ సాంకేతిక విజ్ఞానానిక కొత్త నైపుణ్యాలు కూడా అవసరం.
  6. బహుళ జాతి కంపెనీలలో, మొబైలు ఫోనులు తయారీలో, టెలిఫోన్ బూత్ లలో, మొబైల్ అమ్మకాలలో, మరమ్మత్తులలో రీఛార్జ్/టాప్-అప్ సేవలలో యువతకు కొత్త ఉపాధులు ఏర్పడ్డాయి.

ప్రశ్న 16.
భారతదేశ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తి పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 1
ఎ) ఇవ్వబడిన గ్రాఫ్ ఏ అంశాన్ని తెలియజేస్తుంది?
బి) ఏవేని రెండు ఆహారధాన్యాల పేర్లు రాయండి ?
సి) 1961-75 సంవత్సరాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
డి) 1976-90 నుండి 1991-2009 మధ్య ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని టన్నులు పెరిగింది?
జవాబు:
ఎ) ఇవ్వబడిన గ్రాఫ్ భారతదేశ వార్షిక ఆహారధాన్యాల ఉత్పత్తిని తెలియచేస్తుంది. .
బి) రెండు ఆహార ధాన్యాల పేర్లు వరి, జొన్న మొ||నవి.
సి) 1961-75 సం||రాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 101 మిలియన్ టన్నులు.
డి) 1976 – 90 నుండి 1991 – 2009 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 72 మిలియన్ టన్నులు పెరిగింది.

AP 8th Class Social Important Questions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 17.
“సాంకేతిక విజ్ఞానం అన్ని వేళలా స్వాగతించతగినది కాదు. కొత్త యంత్రాల ప్రవేశంతో తమ ఉద్యోగాలు పోతాయని ప్రజలు భయపడతారు”.
సాంకేతిక విజ్ఞానం నిరుద్యోగితకు దారితీస్తుందని మీరు భావిస్తున్నారా ! మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
సాంకేతిక, నిరుద్యోగితకు దారి తీస్తుంది అని భావించటానికి కారణాలు :

  1. వరికోత యంత్రం వలన కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు.
  2. ఇప్పటికే కంప్యూటర్ల ప్రవేశం అనేక ఉద్యోగాలను తొలగించి వేసింది.
  3. ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఏటియమ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సదుపాయాలతో బ్యాంకులకు ఎక్కువ మంది ఉద్యోగులతో అవసరం లేదు.
  4. ఏ విధంగా అయితే ట్రాక్టర్ల వాడకం పశువుల వాడకాన్ని తగ్గించి వేసిందో అదేవిధంగా ఉత్పత్తి ప్రక్రియలో మానవుల అవసరాన్ని సాంకేతికత తగ్గించి వేస్తున్నది.