AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

These AP 6th Class Social Important Questions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 8th Lesson Important Questions and Answers రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 1.
క్రింది వారిని గురించి నీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
1) మెగస్తనీస్ 2) కౌటిల్యుడు
జవాబు:
1) మెగస్తనీస్ :
మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాలపరిస్థితులు. వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం.

2) కౌటిల్యుడు :
కౌటిల్యుడిని ‘విష్ణుగుప్తుడు’ మరియు ‘చాణక్యుడు’ అని కూడా పిలుస్తారు. అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ‘అర్థశాస్త్రము’ అతను రచించిన ప్రముఖ గ్రంథం.

ప్రశ్న 2.
అశోకుని శిలాశాసనాల గురించి తెల్పండి. ఏదైనా ఒక శాసనం గురించి విపులంగా వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1
13వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగయుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ‘దిగువ శిలా శాసనాన్ని పరిశీలించండి. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ఈ కింది విధంగా భావించవచ్చును.

ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలమంది చని పోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను. దీనివలన నా వారసులు ఎవ్వరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు. (ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ‘దమ్మము’ అని పిలుస్తారు.)

అశోకుడు ఇలాంటి చాలా శిలాశాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెక్కించాడు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం. అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడి ఉన్న ధర్మ సూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారులను నియమించాడు.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుడు ప్రజల కొరకు చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలేవి?
జవాబు:
నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అనంతరం అశోకుడు రోడ్డుకు రెండువైపులా చెట్లు నాటించాడు. చెట్లు రోడ్లపై ప్రయాణించేవారికి నీడను ఇవ్వడంతోపాటు ఆకలితో ఉన్నవారికి పండ్లను ఇవ్వడం ద్వారా ఆకలిని తీర్చేవి. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బావులు తవ్వించాడు.

అశోకుని కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు కలవు. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతులు గల ప్రజలను కలిపాయి. రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి. విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. మనుషులు, జంతువులకు కూడా వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి.

ప్రశ్న 4.
శాతవాహనుల గురించి నీకు ఏమి తెలియును, వాణిజ్యము, మతము గూర్చి ప్రాధాన్యతనిస్తూ వ్రాయుము.
జవాబు:
శాతవాహనులు :
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగల పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్నచిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలన ప్రారంభించారు. అలా ఏర్పడిన రాజులలో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం’ నుండి పరిపాలించారు. అది కృష్ణానదీ తీరంలో కలదు.

శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ది చెందినవి. అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహనులు మంచి పట్టును కలిగి ఉన్నారు. రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు.

శాతవాహనులు హిందూమతాన్ని అనుసరించారు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించారు. నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది.

ప్రశ్న 5.
చాళుక్యులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము. పట్టడగల్ లోని దేవాలయం గురించి వర్ణింపుము.
జవాబు:
చాళుక్యులు వాస్తుశిల్పకళకు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో ‘వెశారా’. అను నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశములోని ‘ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’. పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ రెండవ పులకేశిని యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు. చోళ, చేత, పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహసంబంధాలు నెలకొల్పారు.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2
కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఈ గ్రామంలో పది దేవాలయాలు కలవు. అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా, పాపనాథ ఆలయం నగారా నిర్మాణ శైలిలో ఉన్నది.

ప్రశ్న 6.
చాళుక్యులు గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
చాళుక్యులు :
దక్షిణ మరియు మధ్య’ భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీ.పూ. 600-1200 మధ్య చాళుక్యరాజులు పరిపాలించారు. తొలి చాళుక్యరాజులలో ఒకరైన రెండవ పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రెండవ పులకేశి మరొక ప్రసిద్ది చెందిన చాళుక్యరాజు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఐహోలు శిలాశాసనములో పేర్కొనబడినది. రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.

ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
అ. అజంతా, ఎల్లోరా గుహలు ఏ రెండు నదుల మధ్య ఉన్నాయి?
జవాబు:
తపతి, గోదావరి.

ఆ. గుప్తుల రాజధాని నగరం ఏది?
జవాబు:
పాటలీపుత్ర

ఇ. గుప్తుల కాలంలోని ముఖ్యమైన రేవు పట్టణం ఏది?
జవాబు:
జరుకచ్చా.

ఈ. అమరావతి ఏ నది ఒడ్డున ఉన్నది?
జవాబు:
కృష్ణానది.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
ఈ క్రింది వాటిని గుర్తించండి.
1. పాటలీపుత్ర
2. కళింగ
3. ఉజ్జయిని
4. సువర్ణగిరి
5. తక్షశిల
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

These AP 6th Class Social Important Questions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 7th Lesson Important Questions and Answers సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 1.
ఉపనిషత్తుల గురించి వివరించుము.
జవాబు:
వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులనగా అర్థం ‘వచ్చి చేరువగా కూర్చోవడం, ఇవి ఉపాధ్యాయులు – మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. “మనం ఎక్కడి నుంచి వచ్చాము? లేదా మరణం తరువాత మనం ఎక్కడకు వెళతాము?” వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి.

ప్రశ్న 2.
మహాజన పదాలలో నగర ప్రజల జీవన విధానంను వివరించండి.
జవాబు:
మహాజన పదాలలో నగర జీవనం :
మహాజనపదాలలోని పట్టణాలలో ఇప్పటివలే తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పని చేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతావారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయల్పడ్డాయి.

వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు. నీటిని తెచ్చేవారు. చెక్కతోను, ఏనుగు దంతంతోను బొమ్మలు తయారుచేసే అనే రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు.

వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్థులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటూ ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు.

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘గణ’ అనగానేమి?
జవాబు:
‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ‘సంఘ’ అంటే ‘శాసన సభ’ . గణ – సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణ రాజ్యం.

ప్రశ్న 4.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
“రాజ్యం” అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో (రాజరికం) ఒక కుటుంబం వంశ పారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి.

ప్రశ్న 5.
‘వజ్ర’ గణకు ప్రాధాన్యత నిస్తూ, గణ రాజ్యంలోని పాలనా విధానము, పతనము గురించి వివరించుము.
జవాబు:
మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక్, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను ‘రాజు’ అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులయిన వీరిని అన్ని మహాజనపదాలూ గౌరవించేవి. ఈ గణ రాజ్యాలను జయించటానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ గురించి నీకేమి తెలియును?
జవాబు:
గాంధార శిల్పకళ :
గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో, సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్దుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి.

ప్రశ్న 7.
ఈ చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలంనాటి సాంచి స్థూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు?
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
జవాబు:
రాజు పట్టణ కోట నుండి గుర్రాల రథం ద్వారా వస్తున్నాడు. రథసారధి చాలా సాదాసీదాగా ఉన్నాడు. ప్రక్కన ఉన్న వ్యక్తి ప్రత్యేక అలంకరణలో ఉండడం మూలంగా ఆయనను రాజుగా గుర్తిస్తాను.

ప్రశ్న 8.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3
1. అస్మక ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
అస్మక గోదావరి నది ఒడ్డున ఉన్నది.

2. అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ఏమి?
జవాబు:
అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ‘మత్స్య’.

3. కోసల, వజ్జిలకు మధ్యలో ఉన్న జనపదం ఏది?
జవాబు:
కోసల, వజ్జికి మధ్యలో ఉన్న జనపదం మలయ లేదా మల్ల జనపదం.

4. ఈ జనపదాలు భారతదేశానికి ఏ భాగాన ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
ఈ జనపదాలు భారతదేశానికి ఉత్తర భాగాన ఎక్కువగా ఉన్నాయి.

5. దక్షిణ భారతదేశంలో మహాజనపదం ఏమి?
జవాబు:
దక్షిణ భారతదేశంలో మహాజనపదం ‘అస్మక’.

ప్రశ్న 9.
ప్రక్క పటాన్ని గమనించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4

1. ‘కాంభోజ’ కు దక్షిణాన ఉన్న మహాజనపదం ఏది?
జవాబు:
గాంధారా

2. ‘నేపాల్’ సరిహద్దులో ఉన్నటువంటి మహాజనపదాలు ఏవి?
జవాబు:
కోసల, మలయ, వట్టి

3. ఈ మహాజనపదాల పేర్లతో ‘చేప’ అని అర్ధం వచ్చేది ఏది?
జవాబు:
మత్స్య

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

These AP 6th Class Social Important Questions 6th Lesson తొలి నాగరికతలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 6th Lesson Important Questions and Answers తొలి నాగరికతలు

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత ఏ ప్రాంతాల మధ్య, ఎప్పుడు వికసించింది?
జవాబు:
సింధూనది మరియు ఘగ్గర్ – హక్రా నదీ ప్రాంతంలో సింధూలోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగృహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్ హరియానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడినది. అంతేగాక ఆఘనిస్థాన్, పంజాబ్, సింధూ బెలూచిస్తాన్ (పాకిస్తాన్) ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీ.పూ. 2500 – 1700 సంవత్సరాల మధ్య వికసించింది.

ప్రశ్న 2.
సింధూ నాగరికత నాటి పట్టణ ప్రణాళిక సౌకర్యాలను గురించి వివరిస్తూ మహాస్నానవాటిక గూర్చి ప్రాధాన్యత ఇవ్వండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 1
హరప్పా నాగరికత కాలం నాటి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక (ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను) కలదు, దీనికి నాలుగు వైపుల గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు.

ప్రశ్న 3.
సింధూ ప్రజల సాంఘిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సాంఘిక జీవనం :
స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామగ్రి గురించి, పరిమళద్రవ్యాల గురించి తెలుసు.

వినోదాలు :
నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకొనేవారు.

నైపుణ్యాలు :
చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారుచేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం (పూజారి) పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 4.
ఆర్యుల జన్మస్థానము గురించి పండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెల్పుము.
జవాబు:
ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆర్ట్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారేనని ఒక అభిప్రాయమూ కలదు. కొంతమంది చరిత్రకారులలో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు.

ప్రశ్న 5.
వైదిక వాజ్మయము (వేద సాహిత్యము) గురించి నీకేమి తెలియును?
జవాబు:
1. ఋగ్వేదము :
ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం

2. యజుర్వేదము :
యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియ జేయును.

3. సామవేదము :
ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం, భారతీయ సంగీతము యొక్క మూలాలు ఇందులో కలవు.

4. అధర్వణ వేదము :
ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు.

5. బ్రాహ్మణాలు : వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపములో కలదు.

6. అరణ్యకాలు :
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయును.

7. ఉపనిషత్తులు :
ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు.

ప్రశ్న 6.
వేదకాలం నాటి మత విశ్వాసాల గురించి వివరించండి.
జవాబు:
తొలివేదకాలం :
ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం (ఆత్మ) వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు.

మలి వేదకాలం :
మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కంధుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొ||న ఇతర దేవతలు ప్రాముఖ్యత పొందారు.

ప్రశ్న 7.
తొలి, మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం గూర్చి తెలుపుము.
జవాబు:
తొలి వేదకాలం నాటి రాజకీయ జీవనం : ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని ‘రాజన్’ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’ మరియు ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు.

మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం :
మలి వేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు. ‘సభ’ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేథ, రాజసూయ యాగాలు చేసేవారు.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 2
పైన ఇవ్వబడిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
1) వేదాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
వేదాలు నాలుగు, అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం

2) ఇతిహాసాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ఇతిహాసాలు రెండు అవి రామాయణం, మహాభారతం.

3) పై సమాచారం ఆధారంగా ఏమి తెలుసుకోవచ్చు?
జవాబు:
ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు.

4) ఆది కావ్యం అని దేనినంటారు?
జవాబు:
రామాయణం.

5) మహాభారతాన్ని ఎవరు రచించారు?
జవాబు:
వేద వ్యాసుడు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

These AP 6th Class Social Important Questions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 5th Lesson Important Questions and Answers సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 1.
వేట, ఆహార సేకరణ సులభమైన విషయంగా నీవు భావిస్తున్నావా? అవును/కాదు. మీ జవాబును సమర్థించుము.
జవాబు:
ఈ వేట, ఆహార సేకరణ అంత సులభమైన విషయం కాదు. చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాలలో దేన్ని తింటారో తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి. వేటాడటానికి, ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానం వేటగాళ్ళకు తెలిసి ఉండాలి. వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం, ఏకాగ్రత ఉండాలి. ఈ విషయాలను ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియ
జేసేవారు, ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు.

ప్రశ్న 2.
ఆది మానవులు సంచార జీవనం గడపటానికి కారణమేమిటి?
జవాబు:
ఆది మానవులు సంచార జీవనం గడిపేవారని మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా, జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్లేవారు. కొన్ని ప్రత్యేక కాలములోనే చెట్లు పండ్లనిస్తాయి. తమ మనుగడ కోసం, ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్లేవారు. మానవులు, జంతువులు, మొక్కలు జీవించడానికి నీరు అవసరం. వేసవి కాలంలో నీటి వనరులయిన సరస్సులు, కుంటలు, నదులు, ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రాంతానికి ఆది మానవులు వలస వెళ్లేవారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
అది మానవులు నిప్పును దేనికి ఉపయోగించారు?
జవాబు:
ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. ఈ విధంగా నిప్పు ఆది మానవులకు అనేక విధాలుగా – ఉపయోగపడింది. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు.

ప్రశ్న 4.
ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం?
జవాబు:
పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్లు ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతోను, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబులను (ధనుస్సు, బాణాలను) తయారు చేసుకొన్నారు. ఈ పరికరాలతో వారి వేట సులువుగా సాగేది.

ప్రశ్న 5.
పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని గుహల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ‘పురావస్తు శాస్త్రవేత్తలు’ అంటారు. పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఈ జిల్లాలో బేతంచర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆదిమానవులు కొన్నివేల సంవత్సరాలు ఉపయోగించారు.

జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని, ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకలతో చేసిన’ పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.

ప్రశ్న 6.
ఆది మానవుల చిత్రకళ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
ఆది మానవులు గుహలలోనూ, రాతి స్థావరాలలోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలనూ చిత్రించారు. వారు కొన్ని రకాల రంగు రాళ్లను పిండి చేసి, జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు.

ప్రశ్న 7.
ఆది మానవుల కాలంలో ఏది వ్యవసాయానికి నాంది పలికింది?
జవాబు:
క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనా నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు, పరిశీలన చేయడం ప్రారంభించారు. తమకు కావలసిన గింజలను ఏరుకొని, వాటిని విత్తి, ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 8.
ఆది మానవులు సంచార జీవనం నుండి స్థిర జీవనంను ఎందుకు ఏర్పరచుకున్నారు?
జవాబు:
ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, వాటి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుండి వాటిని : కాపాడటానికి పంట పండే ప్రదేశాలలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు.

ప్రశ్న 9.
వ్యవసాయ, పశుపోషకులు ఉపయోగించిన పనిముట్ల గురించి వివరంగా తెల్పండి.
జవాబు:
ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయ దారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్లు లాంటి పరికరాలను తయారు చేసుకొన్నారు. ఇలా సాన పెట్టిన గొడ్డళ్ళకు కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లను నరికేవారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. రుబ్బురోలు, రోకలితో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులు దంచేవారు.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

These AP 6th Class Social Important Questions 3rd Lesson పటములు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 3rd Lesson Important Questions and Answers పటములు

ప్రశ్న 1.
చిత్తు చిత్రం, మాన చిత్రం (పటం)నకు వ్యత్యాసమేమి?
జవాబు:

చిత్తుచిత్రం పటం
చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించ కుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకండానే గీయవచ్చు. పటం అనగా మొత్తం భూమిని గాని లేదా అందులోని ఒక భాగం గురించి గానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్యమైన అంశాలు.

ప్రశ్న 2.
గ్లోబు, పటాలను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తామో వివరించండి.
జవాబు:
గ్లోబుని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం – ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితులలో మనం పటాలను ఉపయోగిస్తాం.

ప్రశ్న 3.
మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి, ప్రధాన దిక్కులు ఏవో వివరించండి.
జవాబు:
ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే ఎదురుగా ఉన్నది తూర్పుదిక్కు వెనుక అంటే వీపుభాగం వైపు వున్నది పడమరనీ, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కునీ, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కునీ సూచిస్తుంది. ఈ , నాలుగు దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధానదిక్కుగా భావిస్తాం. అందువలనే అన్ని పటాలలోనూ కుడిచేతివైపు పైన N అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకి ఉత్తరదిక్కు తెలిస్తే, మిగిలిన దిక్కులని సులభంగా కనుక్కోవచ్చును. ప్రధాన దిక్కులు నాలుగు – ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర, వీటిని ప్రధాన దిక్కులు అంటారు.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 4.
‘స్కేలు’ అనగానేమి? దీనిని ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
స్కేల్ పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై కల వాస్తవ దూరానికీ పటంలో చూపబడిన దూరానికీ కల నిష్పత్తినే ‘స్కేలు’ అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం.

ప్రశ్న 5.
పటాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. రాజకీయ పటాలు
  2. భౌతిక పటాలు
  3. విషయ నిర్దేశిత పటాలు.

1. రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు.

2. భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

3. విషయ నిర్దేశిత పటాలు :
ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు ఎన్ని? అవి ఏవి? సోదాహరణంగా వివరించండి.
జవాబు:
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు :
అ. పెద్ద తరహా పటాలు : ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూనైసర్గిక పటాలు (topo graphic maps) భూ సరిహద్దులను తెలిపే పటాలు (cadastral maps) గా విభజించవచ్చును. భూసరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూనైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి.

ఆ. చిన్న తరహా పటాలు :
ఇవి పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు మొదలగునవి. ఇవి రెండు రకాలు – గోడ పటాలు మరియు అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ మరియు ముఖ్యమైన అంశాలను చూపుతాయి.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 7.
జి.పి.ఎస్ మరియు వెబ్ ఆధారిత పటాల వలన ఎటువంటి సమాచారం పొందవచ్చు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 1
జి.పి.ఎస్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (Global Positioning System) భూమ్మీద ఉండే వస్తువులను గుర్తించడానికి 10 ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ.

వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును. సాంప్రదాయక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ, విహంగ వీక్షణ చేయవచ్చును.

ప్రశ్న 8.
ఖండాలు అనగానేమి? ఖండాలు ఎన్ని అవి ఏవి? మహాసముద్రాలు అనగానేమి? మహాసముద్రాలు ఎన్ని అవి ఏవి? వీటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
జవాబు:
విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా మరియు ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలు.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 2

ప్రశ్న 9.
బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చారోడ్లు, పక్కారోడ్లు, చెట్లు, ఇళ్ళు, నదులను, మాన చిత్రంలో ఏ విధమైన చిహ్నాలు/గుర్తులతో చూపిస్తారో వాటిని గీయండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 3

ప్రశ్న 10.
పై మాన చిత్రాన్ని పరిశీలించి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము లిమ్ము.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 4
i) చర్చికి ఏ దిశలో నది ప్రవహిస్తుంది?
జవాబు:
తూర్పు

ii) మసీదు ఏ గ్రామంలో ఉంది?
జవాబు:
బొందపల్లి.

iii) ఏ రెండు గ్రామాల మధ్య పోలీస్ స్టేషన్ కలదు?
జవాబు:
రామాపురం, కృష్ణాపురం

iv) కృష్ణాపురంలోని దేవాలయానికి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు కలదు?
జవాబు:
కచ్చారోడ్డు.

v) పై చిత్రంలో ఎటువంటి రైలుమార్గంను సూచిస్తుంది?
జవాబు:
బ్రాడ్ గేజ్ రైల్వే

vi) రైలు మార్గానికి ఉత్తరాన ఉన్న గ్రామమేది?
జవాబు:
బొందపల్లి

vii) పై పటంలోని పాఠశాలలో మీరు ఉన్నారని అనుకోండి. పాఠశాల నుంచి బయటకు వస్తుంటే ఏ దిశ వైపుకి నడుస్తుంటారు?
జవాబు:
దక్షిణ దిశలో

viii) నది ఒడ్డున ఉన్న ప్రార్ధన మందిరం ఏమిటి?
జవాబు:
(గుడి) దేవాలయం

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

These AP 6th Class Social Important Questions 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా will help students prepare well for the exams.

AP Board 6th Class Social 2nd Lesson Important Questions and Answers గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 1.
భూ అక్షం అనగా నేమిటి?
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖను భూమియొక్క అక్షం అని పిలుస్తారు.

ప్రశ్న 2.
గ్లోబు యొక్క ఆవిర్భావ చరిత్రను వివరించండి, గ్లోబు యొక్క ఉపయోగాలు తెల్పండి.
జవాబు:

  • పురాతన ఖగోళ గోబును 1492లో మార్టిన్ బెహెమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గోబును కానిస్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో “టకి-ఆల్-దిన్” రూపొందించాడు.
  • ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.

ఉపయోగాలు:

  • భూమి ఆకారాన్ని చక్కగా చూపుతుంది. ఖండాలు, మహాసముద్రాలను చూపుతుంది.
  • భూభ్రమణాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోని దేశాలను చూపిస్తుంది.

ప్రశ్న 3.
ఉత్తర మరియు దక్షిణార్ధగోళాలు అంటే ఏవి? చిత్రం ద్వారా చూపించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 2
గ్లోబుకు మధ్యభాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్యరేఖ (0° అక్షాంశం) అంటారు. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళమని, భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.

ప్రశ్న 4.
అక్షాంశాలు అనగానేమి? ముఖ్యమైన అక్షాంశాలను గూర్చి వివరించండి.
జవాబు:
భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం (Latitude) అను పదం లాటిట్యూడో (Latitudo) అనే లాటిన్ పదానికి చెందినది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.

మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చును. ఇవే అక్షాంశాలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్యరేఖకు (0″ నుండి 90° వరకు, దక్షిణంగా (0°నుండి 90 వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్యరేఖకు ఉత్తరంగా 90° అక్షాంశాలు, దక్షిణంగా 90° అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు.

ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ఉత్తరార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు.

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 5.
రేఖాంశాలు అంటే ఏమిటి ? ముఖ్యమైన రేఖాంశాలను గూర్చి వివరించండి. తూర్పు, పశ్చిమార్ధగోళాలు అని వేటినంటారు?
జవాబు:
ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలంటారు. లాంగిట్యూడ్ (Longitude) అనే పదం Longitudo అనే లాటిన్ పదానికి సంబంధించినది. నిడివి, వ్యవధి పొడవు అని దీని అర్థం.
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 1

గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అని అంటారు. ఈ

రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. (0° రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం / ప్రామాణిక రేఖాంశం (Prime – Meridian) లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180° రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ (International Date Line) అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ (Greenwich) రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధ గోళమని అంటారు.

ప్రశ్న 6.
రాత్రి, పగలులు, ఎలా ఏర్పడతాయి వివరించండి.?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురుపడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతిపడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దికొద్దిగా చీకటిలోనికి, చీకటిలో ఉన్న భాగం క్రమేపి వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే రాత్రి పగలు ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగిరావటానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు (సుమారు 24 గంటలు) సమయం అనగా ఒక రోజు పడుతుంది.

ప్రశ్న 7.
ఋతువులు ఎలా ఏర్పడతాయి? చిత్రం ద్వారా వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 3
పై చిత్రం ననుసరించి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కక్ష్య అంతటా భూమి ఒకేదిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం మరియు శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పురావటం వలన ఋతువులు ఏర్పడతాయి.

పై చిత్రంలో జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యునివైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్య కిరణాలు ఏటవాలుగా ధృవప్రాంతాలపై పడటం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి.

ఉత్తరధృవం సూర్యునివైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తరధృవం వరకు పగటికాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటికాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగానూ ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని వేసవి అయనాంతం (Summer Solstice) అంటారు.

దక్షిణ ధృవం సూర్యునివైపు వాలి ఉండటం వలన డిసెంబరు 22వ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద నిట్టనిలువుగా పడతాయి. మకరరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం (Summer) తీవ్రంగా ఉండి పగటికాలం — ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని శీతాకాల అయానంతం (Winter Solstice) అంటారు.

ప్రశ్న 8.
గ్రహణాలు అనగానేమి? గ్రహణాలు ఎన్ని రకాలు?
జవాబు:
సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాయని మనం చదువుకున్నాం. అవి ఇలా తిరిగేటప్పుడు ఒకే సరళరేఖ పైకి అవి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపైన లేదా చంద్రునిపైన నీడపడినట్లు కనబడుతుంది. గ్రహణాలు రెండు రకాలు.

ప్రశ్న 9.
సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో అది సంభవించదు.

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 10.
చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకటిలో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుకభాగంలో లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం సంభవించదు.

ప్రశ్న 11.
క్రింది పటం దేనిని తెలియజేస్తుంది?
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 4
జవాబు:
1) భూమి యొక్క చలనమును.
2) రాత్రి, పగలు ఏర్పడుటను తెలియజేస్తుంది.

ప్రశ్న 12.
భూ పరిభ్రమణం అనగానేమి? భూమి కక్ష్య అంటే ఏమిటి? దీనిని గురించి సవివరంగా చర్చించండి.
జవాబు:
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని “భూపరిభ్రమణం” అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని “క్య” అంటారు. ఈ “క్ష్య” దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూపరిభ్రమణానికి ఒక సంవత్సరకాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 4 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన ఆ రోజును నాలుగు సంవత్సరాలకొకసారి కలిపి ఆ సంవత్సరాన్ని “లీపు సంవత్సరం” అంటారు. అందువలన లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి.

ప్రశ్న 13.
అంతర్జాతీయ దినరేఖ అనగానేమి?
జవాబు:
గ్రీనిచ్ రేఖాంశం నుండి ‘అంతర్జాతీయ దినరేఖ’ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను (0 నుండి 180°తూ) తూర్పు రేఖాంశాలుగానూ, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు (0°నుండి 180 పశ్చిమ) – పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. వాస్తవానికి 180° తూర్పు రేఖాంశం, 180° పశ్చిమ రేఖాంశం ఒకటే. దానినే 180° అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి.

ప్రశ్న 14.
క్రింది ఫ్లోచార్టను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 5
i) భూమికి నమూనా ఏది?
జవాబు:
గ్లోబు

ii) గ్రహణాలు ఏర్పడటానికి భూమి యొక్క ఏ చలనము కారణము?
జవాబు:
భూ పరిభ్రమణము

iii) పశ్చిమార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు కలవు?
జవాబు:
పశ్చిమార్ధగోళంలో అక్షాంశాలు ఉండవు. రేఖాంశాలు మాత్రమే ఉంటాయి.

iv) 180°W, E రేఖాంశాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్జాతీయ దినరేఖ.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

These AP 6th Class Social Important Questions 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి will help students prepare well for the exams.

AP Board 6th Class Social 1st Lesson Important Questions and Answers సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 1.
నక్షత్రరాశులు అనగానేమి? కొన్ని నక్షత్ర రాశుల పేర్లు తెల్పండి.
జవాబు:
మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని ‘నక్షత్రరాశులు’ అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్రరాశులలో ఒకటి సప్తర్షి ఇది ఏడు నక్షత్రాల సమూహం.

ప్రశ్న 2.
ప్రాచీనకాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఎలా గుర్తించేవారు? ధృవ నక్షత్రం అంటే ఏమిటి? వివరించండి. సప్తర్షి మండల నుండి ధృవ నక్షత్రం ఏ దిశలో ఉంటుందో బొమ్మగీచి చూపండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 1
ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ‘ధృవ నక్షత్రం’ అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్రరాశి సహాయంతో ఈ ధృవ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు.

ప్రశ్న 3.
సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణమేమి? సూర్యుని ఉపరితలం గురించి వివరించండి.
జవాబు:
సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని (తన వైపు లాగ గల శక్తి) అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 4.
మన సౌర కుటుంబంలోని గ్రహాల గురించి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం – బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు, వరుణుడు, సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్ష్యలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని ‘భూమికి కవల గ్రహం’ (ఎర్త్ – ట్విన్) గా పరిగణిస్తారు.. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు.

ప్రశ్న 5.
మనం నివసిస్తున్న భూ గ్రహం గురించి నీకేమి తెలుసో వివరించు.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 2
మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం. పరిమాణంలో ఇది ఐదవ అతిపెద్ద గ్రహం. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది.. అందుకే దాని ఆకారాన్ని జియోయిగా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని మూడింట రెండు వంతుల * ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దీనిని నీలి గ్రహం అంటారు.

ప్రశ్న 6.
ఉపగ్రహాలు అని వేటినంటారు? ఉపగ్రహాలు కల్గిలేని గ్రహాలు ఏవి?
జవాబు:
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే, గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
ఆవరణములు ఎన్ని? అవి ఏవి? వివరించండి.
జవాబు:
జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది నాలుగు ప్రధాన ఆవరణలు. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది. శిలావరణం : శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర.

జలావరణం :
భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచుపొరలు, చెరువులు మొదలైన వాటినన్నింటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది.

వాతావరణం :
భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని (78%) మరియు ఆక్సిజన్ (21%) కార్బన్‌డయాక్సెడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి ఇతర వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం : భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ‘జీవావరణం’ అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది.

ప్రశ్న 8.
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? దాని గురించి మీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
జవాబు:
మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగవ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 9.
భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సంస్థ ఏది? కొన్ని భారతీయ ఉపగ్రహాల పేర్లు తెల్పండి.
జవాబు:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీశ్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి “సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ (SHAR)” అని పేరు పెట్టారు.

కొన్ని భారతీయ ఉపగ్రహాలు : ఇన్సాట్ (INSAT), ఐ ఆర్ ఎస్ (IRS), ఎడ్యుశాట్ (EDUSAT) మొదలైనవి.

ప్రశ్న 10.
మంగళయాన్ (MOM) గురించి నీవు తెలుసుకున్న విషయాలను ప్రస్తావించండి.
జవాబు:
అంగారక గ్రహ వాతావరణం, స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రారంభించిన మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్ – MOM) అంగారక కక్ష్యకు సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రాం, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాల్గవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది.

ప్రశ్న 11.
గ్రహశకలాలు అని వేటినంటారు? ఇవి ఎక్కడ ఉంటాయి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 3
గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు (Asteroids) అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయం.

ప్రశ్న 12.
‘ఉల్కలు’ గురించి వివరించండి.
జవాబు:
సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉల్కలు (Meteoroids) అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినపుడు గుంతలను సృష్టిస్తుంది.

ప్రశ్న 13.
తోకచుక్కలు అనగానేమి? భూమికి దగ్గర వచ్చే తోకచుక్కకు ఉదాహరణ నివ్వండి. ఇది చివరిసారిగా ఎప్పుడు కన్పించింది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 4
తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది.

ప్రశ్న 14.
గెలాక్సీ/ పాలపుంత అనగానేమి?
జవాబు:
నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే ‘పాలపుంత’ అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ‘ఆకాశగంగ’ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 15.
పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన నక్షత్రాలను ఎందుకు చూడలేము?
జవాబు:
సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. అందువలన పగటిపూట మనం చంద్రుడిని, ఇతర నక్షత్రాలను చూడలేము.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 16.
నక్షత్రాలు అనగానేమి? నీకు తెలిసిన ఒక నక్షత్రంను తెల్పి, మిగతా నక్షత్రాల వేడి/కాంతి భూమికి అంతగా చేరకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చిన్నవిగా కనిపిస్తాయి.

ప్రశ్న 17.
భూమి నీలం రంగులో కన్పించడానికి కారణమేమి?
జవాబు:
భూమిపై మూడింట రెండు వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది.

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

These AP 8th Class Social Important Questions 24th Lesson విపత్తులు – నిర్వహణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 24th Lesson Important Questions and Answers విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 1.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

ప్రశ్న 3.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 5.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

ప్రశ్న 6.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 7.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

ప్రశ్న 8.
“విపత్తుల నిర్వహణలో తీవ్రత తగ్గించే చర్యలు” అంటే ఏమిటి ? తుఫానుల విషయంలో తీవ్రతను తగ్గించే ఏవైనా రెండు చర్యలను సూచించండి.
జవాబు:

  1. విపత్తుల నిర్వహణలో తీవ్రత తగ్గించే చర్యలు అనగా విపత్తులు సంభవించటం మునపే వాటి తీవ్రతను తగ్గించుటకు, నివారించుటకు తీసుకునే చర్యలు. తుఫానులు సమయంలో నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి తీసుకోదగిన చర్యలు.
  2. తుఫాను సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుట.
  3. తుఫాను నుండి ప్రజలను రక్షించుటకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉండటం.
  4. తుఫానులు తరచుగా సంభవించే ప్రాంతాలలో మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం.
  5. తుఫానులను తట్టుకోగలిగే సాంకేతికత, సామర్థ్యం గల నిర్మాణాలను ప్రోత్సహించటం.

AP 8th Class Social Important Questions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

AP 8th Class Social Important Questions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

These AP 8th Class Social Important Questions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 23rd Lesson Important Questions and Answers క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 1.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.

2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.

3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.

4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.

AP 8th Class Social Important Questions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’

– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.

‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’

– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.

2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.

3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.

4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.

5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.

ప్రశ్న 3.
శరీరం, మనసుల మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని “మహాత్మాగాంధీ” నమ్మారు. క్రీడలు వ్యక్తిగతంగా మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడంలో ఏ విధంగా సహాయం చేస్తాయో వివరించండి.
జవాబు:
వ్యక్తిగతంగా క్రీడలు, ఆటలు ఎలా ఉపయోగకరం.

  1. ఆటలు ఆడటం సంతోషానిస్తుంది.
  2. ఆటలు స్నేహాన్ని పెంపొందిస్తాయి.
  3. ఆటలు ఆడడం వల్ల శారీరక ఆరోగ్యం కాపాడబడుతుంది.
  4. ఆటలు క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసాన్ని నేర్పుతాయి.

క్రీడలు జాతీయ ఐక్యతను పెంపొందిస్తాయి :

  1. జాతీయ జట్టులో వివిధ ప్రాంతాల, మతాలవారు ఉండటం ద్వారా జాతీయ సమగ్రత సాధ్యం అవుతుంది.
  2. ఒలంపిక్ గేమ్స్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించడం ద్వారా పౌరులలో దేశభక్తి, గౌరవం, పెంపొందుతాయి.

AP 8th Class Social Important Questions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

AP 8th Class Social Important Questions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

These AP 8th Class Social Important Questions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 22nd Lesson Important Questions and Answers సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 1.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.

ప్రశ్న 2.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.

2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.

3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.

5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

AP 8th Class Social Important Questions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.

2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.

3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.

4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.

5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.

6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు

7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.

ప్రశ్న 4.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :

  1. సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
  2. టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
  3. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
  4. ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
  5. ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.

ప్రశ్న 5.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.

ప్రశ్న 6.
“ఆధునిక కాలంలో అన్ని కళలనూ ‘సినిమా’ నే మింగేస్తున్నది” – సొంతమాటలలో వ్యాఖ్యానించండి.
జవాబు:
“ఆధునిక కాలంలో అన్ని కళలనూ సినిమానే మింగేస్తున్నది”

  1. మనదేశంలో సినిమాలు రాకముందు నాటికలు, నాటకాలు, బుర్రకథ, హరికథా కాలక్షేపాలు ఉండేవి.
  2. ప్రజలు పగలంతా చేసిన పనిని మరచి పోవడానికి రాత్రి సమయాలలో కొంచెం సేపు వినోదం కోసం ఇవి ప్రదర్శించే వారు.
  3. పండుగల సమయాలలో దేవాలయాలలో తోలుబొమ్మలాట, భరతనాట్యం , కూచిపూడి మొ||న ప్రదర్శనలు జరిగేవి.
  4. అక్కడక్కడా సంగీత కచేరీలు కూడా నిర్వహించేవారు.
  5. కాని సినిమా వచ్చిన తరువాత, మరియు వివిధ రకాల ఛానళ్ళు వచ్చిన తరువాత ఈ పై చెప్పినవి ఏమి లేవు. చూసేవారు కూడా లేరు.

కావున సినిమానే అన్ని కళలను మింగేసింది.

AP 8th Class Social Important Questions Chapter 20 లౌకికత్వం – అవగాహన

AP 8th Class Social Important Questions Chapter 20 లౌకికత్వం – అవగాహన

These AP 8th Class Social Important Questions 20th Lesson లౌకికత్వం – అవగాహన will help students prepare well for the exams.

AP Board 8th Class Social 20th Lesson Important Questions and Answers లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 1.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.

లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.

వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:

  1. మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
  2. ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?

ప్రశ్న 2.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.

ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో

AP 8th Class Social Important Questions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 3.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.

ప్రశ్న 4.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

ప్రశ్న 5.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రాయానం

AP 8th Class Social Important Questions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 6.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.

AP 8th Class Social Important Questions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

AP 8th Class Social Important Questions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

These AP 8th Class Social Important Questions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 19th Lesson Important Questions and Answers సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 1.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

ప్రశ్న 2.
మనము సావిత్రిబాయి పూలేని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎందుకు?
జవాబు:
సావిత్రిభాయి పూలేని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఆమె ఒక సంఘ సంస్కర్త. ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయిని ఆమె తన భర్తతో కలసి మహిళల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారికి విద్యను అందించే విషయంలో, వారిని శక్తివంతులుగా చేయడానికి ఆవిడ సమాజంతో పోరాడి గెలిచిన మహిళ.

ప్రశ్న 3.
“స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో మహిళల హక్కులకోసం పోరాడిన వాళ్ళలో పురుషులే ఎక్కువగా ఉన్నారు” దీనిని మీరేవిధంగా అర్థం చేసుకుంటారు ? మీ వ్యాఖ్యలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో స్త్రీలు విద్యావంతులు కారు. కావున వారి కోసం పురుషులు ఉద్యమించవలసి వచ్చింది.

  1. స్త్రీలు ఇండ్లు దాటి బయటకు వచ్చేవారు కాదు.
  2. పరదా పద్ధతి అమలులో ఉండేది.
  3. ఏ విషయంలోనూ స్త్రీలకు స్వంత నిర్ణయాలు ఉండేవి కావు.
  4. వారికి హక్కులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు.
  5. పురుషులు విద్యావంతులవడం, వారికి స్త్రీకి గల హక్కులు గురించి తెలియడంలో వారి సమాజంలో అణిచివేతకు గురవుతున్నారు. కావున వారికి పోరాడే అవకాశం లేకపోవడం ఈ పై విషయాల వలన పురుషులే స్త్రీల హక్కుల కోసం పోరాడారు.
  6. స్త్రీలు విద్యావంతులు కాకపోవడం వలన వారి హక్కుల కోసం వారు పోరాడలేకపోయారు.

AP 8th Class Social Important Questions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 4.
ఇప్పటికి భారతదేశంలో బాల్య వివాహాలు జరగడానికి గల రెండు కారణాలు తెలిపి, బాల్య వివాహాలను అరికట్టుటకు రెండు చర్యలను సూచించండి.
జవాబు:
1. పేదరికం :
చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల కుటుంబ ఖర్చులు తగ్గుతాయని తల్లిదండ్రులు భావించటం.

2. లింగవివక్షత :
కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానమైన విలువ ఇవ్వకపోవడం.

3. మగ పిల్లల విద్యపై పెట్టే ఖర్చు తమకు ఎక్కువ ప్రయోజనకరమైనదిగా భావించడం.

బాల్య వివాహాలను అరికట్టడంకు తీసుకోదగిన చర్యలు :

  1. ఆడపిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించడం.
  2. బాలికలకు ఉచిత విద్యను అందించడం.
  3. బాల్య వివాహాలను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావడం.
  4. బాల్యవివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం.