TS 8th Class Telugu Grammar వ్యాకరణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download వ్యాసాలు Questions and Answers.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ‘వర్ణమాల’ లేదా ‘అక్షరమాల’ అని అంటారు.
ఉదా : ‘అ’ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. అంటే అక్షరం. తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు.
అవి :

  1. అచ్చులు
  2. హల్లులు
  3. ఉభయాక్షరాలు

అచ్చులు :
అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ
ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.

అ) హ్రస్వాలు : ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు.
అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్పపాటు కాలం)

ఆ) దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ‘దీర్ఘాలు’ అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ – ఓ – ఔ

హల్లులు :
క ఖ గ ఘ ఙ
చ చ ఛ జ షు ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ
శ ష స హ ళ ఱ
ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు.
అ) క, చ, ట, త, – పరుషాలు
ఆ) గ, జ, డ, ద, బ – సరళాలు
వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు.
ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు.
ఈ) ఙ, ఞ, ణ, న, మ – అనునాసికాలు
ఉ) య, ర, ల, వ – అంతస్థాలు
ఊ ) శ, ష, స, హ – ఊష్మాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సూచన : “ఱ” అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు ‘ర’ ను వాడుతున్నారు. అట్లే చ, జే లు వాడుకలో లేవు, వీటికి బదులుగ చ, జ లను వాడుతున్నారు.

ఉభయాక్షరాలు : మూడు. అవి సున్న ‘మ్’ (పూర్ణబిందువు), అరసున్న ‘C’, విసర్గ :’. ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోనూ ఉపయోగించడంవల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.

సూచన : అరసున్నకు గ్రాంథికభాషలో ప్రాధాన్యమున్నది. విసర్గ సంస్కృతపదాలకు మాత్రమే చేరుతుంది.
అక్షరమాలలో ఎట్లా ఉన్నా ‘హల్లు’ అనేది పొల్లుగా పలికే ధ్వని. ‘మ్’, ‘అ’ అనే ధ్వనులు కలిసి ‘మ’ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు.

కొన్ని అక్షరాల్లో రెండేసిగాని, మూడేసిగాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడురకాలు.
1. ద్విత్వాక్షరం
2. సంయుక్తాక్షరం
3. సంశ్లేషాక్షరం

1) ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : ‘క్క’ = క్ + క్క (క్) + అ = క్క – ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది.
2) సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరే ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. హల్లుకు చెందిన హల్లు యొక్క
ఉదా : న్య = న్ + య్ (్య) + అ = న్య – ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
3) సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు.
ఉదా : = క్ + ష్ + మ్ + ఇ = ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

లింగాలు:

కింది వాక్యాలను చదువండి.

  • గీత లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు.
  • ప్రదీప్ సందీప్ లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు.
  • పిల్లి ఎలుకను వెంబడించింది.
  • చెట్టుమీద కోతులు దుంకుతున్నాయి.

పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు.
ప్రదీప్, సందీప్, నాన్న – అనేవి పురుషులకు (మగవారికి) చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ‘పుంలింగ పదాలు’ అంటారు.
పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులనుకానీ, స్త్రీలనుకానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు.
దీని ప్రకారం
పురుష వాచక శబ్దాలను పుంలింగాలనీ
స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలనీ
పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని) వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

విభక్తులు:

కింది వాక్యాలను గమనించండి.
అ. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి, బతుకమ్మ పండుగ ప్రతీక.
ఆ. హెూళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఇ. పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.
ఈ. వాణి పూజ కొరకు పూలను కోసింది.
ఉ. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం.

పై వాక్యాల్లో గీతగీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువండి.
ఉదా || పీర్ల ఇత్తడి వెండి తయారుచేస్తారు.

పై వాక్యంలో పదాలమధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. పీర్ల ఇత్తడి వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదువండి.

“పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.” ఇట్లా పదాల మధ్య అర్థసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని “విభక్తి ప్రత్యయాలు” అంటారు.

విభక్తి ప్రత్యయాలు:

ప్రత్యయాలు  విభక్తులు
అ. డు, ము, వు, లు  ప్రథమా విభక్తి
ఆ. ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి  ద్వితీయా విభక్తి
ఇ. చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)  తృతీయా విభక్తి
ఈ. కొఱకు(న్), కై (కోసం)  చతుర్థీ విభక్త
ఉ. వలన(న్), కంటె(న్), పట్టి  పంచమీ విభక్తి
ఊ. కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్)  షష్ఠీ విభక్తి
ఎ. అందు(న్), న(న్)  సప్తమీ విభక్తి
ఏ. ఓ, ఓరి, ఓయి, ఓసి  సంబోధన ప్రథమావిభక్తి

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

భాషా భాగాలు:

వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని “నామవాచకాలు” అంటారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను “సర్వనామాలు” అంటారు. పనిని తెలియజేసే పదాలను “క్రియాపదాలు” అంటారు. నామవాచకాల గుణాన్ని తెలిపే పదాలను “విశేషణాలు” అంటారు.

అవ్యయం:

కింది వాక్యాలను చదువండి.
నిదానమే ప్రధానం అట్లని సోమరితం పనికిరాదు.
మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఆహా ! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో !

ఈ వాక్యాల్లో ఉన్న “అట్లని, అయితే, ఆహా !” మొదలైన పదాలను చూశారుకదా ! ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే వీటికి విభక్తులు లేవు. ఏకవచన, బహువచనమనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను ‘అవ్యయాలు’ అంటారు.

సమాపక, అసమాపక క్రియలు:

ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను “సమాపక క్రియలు” అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తికానట్లు తెలిపే క్రియలను “అసమాపక క్రియలు” అంటారు.

2. కింది వాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.

అ. చెంబుతో నీళ్ళు ముంచుకొని, తాగుతుంది.
అసమాపక క్రియ – ముంచుకొని
సమాపక క్రియ – తాగుతుంది

ఆ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
అసమాపక క్రియ – ఆపివేసి
సమాపక క్రియ – వెళ్ళిపోయాడు

ఇ. పరీక్ష చేసి, కాలు విరిగిందని చెప్పాడు.
సమాపక క్రియ – చెప్పాడు
అసమాపక క్రియ – విరిగిందని

ఈ. దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.
అసమాపక క్రియ – తీసుకొని
సమాపక క్రియ – తుడిచింది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

అర్థాన్ని బట్టి వాక్యాల్లో రకాలు:

క్రియలనుబట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి.
ఉదా : అ. ఆహా ! ఎంత బాగుందో !
ఆ. ‘చేతులు కడుక్కో’
ఇ. మన రాష్ట్ర రాజధాని ఏది ?

పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెట్లాగో చూద్దాం !
ఆహా ! ఎంత బాగుందో! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసేవాక్యం ‘ఆశ్చర్యార్థక వాక్యం’.
ఇక రెండో వాక్యం ‘చేతులు కడుక్కో’. ఇది “విధిగా చేయాలి” అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం ‘విధ్యర్థక వాక్యం’.
ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ? ఇది ప్రశ్నార్ధకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ‘ప్రశ్నార్థక వాక్యం’.

కింది వాక్యాలను చూద్దాం.

  • అతడు వస్తాడో ? రాడో ?
  • రేపు వర్షం పడవచ్చు.
  • ఈ రోజు ఎండ కాస్తుందో ? లేదో ?

ఈ మూడు వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది.
పని జరుగుతుందో లేదో అనే ‘సందేహం’ కలిగేటట్లున్న వాక్యం “సందేహార్థక వాక్యం”.

  • లోపలికి రావచ్చు.
  • కొద్దిసేపు టీవీ చూడవచ్చు.
  • మీరు వెళ్ళవచ్చు.

ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే ఇవి ‘అనుమత్యర్థక వాక్యాలు. ‘
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

  • ఇతరులను ఎగతాళి చేయవద్దు.
  • నీటిని వృధా చేయవద్దు.
  • ఎక్కువ సేపు నిద్రపోవద్దు.

ఈ వాక్యాలు ఆయా పనులను చేయవద్దని చెబుతున్నవి (నిషేధిస్తున్నవి). కనుక ఇవి “నిషేధార్థక వాక్యాలు”.
ఒక పనిని చేయవద్దనే (నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం “నిషేధార్థక వాక్యం”.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సంధులు:

క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.
అ. ఇప్పటికైనా జాగ్రత్తపడుతారని ఆశ.
ఆ. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధిచెందుతుంది.
ఇ. అవి ఎక్కడుంటాయో తెలియదు.
పై వాక్యాల్లో ఇప్పటికైనా అనే మాటలో
మొదటిపదం – ఇప్పటికి
రెండవపదం ఐనా

నీళ్ళెంత అనే మాటలో
మొదటిపదం – నీళ్ళు
రెండవపదం – ఎంత

ఎక్కడుంటయో అనే మాటలో
మొదటిపదం – ఎక్కడ
రెండవపదం – ఉంటయో
పై వాటిని ఇట్లా విడదీయవచ్చు.

ఇప్పటికైనా = ఇప్పటికి + ఐనా
నీళ్ళెంత = నీళ్ళు + ఎంత
ఎక్కడుంటయో = ఎక్కడ + ఉంటయో
ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు.

కింది వాటిని పరిశీలించండి.
1. వారు + ఉండిరి = వారుండిరి
2. ఎవరికి + ఎంత = ఎవరికెంత
3. ఇంక + ఒకరు = ఇంకొకరు

పై ఉదాహరణల్లో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారుకదా ! ఇట్లా రాయడాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.

కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.
నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ + ఇ) = ఇ (డి)
వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ + ఇ) = ఇ (రి
పై మొదటిపదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వస్వరం( ‘ఉ’; రెండవ పదం (ఇక్కడ) లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ’. ‘ఉ’ కారానికి ‘ఇ’ కారం కలిసినప్పుడు ‘ఇ’ కారమే నిలబడింది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటాం.
పూర్వ, పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి. (ఏకాదేశమంటే ఒకవర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చిచేరడం.)

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఉత్వసంధి :

ఈ కింది పదాలను గమనించండి.
అ. రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ. సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ. మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ. అతడు + ఎక్కడ = అతడెక్కడ = ఉ + ఎ = ఎ

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
”ఉకారాన్ని ఉత్తు అంటారు. – ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.

అత్వసంధి:

కింది పదాలను పరిశీలించండి.

అ. రామయ్య = రామ + అయ్య
ఆ. మేనత్త / మేనయత్త = మేన + అత్త
ఇ. సెలయేరు = సెల + ఏరు
ఈ. ఒకానొక = ఒక + ఒక
సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘పరపదం’ అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండవ పదం మొదటి అచ్చు వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

1) రామయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
2) మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. (వైకల్పికం)
3) సెలయేరు లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
4) ఒకానొక లాంటి పదాలు ‘ఒకొక’లాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వ స్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్వసంధి’.
అత్తు (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
బహుళం : సంధి నిత్యంగా, వైకల్పికంగా నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని ‘బహుళం’ అంటారు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఇత్వ సంధి:

కింది పదాలను కలిపి రాయండి.
అ. ఏమి + అది = ఏమది
ఆ. ఎవరికి + ఎంత = ఎవరికెంత
ఇ. మరి + ఇప్పుడు = మరిప్పుడు
ఈ. అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.

మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’ కారానికి (ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది.
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు.
“ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా ! దీనినే ఇత్వసంధి అంటారు. ఏమ్యాదులయందు ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

ఆమ్రేడిత సంధి:

ఔరౌర ! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా ! ఎంతో ఆనందం కలిగించావు.
పై వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా !
ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే…

ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + ఆ
ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.
అట్లాగే ఆహా + ఆహా = ఆ(హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’.
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

ఈ కింది పదాలను చదువండి.
అ) పగలు + పగలు = పట్టపగలు
ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివర పదం కూడ.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
అ) నడుమ + నడుమ = నట్టనడుమ
ఆ) కొన + కొన = కొట్టకొన
ఇ) కడ + కడ = కట్టకడ
“ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)”.
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా !
ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చుమీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సవర్ణదీర్ఘ సంధి:

కింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం గమనించండి.
అ) శివాలయం = శివ + ఆలయం = అ + ఆ
ఆ) మునీంద్రుడు = ముని + ఇంద్రుడు = ఇ + ఇ = ఈ
ఇ) భానూదయం = భాను + ఉదయం = ఉ + ఉ = ఊ
ఈ) మాతౄణం = మాతృ + ఋణం = ఋ + ఋ = ౠ
పై పదాలను విడదీసినపుడు మొదటి (పూర్వ), రెండవ (పర) పదాల్లో ఒకేరకమైన అచ్చులున్నాయికదా ! అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటివాటి దీర్ఘాలు వచ్చాయి.
అ/ఆ + అ/ఆ = ఆ
ఉ/ఊ + ఉ/ఊ = ఊ
ఇ/ఈ + ఇ/ఈ = ఈ
ఋ/ౠ + ఋ/ౠ = ౠ
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణాలు) వచ్చి చేరినపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణదీర్ఘసంధి అంటాం.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ‘ఏకాదేశం’ అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చిచేరడం.
ఒకేరకమైన అచ్చులను ‘సవర్ణాలు’ అంటాం.

గుణసంధి:

కింది పదాలను చూడండి.

  • రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
  • పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
  • వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
  • దేవర్షి = దేవ + ఋషి (అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.
‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (TS 8th Class Telugu Grammar వ్యాకరణం 1)
‘అ’ కారానికి ‘ఉ’ పరమైనప్పుడు ‘ఓ’ (TS 8th Class Telugu Grammar వ్యాకరణం 2)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

సమాసాలు:

ద్వంద్వ సమాసం:

కింది వాక్యాలు చదువండి.
అ. మాకు దేశభక్తి ఉన్నది.
ఆ. సురేశ్ వేసుకున్నది తెల్లచొక్క
ఇ. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది.
ఈ. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు.
ఉ. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది.
ఊ. మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది.

పై వాక్యాల్లో గీతగీసిన పదాల అర్థాలను గమనించండి.
దేశభక్తి – దేశమునందు భక్తి
తెల్లచొక్క – తెల్లనైన చొక్క
లక్ష్మీపతి – లక్ష్మియొక్క పతి
గురుదక్షిణ – గురువుకొరకు దక్షిణ
కూరగాయలు – కూర మరియు కాయ
పది ఎకరాలు – పది సంఖ్యగల ఎకరాలు

పై పదాల్లో వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా !
ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.
సమాసంలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు. సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాన్ని పరిశీలించండి.

“గురుశిష్యుల బంధం చాలా గొప్పది”.

ఈ వాక్యంలో గురుశిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరూ ముఖ్యులే. ఇట్లా రెండుకాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యంగల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వసమాసం అంటారు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ద్విగు సమాసం:

ఈ పదాలను పరిశీలించండి.
నవరసాలు
చతుర్వేదములు
షట్చక్రవర్తులు
పంచపాండవులు
దశ దిశలు
ఈ పదాలలో మొదటి (పూర్వ) పదం సంఖ్యా వాచకంగా వుండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.
నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
చతుర్వేదములు – నాలుగు సంఖ్యగల వేదములు
షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (పర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.

తత్పురుష సమాసం:

కింది వాక్యం చదువండి.
‘రాజభటుడు వచ్చాడు’

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.

తిండి గింజలు – తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి

పై రెండు వాక్యాలను కూడ గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

తత్పురుష సమాసం రకాలు

కింది పట్టికను చూడండి. చదువండి.

తత్పురుష సమాసం రకాలు  విభక్తులు  ఉదాహరణ
ప్రథమా తత్పురుషం  డు, ము, వు, లు  మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య భాగం (సమాసంలోని మొదటి పదం ప్రథమావిభక్తిలో ఉన్నది కనుక ప్రథమా తత్పురుషం)
ద్వితీయా తత్పురుషం  ని, ను, ల, కూర్చి, గురించి  జలధరం జలమును ధరించినది
తృతీయా తత్పురుషం  చేత, చే, తోడ, తో  బుద్ధిహీనుడు – బుద్ది చేత హీనుడు
చతుర్థీ తత్పురుషం  కొరకు, కై  దూడగడ్డి – దూడకొరకు గడ్డి
పంచమీ తత్పురుషం  వలన (వల్ల), కంటే, పట్టి  దొంగభయం – దొంగవలన భయం
షష్ఠీ తత్పురుష  కి, కు, యొక్క లో, లోపల  రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుషం  అందు, న  దేశభక్తి – దేశమునందు భక్తి

 

కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (న అంటే వ్యతిరేకార్థం).

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు:

కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

వాక్యం  అసమాపక క్రియ  సమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది  వెళ్ళి  కొన్నది
1) రాజు పద్యం చదివి, భావం చెప్పాడు  చదివి  చెప్పాడు
2) వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది.  గీసి  వేసింది
3) కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.  ఎక్కి  వెళ్ళింది
4) రంగయ్య వచ్చి, వెళ్ళాడు  వచ్చి  వెళ్ళాడు.
5) వాళ్ళు అన్నం తిని, నీళ్ళు తాగారు.  తిని  తాగారు

కింది వాక్యాలు చదువండి. కలిపి రాసిన విధానం చూడండి.
ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్రలేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

3. కింది వాక్యాలు చదువండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేదు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.
సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
జవాబు.
వనజ చురుకైనది, అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
జవాబు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
జవాబు.
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు మరియు తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు కాని చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము చెప్పలేము.
జవాబు.
మేము రాము, చెప్పలేము.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఛందస్సు:

కింది వానిని చదివి తెలుసుకోండి.

ఛందస్సు : పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.
అ) “లఘువు” – క్షణకాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “|” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 3

ఆ) “గురువు” – రెండు క్షణాల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అని సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 4

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఇ) కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.
చిక్కని
పాలపై
ధనము
చెందిన
పాకము
పంచదార
మూర్ఖులు
అందం
పుణ్యముల్
నమోనమః
రైతులు
గౌరీపతి
జవాబు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 5

గణాలు : గణం అంటే మాత్రల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 6

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 7

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 8

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

ఈ కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 10

ఉత్పలమాల:

ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 9

పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
10వ అక్షరానికి (లె-రీ); (యు-చుం); అనే అక్షరాలకు యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా క్క-క్కి-అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస” నియమం అంటారు.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా భ ర న భ భ ర వ అనే గణాలు వస్తాయి.
  4.  ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

చంపకమాల:

ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం 11

పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతిపాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘ఆ’తో, ‘బు’ కు ‘పు’తో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ని – న అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Grammar వ్యాకరణం

అలంకారాలు:

కింది దానిని చదువండి.

ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్లు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధరకాలుగా అలంకరణ చేస్తాం. అప్పుడే ఆ వస్తువు అందం కనిపిస్తుంది. అట్లనే పద్యాలలో, కవితల్లో కూడా వినసొంపుగా ఉండడానికి అలంకారం ఉంటుంది.

ఇది మనబడి
అక్షరాల బడి
సరస్వతి దేవి ఒడి
మనకు నేర్పును నడబడి
పోదాం పద వడివడి

పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.
అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యను ప్రాస’ అలంకారం అంటారు.

ఉపమాలంకారం:

కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే పదానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్ని బట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

  1. ఉపమేయం : దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం ఉపమేయం)
  2. ఉపమానం : దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం ఉపమానం)
  3. సమానధర్మం : ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం (అందంగా ఉండడం – సమానధర్మం)
  4. ఉపమావాచకం : పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
    “ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

ఉత్ప్రేక్షాలంకారం:

కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్నమాట- దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

Leave a Comment