TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

These TS 8th Class Telugu Bits with Answers 12th Lesson మాట్లాడే నాగలి will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

చదువండి ఆలోచించి చెప్పండి:

ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకెంత ప్రాధాన్యముందో …. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ పీతకూ కూడ కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై పేరా దేన్ని గురించి తెలుపుతున్నది ?
జవాబు.
పై పేరా జీవరాశి యొక్క మానవుల యొక్క అస్తిత్వాన్ని గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
తెలివిమీరిన మానవులు ఏం చేస్తున్నారు ?
జవాబు.
తెలివిమీరిన మానవులు విశ్వం వినాశనానికి తమ తెలివిని ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 3.
వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి ?
జవాబు.
వీటి ఫలితాలు అంటే మానవుల తెలివితేటలకు సంబంధించిన విషయాలు, వాటి ఫలితాలని అర్థం. ఆ తెలివి తేటలు లోకవినాశనానికి ఉపయోగ పడుతున్నట్లున్నాయి.

ప్రశ్న 4.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలి ?
జవాబు.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ముందుగా జీవహింసను మానుకోవాలి. జీవన చక్రంలో మనకు ఎంత ప్రాముఖ్యం ఉందో వాటికీ అంతప్రాముఖ్యం ఉందని గుర్తించి మనలానే వాటిని కూడా బ్రతుకనీయాలి.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

పాఠం ఉద్దేశం:

ప్రాణులకు – ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెప్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
అనువాద ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Transla- tion) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని ‘అనువాద ప్రక్రియ’గా పేర్కొనటం జరుగుతున్నది.

సాహిత్య అకాడమీ వారు ముద్రించిన “భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు” అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్. వేణుగోపాలరావు అనువాదం చేశాడు.

రచయిత పరిచయం:

ప్రశ్న.
పొనుక్కున్నం వర్కెయ్ పరిచయం రాయండి.
జవాబు.
పొన్కున్నం వర్కెయ్ మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. వర్కెయ్ బాల్యం పొన్కున్నంలో గడిచింది.

ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కెయ్ ‘తిరుముల్కచ్చ’ (1939) అనే కథానికా సంకలనంతో రచయితగా పరిచయమయ్యాడు. 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలయినవి ఇతని కలం నుండి వెలువడ్డాయి.

మానవసంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కెయ్ రచనలలోని ప్రధానాంశాలు. ఈయన గొప్ప మానవతావాది.

ప్రవేశిక:

ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ‘ఓసెఫ్ – కన్నన్” ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్ ఎవరు ? కన్నను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

కఠిన పదాలకు అరాల్థు:

దివి = ఆకాశము
ముచ్చటపడు = ఇష్టపడు
ఘోరము = సహించలేనిది
బృందము = సమూహము
మాధుర్యము = తీయనైన
స్వరాలు = చప్పుళ్ళు
తాకట్టు = కుదవ పెట్టు
నిష్ఫలం = ఫలము లేనిది
దినము = రోజు
విపరీతంగా = ఎక్కువగా
సౌఖ్యము = సుఖము
చరమదశ = చివరిదశ
సంబరము = పండుగ
కార్యము = పని
ధరణి = భూమి
వృషభం = ఎద్దు
ఠీవి = హుందా, వైభవం
పాన్ = కిళ్ళీ
పోగు = కుప్పవేయు
అరిష్టం = కీడు
పురి = పింఛం
పరిరక్షించు = కాపాడు
డగ్గుత్తిక = బాధతో పూడుకుపోయిన గొంతుతో

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
ఓసెఫన్ను ఎద్దుపిచ్చోడు’ అనడం గురించి మీ అభిప్రాయం ఏమిటి ? (టెక్స్ట్ పేజి నెం. 121)
జవాబు.
ఓసెఫ్ నిజంగా ఎద్దు పిచ్చోడే. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్క తన ఎద్దు కన్నన్ తోడిదే లోకం. కనుక ఓసెఫ్ ఎద్దు పిచ్చోడే.

ప్రశ్న 2.
విచక్షణ అంటే నీకేమర్థమయింది ? కన్ననికి విచక్షణ ఉందని మీరెట్లా చెప్పగలరు ? (టెక్స్ట్ పేజి నెం. 121)
జవాబు.
ఇది చేయదగిన పని ఇది చేయకూడని పని అని నిర్ణయించటమే విచక్షణ. కన్నన్కు ఆ విచక్షణ ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే ఓసెఫ్ ఏం చెబితే అది కన్నన్ చేసుకుపోతుంది. ఒక మడిలో నుండి మరొక మడిలోకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా దానికేమీ చెప్పనక్కర లేదు. గట్ల మీద కాలువేస్తే గట్లు తెగిపోతాయనే విచక్షణ దానికుండేది. దున్నటం పూర్తి అయ్యాక మేతకు వదిలి “కడుపు నింపుకో, అరటి చెట్లను ముట్టుకోకు” అని ఓసెఫ్ అనేవాడు. కన్నన్ ఎప్పుడూ అరటి చెట్లను గాని, కొబ్బరి మొలకలను గాని ముట్టుకునేది కాదు. అవి పాడైపోతాయనే విచక్షణ దానికి ఉండేది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ప్రశ్న 3.
సాటి మనుషులతో మన ప్రేమాభిమానాల్ని ఎట్లా వ్యక్తపరచవచ్చు? (టెక్స్ట్ పేజి నెం. 121)
జవాబు.
సాటి మనుషులపై ప్రేమాభిమానాల్ని మనసుకు హత్తుకొనే చక్కని మాటలతో వ్యక్తం చేయాలి. మంచిమాట మనసును ఆనందింప చేస్తుంది. మన వద్దకు వచ్చిన వారికి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించనక్కరలేదు. వారి మనసుకు బాధ కలుగకుండా ఉపశమనం కలిగించే రెండు మాటలు మాట్లాడి ఆప్యాయంగా ఆదరిస్తే చాలు ప్రేమాభిమానాలను వ్యక్తంచేసినట్లు అవుతుంది.

ప్రశ్న 4.
సంగీతానికున్న శక్తి ఎట్లాంటిది ? (టెక్స్ పేజి నెం. 123)
జవాబు.
సంగీతం శిశువులను, పశువులను, చివరికి రాళ్ళను కూడా కరిగించగలిగిన శక్తిగలది. కన్నన్కి ఓసెఫ్ సంగీతం (పాట) అంటే ఇష్టం. పచన్ సంగీతం విన్న కన్నన్ సంగీతాన్ని అవమానించాడని కుడికాలు మీద తన్నింది. కాబట్టి సంగీతం చాలా గొప్ప శక్తిగలదని పశువులు కూడా ఆస్వాదిస్తాయని తెలుస్తుంది.

ప్రశ్న 5.
“ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే”- దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ? (టెక్స్ పేజి నెం. 123)
జవాబు.
ప్రేమకు ఎపుడూ మాటలు ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమంటే రెండు మనసులు కలిసి అనుభవించే సుఖదుఃఖాల సాన్నిహిత్యం. దీనిలో సాన్నిహిత్యం ముఖ్యం. ఓసెఫ్ కన్నా కన్నన్కు దగ్గరయిన వారెవ్వరూ లేరు. అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత దుఃఖాన్ని అనుభవించాయి. కనుక ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యం.

ప్రశ్న 6.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు మీకేమనిపించింది ? ఎందుకు ? (టెక్స్ పేజి నెం. 123)
జవాబు.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. దానిని తన సంతానంగా భావించాడు. కూతురి పెళ్ళి ఆగిపోతుందన్న భయంతో అప్పటికే తన బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఇక మిగిలింది ఎద్దు. దాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. అందుకని ఓసెఫ్ పట్ల జాలి కలిగింది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ప్రశ్న 7.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ? (టెక్స్ట్ పేజి నెం. 125)
జవాబు.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మనుషుల అంచనాలను తారుమారు చేస్తుంది. అధిక ధరలు ఓసెఫ్ వంటి సామాన్యుల జీవితాలను శాసిస్తాయి. మధ్య తరగతి వారిని రోడ్డున పడవేస్తుంది. ధరల పెరుగుదల మనశ్శాంతిని దూరం చేస్తుంది.

ప్రశ్న 8.
‘భూతదయ’ – అంటే ఏమిటో వివరించండి. (టెక్స్ట్ పేజి నెం. 125)
జవాబు.
భూతదయ అంటే భూతములపట్ల దయ అని అర్థం. భూతములు అంటే జీవరాశి అనిఅర్థం. ఆ జీవులపై మనం చూపించే కరుణే భూతదయ. సృష్టిలో మానవునకు బ్రతికే హక్కు ఎంత ఉన్నదో మిగిలిన జీవరాశికీ అంతే ఉంది. వాటిపట్ల దయ, జాలి, కరుణలు చూపించాలి, అలా చూపించటాన్నే భూతదయ అంటాము.

ప్రశ్న 9.
“బిడ్డా, నన్ను గుర్తు పట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా ?” దీని మీకేమి ద్వారా. అర్థమయ్యింది ? (టెక్స్ట్ పేజి నెం. 125)
జవాబు.
విధిలేని పరిస్థితిలో ఓసెఫ్ కన్నన్ను అమ్మేశాడు. ఇపుడు దానిని కబేళాకు తరలించారు. అక్కడ ఓసెఫ్ కన్నన్ను చూసి చలించి పోయాడు. బక్కచిక్కి ఎముకల గూడులా ఉన్న తన బిడ్డవంటి ఎద్దు కన్నన్ను చూసి ‘ఇలా నిన్ను చూడవలసి వచ్చిందా’ అని బాధపడ్డాడు. కన్నన్ కూడా ఓసెఫన్ను చూసి కన్నీరు కార్చి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా నాకటం ప్రారంభించింది. దీనిద్వారా ఓసెఫ్, కన్నన్ల అనురాగ ఆప్యాయతలు తెలిశాయి. మనుషుల్లానే జంతువులకూ ప్రేమ ఉందని తెలిసింది.

ప్రశ్న 10.
కన్నన్ తన యజమానిపై అభిమానాన్ని, ప్రేమని ప్రదర్శించిందని ఎట్లా చెప్పగలవు ? (టెక్స్ పేజి నెం. 126)
జవాబు.
మూగజీవాలకు భాషతో, మాటతో భావాలను వ్యక్తం చేయటం రాకపోయినా చేష్టలతో వ్యక్తం చేయగలవు. కన్నన్ తన యజమానిని చూడగానే, అతని చేయి తాకగానే ఆ స్పర్శకు తన తోక ఎత్తింది. అది తన నోటితో కాదు హృదయంతో ఏడ్చింది. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేలమీద ఒరిగింది.

ప్రశ్న 11.
“నాన్నా! నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు” – అనే కత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకుంటావు? (టెక్స్ట్ పేజి నెం. 126)
జవాబు.
కత్రి తనకు కొత్త బట్టలు తెచ్చిపెట్టి నాన్న కొత్తకాపురానికి పంపిస్తాడన్న ఆలోచనలో ఉంది. కొత్త బట్టలకు బదులు కన్నన్ ను వెంటబెట్టుకురావటంతో కత్రి తాను కొత్త కాపురానికి వెళ్తున్నానన్న ఆశలు అడియాసలయ్యాయి అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 12.
“నాకు నువ్వెంతో కన్నన్ అంతే – దీని ద్వారా నీకేమర్థమయ్యింది ? (టెక్స్ పేజి నెం. 126)
జవాబు.
“నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల వలన కన్నన్ పై ఓసెఫ్కు ఉన్న ప్రేమ అర్థమయింది. తన కన్న కూతురు కత్రిని ఎంత ప్రేమగా ఓసెఫ్ పెంచుకున్నాడో అంతే ప్రేమతో కన్నన్ను కూడా చూసుకున్నాడని అర్థమయింది. కన్నన్ ఓసెఫ్కు మరో బిడ్డ అని అర్థమయింది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

1. కింది అంశాల గురించి తెలుపండి.

అ. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
మానవత్వం గురించి, మూగ జీవుల పట్ల మానవులు చూపాల్సిన ప్రేమ గురించి చెప్పిన మంచి కథ ఇది. ఓసెఫ్ ఒక మనసున్న రైతు. అతని వద్ద కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఆ ఎద్దే అతని లోకం. అది ఉంటే అతడు ఈలోకాన్ని మరచేవాడు. అందుకే అతనిని ఎద్దు పిచ్చోడు అని మిగిలిన రైతులు అనేవారు. కన్నన్ను ఎప్పుడూ ఓసెఫ్ చెర్నాకోలతో కొట్టలేదు. అదే తన యజమాని మనసు తెలుసుకుని ప్రవర్తించేది. పని అయిపోయాక హాయిగా కడుపునింపుకోమని వదిలేవాడు. అది గడ్డి తిన్నదే గాని ఏనాడు అరటి మొక్కలను కొబ్బరి మొక్కలను తాకనైనా తాకలేదు. ఓసెఫ్ పాట మాట అంటే కన్నన్కు ఇష్టం. ఇరవైఏళ్ళపాటు కన్నన్ ఓసెఫ్క మొక్కవోని సేవచేసింది.

ఓసెఫ్కు ఒక కూతురుంది. ఆమెపేరు కత్రి. ఆమెకు పెళ్ళిచేయాలనుకున్నాడు. కట్నంకోసం పొలాన్ని అమ్మాడు. అయినా చాలలేదు. కన్నన్ను కూడా అమ్మేయక తప్పిందికాదు. ఒక రోజు కూతురు కత్రికి బట్టలు తేవటానికి వెళ్ళిన ఓసెఫ్కు తన కన్నన్ను మాంసం దుకాణానికి తరలిస్తుండడం కన్పించింది. తట్టుకోలేక పోయాడు. కన్నన్.. అని పెద్దకేకవేసి బట్టలకని తెచ్చిన డబ్బులతో కన్నన్ను కొని ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న బట్టలు తెస్తున్నాడని ఎదురువెళ్ళిన కత్రికి కన్నన్ కన్పించింది. విషయం అర్థమయింది. నాన్నా నువ్వు నాకు ఇలా అన్యాయం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదని ఏడ్చింది. అప్పుడు ఓసెఫ్ “ఓ బిడ్డా నువ్వు నాకు ఎంతో కన్నన్ కూడా అంతే అన్నాడు.

ఆ. ‘మాట్లాడే నాగలి’ అనే పేరు ఈ కథకు సరైందేనా ? ఎందుకు ?
జవాబు.
దేశాభివృద్ధిలో రైతులదే కీలకపాత్ర. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆయుధం నాగలి. రైతు యొక్క జీవితాన్ని విశ్లేషించిన కథ ‘మాట్లాడే నాగలి’. రైతు అతనికి ప్రాణప్రదమైన ఎద్దుల అనుబంధం ఈ కథలో వివరించబడింది. కనుక ఈ కథకు మాట్లాడే నాగలి అనుపేరు సరైందేనని భావించాలి. ఇక్కడ నాగలి అంటే ఎద్దు. మాట్లాడడమంటే ప్రేమను చూపడం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

అ. ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో మొదటి పేరాలో ఉంది. మొద్దుబారి పోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తలపైకెత్తి చుట్టూ చూసింది.

ఆ. అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో రెండవ పేరాలో ఉంది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తలమీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. ఔను, వెనకకాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కాని మునిసిపాలిటీ వేసిన ఆ నల్లముద్రను చెరపడం అంత సులభం కాదు.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

2. కింది పేరా చదవండి. ఖాళీలు పూరించండి.

ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపలకింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడ.

ఎందుకది ? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అ సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని “ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా!” అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. ‘పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతే’ అన్నారు భగవాన్.

అ. జీవకారుణ్యం అంటే ………………………..
జవాబు.
తోటి జీవుల పట్ల కారుణ్యంతో వ్యవహరించటం.

ఆ. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం ………………………..
జవాబు.
చీమలకు ఆహారం వెయ్యటం

ఇ. పూర్వాచారాలను పాటించాలె ఎందుకంటే ………………………..
జవాబు.
ఆ ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కలిసి ఉన్నవి.

ఈ. పై పేరాకు శీర్షిక ………………………..
జవాబు.
జీవకారుణ్యం

ఉ. పై పేరాలోని ఐదు ముఖ్యమైన పదాలు ………………………..
జవాబు.
పండుగరోజు, ఆశ్రమం, బియ్యపుపిండి, ఘాటు, ధనుర్మాసం, రంగవల్లులు, జీవకారుణ్యం.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు ?
జవాబు.
ఓసెఫ్ స్థానంలో నేనుంటే కన్నన్ను ఓసెఫ్ లాగానే కన్న బిడ్డలా చూసుకుంటాను. దానితోడిదే లోకంలా భావిస్తాను. నా మనుగడకు కారణమైన కన్నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అవసరం తీరిందిగదా, అది ఇంక ఎంతో కాలం పనిచేయలేదు కదా అని దానిని కటిక వానికి అమ్మను. పెంపుడు జంతువులపై ప్రేమను అందరికీ వివరిస్తాను.

ఆ. ‘పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది’ ఎందుకని ?
జవాబు.
ఎవరైనా మాటల్లో చెప్పేవిషయాలు చేతల్లో చేసి చూపించాలనేది ఓసెఫ్ తత్వం. ఆయన పశువులను ప్రేమగా చూడడం కర్తవ్యంగా భావించేవాడు. అందుకే ఓసెఫ్ తనకుమార్తె అత్తారింటికి వెళ్ళటానికి బట్టలు కొనడం కన్నా, తనకు చాలా కాలం జీవనాధారంగా నిలచిన మూగజీవి కన్నన్ మాంసశాలకు వెళ్ళకుండా ఉండడానికి పైసలు ఖర్చు చేయడం సరైందని భావించాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు చేసే కన్నా వాటిని రక్షిస్తే బాగుంటుందన్నాడు.

ఇ. క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు ?
జవాబు.
క్రయపత్రం అంటే బేరసారాలు జరిగేటప్పుడు కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు నమ్మకం కోసం ఒకరికొకరు రాసుకునే పత్రం. వ్యాపార లావాదేవీలు ముగిసేవరకే దీని విలువ ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఇండ్లు, గొడ్లు మొదలగు వాటికి క్రయవిక్రయాలు జరిపేటప్పుడు వీటిని రాసుకుంటారు. ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను ఇతరులకు విక్రయించేటప్పుడు కూడా ఈ క్రయపత్రాలు వ్రాసుకుంటారు. దీనిని ఇంగ్లీషులో ‘అగ్రిమెంట్’ అని వ్యవహరిస్తారు. ఒకనాడు నోటి మాటలతోనే క్రయవిక్రయాలు జరిగేవి. ఇపుడు క్రయపత్రం రాసుకోవటం తప్పనిసరి అయింది.

ఈ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి “నాన్నా!” అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి ‘నాన్నా’ అంది. ఇలా అనటానికి కారణం లేకపోలేదు. తండ్రి తనకు వివాహంచేసి అత్తగారింటికి పంపించటానికి బట్టలు తెస్తానని పెళ్ళిబట్టలు మానేసి కన్నన్ను వెంటబెట్టుకొచ్చాడు. మరి తను అత్తారింటికి వెళ్ళేదెట్లా. ఆ ఆశ నెరవేరేదెట్లా అని ఆలోచించిన కత్రి తన మనసులో కలిగిన ఆలోచనను ఆవేదనను ‘నాన్నా’ అన్న ఒక్క మాటలో వ్యక్తం చేయగలిగింది. ఇంత పనిచేస్తావని ఎప్పుడూ అనుకోలేదని మూగగా రోదించింది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ఉ. మాట్లాడే నాగలి ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ? రచయిత ఎవరు ? విశేషాలను తెలుపండి ? (అదనపు ప్రశ్న)
జవాబు.
మాట్లాడే నాగలి అను పాఠం అనువాద ప్రక్రియకు సంబంధించిన పాఠం. దీనిని మలయాళంలో పొన్కున్నం వర్కెయ్, వ్రాయగా దానిని ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువదించాడు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లైతే దానిని అనువాదం అంటాం. ఆంగ్లంలో అనువాదాన్ని ‘Translation’ అంటారు. సాహిత్య అకాడమీవారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు’ అనే గ్రంథంలో ప్రచురించిన మలయాళకథ ఇది. ప్రకృతి, మూగజీవుల పట్ల ప్రేమ ఆవశ్యకతను వివరించిన కథ ఇది. జీవకారుణ్యానికి ఈ కథ ఒక మచ్చుతునక.

ఊ. కన్నను, దాని స్వభావాన్ని వివరించండి. (లేదా) మాట్లాడే నాగలి పాఠం ఆధారంగా కన్నన్ ఎద్దు స్వభావాన్ని (అదనపు ప్రశ్న)
వివరించండి.
జవాబు.
కన్నన్ ఓసెఫ్కు జీవనాధారమైన ఎద్దు. ఓసెఫ్క కన్నన్ తోడిదే జీవితం. అది బూడిదరంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారం గలిగిన వృషభరాజం. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటకు ఉబికిన కళ్ళుండేవి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకత కన్పించేది. కన్నన్ విచక్షణాజ్ఞానం కలిగిన ఎద్దు. దానిని తిట్టవలసిన కొట్టవలసిన అవసరం ఓసెఫ్కు ఏనాడు రాలేదట. దీనిని బట్టి కన్నన్ ఎంతటి పెంపుడు జంతువో అర్థమౌతుంది. ఓసెఫ్ మాటలను ముందుగానే అర్థంచేసుకొని కూతురితో సమానమనిపించుకుంది.

ఎ. ఓసెఫ్ కన్నన్ను ఎలా శాంతింపజేసేవాడు ? (అదనపు ప్రశ్న)
జవాబు.
ఓసెఫ్ మాట్లాడిన ప్రతిమాట కన్నన్ అర్థం చేసుకునేది. ఎంతటి గుంపులో ఉన్నా కన్నన్ ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది. నాగలిని ఓసెఫ్ పడితేనే ఇష్టపడేది. ఇంకెవరు పట్టినా తన కొంటెతనం చూపించేది. కన్నన్ హెచ్చరికతో దానిని శాంతింపజేసేవాడు. పొలాల్లో పనిచేసే రైతులు చక్కగా పాటలు పాడుకుంటారు. వాటికి వ్యాకరణంతోగాని, శాస్త్రీయ రాగాలతోగాని పనిఉండదు. ఓసెఫ్ గొంతెత్తి చక్కని పాటలు పాడేవాడు. ఆ ఆలాపన కన్నన్కు మహాఇష్టం.

ఒకసారి మడి దున్నుతున్నపుడు ఓసెఫ్కు బదులు ఓసెఫ్ మిత్రుడు పచన్ పాట అందుకున్నాడు. ఆ పాటను విన్న కన్నన్ సంగీతాన్ని పచన్ అవమానిస్తున్నాడని కుడి కాలు మీద ఒక్కటి తన్నింది. ఓసెఫ్ మాటలతో మరలా శాంతించింది. ఇలా కన్నన్ విషయంలో ఎవరైనా ఓసెఫ్ తరువాతే, ఓసెఫ్కు కన్నన్ తరువాతే ఎవ్వరైనా!

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. (లేదా) ‘మాట్లాడే నాగలి’ పాఠం ఆధారంగా ఓసెఫ్, కన్నన్ ల మధ్య అనుబంధం గురించి రాయండి.
జవాబు.
ఓసెఫ్ ఒక రైతు. అతడు తన ఎద్దు కన్నన్ సంగతి వచ్చేసరికి అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదేలోకం. బూడిదరంగులో పొట్టిగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో, సుడిదిగిన బిగువైన చర్మంతో బయటకు ఉబికిన కళ్ళతో ఠీవిగా నడుస్తుంది. ఓసెఫ్ ప్రతి అడుగు ప్రతి మాట దానికి ఎరుకే! అందుకే కన్నన్ పై ఓసెఫ్ ఏనాడూ చెర్నాకోల వాడలేదు. కన్నన్ను ఓసెఫ్ ఎప్పుడూ కట్టేయ లేదు. దున్నటం పూర్తవగానే దానిని మేతకు వదిలేవాడు. కన్నన్ వంటికి అంటిన బురదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. కన్నన్కు ఓసెఫ్ చేసేపనులలో నచ్చనిది ఇది ఒక్కటే. ఓసెఫ్ కన్నన్కు తన హృదయంలోని ప్రేమానురాగాలను పంచి పెట్టేవాడు. పశువులను రక్షించాలన్న ఉపన్యాస మంటే ఓసెఫ్కు కోపం వచ్చేది.

ఓసెఫ్ దొడ్లో పశువులు ఆకలితో మాడితే ఆ ఇంటికి అరిష్టం వస్తుందనేవాడు. పనిఅవగానే ఇంటికి తీసుకొనిపోయి కన్నన్కు చేతినిండా గడ్డిపరకలను, అరటి తొక్కలను చిన్న కానుకగా ఇచ్చేవాడు. ఓసెఫ్ ప్రేమగా కన్నన్ను దువ్వుతుంటే కన్నన్ అతనిని నాకుతుంటుంది. ప్రేమకు మాటలూ ప్రదర్శనలు అవసరంలేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాలు. కుమార్తె “నాన్నా నువ్వు నాకింత పని చేస్తావని ఎపుడూ అనుకోలేదు” అని అన్నపుడు ఓసెఫ్ బిడ్డా “నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల్లో కన్నన్పట్ల ఓసెఫ్ ప్రేమ మనకు అర్థమౌతుంది.

(లేదా)
ఆ. మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి ? (లేదా) పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి రాయండి.
జవాబు.
ఈ సృష్టిలో మనిషికి బ్రతికే హక్కు ఎంత ఉందో మిగిలిన జీవరాశికి బ్రతికే హక్కు అంతే ఉంది. కాబట్టి మనం మూగ జీవాల మీద ప్రేమచూపించాలి. జీవరాశిలో మానవుడు విలక్షణమైనవాడు. మిగిలిన జీవరాశుల కంటే మానవుడు ఆలోచనా జ్ఞానం విచక్షణా జ్ఞానం కలిగినవాడు. మానవుడు జీవరాశి అంతటికి ఉన్నతుడు అవటంచేత ఇతర జీవరాశుల నియంత్రణకు పాల్పడుతున్నాడు. అది సరైన పద్ధతి కానేకాదు.

ప్రతి జీవిపై ప్రేమాభిమానాలను చూపించాలి. మనిషి తాను సుఖంగా బతకాలనుకొని ఇతర జీవరాశిని నాశనం చేస్తే ప్రకృతిలో అసమతౌల్యత తలెత్తే ప్రమాదం ఉంది. ఆ అసమతౌల్యతను అధిగమించటానికైనా మనం మూగ జీవాల మీద ప్రేమను చూపించాలి. మూగజీవులకు మాటలేదు. తమ బాధలను చెప్పుకోలేవు. అందుకే వాటిని ప్రేమగా లాలించాలి. అవి చేతలతో వ్యక్తం చేసే బాధలను అర్థం చేసుకోవాలంటే ప్రేమ చూపించడమే మార్గం.

ఇ. ఎద్దు (కన్నన్)ను అమ్మవలసిన పరిస్థితిలో ఓసెఫ్ పడిన బాధను వివరించండి. (లేదా) ఓసెఫ్కి ఎద్దులంటే చాలా ప్రేమ. వాటిని అమ్మేశాడు కదా ! పేదరైతులు తమకు విలువైన వాటిని ఎందుకమ్ముకుంటున్నారో వివరించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
కన్నన్ ఓసెఫ్ దగ్గర పన్నెండు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల ప్రభావం వలన ఓసెఫ్కు కన్నన్ ను అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తాను బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా కాదు. అంతకంటే గత్యంతరం లేదు. ఓసెఫ్కు పెళ్ళీడుకు వచ్చిన ముద్దుల కూతురుంది. ఆమె పెళ్లికి కట్నకానుకలు సమర్పించటానికి పొలాన్ని, తనకు ఇష్టమైన కన్నన్నీ అమ్మేయవలసివచ్చింది.

పెళ్లికొడుకు కుటుంబం పైసాకు రికాణా లేనిదైనా 3 వేలు కట్నంగా అడగటంతో అమ్మేయక తప్పిందికాదు. కన్నన్ ను అమ్మినపుడు ఓసెఫ్ అక్కడ లేడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు ఉండవు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే. ఓసెఫ్ బాధ ఎవరూ తీర్చలేనిది. ఓసెఫ్ మనసు మనసులో లేదు. కన్నన్ పట్ల ఓసెఫున్న ప్రేమ కథ చివరిలో కూతురుతో “బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతే” అన్నమాటల్లో అర్థమౌతుంది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
“మూగజీవులకు నోరొస్తే …..” ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జవాబు.
ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోరతపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షింపదలచి తన ఆశ్రమంలోని జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వమొచ్చి ఆశ్రమంలో తనకు అడ్డువచ్చే ప్రతి జంతువునూ నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆశ్రమంలోని విద్యార్థులను కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా తిట్టింది. దాంతో మహర్షికి కోపం వచ్చి మరలా దానికి మాట రాకుండా చేశాడు.

కాబట్టి ఎవరి స్థాయిని వారు మరువకూడదు.

ప్రశ్న 2.
“మూగజీవులను ప్రేమించాలి’ అన్న అంశాన్ని ప్రజలకు తెలియచెపుతూ ఒక కరపత్రం రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.

మూగజీవులను ప్రేమించాలి

ప్రజలారా!
సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో మనం ప్రేమానురాగాలను చూపించాలి. మనింట్లో ఒక ఆవో గేదో ఉందనుకుందాం. అది మనతో 10, 15 ఏండ్ల పాటు కలిసి మెలసి ఉంటుంది. మనకు ఒకరకంగా జీవనోపాధినిస్తుంది. తరువాత అది పాలివ్వటం లేదని కటికవానికి అప్పగించకూడదు. నాలుగు గడ్డిపరకలు వేస్తే దాని జీవనం అది గడుపుతుంది. అంతకన్నా మూగజీవాలు మనల్ని ఏమీ కోరవు. వాటి మూగ వేదనను రోదనను భరించవలసిన పని మనకేమిటంటే ఇక మానవత్వం ఎక్కడున్నది.

ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి. అవి మనకు ఏ హాని చేయవు. వాటిని ప్రేమిస్తూ నాలుగు గింజలను వాటికోసం ఉంచండి. మనకు పోయేదేంలేదు. దారి వెంట తనదారిన తాను పోతున్నా తొండల మీద పక్షుల మీద రాళ్ళను విసరటం మానుకోవాలి. అవి గాయపడితే మనకేం లాభం. కాబట్టి మూగజీవాలను ప్రేమతో ప్రేమించండి. ప్రేమిస్తారు కదూ!

ఇట్లు
జీవావరణ పరిరక్షణ కమిటీ,
వరంగల్.

పదజాల వినియోగం:

1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.
వృషభం = ఎద్దు

అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది.
జవాబు.
పసికట్టు = కనిపెట్టు

ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు.
ఠీవిగా = దర్జాగా

ఇ) మనిషిని అసహనం ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు.
అసహనం = సహనము లేకుండుట

ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.
అరిష్టం = కీడు

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

2. కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

ఆ) రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు ?
జవాబు.
హృదయము, ఎద, ఎడద

ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష

ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సంబరం, సంతోషం, ఆనందం

3. కింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.

ఆ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.
దిక్కు = దిశ, శరణము, వైపు

ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే ఉత్తరమివ్వ లేదు.
జవాబు.
ఉత్తరము = దిక్కు, లేఖ, జవాబు.

4. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతి వికృతి
1. మేఘం  అ. అచ్చెరువు
2. హృదయం  ఆ. ప్రేముడి
3. పశువు  ఇ. రాతిరి
4. ఆశ్చర్య  ఈ. మొగము
5. సంతోషం  ఉ. అబ్బురం
6. దీపం  ఊ. ఎద
7. ప్రేమ  ఎ. పసరం
8. సహాయం  ఏ. మొగులు
9. ముఖము  ఐ. సంతసం
10. అద్భుతం  ఒ. దివ్వె
11. రాత్రి  ఓ. సాయం

1. ఏ
2. ఊ
3. ఎ
4. అ
5. ఐ
6. ఒ
7. ఆ
8. ఓ
9. ఈ
10. ఉ
11. ఇ

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది సంధులను విడదీసి, సంధి పేర్లను రాయండి.

రూపము విసంధి పేరు
1. ప్రేమానురాగాలు ప్రేమ + అనురాగాలు సవర్ణదీర్ఘసంధి
2. ఆనందోత్సాహాలు ఆనంద + ఉత్సాహాలు గుణసంధి
3. ఇంకెవరు ఇంక + ఎవరు అత్వ సంధి
4. ఎక్కడయినా ఎక్కడ + ఐనా అత్వ సంధి
5. ఏమున్నది ఏమి + ఉన్నది ఇత్వసంధి
6. చేతులెట్లా చేతులు + ఎట్లా ఉత్వసంధి
7. పైకెత్తి పైకి+ఎత్తి ఇత్వసంధి
8. మరెక్కడ మరి + ఎక్కడ ఇత్వ సంధి
9. సారమంతా సారము + అంత ఉత్వసంధి
10. ఆలస్యమయ్యింది ఆలస్యము + అయింది ఉత్వసంధి
10. దుర్భరమైనా దుర్భరము + ఐన ఉత్వసంధి
12. రామేశ్వరం రామ + ఈశ్వరం గుణసంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసంపేరు
అ) కీళ్ళ నొప్పులు కీళ్ళ యొక్క నొప్పులు షష్ఠీ తత్పురుష సమాసము
ఆ) తల్లీ కూతుళ్ళూ తల్లియును కూతురును ద్వంద్వసమాసము
ఇ) దయా హృదయం దయతో కూడిన హృదయం తృతీయ తత్పురుష సమాసము
ఈ) భూమి శిస్తు భూమి యొక్క శిస్తు షష్ఠీ తత్పురుష సమాసము
ఉ) రాత్రింబవళ్ళూ రాత్రియును పగలును ద్వంద్వ సమాసము
ఊ) పది సంవత్సరాలు పది సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసము
ఎ) నలుదిక్కులు నాలుగు సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసము

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నిత్య జీవితంలో జంతువులు పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు కోకొల్లలు. వాటిలో నాకు తెలిసిన కథ వివరిస్తాను.’

బౌద్ధమతం బుద్ధునిచే ప్రారంభించబడింది. అది ‘అహింసో పరమోధర్మః’ అని ప్రబోధించింది. బుద్ధుడు చిన్నతనంలో ఒకానొక రోజున ఉద్యానవనంలో విహరిస్తుండగా హంసలు ఆ వనంలో హాయిగా అటుఇటు తిరుగుతున్నాయి. బుద్ధుని అన్న కుమారుడు ఆ హంసలలో ఒకదానిని బాణంతో కొట్టాడు. ఆ హంస బుద్ధుని వద్దకు వచ్చి పడిపోయింది. అపుడు బుద్ధుడు ఆ హంస శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి తన వస్త్రాన్ని చించి కట్టుకట్టి సంరక్షించాడు. ఆ హంసను నేను వేటాడాను; అది నాది నాకిమ్మని పట్టుపట్టాడు అన్న కుమారుడు. బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. వారి తగవు రాజు వద్దకు చేరింది. రాజు వారిద్దరి వాదనలు విని హంసను ప్రేమతో రక్షించిన వాడు బుద్ధుడు కావున అది బుద్ధునిదేనని తీర్పు ఇచ్చాడు.

ప్రేమించిన వానిదే ప్రాణి కాని హింసించిన వానిది కాదని ఈ కథలోని నీతి.

ప్రశ్న 2.
వివిధ జంతువులు / పక్షులు పెంపకం దారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల / పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
సంప్రదించిన వ్యక్తులు

  1. డేవిడ్ – కెన్నెల్ నిర్వాహకులు
  2. మన్నూభాయ్ – పావురాల ప్రేమికుడు
  3. కిరణ్ – కుక్కపిల్ల (జూలీ) ని పెంచుకుంటున్న స్నేహితుడు
  4. రంగమ్మత్త – పిల్లికూనను పెంచుకుంటున్న పక్కింటి అత్తమ్మ
  5. రామయ్య – ఆవును సాదుకుంటున్న పశుప్రేమికుడు
  6. సలీం అలీ – పక్షుల సంరక్షకుడు
  7. శ్రావణి – లవ్బర్డ్స్ని పెంచుతున్న ఒక అమ్మాయి.
  8. సురేందర్ – ఆక్వేరియంలో చేపపిల్లలను పెంచుతున్న మిత్రుడు

ఈవిధంగా మన చుట్టూ సమాజంలో ఉన్న రకరకాల జంతుప్రేమికులను, పక్షుల ప్రేమికులను, చేపల ప్రేమికులను సంప్రదించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. వివిధ రకాల పశుపక్ష్యాదుల పెంపకం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించడమే గాక, బాధ్యతను, సహానుభూతినీ, క్రమశిక్షణనూ నేర్పిస్తాయనీ తెలుసుకున్నాను. వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేశాయి.

నివేదిక :
మనుషులకు దగ్గరై, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని పెంచుకొని, విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మనసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే జంతువులూ, పక్షులూ మనచుట్టూ ఉన్నాయని, వాటి రక్షణ, పోషణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా మూగజీవుల మనోవేదనను, స్పందనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పెంపకం ఉపకరిస్తుందనీ గ్రహించాను.

మనకు ఇష్టమైన పక్షినో, జంతువునో పెంచుకోవాలనుకున్నప్పుడు వాటిని చిన్న వయస్సులో ఉండగానే తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, రక్షణ, భద్రత, పోషణకు సంబంధించిన అన్ని విషయాలూ కూలంకషంగా తెలుసుకోవాలి.

కొన్ని కొన్ని పక్షులకు / జంతువులకు ప్రత్యేకమైన ఆహారం, ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఉదాహరణకు పావురాలకు జొన్నలంటే ఇష్టం. అదే లవ్బర్స్కైతే కొర్రలు ఇష్టమైన ఆహారం. పిల్లులూ కుక్కలు కూడా పాలన్నా, మాంసాహారమన్నా ఇష్టపడతాయి. కుక్కలకు రొట్టెలు ఇష్టం. పిల్లులకు పెరుగన్నం ప్రీతిపాత్రం. చేపలకు నిర్దేశించిన ఆహారం ఎక్కువైతే విషతుల్యమౌతుంది.

అవి నివసించే పరిసరాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లులు, కుక్కలకు మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్ళే అలవాటు చేయాలి. పావురాలు, లబ్బర్డ్స్ తమ గూళ్ళను, పంజరాన్నీ బాగా మలిన పరుస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పిల్లులకు, కుక్కలకు తరచూ స్నానం చేయిస్తుండాలి. ఆవులు కూడా స్నానానికి ఇష్టపడతాయి. ఎద్దులు అంతగా ఇష్టపడవు. చేపల అక్వేరియంలు తొందరగా మురికి అయిపోతుంటాయి. వాటిని 10-15 రోజులకొకసారి శుభ్రం చేయాలి.

పశువులు, పక్షులు సరిగ్గా నిద్రపోకున్నా, వాటి అరుపుల్లో తేడా వచ్చినా, నీరసంగా కనిపించినా వెంటనే వాటికి సంబంధించిన వైద్యులకో, అనుభవజ్ఞులకో చూపించి తగిన వైద్య సహాయం అందించాలి. అవి మూగజీవులు – మన భాషను అవి అర్థం చేసుకుంటాయి. కాని వాటి భాషనే మనం అర్థం చేసుకోలేం. తగినంత శ్రద్ధ, పరిశీలన ఉంటే కనీసం వాటి మనోభావాలను అర్థం చేసుకొని, తగిన విధంగా స్పందించగలుగుతాం.

జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. నగరాల్లో వాటిని స్వేచ్ఛగా వదిలేసే అవకాశం లేకుంటే కనీసం రోజుకొక్కసారైనా బయటి ప్రపంచంలో తిప్పడం మంచిది. లవ్బర్డ్స్ పెద్దవయ్యాక వాటిని పంజరంలో నుండి స్వేచ్ఛగా వదిలేయాలి.

ఈవిధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పోషించడమేగాక, వీలైనంత సమయం వాటితో గడిపితే వాటికీ, మనకూ ఆనందంగా ఉంటుంది. మూగజీవులను స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు సాటి మనుషులతో సఖ్యంగా నివసించగల్గుతారు.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

రైతు = కృషీవలుడు, కర్షకుడు
లోకము = ప్రపంచము, జగత్తు
రాజు = చక్రవర్తి, భూపాలకుడు
కళ్ళు = నయనము, నేత్రములు
స్నేహితుడు = మిత్రుడు, నేస్తము
చెట్టు = తరువు, వృక్షము
భూమి = ఇల, ధరణి
పండుగ = ఉత్సవము, సంబరము

నానార్థాలు:

రాజు = చంద్రుడు, భూపాలుడు
ఊరు = గ్రామము, ద్రవించు
స్నేహితుడు = చెలికాడు, సూర్యుడు
అర్ధము = శబ్దార్థము, ప్రయోజనము

ప్రకృతులు – వికృతులు

ప్రకృతి – వికృతి
భాష – బాస
మనిషి – మనిసి
ప్రాణము – పానము
కష్టము – కస్తి
ఆశ – ఆస

సంధులు:

బ్రహ్మాండమైన = బ్రహ్మాండము + ఐన = ఉత్వసంధి
చిత్రమైన = చిత్రము + ఐన = ఉత్వసంధి
గొంతెత్తి = గొంతు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

ప్రత్యక్షము = ప్రతి + అక్షము = యణాదేశసంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమవుతాయి.

చెప్పినదంతా = చెప్పినది + అంతా = ఇత్వ సంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది.

ప్రేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.

ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సాహాలు = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

సమాసములు:

అరటి చెట్టు = అరటి అనుపేరుగల చెట్టు = సంభావనా పూర్వపద కర్మధారయము
ప్రేమానురాగాలు = ప్రేమయును, అనురాగమును = ద్వంద్వ సమాసము
మంచి భూమి = మంచిదైన భూమి = విశేషణ పూర్వపద కర్మధారయము
మధ్యాహ్నము = అహ్నం యొక్క మధ్య భాగము = ప్రథమా తత్పురుష సమాసము

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

క్రింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ప్రశ్న 1.
అరిష్టం : _____________
జవాబు.
అరిష్టం = కీడు.
భగవంతుని ఆరాధించేవారిని ఏ అరిష్టాలు దరిచేరవు.

ప్రశ్న 2.
ఠీవి : _____________
జవాబు.
ఠీవి = వైభవం, హుందా.
శ్రీరామనవమికి సీతారామ కల్యాణం ఎంతో ఠీవిగా జరిగింది.

ప్రశ్న 3.
పరిరక్షించు : _____________
జవాబు.
పరిరక్షించు = కాపాడు
తల్లిదండ్రులు పిల్లలను అనుక్షణం పరిరక్షిస్తుంటారు.

ప్రశ్న 4.
తాకట్టు : _____________
జవాబు.
తాకట్టు = కుదువపెట్టు
పేదవారు అవసరానికి వస్తువులను తాకట్టుపెట్టుకొని అవసరం గడుపుకుంటారు.

ప్రశ్న 5.
ముచ్చటపడు : _____________
జవాబు.
ముచ్చటపడు = ఇష్టపడు
ముచ్చటపడి కొనుక్కొన్న వాహనం వానపడి బురద కొట్టుకుపోయింది.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

కింది గీతగీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 6.
విశ్వం – అర్థాన్ని గుర్తించండి. ( )
A) నేల
B) ప్రపంచ
C) దేవుడు
D) భూమి
జవాబు.
B) ప్రపంచ

ప్రశ్న 7.
ఒంగోలు జాతి వృషభాలు ప్రపంచ ప్రసిద్ధి వహించినవి. ( )
A) పక్షులు
B) గేదెలు
C) ఆవులు
D) ఎద్దులు
జవాబు.
D) ఎద్దులు

ప్రశ్న 8.
మా పెరటిలో కొబ్బరి మొలకలు వచ్చాయి. ( )
A) మొక్క
B) పిలక
C) చెట్టు
D) గెల
జవాబు.
B) పిలక

ప్రశ్న 9.
మూగజీవుల పట్ల క్రూరత్వం పనికిరాదు. ( )
A) మంచితనం
B) పిరికితనం
C) దయలేనితనం
D) జాలి
జవాబు.
C) దయలేనితనం

ప్రశ్న 10.
ఎన్ని రకాల పండ్లను తిన్నా మామిడి పండ్ల మాధుర్యం దేనిలోనూ లభించదు. ( )
A) తీపి
B) చేదు
C) పులుపు
D) వగరు
జవాబు.
A) తీపి

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

నానార్థాలు:

ప్రశ్న 11.
అంజలి ఘటించటం భారతీయుల సంస్కారం – గీతగీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. ( )
A) దోసిలి, నమస్కారం
C) అమ్మాయి, పాప
B) అందము, చందము
D) తిరస్కారం, దూషణం
జవాబు.
A) దోసిలి, నమస్కారం

ప్రశ్న 12.
వంశము, జాతి పదాలకు నానార్థం గుర్తించండి. ( )
A) మతము
B) తెగ
C) కులము
D) జాతి
జవాబు.
C) కులము

ప్రశ్న 13.
పని, ప్రయోజనము – వీటి నానార్థం గుర్తించండి. ( )
A) పాట
B) ఆట
C) మాట
D) కార్యము
జవాబు.
D) కార్యము

ప్రశ్న 14.
క్షీరము, భాగము – వీటి నానార్థం గుర్తించండి. ( )
A) నీళ్లు
B) నూనె
C) పాలు
D) ఏదీకాదు
జవాబు.
C) పాలు

పర్యాయపదాలు:

ప్రశ్న 15.
‘అడవి’కి పర్యాయపదాలు గుర్తించండి. ( )
A) విపినము, వనము
B) నది, వాహిని
C) సెలయేరు, చెరువు
D) కొండ, పర్వతం
జవాబు.
A) విపినము, వనము

ప్రశ్న 16.
‘కలాపి’కి పర్యాయపదాలు చెప్పండి. ( )
A) కుక్క, నక్క
B) పిల్లి, పులి
C) నెమలి, మయూరము
D) చిలుక, గోరువంకలు
జవాబు.
C) నెమలి, మయూరము

ప్రశ్న 17.
పరిమళము నకు పర్యాయపదాలు. ( )
A) అర, పరి
B) చక్కనిగాలి, మధురము
C) ధరణి, పరిమాపకము
D) సౌరభం, సువాసన
జవాబు.
D) సౌరభం, సువాసన

ప్రశ్న 18.
‘ధరణి’కి పర్యాయపదాలు. ( )
A) నీరు, జలం
B) భూమి, అవని
C) గాలి, ధర
D) ఆకాశము, గగనము
జవాబు.
B) భూమి, అవని

ప్రశ్న 19.
సీతారాముల పెళ్ళి చూతము రారండి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ? ( )
A) వివాహము, పరిణయము
B) తన్ను, కొట్టు
C) సంబరం, ఆనందం
D) ధనం, సొమ్ము
జవాబు.
A) వివాహము, పరిణయము

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ప్రకృతి – వికృతులు:

ప్రశ్న 20.
‘తీరము’నకు వికృతి పదం ( )
A) కాలువ
B) ఒడ్డు
C) నది
D) దరి
జవాబు.
D) దరి

ప్రశ్న 21.
సిరి – ప్రకృతి పదాన్ని గుర్తించండి. ( )
A) స్త్రీ
B) శ్రీ
C) ఇంతి
D) పడతి
జవాబు.
B) శ్రీ

ప్రశ్న 22.
పండుగ దినాలలో దేవాలయమునకు వెళ్ళాలి. గీతగీసిన పదానికి వికృతి ( )
A) దేవళము
B) గుడి
C) దేశీవళం
D) దర్శనము
జవాబు.
A) దేవళము

భాషాంశాలు:

సంధులు:

ప్రశ్న 23.
గొంతెత్తి – విడదీసి రాయండి. ( )
A) గొంతు + ఎత్తి
B) గొంతె + ఎత్తి
C) గొం + తెత్తి
D) గొం + ఎత్తి
జవాబు.
A) గొంతు + ఎత్తి

ప్రశ్న 24.
ప్రభువు + అయిన – కలిపి రాయండి. ( )
A) ప్రభువయిన
B) ప్రభువైన
C) ప్రభైన
D) ప్రభువై
జవాబు.
B) ప్రభువైన

ప్రశ్న 25.
బ్రహ్మాండమైన – ఇందులో సంధి పేరు గుర్తించండి. ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) ఇత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు.
D) ఉత్వసంధి

ప్రశ్న 26.
ఆనందోత్సాహాలు’లోని సంధి పేరు గుర్తించండి. ( )
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) ఇత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు.
B) గుణసంధి

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

సమాసాలు:

కింది పదాలను అడిగిన విధంగా గుర్తించండి.

ప్రశ్న 27.
‘కష్టసుఖములు’ విగ్రహవాక్యం ( )
A) కష్టమును సుఖమును
B) కష్టము, సుఖము
C) కష్ట సుఖాలు
D) కష్ట మనెడు సుఖము
జవాబు.
A) కష్టమును సుఖమును

ప్రశ్న 28.
భూమి యొక్క శిస్తు – సమాస పదము గుర్తించండి. ( )
A) భూమిశిస్తూ
B) భూమిశిస్తు
C) భూమిశిస్తులు
D) భూమి కొరకు శిస్తు
జవాబు.
B) భూమిశిస్తు

ప్రశ్న 29.
‘మంచిమాటలు’ – సమాస నామాన్ని గుర్తించండి. ( )
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమాసం
C) రూపక సమాసం
D) విశేషణ పూర్వపద కర్మధారయము
జవాబు.
D) విశేషణ పూర్వపద కర్మధారయము

ప్రశ్న 30.
మూడు రోజులు – విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. ( )
A) మూడు సంఖ్య గల రోజులు
B) మూడు అనెడు రోజులు
C) మూడును, రోజులును
D) మూడు వలన రోజులు
జవాబు.
A) మూడు సంఖ్య గల రోజులు

ప్రశ్న 31.
‘రైతు హృదయం’లోని సమాసం ( )
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) సప్తమీ తత్పురుష సమాసం
జవాబు.
C) షష్ఠీ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు. ఎటువంటి వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 32.
నాన్న రావటానికింత ఆలస్యమేమిటి అమ్మా ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం

ప్రశ్న 33.
ఆహా ! ఆ ఎద్దు ఎంత అందంగా ఉందో ! ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం

ప్రశ్న 34.
నువ్వు వృషభరాజానివి ; ఆ పొలమంతా దున్నగలవు. ( )
A) ఆశ్చర్యార్థకం
B) సామర్థ్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
B) సామర్థ్యార్థకం

ప్రశ్న 35.
నువ్వు కన్నన్ ను తీసుకువెళ్ళవచ్చు ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రేరణార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
D) అనుమత్యర్థకం

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

క్రియను గుర్తించుట:

గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.

ప్రశ్న 36.
పశువులు తిండిలేక మాడితే అరిష్టం దాపురిస్తుంది. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) చేదర్థకం

ప్రశ్న 37.
కన్నన్ అనే ఎద్దు పొలం దున్ని బయటకి వచ్చింది. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 38.
కన్నన్ పొలం దున్నినా ఉత్సాహంగానే బయటికి వచ్చేది. ( )
A) క్త్వార్థం
B) అప్యర్థకం
C) చేదర్థకం
D) శత్రర్థకం
జవాబు.
B) అప్యర్థకం

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 39.
ఓసెఫ్ ‘కన్నన్’ అంటూ కేక వేశాడు. ఓసెఫ్ కన్నన్ను చేరుకున్నాడు. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) ఓసెఫ్ కన్నన్ అంటూ కేక వేసి చేరుకున్నాడు.
B) ఓసెఫ్ కన్నన్ అంటూ కేక వేస్తూ దాన్ని చేరుకున్నాడు.
C) ఓసెఫ్ కన్నన్ అంటూ కేకలు వేస్తూ దాన్ని చేరుకుంటున్నాడు.
D) ఓసెఫ్ కన్నన్ను చేరుకుంటూ కన్నన్ అని కేకలు వేశాడు.
జవాబు.
A) ఓసెఫ్ కన్నన్ అంటూ కేక వేసి చేరుకున్నాడు.

ప్రశ్న 40.
నేను వరంగల్లు వచ్చాను. నేను సిద్ధార్థలో చేరాను. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) నేను వరంగల్లు వస్తూ సిద్ధార్థలో చేరాను
B) నేను వరంగల్లు రావాలని సిద్ధార్థలో చేరాను
C) నేను సిద్ధార్థలో చేరటానికి వరంగల్లు వచ్చాను
D) నేను వరంగల్లు వచ్చి సిద్ధార్థలో చేరాను
జవాబు.
D) నేను వరంగల్లు వచ్చి సిద్ధార్థలో చేరాను

ప్రశ్న 41.
కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టింది. కన్నన్ నెమలిలా ఆనందించేది. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపడుతూ నెమలిలా ఆనందించేది.
B) కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టి నెమలిలా ఆనందించేది.
C) కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టకుండానే నెమలిలా ఆనందించేది.
D) కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టాలని నెమలిలా ఆనందించేది.
జవాబు.
B) కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టి నెమలిలా ఆనందించేది.

ప్రశ్న 42.
కన్నన్ తల అటూ ఇటూ తిప్పింది. కన్నన్ తన నిరసన ప్రకటించింది. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) కన్నన్ తల అటూ ఇటూ తిప్పుతూ నిరసన ప్రకటించింది.
B) కన్నన్ తల అటూ ఇటూ తిప్పాలని నిరసన ప్రకటించింది.
C) కన్నన్ తల అటూ ఇటూ తిప్పి నిరసన ప్రకటించింది.
D) కన్నన్ తల అటూ ఇటూ తిప్పకుండా నిరసన ప్రకటించింది.
జవాబు.
C) కన్నన్ తల అటూ ఇటూ తిప్పి నిరసన ప్రకటించింది.

ప్రశ్న 43.
అందులో పదాలు ఉండవు. అందులో వాక్యాలు ఉండవు. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) అందులో పదాలు ఉంటే వాక్యాలు ఉండవు.
B) అందులో పదాలు, వాక్యాలు ఉండవు.
C) అందులో పదాలు ఉన్నా వాక్యాలు ఉండవు.
D) అందులో ఉండవు వాక్యాలు, పదాలు
జవాబు.
B) అందులో పదాలు, వాక్యాలు ఉండవు.

ప్రశ్న 44.
ఉత్పత్తులు పెరిగాయి. ధరలు తగ్గలేదు. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) ఉత్పత్తులు పెరుగుతున్నా ధరలు తగ్గలేదు.
B) ఉత్పత్తులు పెరిగినా ధరలు తగ్గలేదు.
C) ఉత్పత్తులు పెరిగాయి కానీ ధరలు తగ్గలేదు.
D) ధరలు తగ్గలేదు ఉత్పత్తులు పెరిగినా.
జవాబు.
C) ఉత్పత్తులు పెరిగాయి కానీ ధరలు తగ్గలేదు.

ప్రశ్న 45.
ఓసెఫ్ బట్టల ధరలు కనుక్కున్నాడు. నాణ్యత కనుక్కున్నాడు. -సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) ఓసెఫ్ బట్టల ధరలు, నాణ్యత కనుక్కున్నాడు.
B) ఓసెఫ్ బట్టల ధరలతో పాటు నాణ్యత కనుక్కోలేదు.
C) ఓసెఫ్ బట్టల ధరలనూ నాణ్యతనూ కనుక్కుంటున్నాడు.
D) బట్టల ధరలూ, నాణ్యతను ఓసెఫ్ కనుక్కుంటున్నాడు.
జవాబు.
A) ఓసెఫ్ బట్టల ధరలు, నాణ్యత కనుక్కున్నాడు.

ప్రశ్న 46.
దుకాణాలు పెరిగాయి. దోపిడీ పద్ధతులు పెరిగాయి. సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) దుకాణాలు పెరిగినా దోపిడీ పద్ధతులు పెరిగాయి.
B) దుకాణాలు మరియు దోపిడీ పద్ధతులు పెరిగాయి.
C) దుకాణాలు, దోపిడీ పద్ధతులు పెరుగుతున్నాయి.
D) దుకాణాలు పెరిగాయి కానీ దోపిడీ పద్ధతులు పెరగలేదు.
జవాబు.
D) దుకాణాలు పెరిగాయి కానీ దోపిడీ పద్ధతులు పెరగలేదు.

TS 8th Class Telugu Bits 12th Lesson మాట్లాడే నాగలి

ప్రశ్న 47.
తనకు సౌఖ్యాన్ని కలిగించింది ఆ గొంతు. తనకు ఆశను కలిగించింది ఆ గొంతు. ( )
A) తనకు సౌఖ్యాన్ని, ఆశను కలిగించింది ఆ గొంతు.
B) తనకు సౌఖ్యాన్ని కలిగించి ఆశను కలిగించింది ఆ గొంతు.
C) తనకు సౌఖ్యంతో పాటు ఆశను కలిగించింది ఆ గొంతు.
D) ఆ గొంతు తనకు సౌఖ్యాన్ని, ఆశను కలిగించింది.
జవాబు.
A) తనకు సౌఖ్యాన్ని, ఆశను కలిగించింది ఆ గొంతు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

These TS 8th Class Telugu Bits with Answers 11th Lesson కాపుబిడ్డ will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

చదువండి – ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 81

తొలిజల్లు వచ్చింది
తొలకరించింది.
పదవోయి రైతన్న
పాటుచేయంగ!

బలము నీవే జాతి
కలిమి నీవేరా!
పాతరల బంగారు
పంట నింపుమురా!!

హలమే మన సౌభాగ్య
బలమనుచు చాటి
పొలము దున్నాలోయి
పొలికేక బెట్టి!

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ప్రశ్న 1.
తొలివానకురిసే కాలాన్ని ఏమంటారు ?
జవాబు.
తొలివాన కురిసే కాలాన్ని తొలకరి అంటారు.

ప్రశ్న 2.
ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది ?
జవాబు.
ఈ గేయం రైతును గురించి చెబుతుంది.

ప్రశ్న 3.
గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు.
“గేయంలో హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలోయి” అని ఉన్నది. బొమ్మలో హలం పట్టుకొని రైతు పొలం దున్నుతున్నాడు. గేయంలోను, బొమ్మలోనూ ఉన్నభావం ఒక్కటే.

ప్రశ్న 4.
బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు ?
జవాబు.
రైతు ఎండ, వాన లెక్క చెయ్యకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలో శ్రమపడతాడు. తన సుఖాన్ని త్యాగం చేసి తన చెమటతో నేలను తడిపి బంగారు పంటలను పండిస్తాడు. ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రశ్న.
కాపుబిడ్డ పాఠ్యభాగ ఉద్దేశం వివరించండి.
జవాబు.
ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసా తత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం.
ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి.

కవి పరిచయం:

ప్రశ్న .
గంగుల శాయిరెడ్డి పరిచయం రాయండి.
జవాబు.
(పరీక్షల్లో గీత గీసిన వాక్యాలు రాస్తే చాలు)
ఈ పాఠ్యాంశాన్ని రాసినకవి గంగుల శాయిరెడ్డి. పూర్వం నల్లగొండ జిల్లాలోను, ప్రస్తుతం వరంగల్లు జిల్లాలోను భాగమైన ‘జీడికల్లు’ గ్రామం వీరి జన్మస్థలం.

శాయిరెడ్డి రచనల్లో ‘కాపుబిడ్డ’ కావ్యంతోపాటు తెలుగు పలుకు; ‘వర్షయోగము; ‘మద్యపాన నిరోధము’ అనేవి ముద్రితాలు. ఇంకా గణిత రహస్యము. ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనా భావం గల శాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.

ప్రవేశిక:

ప్రశ్న.
కాపుబిడ్డ పాఠ్యభాగ ప్రవేశిక తెల్పండి.
జవాబు.
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా! ‘సత్కవుల్ హాలికులైన నేమి’ అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

కఠిన పదాలకు అర్థాలు:

పూను = దీక్షవహించు
క్రాగుచు = ఎండలో కాలిపోతూ
హలము = నాగలి
సాధులు = సత్పురుషులు
వెత = బాధ
సైచువారు = సహించువారు
సైరికులు = రైతులు
చేయిమోడ్చి = చేతులు జోడించి, నమస్కరించి
ఈవు = నీవు
శీతంబు = చలి
చీకటి కప్పి = చీకటి వ్యాపించి
ఇడుములు = కష్టాలు
అడలుదు = బాధపడుతుంటావు
అంగలార్చు = ఎదురుచూచు
సంయమి = ముని
కుడిచి = అనుభవించి
కొంపంతా = ఇల్లంతా
మెదులుట = కదులుట, తిరుగుట
మాపటివేళ = రాత్రివేళ
వృశ్చికం = తేలు
ఆలు = భార్య
వ్యాఘ్రం = పులి
బ్రాహ్మీముహూర్తం = తెల్లవారుజాము
తానం = స్నానం
వదరుబోతు = వాగుడుకాయ
కుటిలం = మోసం
ఈగి = దానం
మితభాషి = తక్కువగా మాట్లాడు
జొన్నగటక = జొన్నసంకటి
సుధ = అమృతం
వలపలిచేయి = కుడిచేయి
వడుకు ఉడుపులు = చేతితో నేసిన నేత వస్త్రాలు
కంబళి = గొంగళి, రగ్గు
పరిజనం = పరివారం
నిక్షేపములు = నిధులు
బల్ + వలపు = బల్వలపు = మిక్కిలి ప్రేమ
కేలు = చేయి

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు:

I. 1. సీ. మండువేసవియెండ, మంటలోఁగ్రాగుచు
బూనిన పనిసేయు మౌనులెవరు ?
వానలో నానుచు, వణకుచు హలమూని
చలియందు దున్నెడి సాధులెవరు ?
ఱాళ్ళలో నడవిలో, రాతిరింబవలును
తడబాటు లేనట్టి, తపసులెవరు ?
తలక్రింద చేయిడి, గులకశిలల పైన వెత లేక నొరిగిన వేత్తలెవరు ?
గీ. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులుదప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

ప్రతిపదార్థం :

మండు వేసవి ఎండన్ = మండిపోయే వేసవికాలపు ఎండలో
మంటలోన్ = వేడిలో
క్రాగుచు = కాలిపోతూ
పూనిన = దీక్షవహించిన (తాను చేయాలనుకొన్న)
పని + చేయు = పనిని పూర్తి చేసే
మౌనులు = మహర్షులు
ఎవరు = ఎవ్వరు ?
వానలో నానుచు = వర్షంలో తడిసిపోతూ
వణకుచు = గజగజ వణుకుతూ
హలము + ఊని = నాగలి ధరించి
చలి + అందు = చలిలో కూడా
దున్నెడి = పొలందున్నె
సాధులు + ఎవరు = సత్పురుషులు ఎవరు
ఱాళ్ళలోన్ = రాళ్ళలోనూ
అడవిలోన్ = అడవిదారిలోనూ
రాతిరిన్ = రాత్రివేళ
పవలున్ = పగటివేళ
తడబాటు = ఏవిధమైన భయము
లేని + అట్టి = లేనటువంటి
తపసులు + ఎవరు = తాపసులు ఎవరు
తలకింద = తల కింద
చేయి + ఇడి = చేయి పెట్టుకొని
గులక శిలలపైన = గులక రాళ్ళ మీద
వెతలేకన్ = ఏ బాధాలేకుండా
ఒరిగిన = పడుకున్న
వేత్తలు + ఎవరు = పండితులెవరు
కష్ట సుఖములన్ = కష్టములోను, సుఖములోను
ఒకరీతిన్ = ఒకేవిధముగా
గడుపువారు = కాలం గడిపే వారు
శత్రుమిత్రులన్ = విరోధులను, స్నేహితులను\
సమముగా = సమానంగా
సైచువారు = ఆదరించువారు
సైరికులు + తప్ప = రైతులు తప్ప
అంతటి = అంత గొప్ప
శాంత మూర్తులు = ఓర్పుగలవారు
ఎవరు = ఇంకెవరున్నారు ?
కాన = అందుకే
చేయి + మోడ్చి = చేతులు ముడిచి
వారిని + ఏ = ఆ రైతులనే
గౌరవింతు = సన్మానిస్తాను

తాత్పర్యం :
మంటలు మండే ఎండకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా చేపట్టిన పని కొనసాగించే ఋషు లెవరు ? వానలో నానుతు చలిలో వణుకుతు నేలను దున్నే సాధువు లెవరు ? రాత్రనక, పగలనక, రాతి నేలల్లో, అడవుల్లో తడబడకుండ తిరిగే తాపసులెవరు? ఎన్ని బాధలున్నా లెక్కచేయక, గులకరాతి నేలమీదనే తలకింద చేయి పెట్టుకొని విశ్రమించే విజ్ఞులెవరు కష్టసుఖాలను ఒకే విధంగా, శత్రు, మిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులెవరు ? రైతులుగాక! అందుకే చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

2. సీ. కార్చిచ్చులోబడి వంటకమ్ముల ద్రొక్కి
వడగండ్ల దెబ్బల వడుదువీవు
పెనుగాలి చే దుమ్ము కనులందుఁబడుచుండ
నుఱుము మెఱుములలో నుందువీవు
మంచుపైఁబడుచుండ మాపుశీతంబులో
పచ్చికనేలపై పండుదీవు
కటిక చీకటి గప్పి యెటుదారిగానక
నాఁకలి డప్పిచే నడల దీవు
గీ. ఇన్నియిడుముల గుడిచి నీ విల్లుజేర
నాలుపిల్లలు కూటికై యంగలార్చ
చలనమింతైన లేని యో సంయమీంద్ర
కర్షకా! నిన్ను చేమోడ్చి గౌరవింతు.

ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
కార్చిచ్చులోన్ + పడి = మంటలలో మండిపోతూ
కంటకమ్ములన్ = ముళ్ళను
త్రొక్కి = కాళ్ళకింద తొక్కుతూ
పెనుగాలిచే = పెద్దగాలులు వీచినప్పుడు
దుమ్ము = ధూళి
కనులందున్ = కళ్ళలో
పడుచుండన్ = పడిపోతూ ఉండగా
ఉఱము మెఱములలో = ఉరుములూ మెరుపుల మధ్య
ఉందువు + ఈవు = నీవుంటావు
మంచు = మంచు
పైన్ + పడుచు + ఉండ = మీద కురుస్తూ ఉంటే
మాపు = రాత్రిపూట
శీతంబులో = చలిలో
పచ్చికనేలపై = గడ్డి భూముల మీద
పండు + ఈవు = పడుకుంటావు
కటిక చీకటి + కప్పి = దట్టమైన చీకటి వ్యాపించి
ఎటుదారి + కానకన్ = ఏ దారియు కనిపించక
ఆకలి దప్పిచే = ఆకలితో, దాహంతో
అడలుదు + ఈవు = నీవు బాధపడుతుంటావు
అన్ని + ఇడుములన్ = అన్ని కష్టాలనూ
కుడిచి = అనుభవించి
నీవు = రైతువైన నీవు
ఇల్లున్ + చేరన్ = ఇంటికి చేరేసరికి
ఆలుపిల్లలు = భార్యయు, బిడ్డలును
కూటికి + ఐ = తిండికోసం
అంగలు + ఆర్చ = ఎదురు చూస్తుండగా
ఇంత + ఐన = కొంచెము కూడా వారి గురించి
చలనము లేని = కదలిక లేని
ఓ సంయమి + ఇంద్రా = ఓ మునివర్యా!
నిన్ను = నిన్ను
చేయి + మోడ్చి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = గౌరవిస్తాను

తాత్పర్యం :
ఓ కర్షకుడా! మిక్కిలి వేడిమిని సహించి, ముండ్లమీద నడిచి, వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మినా, ఉరుములు మెరుపులతో ఉన్నా చలించవు. మంచుకురిసే రాత్రి వేళల్లో, చలిలో, పచ్చిక నేలమీదనే నిద్రపోతావు. ఎటూ దారి కానరాని కటిక చీకటి రాత్రులలో అప్పుడప్పుడు ఆకలిదప్పికలతోనే కాలం గడపవలసి వస్తుంది.

ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య, పిల్లలు ఆకలితో అన్నానికై అంగలారుస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీవు యతీశ్వరుని వలె ఏ మాత్రమూ చలనం లేకుండా ఉంటావు. అలాంటి నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను.

వివరణ :
కష్టాలను, సుఖాలను ఒకేలా చూసేవారు యతులు. యతులు కష్టాలకు బాధపడరు, సుఖాలకు ఆనందించరు. రైతు కూడా యతి లాంటివాడే. తన భార్యాబిడ్డలు తిండిలేక ఆకలితో ఉన్నా, దాని గురించి బాధపడడు. కష్టమూ, సుఖమూ ఒకేలా భావిస్తాడు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

II. 3. సీ. ఎండల వేడికి నెత్తుమేడలు లేక
చెట్టుల నీడకుఁ జేరినావు
కొలది చినుకులకే కొంపంత తడియగా
పొదరిండ్ల బురదలో మెదలినావు
గడగడ వడకుచు గడ్డివాముల దూఱి
చలికాలమెట్టులో జరిపినావు
పుట్టలొల్కుల మిట్ట బట్టిమాపటివేళ
గాఢాంధకారము గడపినావు
గీ. సర్పవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు
నునికి పట్టగుచోట్లలో మునులభంగి
తిరిగి యేప్రొద్దు నుందువో దివ్యమూర్తి
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు||

ప్రతిపదార్థం :

దివ్యమూర్తి = ఓ దేవతామూర్తీ!
కర్షకా = రైతన్నా!
ఎండల వేడికి = ఎండలవలన కలిగిన వేడికి తట్టుకోటానికి
ఎత్తు మేడలు లేక = ఎత్తైన భవనాలు లేక
చెట్టుల నీడకు = చెట్ల నీడల
చేరినావు = వచ్చియున్నావు
కొలది = కొద్దిపాటి
చినుకులకే = వానచినుకులకే
కొంప + అంత = ఇల్లంతా
తడియగా = తడిసిపోగా
పొదరు + ఇండ్ల బురదలో = పొదరిళ్ళ దగ్గరున్న బురదలో
మెదలినావు = తిరిగినావు
గడగడ వడకుచు = చలికి వణికిపోతూ
గడ్డివాముల + దూరి = గడ్డి కుప్పలలో దూరి
చలికాలము = శీతాకాలము
ఎట్టులు + ఓ = ఎలాగో అతి కష్టం మీద
జరిపినావు = గడిపేశావు
పుట్టలొల్కుల = పుట్టదగ్గర గుట్టల దగ్గర
మిట్టన్ + పట్టి = ఎత్తు ప్రదేశాలలోను తిరిగి
మాపటివేళ = రాత్రిపూట
గాఢ + అంధకారము = దట్టమైన చీకటిలో
గడిపినావు = కాలం గడిపావు
సర్ప = పాములు
వృశ్చిక = తేళ్ళు
వ్యాఘ్ర = పులులు
ఆది = మొదలైన
జంతువులకు = మృగములకు
ఉనికి పట్టు = నివాసము
అగుచోట్లలో = ఐన ప్రదేశములలో
మునులభంగి = రుషుల వలె
ఏప్రొద్దు = ఏవేళనైనా
తిరిగి = తిరుగుతూ
ఉందువు + ఒ = ఉంటావుగదా
చేతులు + ఎత్తి = రెండు చేతులు పైకెత్తి
నే = నేను
గౌరవింతు = నిన్ను గౌరవిస్తాను

తాత్పర్యం :
ఓ రైతన్నా! ఎత్తైన మేడలు లేని నీవు ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురదనిండిన గుబురుల్లోనే తలదాచుకుంటావు. చలిబారి నుండి తప్పించుకోవటానికి గడ్డివాములను ఆశ్రయిస్తావు. పనిమీదపడి కటికచీకటి రాత్రులందు కూడ పుట్టలు, మిట్టలపై సంచరిస్తుంటావు. పాములు, తేళ్ళు, పులుల వంటి క్రూర జంతువులకు నిలయమైన తావులలో మునులవలె ఎల్లవేళలా తిరుగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

4. సీ. పనియున్న లేకున్న బ్రాహ్మీముహూర్తాన
తప్పక లేచెడి తాపసేంద్ర!
తెలిసియో తెలియకో దినమున కొకసారి
తానంబు చేసెడి మౌనిచంద్ర!
ఉండియో లేకనో యుత్తమాహారంబు
చక్కగా గుడిచెడి సంయమీంద్ర
వచ్చియో రాకనో వదరు బోతువుగాక
మితభాషితము సేయు యతికులేంద్ర.
గీ. కుటిల నటనము, గర్వము, కొంటెతనము
వన్నె చిన్నెలు లేని సద్వర్తనుడవు
ఈగియందనురాగివో, యోగిచంద్ర!
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు.

ప్రతిపదార్థం :

యోగిచంద్రా = యోగీశ్వరుడా!
కర్షకా = ఓ రైతన్నా!
పని + ఉన్న = పని ఉన్నప్పుడైనా
లేక + ఉన్న = లేకపోయినా
బ్రాహ్మీ ముహూర్తము + న = తెల్లవారుజామున
తప్పక లేచెడి = తప్పనిసరిగా నిద్రలేచే
తాపస + ఇంద్ర = మునీంద్రుడా!
తెలిసి + ఓ = ఎరుక ఉండియో
తెలియక + ఓ = ఎరుకలేకయో
దినమునకు = రోజుకు
ఒకసారి = ఒక పర్యాయము
తానంబు చేసెడి = స్నానం చేసే
మౌనిచంద్రా = మునివరా!
ఉండి + ఓ = కలిగియుండినా
లేకను + ఓ = ఏమీ లేకపోయినా
ఉత్తమ + ఆహారంబు = మంచి భోజనమును
చక్కగా కుడిచెడి = చక్కగా ఆరగించే
సంయమి + ఇంద్ర = యతులలో గొప్పవాడా!
వచ్చి + ఓ = మాట్లాడటం వచ్చినా
రాకను + ఓ = చేతకాక పోయినా
వదరుబోతువు + కాక = వాగుడు కాయవు కాకుండా
మితభాషితము + చేయు = తక్కువగా మాట్లాడే
యతికుల + ఇంద్ర = యతిశ్రేష్టుడా
కుటిల నటనము = కుత్సితమైన నాటకాలు
గర్వము = పొగరుబోతు తనము
కొంటెతనము = మోసపు స్వభావము
వన్నె చిన్నెలు = అనవసరపు ఆడంబరాలు
లేని = లేనటువంటి
సత్ + వర్తనుండవు = మంచి ప్రవర్తన కలవాడివి
ఈగి + అందు = దానము చేయుట యందు
అనురాగివి + ఓ = ఆసక్తి కలవాడవు
నేను = నేను
చేతులు + ఎత్తి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం :
హాలికుడా! పని ఉన్నా, లేకున్నా నియమంగా తెల్లవారు జాము లేచే నీవు గొప్ప తాపసివే. తెలిసో తెలియకనో రోజుకొక్క సారైనా స్నానమాచరించే నీవు మునిశ్రేష్ఠునివే. ఉండో, లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు ఋషీశ్వరునివే. తెలిసీ తెలియనితనంవల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటె పనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది. నీవొక యోగివి. శ్రేష్ఠుడవు. దానగుణంపై మక్కువ గలవాడవు. అన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

5. సీ. పచ్చజొన్న గటక, పరమాన్నమును గాగ
చల్లనీరే సుధా సారమగును
వడుకుడుపులు జరి పట్టుబట్టలు గాగ
కంబళే వజ్రంపు కవచమగును
వలపలి చే కఱ్ఱ, వజ్రాయుధముగాగ
పరిజనమే నీకు పశువులగును
అందమౌపైరులే, నందనములుగాగ
నేప్రొద్దుపంటనిక్షేపమగును.
గీ. ఇచ్చుచుండును నీశ్వరుఁడింద్ర పదవి
వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపసేంద్ర!
కర్షకా! నిన్నుకేలెత్తి, గౌరవింతు.

ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
పచ్చజొన్న గటక = పచ్చలు జొన్నలతో చేసిన సంకటి
పరమ + అన్నము + కాగ = = పాయసాన్నం అయితే
చల్లనీరు + ఏ = చల్లని మంచినీళ్ళే
సుధాసారము + అగును = అమృతమవుతుంది
వడుకు + ఉడుపులు = చేనేత వస్త్రాలు
జరీపట్టు బట్టలు + కాగా = జరీ వస్త్రాలు, పట్టు వస్త్రాలు అయితే
కంబళి + ఏ = గొ౦గళే
వజ్రము + కవచము + అగును = వజ్రాల కవచం అవుతుంది
వలపలి చే కర్ర = కుడి చేతిలో ఉన్న కర్ర
వజ్ర + ఆయుధము + కాగా = వంటిదయితేఇంద్రుని వజ్రాయుధము వంటిదయితే
నీకు = రైతువైన నీకు
పశువులు = ఎడ్లు, ఆవులు మొదలైనవి
పరిజనము + ఏ = పరివారముగా
అగును = అవుతాయి
అందము + ఔ = అందంగా ఉన్న
పైరులు + ఏ = పొలాలే
నందనములు + కాగన్ = నందనవనాలైతే
ఏ ప్రొద్దు పంట = ఏ పూట పండించిన పంటైనా
నిక్షేపము + అగును = నిధులుగా ఔతాయి
ఈశ్వరుడు = భగవంతుడు
ఇంద్రపదవి = ఇంద్రుడి సింహాసనమును
ఇచ్చుచు + ఉండును = నీకిస్తూ ఉంటాడు
ప్రకృతి = ప్రకృతి కాంత
బల్వలపు చేత = మిక్కిలి ప్రేమతో
వచ్చుచు + ఉండును = నీ దగ్గరకు వస్తుంటుంది.=
తాపస + ఇంద్ర = తాపసులలో శ్రేష్ఠుడా
దానిని = ఆ వరాలను
కన్ను + ఎత్తి = కళ్ళు తెరిచి
చూడవు = గమనించవు
నిన్ను = అటువంటి నీకు
కేలు + ఎత్తి = చేతులెత్తి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం :
ఓ కృషీవలుడా! నీకు పచ్చజొన్న సంకటే పరమాన్నం. చల్లని మంచినీళ్ళే అమృతం. చేతితో వడకిన నూలు బట్టలే పట్టు వస్త్రాలు. కప్పుకునే గొంగడే నీకు చెక్కుచెదరని కవచం. కుడి చేతిలోని ముల్లుగర్ర నీకు వజ్రాయుధం. పశుసంపదే నీకు పరివారం. నీవు పెంపు చేసిన పంటచేనులే నందనవనాలు. పండించే పంటనే నిధి నిక్షేపాలు. ఓ మునిశ్రేష్ఠా! ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెత్తైనా చూడక నీ వృత్తినే మిన్నగా భావిస్తావు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ఆలోచించండి – చెప్పండి.

ప్రశ్న 1.
రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి. (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
కుండలు చేసే కుమ్మరి మన్ను తీసి మెత్తగా తొక్కి మృదువైన ముద్దగా చేసి ఎంతో జాగ్రత్తగా సారె మీద పెట్టి రకరకాల ఆకారాలలో కుండలు చేస్తాడు. అతడు పడే కష్టానికి మనం కుండల కిచ్చే ధర ఏపాటి ? కమ్మరి కొలిమి దగ్గర ఆ వేడిని భరిస్తూ ఇనుము కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు. కత్తి, కొడవలి వంటివి వేడి మీదనే సాగకొడతాడు. సాలెవారు పత్తి నుంచి నూలు తీసి మగ్గం మీద రకరకాల కళాకృతులతో వస్త్రాలు నేస్తారు. ఇలాగే ఎంతో మంది. వారెంత కష్టపడినా ఆ శ్రమకు తగిన ఫలితం లభించక పేదరికంతో క్రుంగిపోతున్నారు.

ప్రశ్న 2.
మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి ? (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
రైతులు వేసవి కాలం, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల్లోనూ ఎండనక, వాననక పొలాల్లో పనులు చేస్తూనే ఉంటారు. దానికోసం ప్రతిరోజూ పొలం పనులు చేయవలసి ఉంటుంది. దుక్కిదున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టటం, కలుపు తీయటం, క్రిమికీటకాల నుండి పంటను రక్షించుకోవటం, కోతలు, నూర్పిళ్ళు, ధాన్యాన్ని బస్తాలకెత్తి గమ్యం చేర్చటం – ఇలా ఏడాది పొడుగునా రైతులకు పనులుంటూనే ఉంటాయి.

ప్రశ్న 3.
పేదరైతు కష్టాలు ఎట్లాంటివి ? (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
పేదరైతు తిండికి బట్టకు కరువై ఎంతో భారంగా బ్రతుకు గడుపుతూ ఉంటాడు. పంట పండించడానికి భూస్వాముల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పుచేసి తీర్చలేక బాధపడుతూ మరింత పేదవాడై పోతాడు. ఎండ, వాన, చలి, పగలు-రాత్రి అనే తేడాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. దళారులు ఎంతో తక్కువ ధరకు కొనేసి మరింత లాభాలకు అమ్ముకొని ధనవంతులైపోతూ పేదవారిని మరింత పేదవారుగా మారుస్తారు. ఇలా పేదరైతు అనేక కష్టాలు పడుతున్నాడు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ప్రశ్న 4.
సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి ? (టెక్స్ పేజి నెం. 112)
జవాబు.
సద్వర్తన అంటే మంచి ప్రవర్తన. సద్వర్తనకు సహాయం చేసే గుణాలు : తెల్లవారు జామున నిద్రలేవాలి. ప్రతినిత్యం స్నానం చేయాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అతిగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండాలి. ఇతరుల మేలు కోరాలి. ప్రకృతిలోని ఎండ, వాన, చలి వంటి ధర్మాలను ఓర్చుకోగలగాలి. ధనము, పదవులు మొదలైన వాటిపై ఆశపడరాదు. ఇవన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.

ప్రశ్న 5.
రైతుకు భగవంతుడు ఇంద్రపదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు ? (టెక్స్ట్ పేజి నెం. 112)
జవాబు.
ఇంద్రుడు అమృతం తాగుతాడు. స్వర్గం అతని నివాసస్థానం. పట్టువస్త్రాలు, వజ్రాల కవచం ధరిస్తాడు. అతని చుట్టూ సేవకులు ఉంటారు. రైతు తినే జొన్నకూడు పరమాన్నమై, చల్లనీరు అమృత మౌతుంది. నేత వస్త్రాలే జరీ, పట్టు వస్త్రాలై కంబళి వజ్రాల కవచమౌతుంది. అతని చేతిలోని ముల్లుకర్ర వజ్రాయుధమై చుట్టూ వున్న పశువులే సేవకులౌతారు. అందమైన పైరులు నందన వనాలౌతాయి. రైతు పండించిన పంట భూమిలోని నిధులౌతాయి. ఇలా భగవంతుడు రైతు చుట్టూ ఉన్న పరిస్థితులను స్వర్గంతో సమానంగా మార్చి రైతును దేవేంద్రుని చేశాడు అని కవి వర్ణించాడు.

ప్రశ్న 6.
రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి ? (టెక్స్ట్ పేజి నెం. 112)
జవాబు.
ముని బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు జామున లేస్తాడు. ఉత్తమమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటాడు. వదరుబోతు కాకుండా మితభాషిగా ఉంటాడు. మోసాలు చేయడం, నాటకాలాడటం, ఆడంబరాలకు పోవడం మునుల విషయంలో జరగదు. ఈ గుణాలు అన్నీ రైతులో కూడా ఉన్నాయి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.

పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 3.
“రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు ? (అదనపు ప్రశ)
జవాబు.
ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు. ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది పద్యమును చదివి ఖాళీలను పూరించండి.

‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

భావం : సైరికులు అనగా రైతులు వారు శత్రువులను మిత్రులను. సమానంగా సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.

2. కింది పద్యాన్ని చదివి దానికింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”

అ. ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
ఎ) నీరు
బి) వరద
సి) గాలి
డి) బురద
జవాబు.
డి) బురద

ఆ. ‘ఎగురజిమ్ముట’ అనగా
ఎ) కాలిపోవుట
బి) గాలికి పైకి విసురు
సి) కూలిపోవుట
డి) కిందపడుట
జవాబు.
బి) గాలికి పైకి విసురు

ఇ. ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
ఎ) పలకరించుట
బి) పులకరించుట
సి) వర్షాకాలం మొదలు
డి) ఎండాకాలం మొదలు
జవాబు.
సి) వర్షాకాలం మొదలు

ఈ. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం
ఎ) ఎవరు చూస్తారు?
బి) ఎవరు పట్టించుకుంటారు?
సి) ఎవరు అంటారు?
డి) ఎవరు వింటారు?
జవాబు.
ఎ) ఎవరు చూస్తారు?

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు.

రైతుకు పైన చెప్పిన సుఖాలన్నీ నీచమైనవి. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.

ఆ. “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి ?
జవాబు.
జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

ఇ. రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.
జవాబు.
రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.

ఈ. “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.

మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.

పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.

ఆ. కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కవి అన్నాడు కదా ! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని
వివరించండి.
జవాబు.
దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు.

ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

IV. సృజనాత్మకత/ప్రశంస.

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ. పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
జవాబు.

రైతు ఆత్మకథ

నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.

మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను. అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను. నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే.

కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.

ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను.

తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి. ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను. ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు.

నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.

(లేదా)
ఆ. అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు.

అభినందన పత్రం

కృషీవలా!

ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.

అన్నదాతా!

అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు. అటువంటి నీకు మా జోతలివే.

హాలికా!

పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.

అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

పదజాల వినియోగం:

1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) హలం :
జవాబు.
హలం = నాగలి
హలం బలరాముని ఆయుధం.

ఆ) సైరికులు :
జవాబు.
సైరికులు : రైతులు
సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 2

ప్రకృతి – వికృతి

రాత్రి – రాతిరి
బ్రహ్మ – బొమ్మ
శుచి – చిచ్చు
గర్వము – గరువము
పశువు – పసరము, పసువు
చంద్రుడు – చందురుడు

3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.

అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
జవాబు.
ముని, తాపసి

ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
జవాబు.
రాయి, శిల

ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.
జవాబు.
మాపువేళ – సాయంకాలం

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణసంధి
ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
ఉ) కొంపంత = కొంప + అంత = అత్వ సంధి

2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.

అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం.

ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.

ఆ) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.

ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

3. ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 83

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.

పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.

  • మొదటి అక్షరానికి లై (ఎ) – రీ (ఈ) యు (ఉ) – చుం (ఉ)
  • 10వ అక్షరానికి యతి చెల్లింది.
  • పై పాదాలలో ప్రాసగా క్క- క్కి- అనే హల్లు వచ్చింది.
  • పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
  • పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఉత్పలమాల :

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
  4. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

4. ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 4

పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే………

ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘ఆ’తో, ‘బు’ కు ‘పు’తో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా న్తి – న అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

చంపకమాల :-

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
  5. ప్రాస నియమం వుంటుంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

5. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయండి.

అ) తనకు ఫలంబులేదని యెదం దలపోయడు కీర్తిగోరు నా
జవాబు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 5

ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను నజభజజజర అనే గణాలు ఉన్నాయి. పై పాదంలో మొదటి అక్షరమైన ‘త’ కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.

ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
జవాబు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 6

ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’ కు 10వ అక్షరమైన ‘నం’ తో యతిమైత్రి.

ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే (అదనపు ప్రశ్న)
జవాబు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 7

ఇది చంపకమాల పద్య పాదము. ఇందులో ప్రతి పాదానికి నజభజజజర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బ’తో యతిమైత్రి.

ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస (అదనపు ప్రశ్న)
జవాబు.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ 8

ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’ కు 10వ అక్షరమైన ‘హ’తో యతిమైత్రి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న .
శ్రీ ప్రసార మాద్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
పరిచయం :
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.

సేకరణ :
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.

నివేదిక :
ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”.

ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.

ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

నటనము = నర్తనము, నాట్యము
పశువులు = జంతువులు, మృగములు
ఉడుపులు = వస్త్రములు, దుస్తులు
కన్ను = అక్షి, నయనం, నేత్రం
కర్షకుడు = హాలికుడు, కృషీవలుడు, సైరికుడు, రైతు
కేలు = చేయి, కరము
హలము = సీరము, నాగలి
ఆకలి = క్షత్తు, బుభుక్ష, కూడు
సంయమి = తాపసి, యోగి, ముని
చీకటి = తమస్సు, అంధకారము
ఆహారము = భోజనము, అన్నము, కూడు
బురద = అడుసు, కర్దమము

వ్యుత్పత్త్యర్థాలు:

కర్షకుడు = కృషి (వ్యవసాయము) చేయువాడు – రైతు
హాలికుడు = హలము చేత పట్టినవాడు – రైతు సీరము (నాగలి)
సైరికులు = ధరించినవారు – రైతులు
వేత్త = బాగా తెలిసినవాడు – జ్ఞాని
సంయమి = యమ నియమాదులను పాటించువాడు – ఋషి

నానార్థాలు:

కాన = కాబట్టి, అడవి
మాపు = సాయంత్రం, మాసిపోవుట
జంతువు = ప్రాణి, మృగము
ప్రొద్దు = ఉదయము, సూర్యుడు
సుధ = అమృతము, సున్నము
మిత్రుడు = స్నేహితుడు, సూర్యుడు

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
గౌరవము – గారవము
సర్పము – సప్పము
బ్రధ్న – ప్రొద్దు
స్నానము – తానము
ఆహారము – ఓగిరము
వర్ణము – వన్నె
చిహ్నము – చిన్నె
కష్టము – కస్తి
వ్యథ – వెత

సంధులు:

మౌనులెవరు = మౌనులు + ఎవరు = ఉత్వసంధి
హలమూని = హలము + ఉని = ఉత్వసంధి
పడుదువీవు = పడుదువు + ఈవు = ఉత్వసంధి
పండుదీవు = పండదు + ఈవు = ఉత్వసంధి
నీవిల్లు = నీవు + ఇల్లు = ఉత్వసంధి
పొదరిండ్లు = పొదరు + ఇండ్లు = ఉత్వసంధి
ఉనికిపట్టగు = ఉనికిపట్టు + అగు = ఉత్వసంధి
చేతులెత్తి = చేతులు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది.

కూటికై = కూటికి + ఐ = ఇత్వ సంధి
చేయిడి = చేయి + ఇడి = ఇత్వ సంధి
లేనట్టి = లేని + అట్టి = ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇంతైన = ఇంత + ఐన = అత్వసంధి
లేకున్న = లేక + ఉన్న = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సంయమీంద్ర = సంయమి + ఇంద్ర = సవర్ణదీర్ఘసంధి
వ్యాఘ్రాది = వ్యాఘ్ర + ఆది = సవర్ణదీర్ఘసంధి
ఉత్తమాహారము = ఉత్తమ + ఆహారము = సవర్ణదీర్ఘసంధి
వజ్రాయుధము = వజ్ర + ఆయుధము = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

సమాసములు:

కష్టసుఖాలు = కష్టమును, సుఖమును – ద్వంద్వసమాసం
శత్రుమిత్రులు = శత్రువును, మిత్రుడును – ద్వంద్వ సమాసం
వన్నెచిన్నెలు = వన్నెయు, చిన్నెయు – ద్వంద్వ సమాసం
వడగండ్ల దెబ్బలు = వడగండ్ల చేత దెబ్బలు – తృతీయా తత్పురుష సమాసం
సమ్యమేంద్రుడు = సమ్యములలో శ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఎండల వేడి = ఎండల యొక్క వేడి – షష్ఠీ తత్పురుష సమాసం
తాపసేంద్ర = తాపసులలో ఇంద్రుడా – షష్ఠీ తత్పురుష సమాసం
చే కర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
సైరికులు : _______________
జవాబు.
సైరికులు = రైతులు
సైరికులు పంటలను పండిస్తారు. వ్యవసాయం చేస్తారు.

ప్రశ్న 2.
చెయిమోడ్చి : _______________
జవాబు.
చెయిమోడ్చి = చేతులు జోడించి
పెద్దలు, గురువులు కనిపించినపుడు చెయిమోడ్చి నమస్కారించాలి.

ప్రశ్న 3.
ఇడుములు : _______________
జవాబు.
ఇడుములు = కష్టాలు
ఇడుములు వచ్చినపుడే మనిషి ధైర్యంగా ఉండాలి.

ప్రశ్న 4.
వడుకుడుపులు : _______________
జవాబు.
వడుకుడుపుల = చేతితో నేసిన నేతవస్త్రాలు
వడుకుడుపులు ఎంతో మెత్తగా, వెచ్చగా ఉంటాయి.

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

అర్థాలు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 5.
అడవిలో క్రూర మృగాలు నివసిస్తాయి. ( )
A) తోట
B) పెరడు
C) ఇల్లు
D) అరణ్యం
జవాబు.
D) అరణ్యం

ప్రశ్న 6.
యతి వరులను గౌరవించడం మన సంప్రదాయం. ( )
A) సన్న్యాసి
B) మనిషి
C) తల్లి
D) తండ్రి
జవాబు.
A) సన్న్యాసి

ప్రశ్న 7.
పార్వతీదేవి వాహనం వ్యాఘ్రం ( )
A) కోతి
B) పాము
C) పులి
D) కప్ప
జవాబు.
C) పులి

ప్రశ్న 8.
వృశ్చికానికి తోకలో విషం ఉంటుంది. ( )
A) పాము
B) తేలు
C) మనిషి
D) దుష్టుడు
జవాబు.
B) తేలు

ప్రశ్న 9.
తుమ్మచెట్టు కంటకం గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది. ( )
A) ముల్లు
B) ఆకు
C) కొమ్మ
D) కాయ
జవాబు.
A) ముల్లు

ప్రశ్న 10.
పేదవారి ఇడుములు అన్నీ యిన్నీ కావు. ( )
A) ఉడుములు
B) అప్పాలు
C) కష్టాలు
D) సుఖాలు
జవాబు.
C) కష్టాలు

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

వ్యుత్పత్త్యర్థాలు:

కింది వానికి వ్యుత్పత్త్యర్థాలు గుర్తించండి.

ప్రశ్న 11.
సీరము తో నేలనను దున్నువాడు – ( )
A) సీరడు
B) సైరికుడు
C) సేరకుడు
D) సైరడు
జవాబు.
B) సైరికుడు

ప్రశ్న 12.
కర్షకుడు – ( )
A) కృషి చేసేవాడు
B) కర్మ చేసేవాడు
C) కర్షణం చేసేవాడు
D) కష్టపడేవాడు
జవాబు.
A) కృషి చేసేవాడు

పర్యాయ పదాలు:

కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి.

ప్రశ్న 13.
అంధకారంలో నడవడం చాలాకష్టం. చీకట్లో పురుగూపుట్రా తిరుగుతాయి. అందుకే తమస్సులో దీపం తీసుకొని నడవాలి. ( )
A) నడవడం, కష్టం, చాలా
B) పురుగు, పుట్ర, చీకటి
C) తమస్సు, దీపం, అందుకే
D) అంధకారం, చీకటి, తమస్సు
జవాబు.
D) అంధకారం, చీకటి, తమస్సు

ప్రశ్న 14.
నేత ఉడుపులు ధరిస్తే హాయిగా ఉంటుంది. పట్టువస్త్రాలు మెరుస్తూ హుందాగా ఉంటాయి. పేదవారికి చినిగిన బట్టలకు కూడా కరువే. ( )
A) ఉడుపులు, ఉడుములు, ఇడుములు
B) వస్త్రాలు, హుందాగా, పట్టు
C) ఉడుపులు, వస్త్రాలు, బట్టలు
D) పేద, మెరుస్తూ, హాయిగా
జవాబు.
C) ఉడుపులు, వస్త్రాలు, బట్టలు

ప్రశ్న 15.
ఆకలి గొన్న వారి బుభుక్ష తీర్చడం మనధర్మం. ( )
A) దాహం, దప్పిక
B) ఆకలి, బుభుక్ష
C) ధర్మం, న్యాయం
D) కొన్న, అమ్మిన
జవాబు.
B) ఆకలి, బుభుక్ష

ప్రశ్న 16.
తాపసి తపస్సుకు భంగం కలిగిస్తే యోగికి కోపం వస్తుంది. ( )
A) తాపసి, యోగి
B) తపస్సు, భంగం
C) యోగి, కోపం
D) తపస్సు, కోపం
జవాబు.
A) తాపసి, యోగి

ప్రశ్న 17.
ఇడుములు కలిగినప్పుడు ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవాలి. ( )
A) ఇడుములు, కష్టాలు
B) ఆపదలు, ఆనందాలు
C) కష్టం, దుఖం
D) సంతోషం, సుఖం
జవాబు.
A) ఇడుములు, కష్టాలు

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

నానార్థాలు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 18.
కానలో క్రూరమృగాలుంటాయి కాన జాగ్రత్తగా ఉండాలి. ( )
A) దారి, మార్గం
B) అడవి, కాబట్టి
C) ఇల్లు, వాకిలి
D) తోట, అడవి
జవాబు.
B) అడవి, కాబట్టి

ప్రశ్న 19.
మిత్రుడు ఉదయించగానే నా మిత్రుడు వస్తాడు. ( )
A) చంద్రుడు, తండ్రి
B) ఇంద్రుడు, స్నేహితుడు
C) సూర్యుడు, స్నేహితుడు
D) సూర్యుడు, సోదరుడు
జవాబు.
C) సూర్యుడు, స్నేహితుడు

ప్రశ్న 20.
మాపువేళ ఎక్కడి నుంచి వస్తున్నావు బట్టలు మాపు కొని ? ( )
A) సాయంత్రం, మాసిపోయి
B) ఉదయం, ఎండ
C) రాత్రి, పగలు
D) ఉదయం, బట్టలు
జవాబు.
A) సాయంత్రం, మాసిపోయి

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ప్రకృతి / వికృతులు:

కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు ప్రకృతి/వికృతి గుర్తించండి.

ప్రశ్న 21.
కొందరు ముసలివారు వెతలతోనే ఎలాగో కాలం గడుపుతారు. ( )
A) వ్యథ
B) వెథ
C) వేత్త
D) వయథ
జవాబు.
A) వ్యథ

ప్రశ్న 22.
నాగుల చవితికి సర్పములను పూజిస్తాము. ( )
A) సృపము
B) సప్పము
C) సరపము
D) శర్పము
జవాబు.
B) సప్పము

ప్రశ్న 23.
ప్రొద్దు పొడవక ముందే నిద్ర లేవాలి. ( )
A) పద్దు
B) ప్రద్దు
C) బ్రధ్న
D) వొద్దు
జవాబు.
C) బ్రధ్న

ప్రశ్న 24.
పుష్కరాలలో గోదావరిలో స్నానాలు చేసొద్దామా ? ( )
A) సానాలు
B) పానాలు
C) సన్నాలు
D) తానాలు
జవాబు.
D) తానాలు

ప్రశ్న 25.
కులము మతము అనే భేదాలు పాటించకూడదు. ( )
A) కూలము
B) కోలము
C) కొలము
D) కుళము
జవాబు.
C) కొలము

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

భాషాంశాలు :

సంధులు:

కింది సంధులను గుర్తించండి.

ప్రశ్న 26.
వజ్రాయుధము ………………… విడదీయండి. ( )
A) వజ్ర + యుధము
B) వజ్ర + ఆయుధము
C) వజ్రా + ఆయుధము
D) వజ్రా + యుధము
జవాబు.
B) వజ్ర + ఆయుధము

ప్రశ్న 27.
సంయమీంద్ర – ఏ సంధి ? ( )
A) ఇత్వసంధి
B) గుణసంధి
C) సవర్ణదీర్ఘసంధి
D) అత్వసంధి
జవాబు.
C) సవర్ణదీర్ఘసంధి

ప్రశ్న 28.
కింది పదాలలో ఇత్వసంధి ఉదాహరణ ఏది ? ( )
A) నీవిల్లు
B) చేతులెత్తి
C) కూటికై
D) లేకున్న
జవాబు.
C) కూటికై

ప్రశ్న 29.
వీటిలో సవర్ణదీర్ఘసంధి ఉదాహరణ ఏది ? ( )
A) హలమూని
B) వ్యాఘ్రాది
C) పండుదీవు
D) చేయిడి
జవాబు.
B) వ్యాఘ్రాది

ప్రశ్న 30.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైతే ఆదేశంగా వచ్చేది ……………….. ( )
A) దీర్ఘాలు
B) గుణాలు
C) యణ్ణులు
D) వృద్ధులు
జవాబు.
A) దీర్ఘాలు

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

సమాసాలు:

కింది సమాసాలను గుర్తించండి.

ప్రశ్న 31.
తాపసేంద్ర – ఏ సమాసము ? ( )
A) ద్వితీయాతత్పురుష సమాసం
B) చతుర్థీ తత్పురుష సమాసం
C) పంచమీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు.
D) షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 32.
వన్నెలును చిన్నెలును – సమాసపదం ? ( )
A) వన్నె చిన్నెలును
B) వన్నెలును చిన్నెలు
C) వన్నెచిన్నెలు
D) వన్నెచిన్నె
జవాబు.
C) వన్నెచిన్నెలు

ప్రశ్న 33.
వడగండ్ల దెబ్బలు విగ్రహవాక్యం ? ( )
A) వడగండ్ల చేత దెబ్బలు
B) వడగండ్ల కొరకు దెబ్బలు
C) వడగండ్లు మరియు దెబ్బలు
D) వడగండ్ల యందు దెబ్బలు
జవాబు.
A) వడగండ్ల చేత దెబ్బలు

ప్రశ్న 34.
కష్టసుఖములు – ఏ సమాసం ? ( )
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) తృతీయాతత్పురుష సమాసం
D) రూపక సమాసం
జవాబు.
B) ద్వంద్వ సమాసం

ప్రశ్న 35.
శత్రుమిత్రులు – విగ్రహవాక్యం ? ( )
A) శత్రును మిత్రును
B) శత్రువులును మిత్రులును
C) శత్రువులైన మిత్రులు
D) మిత్రులైన శత్రువులు
జవాబు.
B) శత్రువులును మిత్రులును

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు ఎటువంటి వాక్యాల్లో గుర్తించండి.

ప్రశ్న 36.
ఆహా ! రైతు ఎంత మంచి పని చేస్తున్నాడో ! ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) హేత్వర్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం

ప్రశ్న 37.
ఎండనక వాననక చేపట్టిన పని కొనసాగించే ఋషులు ఎవరు ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) సామర్ధ్యార్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం

ప్రశ్న 38.
రైతు మాత్రమే ఆ పని చేయగలడు. ( )
A) హేత్వార్థకం
B) సామర్థ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
B) సామర్థ్యార్థకం

ప్రశ్న 39.
దయచేసి రైతు కష్టాన్ని గుర్తించండి. ( )
A) ప్రశ్నార్థకం
B) అనుమత్యర్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
D) ప్రార్థనార్థకం

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

క్రియను గుర్తించుట:

గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.

ప్రశ్న 40.
వేడి సహించి, ముండ్ల మీద నడిచి పంట వేస్తాడు. ( )
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్త్వార్థం
D) అప్యర్థకం
జవాబు.
C) క్త్వార్థం

ప్రశ్న 41.
రైతు కష్టించి పంట పండించినా ఫలితం దక్కడం లేదు. ( )
A) అప్యర్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) క్త్వార్థం
జవాబు.
A) అప్యర్థకం

ప్రశ్న 42.
రైతు పంట పండిస్తే మనకి ధాన్యం కొరత ఉండదు. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 43.
రైతు కష్టపడతాడు. రైతు పంట పండిస్తాడు. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) రైతు కష్టపడి పంట పండిస్తాడు.
C) రైతు కష్టపడాలని పంట పండిస్తాడు.
B) రైతు కష్టపడుతూ పంట పండిస్తాడు.
D) రైతు కష్టపడటం కోసం పంట పండిస్తాడు.
జవాబు.
A) రైతు కష్టపడి పంట పండిస్తాడు.

ప్రశ్న 44.
రైతు ఋషి శ్రేష్ఠుడు. ముని శ్రేష్ఠుడు – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) రైతు ఋషి శ్రేష్ఠుడైన ముని శ్రేష్ఠుడు
B) రైతు ముని శ్రేష్ఠుడైన ఋషి శ్రేష్ఠుడు
C) రైతు ఋషి శ్రేష్ఠుడు మరియు ముని శ్రేష్ఠుడు
D) రైతు శ్రేష్ఠుడైన మునీ, ఋషీ
జవాబు.
C) రైతు ఋషి శ్రేష్ఠుడు మరియు ముని శ్రేష్ఠుడు

ప్రశ్న 45.
నీకు పశుసంపద పరివారం. నీకు పంటచేను నందనవనం. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) నీకు పరివారం నందనవనం, పరివారం పంటచేనే
B) నీకు పశుసంపద పరివారం మరియు పంటచేను నందనవనం.
C) నీకు పంటచేను నందనవనం. అంతేకాక నీ పరివారం నీ పశుసంపదే.
D) నీకు పశుసంపద పరివారం కాగా పంటచేను నందనవనమౌతుంది.
జవాబు.
B) నీకు పశుసంపద పరివారం మరియు పంటచేను నందనవనం.

ప్రశ్న 46.
నీకు చేతులు జోడిస్తాను. నీకు నమస్కరిస్తాను – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) నీకు చేతులు జోడిస్తూ నమస్కరిస్తాను.
B) నీకు చేతులు జోడించాలని నమస్కరిస్తాను
C) నీకు నమస్కరించడానికి చేతులు జోడిస్తాను
D) నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను
జవాబు.
D) నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ఛందస్సు:

కింద ఇచ్చినవి ఏ పద్యపాదాలో గుర్తించండి.

ప్రశ్న 47.
హర్తకుఁ గాదు గోచరమహర్నిశమున్ సుఖపుష్టి సేయు ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు.
A) ఉత్పలమాల

ప్రశ్న 48.
చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా. ( )
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభం
జవాబు.
C) చంపకమాల

ప్రశ్న 49.
మత్తేభం పద్యపాదంలోని గణాలు ఏవి ? ( )
A) భరనభభరవ
B) నజభజజజర
C) సభరనమయవ
D) మసజసతతగ
జవాబు.
C) సభరనమయవ

ప్రశ్న 50.
మసజసతతగ గణాలు ఏ పద్యపాదంలో ఉంటాయి ? ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు.
C) శార్దూలం

అలంకారాలు:

కింది అలంకారములను గుర్తించండి.

ప్రశ్న 51.
ఆకాశం నుండి రాలుతున్న వానచినుకులు, భూమాతకు పట్టిన ముత్యాల గొడుగేమో అన్నట్లుంటాయి. ( )
A) ఉత్ప్రేక్ష
B) ఉపమ
C) రూపక
D) స్వభావోక్తి
జవాబు.
B) ఉపమ

ప్రశ్న 52.
గంగానది నీరు కొబ్బరి నీరువలె తియ్యగా ఉన్నది. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు.
A) ఉపమ

TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ

ప్రశ్న 53.
రత్తమ్మ, అత్తగారి కొత్త చీర కట్టుకొని, దుత్త నెత్తిన పెట్టుకొని వయ్యారంగా నడిచింది. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) వృత్త్యనుప్రాస
జవాబు.
D) వృత్త్యనుప్రాస

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

These TS 8th Class Telugu Bits with Answers 10th Lesson సింగరేణి will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి:

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ?
జవాబు.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు బొగ్గు గనుల నుండి బొగ్గును బయటకు తెస్తున్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏయే వస్తువులు కనపడుతున్నాయి ?
జవాబు.
చిత్రంలో బ్యాటరీలైట్లు, బొగ్గుతో నిండిన గంపలు, తలలకు హెల్మెట్లు కన్పిస్తున్నాయి.

ప్రశ్న 3.
చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకొంటున్నారు ?
జవాబు.
ఈ చిత్రం బొగ్గు గనులకు సంబంధించిందని అనుకుంటున్నాను.

ప్రశ్న 4.
తెలంగాణలో బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి ?
జవాబు.
తెలంగాణలో కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలో బొగ్గు గనులున్నాయి.

ప్రశ్న 5.
నేలబొగ్గు వల్ల ఉపయోగాలేవి ?
జవాబు.
నేలబొగ్గు పరిశ్రమలకు ఇంధనంగా, విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు వేయటానికి తారుగా, ప్లాస్టిక్ను తయారు చేయటానికి, తలకు రాసే సువాసన నూనెలను తయారు చేయటానికి, బట్టలకు వేసే అద్దకాల రంగులను తయారుచేయటానికి ఉపయోగపడుతుంది.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

పాఠం ఉద్దేశం:

ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్ధిపొందాయి. దేశ ప్రగతికి దోహదపడే ‘సింగరేణి గనుల’ గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.

ప్రవేశిక:

ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో ‘సింగరేణి కాలరీస్’ ప్రధాన భూమికను పోషిస్తున్నది.

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతి రోజూ పొంచివున్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా…. గనుల్లో పనిచేస్తూ…. తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

కఠినపదాలకు అర్థాలు:

సిరి = సంపద
విశిషత్ట = గొప్పతనం
విరివిగా = ఎక్కువగా
అనూహ్యంగా = ఊహించనివిధంగా
శ్రేష్ఠము = మేలైన / ప్రసిద్ధి చెందిన
నిక్షిప్తము = దాచిన
మస్టర్ = హాజరు
రంగరించు = కలిపిన
దుర్భరంగా = కష్టంగా, భారంగా
సౌకర్యాలు = వసతులు
జగతి = లోకం
పరీవాహకం = ప్రవహించే పరిసర ప్రాంతం
డాంబరు = తారు
తనువు = శరీరం
సింగారం = అలంకారం
ఖ్యాతి = ప్రసిద్ధి
గని = ఖని
బదిలీ = షిఫ్టు = విధి పూర్తి అయిన తర్వాత వ్యక్తులు మారే సమయం
తెరువు = మార్గం
సాదాసీదాగా = అతిసామాన్యంగా
మజ్దార్ = కార్మికుడు
ఎన్.టి.పి.సి = నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్
నల్ల బంగారం = బొగ్గు
ప్రగతి = పురోగతి, అభివృద్ధి
సీదీ = సమానంగా

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
“శ్రమజీవే జగతికి మూలం … చెమటోడ్చక జరుగదు కాలం’ అన్న వాక్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు ? (టెక్స్టపేజి నెం.99)
జవాబు.
మానవ జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి. అందరి అవసరాలు తీరాలంటే జాతీయోత్పత్తులు పెరగాలి. జాతీయోత్పత్తులు పెరగాలంటే అందరూ కష్టపడి పని చేయాలి. అందుకే శ్రమజీవే జగతికి మూలం అని అర్థం చేసుకున్నాం.

ప్రశ్న 2.
ఈ నేల బొగ్గును ‘నల్ల బంగారం’ అని ఎందుకంటారు ? (టెక్స్టపేజి నెం.99)
జవాబు.
బంగారం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతూ మన విలువను పెంచుతుందో అన్నివిధాలుగా బొగ్గుకూడా ఉపయోగపడుతున్నది. కావున బొగ్గును బంగారంతో పోల్చి ‘నల్ల బంగారం’ అని అంటున్నాం.

ప్రశ్న 3.
‘సహజ సంపదను వినియోగించుకొనే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది’ చర్చించండి. (టెక్స్టపేజి నెం.99)
జవాబు.
ఒకదేశం తనకున్న సహజవనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే అంత అభివృద్ధిని సాధిస్తుంది. ఉదాహరణకు ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద బొగ్గు. దానిని పలు పరిశ్రమలు పలురకాలుగా వాడుకుంటున్నాయి. అలాగే అటవీ సంపద, జల సంపద వీటిని పూర్తి వినియోగంలోనికి తేవటం ద్వారా సామాజిక ఎదుగుదలకు అవకాశాలుంటాయి.

ప్రశ్న 4.
‘దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది’ ఎందుకో చర్చించండి. (టెక్స్టపేజి నెం.101)
జవాబు.
సింగరేణి గనుల్లో అపారంగా, తరిగిపోనన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల్లోని బొగ్గు నాణ్యమైంది. ఇవి తెలంగాణా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక స్థితులను మెరుగుపరిచాయి.

ప్రశ్న 5.
“బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు” అని ఎందుకన్నారు ? (టెక్స్టపేజి నెం.101)
జవాబు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించేది కార్మికులే! వారందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంత వాసులు. గనులలోకి వెళ్ళి బొగ్గును త్రవ్వి పోగుచేసి తట్టల్లో ఎత్తి వెలుపలికి పంపిస్తారు. ఆ నైపుణ్యం గని కార్మికులకే ఉంటుంది. అందుకే బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు అని అన్నారు.

ప్రశ్న 6.
‘గడియారం ముండ్లవలె పనిచేస్తున్న కార్మికులు’ అన్న వాక్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ? (టెక్స్టపేజి నెం.102)
జవాబు.
శ్రమకు ప్రతినిధిగా గడియారం ముల్లును సూచిస్తాం. అట్లాగే బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు కోడికూత కంటే ముందే లేచి గనులలోకి వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవారు వస్తుంటారు. ఇలా గడియారం ముల్లులు తిరిగినట్లు కార్మికులు కూడా విరామం లేకుండా మూడు షిఫ్టుల్లో పనిచేస్తూనే ఉంటారని అర్థమయింది.

ప్రశ్న 7.
ప్రమాదాల అంచున నిలబడి పని చేయటం అంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం.102)
జవాబు.
ప్రమాదాల అంచున నిలబడి పనిచేయట మంటే గనిలోకి వెళ్ళిన కార్మికులకు ఎపుడు ఏవిధంగా ప్రమాదం ఏర్పడుతుందో తెలియదు. గనులు విరిగిపడి, గనులలోకి నీరువచ్చి, గాలి వెలుతురులు లేక ఊపిరితిత్తుల సమస్యలు తరచు వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి. అందుకే వారు ప్రమాదాల అంచున పనిచేసే కార్మికులని అర్థమౌతుంది. ఏ ప్రమాదం ఎక్కడ పొంచి వున్నదో చెప్పలేని పరిస్థితి..

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా! కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమయిందో చెప్పండి.
జవాబు.
తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి వహించినవి. దానికి కారకులు సింగరేణి గనులలో పనిచేసే గని కార్మికులే! ఆ కార్మికులందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలే! వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు సింగరేణికి ఊపిరులయ్యాయి. బ్రతుకు భారాన్ని మోయటానికి కష్టం చేయక తప్పిందికాదు. ప్రారంభంలో వారి శ్రమకు తగిన ఫలితం కూడా వచ్చేది కాదు.

తరువాత కార్మిక సంఘాల చైతన్యంతో తగిన కూలీ రెట్లతో వారి జీవితాలు కొంతలో కొంత మెరుగు పడ్డాయి. బొగ్గు గనుల్లో పనిచేయట మంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! ఏ బతుకుదెరువు లేకపోతే ఈ పనిలో చేరేవారు. కార్మికులు రాత్రి పగలు అను భేదం లేకుండా కష్టపడి పనిచేస్తుంటారు. గడియారంలో ముల్లు విరామం లేకుండా ఎట్లా తిరుగుతుందో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం కృషికి ప్రతినిధులని అర్థమౌతుంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇష్టదేవతకు దండం పెట్టి
గనిలోనికి నువు అడుగుబెట్టి
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే
ప్రాణాలకు వెనుకాడక నువ్వు
రక్తమాంసాలు చెమటగ మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్
జాతికి వెలుగులు అందిస్తుంటవు
“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.

ప్రశ్నలు :
అ. గేయం ఎవరిని గురించి తెలుపుతుంది ?
జవాబు.
ఈ గేయం బొగ్గు కార్మికుని గురించి తెలుపుతుంది.

ఆ. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?
జవాబు.
ఇష్టదేవతకు తమకు కష్టం రానీయవద్దని దండం పెడతారు.

ఇ. కార్మికుడిని ‘నల్లసూర్యుడు’ అని ఎందుకన్నారు ?
జవాబు.
సూర్యుడు లోకాలకు వెలుగులను పంచినట్లు, నల్లసూర్యునిగా పిలువబడుతున్న గని కార్మికుడు ప్రపంచానికి కరెంటు కాంతిని అందిస్తున్నాడు. అందుకే బొగ్గుగని కార్మికుడిని నల్లసూర్యుడని అన్నారు.

ఈ. జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి ?
జవాబు.
జాతికి వెలుగు అందించట మంటే జాతి పురోభివృద్ధికి పాటుపడటమని అర్థం.

ఉ. తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి ?
జవాబు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందులోను, అదిలాబాద్ జిల్లా తాండూరులోను, కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోను, తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

2. కింది పేరా చదువండి. అయిదు ప్రశ్నలను తయారు చేయండి.

తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నతదశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురిచేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈ నాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.
జవాబు.

ప్రశ్నలు :
అ. ఈ పేరా మనకు దేనిని గురించి వివరిస్తుంది ?
ఆ. ఒకప్పుడు తెలంగాణ దేనికి ప్రాముఖ్యత వహించిన ప్రదేశం ?
ఇ. ఒకప్పుడు ఏ కుటీర పరిశ్రమ తెలంగాణలో ఉన్నతస్థితిలో ఉండేది ?
ఈ. బట్టల అద్దకం పరిశ్రమ ఎందుకు కష్టనష్టాలకు గురి అయింది ?
ఉ. విదేశాలలోని యంత్రాలపై ఎట్లాంటి వస్తువులు తయారయ్యేవి ?
ఊ. చేతి పనులపై తయారయ్యే వస్తువులు ఎలా ఉంటాయి ?
ఎ. నేటికి ప్రజలలో ఏ విషయంలో కనువిప్పు కలిగింది ?

II. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఒక దేశం తనకున్న సహజ వనరులను చక్కగా వినియోగించుకుంటేనే మంచి అభివృద్ధిని సాధించగలుగుతుంది. ప్రపంచదేశాలన్నీ పారిశ్రామికంగా ముందంజలో ఉన్నాయి. భారతదేశం కూడా వాటితో పోటీ పడాలంటే పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలంటే సహజ సంపదలను వినియోగించుకోక తప్పదు.

అప్పుడే నిజమైన మానవ నాగరికత నిర్మించబడుతుంది. ఉదాహరణకు జలవనరులను, ఖనిజ సంపదను ఉపయోగించుకోవటం ద్వారా మనం దేశాభివృద్ధిని చేసుకోగలిగాం. అట్లాగే పలు పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి, రంగుల తయారీకి, రోడ్లకు మూలమైన నేలబొగ్గును ఒక సహజవనరుగా ఉపయోగించటం వలన అభివృద్ధికి రాచబాటలు వేసుకోగలమని చెప్పగలను.

ఆ. “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.
తెలంగాణా పోరాటగడ్డ. వారు జీవితంలో తిండికి గుడ్డకు, స్వాతంత్ర్యానికి పోరాటం అనాదిగా సాగిస్తూనే ఉన్నారు. శ్రమలేకుండా సుఖం లేదన్నది వారి సిద్ధాంతం. శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చక జరుగదు కాలం. అందుకే శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అని ఉంటారు. తెలంగాణ గ్రామీణులు మిక్కిలి పేదవారు. నీటికి కటకట పడుతున్న ప్రాంతమది.

నీటి సదుపాయం లేకపోవటం వలన వర్షం మీద ఆధారపడి పంటలు పండిస్తారు. వర్షం పడకపోతే క్షామం తప్పనిసరి. అందుకే ‘బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్దమై ప్రమాదం పొంచి ఉన్నా బొగ్గు గనులలో పనిచేయుటకు సిద్ధమయ్యారు. బొగ్గుగనులు వారికి జీవన భృతినిస్తున్నాయి.

ఇ. పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ? కార్మికుల పనితో అన్వయించి
రాయండి.
జవాబు. సింగరేణి కార్మికులు పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలే పనిచేస్తుంటారు. కోడి కూతకు ముందే లేచి తయారై గనిలోకి పోయేవారు కొందరైతే, పగలు మూడు గంటలకు గనులలోకి పోయేవారు మరికొందరు. అర్ధరాత్రి పనికి పోయేవారు ఇంకొందరు. ఇట్లా ప్రొద్దున నుండి అర్ధరాత్రి వరకు మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తూనే ఉంటారు. ఇలా గడియారం ముళ్ళు విసుగు విరామం లేకుండా ఎట్లా పనిచేస్తాయో అట్లానే సింగరేణి కార్మికులు కూడా పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఈ. డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి ?
జవాబు.
సింగరేణి గనుల విశిష్టతలను లోకానికి తెలియజేసిన వాడు డాక్టర్ కింగ్. ఆయన పరిశోధనల వలన దేశంలోని ఏ ఇతర బొగ్గు గనులకు లేని విశిష్టత వీటికి వచ్చింది. 1841లో ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు భూమిని త్రవ్వుతుండగా బొగ్గు విషయం లోకానికి తెలిసింది. ఈ సంఘటన ఆధారంతో 1871లో డాక్టర్ కింగ్ ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు ఉన్నదని తన పరిశోధనలో గుర్తించాడు.

ఈ బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని కనుగొన్నాడు. గనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్ సీమ్’ అని, పై బొగ్గు పొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరు పెట్టారు. కింగ్ పరిశోధనల వలన వేలాది కార్మికులకు ఉపాధి, ప్రకృతి వనరులను ఉపయోగించుకోగలిగిన అవకాశం మనకు లభించింది.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

అదనపు ప్రశ్నలు:

ఉ. బొగ్గు గనులలో కార్మికులను ఎలా ఎంపిక చేసేవారు ?
జవాబు.
తెలంగాణ గ్రామీణ ప్రజలు బతుకు పోరాటానికి అలవాటు పడినవారు. బుక్కెడు బువ్వకోసం తెలంగాణ పల్లెల నుండి గనులలో కూలీలుగా తరలి వచ్చేవారు. చదువురాకపోయినా, బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగు పోటీలు వంటి వాటిద్వారా అర్హులను ఎంపిక చేసి వారిని బొగ్గు గని కార్మికులుగా తీసుకొనేవారు. వారు మూడు షిఫ్టులలో పనిచేయాల్సి వచ్చేది.

గనుల్లో పనిచేయటం ప్రాణాలకు ముప్పు అని తెలిసినా గత్యంతరం లేక వారు పెట్టే పరీక్షలలో నెగ్గి గని కార్మికులుగా చేరిపోయేవారు. తరువాత తరువాత గనుల యజమానులు కార్మికుల రక్షణకు శ్రద్ధ చూపించటంతో ఎక్కువ మంది గనులలో పనిచేయటానికి ముందుకు వచ్చారు. యూనియన్ల ద్వారా ప్రస్తుతం మంచి జీవన భృతిని అందుకుంటున్నారు.

ఊ. సింగరేణి గని కార్మికుడు వ్రాసిన పాటకు అర్థాన్ని తెలుపండి.
జవాబు.
ఆలోచనలను ప్రక్కనపెట్టి హాయిగా కష్టపడు. అరవై ఐదు అంగుళాల సమతలంలో నలభై అంగుళాల లోతు వరకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో మందుకూరి మందుపాతరను పేల్చమని షార్టు ఫైరన్నకు వివరిస్తున్నాడు. పైకప్పు కూలకుండా బోల్టులు వేసి ప్రమాదాలను జరుగకుండా చూడమంటున్నాడు. బొగ్గు జారిపోకుండా దిమ్మలను సరిచేయమంటున్నాడు. టబ్బు తరువాత టబ్బును పెట్టి మెల్ల మెల్లగా టబ్బును నింపమని ఫిల్లరన్నకు చెప్తున్నాడు.

చక్కగా ఆ బొగ్గుతో నిండిన టబ్బులను రోప్తో పైకి నడిపించమని హాలరన్నను కోరుతున్నాడు. బాధ లెన్నో పడి చక్కని కష్టం చేసి బొగ్గును పైకి చేర్చాము. దానికి తగిన ఫలితాన్ని బ్యాంకు ద్వారా మాకు అందించమని సింగరేణి గని కార్మికుడు పాట ద్వారా తన కష్టాన్ని మరచి పోతున్నాడు అని దీని అర్థం.

ఎ. బొగ్గు గనులు ఎలా ఏర్పడి ఉంటాయి ? అవి సహజ వనరులు ఎలా అయ్యాయి ?
జవాబు.
బొగ్గు గనులు గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి భూమి మీదున్న ఆ వృక్షముల అవశేషాలు క్రమ క్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి. అట్లా కూరుకుపోయిన వాటి మీద మట్టి, రాళ్ళు పడి లోపలికి చేరి పొరలు పొరలుగా బొగ్గు ఏర్పడిందని శాస్త్రజ్ఞుల భావన.

అట్లా ఏర్పడిన బొగ్గు మనకు ఇపుడు పలు అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో ఇది కూడా ఒకటి అయింది. సహజంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా భూమి నుండి తీసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక సహజ వనరు అయింది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.
సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయినా ఆ కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు మన అవసరాల నెన్నింటినో తీరుస్తున్నది కావున మనకు వారితో పరోక్ష సంబంధం ఉన్నట్లే. వారు తయారుగా ఉంచిన బొగ్గు యంత్రాలు నడపటానికి ఉపకరిస్తుంది. దానివలన ఎందరికో ఉపాధి కలుగుతున్నది. బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారవుతుంది. అది లేనిదే ఈ మన దైనందిన జీవితం చాలా కష్టతరమౌతుంది.

బొగ్గుతో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలలో పనిచేసేవారికి ఉపాధికారి అవుతుంది. మనం నడవటానికి సరైన రహదారులు కావాలి. రహదారుల నిర్మాణంలో బొగ్గు నుండి ఉత్పత్తి చేసే తారు ప్రధానపాత్ర వహిస్తుంది.

పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు బొగ్గుతో తయారవుతున్నాయి. బట్టలకు అద్దకం పనిచేయటానికి రంగులను బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. మనదేశంలో విరివిగా అందుబాటులో ఉన్న సహజవనరు బొగ్గు, ఆ బొగ్గును అందించే కార్మికుడితో మన సమాజంలో బతుకుతున్న వారందరికి పరోక్ష సంబంధం ఉన్నది.

చివరకు బట్టలను ఇస్త్రీ చేయటానికి కూడా ఈ బొగ్గు ఉపయోగింప బడుతున్నది కదా! కాబట్టి సింగరేణి కార్మికులు అక్కడ బొగ్గు గనులలో పనిచేస్తున్నా వారితో మనకు పరోక్ష సంబంధం తప్పనిసరి అవుతుంది. ఎంతో మందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

అదనపు ప్రశ్నలు:

ఆ. ఆ సింగరేణి గనుల పూర్వాపరాలను తెలియజేయండి. (లేదా) సింగరేణి తెలంగాణాకు తలమానికం వంటిదని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన నేలల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు చెప్పుకోదగినవి.

గోదావరి నదీ పరీవాహక ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి ఆ చెట్ల అవశేషాలు భూమిలోపలకు చేరి పొరలు పొరలుగా ఏర్పడ్డాయి. అవే బొగ్గుగనులు. దానినే నేలబొగ్గు అని, నల్ల బంగారం అని పిలుస్తున్నాం. మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామస్తుల త్రవ్వకాలలో ఈ బొగ్గు గనుల చరిత్ర బయటపడింది. భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది అంత మంచిది కాదని తేల్చింది. ఆ తరువాత 1871లో డాక్టర్ కింగ్ అనే శాస్త్రజ్ఞుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గును గుర్తించాడు.

ఇది భూమి అడుగు పొరలలో ఉందని అన్నాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీవారు తొలి భూగర్భ గనిని ఇల్లందులో ప్రారంభించారు. దీనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్సీమ్’ అని పైపొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరుపెట్టారు. బొగ్గును రవాణా చేయటానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు రైల్వేలైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అను పేరు పెట్టారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ, సింగరేణి కాలరీస్ కంపెనీగా మారిపోయింది. ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

ఇ. బొగ్గు గనులలో పనిచేసే విభాగాలు, వాటి పేర్లు, కార్మికుల హోదాలను రాయండి.
జవాబు.
బొగ్గుగనులలో పనిచేసేవారు గడియారం ముళ్ళవలే శ్రమజీవులు. మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు. గనిలోకి పోయేముందు హాజరు వేయించుకుంటారు. ‘ఓర్మెన్’ పనిని విభజించి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు. పొట్టినిక్కరు, కాళ్ళకు బూట్లు, తలపై లైటుతో ఉన్న టోపి, నడుముకు బాటరీ కట్టుకొని కార్మికులు గనిలోకి ప్రవేశిస్తారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్ చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు. ‘కోల్ కట్టర్’ ఉళ్ళు కోసి మందుపాతరలను పెడతాడు.

‘షార్ట్ ఫైర్మెన్’ వాటిని పేలుస్తాడు. తర్వాత ‘సర్దార్’ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాడు. ఇతడు పైకప్పు కూలకుండా ప్రమాదాలను పసికడుతుంటాడు. ‘కోల్ ఫిల్లర్’లు చెమ్మత్తో బొగ్గును తట్టల్లోకి ఎత్తి టబ్బులు నింపుతారు. ‘హాలర్’ టబ్బులన్నీ నిండిన తరువాత రోప్ సాయంతో పైకి చేరుస్తాడు.

ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్మెన్, సర్వేయర్, చైర్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూర్లు, బొగ్గును వెలికి తీసే పనిలో భాగస్వాములు అవుతారు. వీరందరూ కలసికట్టుగా పనిచేస్తేనే బొగ్గు త్రవ్వి తీయటం సాధ్యమౌతుంది. అపుడే దేశ పురోభివృద్ధి సాధ్యమౌతుంది.

ఈ. “సింగరేణిని వెలుగులు విరజిమ్మే సింగరేణి” అని ఎందుకు అన్నారు ?
జవాబు.
సింగరేణిని “సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని అంటారు. ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ; వేల మందికి ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకి జీవనోపాధిని, పనిని కల్పించిన కంపెనీ అయిన సింగరేణికి తెలంగాణలో ఎంతో విశిష్టత ఉంది. సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. దేశ ప్రగతికి తోడ్పడే సింగరేణి గనులు, బొగ్గు, థర్మల్ స్టేషన్ గొప్పతనం చెప్పారు.

బొగ్గును అందించి పరిశ్రమలు పనిచేసేలా భగభగమండి వెలుగులు విరజిమ్ముతుంది. ఆ గనుల్లో, కర్మాగారాలలో పనిచేసే కార్మికుల జీవితాలలో వెలుగును నింపుతుంది. అక్కడ పనిచేసే వారి జీవితాలకు సిరిసంపదలనిస్తుంది. ఎంతో సహజ ఖనిజ సంపద అణువణువున కల్గి ఉంది. అక్కడి బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారుచేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆ విద్యుత్ వెలుగులను సింగరేణి ఇస్తుంది.

కనుక సింగరేణిని “వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని, “అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం” అని అంటారు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

IV. సృజనాత్మకత/ప్రశంస:

ప్రశ్న 1.
సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.
గనిలో పాటించవలసిన జాగ్రత్తలు.

  1. గనులలోకి పోయే కార్మికులు ‘మస్టర్’ (హాజరు) తప్పనిసరిగా వేయించుకోవాలి.
  2. తన పనేదో దానికే పరిమితం కావాలి.
  3. సులువుగా నడవటానికి, పరిగెత్తటానికి వీలయ్యే పొట్టి నిక్కరునే ధరించాలి.
  4. కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు వేసుకోవాలి.
  5. తలపై టోపీకున్న లైటు సరిగా వెలుగుతుందో లేదో పరీక్షించుకోవాలి.
  6. నడుముకున్న బాటరీ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి.
  7. మందు పాతరలు పెట్టేటప్పుడు, పేల్చేటప్పుడు అందరినీ అప్రమత్తం చేయాలి.
  8. గనులలోకి నీరు ప్రవేశించినపుడు వెంటనే బయటకు వచ్చేయాలి.
  9. గనులు కూలిపోతాయన్న అనుమానం వచ్చినపుడు వేగంగా బయటకు రావాలి.
  10. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
  11. మత్తుపానీయాలు సేవించి గనులలోకి ప్రవేశించరాదు.
  12. నిప్పుపట్ల జాగ్రత్త వహించాలి.
  13. బొగ్గును పైకి చేర్చే రోప్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.
  14. ఆరోగ్య విషయంలో తరచుగా డాక్టర్ను సంప్రదించాలి.
  15. ఒంటికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.

ప్రశ్న 2.
సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒకపాట రాయండి.
జవాబు.
పల్లవి : చీకటిలో కష్టపడే శ్రమ జీవన సాంద్రుడు
పరుల బతుకులకు వెలుగులు పంచు నల్ల చంద్రుడు. ॥

అనుపల్లవి : శ్రేష్ఠుడురా మాయన్న సింగరేణి కార్మికుడు
నిష్ఠాయుతుడైన నల్ల బంగారం ప్రేమికుడు. ॥

1 చరణం : ఫ్యాక్టరీ కూత విని పరుగెత్తే సైనికుడు
పగలు రేయి పని వీణను మోగించే వైణికుడు
ఊపిరాడలేని గనుల లోపల ఒక యాత్రికుడు
చెమటను బంగారంగా చేయగలుగు మాంత్రికుడు.

2 చరణం : చావుకు వెరువక పోరే ఒక సాహస వీరుడు
కఠిన పరిస్థితులనైన కరిగించే ధీరుడు
తన వాళ్ళ సుఖం కోసం తపియించు ఋషీంద్రుడు
పెనుసవాళ్ళు ఎదురైనా వెరవని గంభీరుడు.

3 చరణం : జీవితమొక పోరాటంగా సాగే యోధుడు
త్యాగ జీవనానికే నిదర్శనమౌ ధన్యుడు
కడలివంటి కన్నీళ్ళను దాచుకునే సాగరుడు
జనతకు ప్రభుతకు జాతికి నిజమైన సేవకుడు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ఉదా : కోడికూత = తెల్లవారు సమయం
పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలు పెడతారు.

అ) చెమటోడ్చు =
జవాబు.
చెమటోడ్చు = కష్టపడు
తెలంగాణ ప్రజలందరు చెమటోడ్చి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుంది.

ఆ) మూలస్తంభం =
జవాబు.
మూలస్తంభం = ముఖ్యమైనది
దేశ అభివృద్ధిలో కార్మికులే మూలస్తంభాలు

ఇ) బతుకుపోరు =
జవాబు.
కష్టపడి పనిచేసేవారే బతుకు పోరులో విజయం సాధిస్తారు.

ఈ) మసిబారు =
జవాబు.
చేతి వృత్తుల వారి జీవితాలు రోజురోజుకు మసిబారుతున్నాయి.

ఉ) తలమానికం =
జవాబు.
శ్రేష్ఠము – గొప్పది
సింగరేణి గనులు మనదేశానికి తలమానికం.

2. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయపదాలు రాయండి.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి 2

అ) తనువు = ______________
జవాబు.
శరీరము, మేను, దేహం

ఆ) భూమి = ______________
జవాబు.
పుడమి, వసుధ, ధరణి

ఇ) రేయి = ______________
జవాబు.
నిశీథిని, రాత్రి, యామిని

ఈ) సువాసన = ______________
జవాబు.
సుగంధం, పరిమళం, సౌర

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.

అ) అచ్చెరువు
జవాబు.
అచ్చెరువు (వి) – ఆశ్చర్యము (ప్ర)

ఆ) ఖని
జవాబు.
ఖని (ప్ర) – గని (వి)

ఇ) జంత్రము
జవాబు.
జంత్రము (వి) – యంత్రము (ప్ర)

ఈ) ప్రాణం
జవాబు.
ప్రాణం (ప్ర) – పానం (వి)

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధిపేరు రాయండి.

అ) కావాలి + అంటే = కావాలంటే – ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఆ) మూల + ఆధారం = మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఇ) ప్రాంతము + అంతా – ప్రాంతమంతా – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ఎప్పుడెప్పుడు – ఆమ్రేడితసంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైనపుడు సంధి తరచుగా అవుతుంది.

ఉ) మహా + ఉద్యమం = మహోద్యమం – గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.

అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీతత్పురుష సమాసము
ఆ) సాధ్యం కానిది = అసాధ్యము – నఞ తత్పురుష సమాసము
ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసము
ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీతత్పురుష సమాసము
ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసము

3. కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్న మాట దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

4. కింది వాక్యాల్లో దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి.

అ) మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
మండే ఎండను నిప్పుల కొలిమితో ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం మండే ఎండలు. ఉపమానం నిప్పుల కొలిమి.

ఆ) ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా! అన్నట్లు ఉన్నాయి.
జవాబు.
ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులుగా ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారమంటారు. దీనిలో ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు. ఉపమానం కొలనులోని పువ్వులు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న .
మీ ప్రాంతంలోని కార్మికులను / శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను నివేదిక రూపంలో వ్రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : కార్మికులు/శ్రామికులు పనిలో వారు పొందిన అనుభవాలు, అనుభూతులు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా కార్మికులు/శ్రామికులను కలువడం ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :

ఇటీవలే నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్ళాను. సిరిసిల్ల ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రం. అందులో మరమగ్గాలపై ఆధారపడి వందలాది మంది నేతన్నలు జీవిస్తున్నారు. పనిలో వారి అనుభవాలు, అనుభూతులు తెలిసికోవడానికై వారి పని గూర్చి, ఆ పని పట్ల వారి అభిప్రాయం అడిగాను. చాలా మంది వారి వృత్తి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వారి మాటల ద్వారా నాకు అర్థమైంది. సొంత ఊరు విడిచి, పొట్ట చేత పట్టుకుని వచ్చిన నేతన్నలకు ఈ వస్త్ర పరిశ్రమ తగిన ఉపాధి కల్పించడం లేదనే చెప్పాలి.

ఇంటి అద్దె, పిల్లల చదువులు, జీవనయానంకై అయ్యే కిరాణ సామాను ఖర్చు, కూరగాయల ఖర్చు .. ఇలా ఎన్నో ఉన్నాయి. వారికి ఈ పనిలో లభించే డబ్బు సరిపోవడం లేదు … కుటుంబాన్ని నెట్టుకు రావడానికో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక కొందరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాగుడుకు బానిసలై తమ ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకొంటున్నారు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి 3

  1. రోజుకు 12 గంటలు పనిచేయాలి. కార్మిక చట్టం 8 గంటలు పనే అని చెబుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు.
  2. డే & నైట్ రెండు షిఫ్టులలో పనిచేయాలి. నైట్ షిఫ్ట్లో పనిచేసేప్పుడు నిద్రలేక …. అనారోగ్యం బారిన పడుతున్నారు.
    విపరీతమైన శబ్దం మధ్య పనిచేయడంవల్ల వినికిడి శక్తి తగ్గడం, తలనొప్పి, రోజంతా చికాకుగా ఉండడం లాంటి లక్షణాలు వేధిస్తున్నాయి.
  3. ఒక్కసారి 8 మరమగ్గాలను పర్యవేక్షించాలి … ఎంతో ఒత్తిడి మధ్య నిలబడే పని చేయాల్సి వస్తుంది.
  4. చిన్న చిన్న దారపు పోగులు గాలిలో కలిసి, శ్వాస వ్యవస్థలో ప్రవేశించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉదా ॥ ఆస్త్మా లాంటివి వస్తున్నాయి.
  5. 12 గంటల పనిలో కనీసం 300 రూ॥లు సంపాదించ లేకపోతున్నారు. ఇంకా స్త్రీలకు ఈ రంగంలో మరీ అన్యాయం జరుగుతోంది. 12 గంటల పాటు కండెలు చుడితే 50-60 రూ॥లే వస్తున్నాయి.
  6. ఈ విధంగా వృత్తిలో వారెదుర్కొంటున్న సాదక బాధకాలు వివరించారు.

ఇ) ముగింపు :

నేత కార్మికుల సాదక బాధకాలు వింటుంటే చాలా బాధనిపించింది. 8 గంటల పని అమలు చేస్తే బాగుండు ననిపించింది. పెరిగిన రేట్ల కనుగుణంగా వారి కూలీ రేట్లు కూడా పెంచితే బాగుండు ననిపించింది. వారి నెల జీతంలో కొంత డబ్బు మినహాయించుకొని వారిని, వారి కుటుంబాలను Health scheme లో చేర్పిస్తే బాగుండు ననిపించింది.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

వ్యవసాయం = సేద్యము, కృషి
ప్రపంచము = లోకము, జగత్తు
సిరి = సంపదలు, ఐశ్వర్యము
నీరు = జలము, ఉదకము
బంగారము = స్వర్ణము, పసిడి
గుహ = కొండ యందలి బిల్వము, హృదయము
చరణము = పాదము, పద్యపాదము
చీకటి = అంధకారము, దుఃఖము

నానార్థాలు:

కాలము = సమయము, నలుపు
కార్యము = పని, ప్రయోజనము
కుప్ప = ధాన్యరాశి, ప్రోగు
కులము = వంశము, జాతి
కృషి = ప్రయత్నము, వ్యవసాయం

ప్రకృతి – వికృతి:

భూమి = బూమి
శక్తి = సత్తి
బంగారము = బంగరము
స్థిరము = తిరము
శ్రద్ధ = సడ్డ
భారము = బరువు
నిద్ర = నిదుర

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

సంధులు :

నడవాలంటే = నడవాలి + అంటే – ఇత్వ సంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

విస్తారమైన = విస్తారము + ఐన = ఉత్వసంధి
నిలయమైన = నిలయము + ఐన = ఉత్వసంధి
అద్భుతమైన = అద్భుతము + ఐన = ఉత్వసంధి
కష్టమైన = కష్టము + ఐన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

దశాబ్దము = దశ + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

నల్ల బంగారము = నల్లనైన బంగారము – విశేషణ పూర్వపద కర్మధారయము
శ్రద్ధాసక్తులు = శ్రద్ధయును, ఆసక్తియును – ద్వంద్వ సమాసము
కష్టనష్టాలు = కష్టమును నష్టమును – ద్వంద్వ సమాసము
జీతభత్యాలు = జీతమును భత్యమును – ద్వంద్వ సమాసము
కార్మికలోకము = కార్మికుల యొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసం
ఊపిరితిత్తుల సమస్యలు = ఊపిరితిత్తుల యొక్క సమస్యలు – షష్ఠీ తత్పురుష సమాసం
దేశాభివృద్ధి = దేశము యొక్క అభివృద్ధి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆరు పొరలు = ఆరు సంఖ్య గల పొరలు – ద్విగు సమాసము
భారతదేశము = భారతమను పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయము
గోదావరినది = గోదావరి అను పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయము.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

క్రింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ప్రశ్న 1.
అనూహ్యంగా : ______________
జవాబు.
అనూహ్యంగా = ఊహించని విధంగా
నేను కొన్న లాటరీ టికెట్కి అనూహ్యంగా లక్షరూపాయలు వచ్చాయి.

ప్రశ్న 2.
నిక్షిప్తము : ______________
జవాబు.
నిక్షిప్తము = దాచిన
పూర్వం నేలమాళిగెలలో బంగారు, వెండి నాణేలు, ఆభరణాలు నిక్షిప్తం చేసేవారు.

ప్రశ్న 3.
దుర్భరం : ______________
జవాబు.
దుర్భరం = భరింపరాని, భరించలేని, కష్టంగా
ఎంత దుర్భరమైన బాధ కల్గినా ధైర్యంగా ఉండాలి.

ప్రశ్న 4.
విరివిగా : ______________
జవాబు.
విరివిగా = ఎక్కువగా
వేసవి కాలంలో విరివిగా మల్లెపూలు పూస్తాయి

ప్రశ్న 5.
రంగరించు : ______________
జవాబు.
రంగరించు = కలుపు
చాలావరకు ఆయుర్వేద మందులను తేనెలో రంగరించి తీసుకుంటారు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

అర్థాలు :

క్రింది గీతగీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 6.
అపారమైన ఖనిజ సంపదలు తెలంగాణలో గలవు. ( )
A) పరిమితమైన
B) అంతులేని
C) తక్కువ
D) అతితక్కువ
జవాబు.
B) అంతులేని

ప్రశ్న 7.
రాముని యొక్క విశిష్టత రామునికే తెలుసు. ( )
A) గొప్పతనం
B) చెడ్డతనం
C) మొండితనం
D) కరకుతనం
జవాబు.
A) గొప్పతనం

ప్రశ్న 8.
ప్లాస్టిక్ అవశేషాల వల్ల భూమిసారం దెబ్బతింటుంది. ( )
A) వాడే పదార్థాలు
B) వాడని పదార్థాలు
C) మడ్డి పదార్థాలు
D) మిగిలిన పదార్థాలు
జవాబు.
D) మిగిలిన పదార్థాలు

ప్రశ్న 9.
సింగరేణి కార్మికులు మస్టర్ వేయించుకుని గనిలోకి వెళ్తారు. ( )
A) హాజరు
B) ముద్ర
C) గుర్తు
D) బొట్టు
జవాబు.
A) హాజరు

ప్రశ్న 10.
ఈ సంవత్సరం మామిడికాయలు విరివిగా కాశాయి. ( )
A) తక్కువగా
B) ఉండి లేకుండా
C) ఎక్కువగా
D) ఏవీకాదు
జవాబు.
C) ఎక్కువగా

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

నానార్థాలు:

క్రింది గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 11.
కాలము చాల విలువైంది. ( )
A) సమయము, నలుపు
B) తెలుపు, ఎరుపు
C) గంట, నిముషము
D) రోజు, వారం
జవాబు.
A) సమయము, నలుపు

ప్రశ్న 12.
ప్రయత్నము, వ్యవసాయము అని అర్థం ఇచ్చే నానార్థ పదం గుర్తించండి. ( )
A) ప్రయాణము
B) పరుగు
C) పని
D) కృషి
జవాబు.
D) కృషి

ప్రశ్న 13.
‘చరణము’నకు నానార్థాలు గుర్తించండి. ( )
A) ఆట, పాట
B) సంగీతం, గజ్జెలు
C) పాదము, పద్యపాదము
D) ఏదీకాదు
జవాబు.
C) పాదము, పద్యపాదము

ప్రశ్న 14.
‘శ్రీ’కి నానార్థాలు గుర్తించండి. ( )
A) సంపద, సాలెపురుగు
B) శ్రీరాముడు, శ్రీకృష్ణుడు
D) వ్యాయామం, సాలెపురుగు
C) శ్రీశ్రీ, శ్రీను
జవాబు.
A) సంపద, సాలెపురుగు

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

పర్యాయపదాలు:

క్రింది గీతగీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

ప్రశ్న 15.
బొగ్గును నల్ల బంగారం అని వ్యవహరిస్తారు. ( )
A) బొగ్గు, మట్టి
B) కనకము, పసిడి
C) ఇత్తడి, రాగి
D) ఇనుము, మినుము
జవాబు.
B) కనకము, పసిడి

ప్రశ్న 16.
ప్రకృతి సహజ సంపదలకు అడవులే మూలం. ( )
A) గనులు, దిబ్బలు
B) సెలయేళ్ళు, దిబ్బలు
C) ఇసుక, రాళ్ళు
D) వనము, అరణ్యము
జవాబు.
D) వనము, అరణ్యము

ప్రశ్న 17.
అడవులు చెట్లుతో నిండి ఉంటాయి. ( )
A) ఆకులు, పూలు
B) కొమ్మలు, తీగలు
C) వృక్షము, తరువులు
D) కాననము, విపినము
జవాబు.
C) వృక్షము, తరువులు

ప్రశ్న 18.
పిల్లలు చీకటికి భయపడతారు. ( )
A) తమము, అంధకారము
B) వెలుగు, వెలుతురు
C) నలుపు, తెలుపు
D) ఎరుపు, పసుపు
జవాబు.
A) తమము, అంధకారము

ప్రశ్న 19.
సర్వప్రాణులకు నీరే ఆధారం. ( )
A) ఏరు, సెలయేరు
B) నది, సముద్రము
C) జలము, ఉదకము
D) చుక్క, వర్షం
జవాబు.
C) జలము, ఉదకము

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

ప్రకృతి – వికృతులు:

క్రింది పదాలకు ప్రకృతి/వికృతులను గుర్తించండి.

ప్రశ్న 20.
విద్యార్థుల మనసు స్థిరముగా ఉండాలి. ( )
A) తిరము
B) అస్థిరము
C) చరము
D) చంచలము
జవాబు.
A) తిరము

ప్రశ్న 21.
పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానహక్కులు కలిగి ఉండాలి. ( )
A) ఇందిర
B) ఇంతి
C) ఇందీవరము
D) బంతి
జవాబు.
B) ఇంతి

ప్రశ్న 22.
జంత్రము అను పదానికి ప్రకృతిని రాయండి. ( )
A) జంతువు
B) మృత్యువు
C) రజ్జువు
D) యంత్రము
జవాబు.
D) యంత్రము

ప్రశ్న 23.
గనుల నుండి బయటపడినందుకు కార్మికులు ఏరోజుకారోజు సంతోషం చెందుతారు. ( )
A) సంతసము
B) ఆనందము
C) దుఃఖము
D) సంబరము
జవాబు.
A) సంతసము

ప్రశ్న 24.
అందరూ కలసి మెలసి స్నేహంగా జీవించాలి. ( )
A) ఆనందంగా
B) ఆప్యాయంగా
C) నెయ్యముగా
D) గొడవలతో
జవాబు.
C) నెయ్యముగా

వ్యుత్పత్తి అర్థాలు:

ప్రశ్న 25.
వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. – ‘అగ్ని’కి వ్యుత్పత్తి అర్థం ( )
A) జ్వలించు స్వభావం కలది
B) ద్రవించు స్వభావం కలది
C) నిప్పువంటిది
D) ఏదీకాదు
జవాబు.
A) జ్వలించు స్వభావం కలది

ప్రశ్న 26.
‘అచలము’ – వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి ( )
A) తేలికైనది
B) ద్రవించేది
C) చలనము లేనిది
D) ఘనీభవించేది
జవాబు.
C) చలనము లేనిది

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

భాషాంశాలు :

సంధులు :

కింది వాటికి సంధులు గుర్తించండి.

ప్రశ్న 27.
‘నిలయము + ఐన’ కలిపి రాస్తే ( )
A) నిలయమైన
B) నిలమైన
C) నిలైన
D) నిలయామైన
జవాబు.
A) నిలయమైన

ప్రశ్న 28.
‘ప్రత్యేకత’ పదాన్ని విడదీసే విధం ( )
A) ప్ర + ఏకత
B) ప్రత్యే + కత
C) ప్రతే + ఏకత
D) ప్రతి + ఏకత
జవాబు.
D) ప్రతి + ఏకత

ప్రశ్న 29.
‘దేవాలయము’లోని – సంధి ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు.
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 30.
చీకటిల్లు – విడదీసే విధం ( )
A) చీక + ఇల్లు
B) చీకటి + ఇల్లు
C) చీ + కటిల్లు
D) చీకటి + ల్లు
జవాబు.
B) చీకటి + ఇల్లు

సమాసాలు:

ప్రశ్న 31.
కష్టసుఖములు – విగ్రహవాక్యం ( )
A) కష్టమును, సుఖమును
B) కష్టముతో సుఖం
C) కష్టము వల్ల సుఖం
D) కష్టం యొక్క సుఖం
జవాబు.
A) కష్టమును, సుఖమును

ప్రశ్న 32.
రమ్యమైన స్థలము సమాసపదాన్ని, నామాన్ని తెలుపండి. ( )
A) రమ్యంగా ఉండే స్థలం
B) స్థల రమ్యం
C) రమ్య స్థలం
D) స్థలంతో రమ్యం
జవాబు.
C) రమ్య స్థలం

ప్రశ్న 33.
దశకంఠుడు – విగ్రహవాక్యం రాయండి. ( )
A) దశ సంఖ్య గల కంఠాలు కలవాడు
B) దశతో కంఠాలు కలవాడు
C) కంఠాలు ఉంటాయి పది
D) దశ వలన కంఠాలు కలవాడు
జవాబు.
A) దశ సంఖ్య గల కంఠాలు కలవాడు

ప్రశ్న 34.
నెలతాల్పు – విగ్రహవాక్యం రాయండి. ( )
A) నెల యొక్క తాల్పు
B) నెల యందు
C) నెల వల్ల తాల్పు
D) నెలను తాల్చినవాడు
జవాబు.
D) నెలను తాల్చినవాడు

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు ఎటువంటి వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 35.
గనులు ఎక్కడెక్కడున్నాయి ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం

ప్రశ్న 36.
మనం బ్రతుకు తెరువు కోసం కష్టపడగలము. ( )
A) సామర్థ్యార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) హేత్యర్థకం
జవాబు.
A) సామర్థ్యార్థకం

ప్రశ్న 37.
గనులు మేము చూడవచ్చా ? మేము రావచ్చా ? ( )
A) సామర్థ్యార్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
B) ప్రశ్నార్థకం

ప్రశ్న 38.
మీరంతా థర్మల్ పవర్ స్టేషన్ చూడటానికి రావచ్చును. ( )
A) ప్రశ్నార్థకం క్రియను గుర్తించుట
B) ఆశ్చర్యార్థకం
C) ప్రేరణార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
D) అనుమత్యర్థకం

గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.

ప్రశ్న 39.
నేల బొగ్గును గనులనుండి తీసి కార్మికులు పైకి చేరుస్తారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 40.
అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బొగ్గు తీయటం సాధ్యమౌతుంది. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) చేదర్థకం

ప్రశ్న 41.
ఎన్ని కష్టాల కోర్చినప్పటికీ పేదల కడుపు నిండటంలేదు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
D) అప్యర్థకం

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 42.
జీవితం సుఖమయం కావాలి. అందరి అవసరాలు తీరాలి. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి.
B) జీవితం సుఖమయం అవ్వడానికి అందరి అవసరాలు తీరాలి.
C) అందరి అవసరాలు తీరితే జీవితం సుఖమయం అవుతుంది.
D) జీవితం సుఖమయం కావాలి కనుక అందరి అవసరాలు తీరాలి.
జవాబు.
D) జీవితం సుఖమయం కావాలి కనుక అందరి అవసరాలు తీరాలి.

ప్రశ్న 43.
గనిలోని కింది బొగ్గు పొరకు ‘కింగ్ సీమ్’ అని పేరు పెట్టారు. గనిలోని పై బొగ్గు పొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరు పెట్టారు. ( )
A) గనిలోని పొరలకు కింగ్ సీమ్, క్వీన్ సీమ్ అని పేరు పెట్టారు.
B) కింగ్ సీమ్, క్వీన్ సీమ్ అని గనిలోని పొరలకు పేరు పెట్టారు.
C) గనిలోని కింది బొగ్గు పొరకు కింగ్ సీమ్, పై బొగ్గు పొరకు క్వీన్ సీమ్ అని పేరు పెట్టారు.
D) బొగ్గు పొరలను గనిలో కింగ్ సీమ్, క్వీన్ సీమ్ అను పేరుతో పిలుస్తారు.
జవాబు.
C) గనిలోని కింది బొగ్గు పొరకు కింగ్ సీమ్, పై బొగ్గు పొరకు క్వీన్ సీమ్ అని పేరు పెట్టారు.

ప్రశ్న 44.
భూగర్భంలో కార్మికులు శక్తికి మించి పని చేస్తారు. వారి శ్రమ వెలకట్టలేనిది. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) భూగర్భంలో కార్మికులు శక్తికి మించి పని చేస్తారు కనుక వారి శ్రమ వెలకట్టలేనిది.
B) భూగర్భంలో శక్తికి మించి పని చేసే కార్మికుని శ్రమ వెలకట్టలేనిది.
C) శక్తికి మించి పని చేసే కార్మికుని శ్రమ వెలకట్టలేనిది.
D) భూగర్భంలో కార్మికులు శక్తికి మించి పని చేస్తుంటే వారి శ్రమ వెలకట్టలేనిదై ఉంటుంది.
జవాబు.
A) భూగర్భంలో కార్మికులు శక్తికి మించి పని చేస్తారు కనుక వారి శ్రమ వెలకట్టలేనిది.

ప్రశ్న 45.
సింగరేణి కార్మికులు కోడికూతకు ముందే నిద్రలేస్తారు. సింగరేణి కార్మికులు తయారై గనిలోకి వెళ్తారు – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) సింగరేణి కార్మికులు కోడికూతకు ముందే నిద్రలేస్తూ తయారై గనిలోకి వెళ్తారు.
B) సింగరేణి కార్మికులు కోడికూతకు ముందే నిద్రలేచి తయారై గనిలోకి వెళ్తారు.
C) సింగరేణి కార్మికులు కోడికూత కన్నా ముందేలేస్తూ గనిలోకి వెళ్తారు.
D) సింగరేణి కార్మికులు గనిలోకి వెళ్ళడానికి కోడికూతకి ముందే నిద్రలేస్తారు.
జవాబు.
B) సింగరేణి కార్మికులు కోడికూతకు ముందే నిద్రలేచి తయారై గనిలోకి వెళ్తారు.

ప్రశ్న 46.
ఓర్మెన్ కార్మికులకు ఏపని చేయాలో చెప్తాడు. ఓరమెన్ పనిని విభజిస్తాడు. – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) ఓర్మెన్ కార్మికులకు పని ఎలా చేయాలో చెప్తూ పని విభజిస్తాడు.
B) ఓర్మెన్ కార్మికులకు పనిని చేయమని చెప్పి పనిని విభజిస్తాడు.
C) ఓర్మెన్ కార్మికులకు పని విభజించి ఎలా చేయాలో చెప్తాడు.
D) ఓర్మెన్ కార్మికులకు ఏ పని చేయాలో చెప్పి పనిని విభజిస్తాడు.
జవాబు.
D) ఓర్మెన్ కార్మికులకు ఏ పని చేయాలో చెప్పి పనిని విభజిస్తాడు.

ప్రశ్న 47.
కార్మికులు ప్రమాదం అంచున నిలబడతారు. మృత్యువుతో పోరాటం చేస్తుంటారు. – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) కార్మికులు ప్రమాదం అంచున నిలబడి మృత్యువుతో పోరాటం చేస్తుంటారు.
B) కార్మికులు ప్రమాదం అంచున నిలబడుతూ మృత్యువుతో పోరాటం చేస్తారు.
C) కార్మికులు ప్రమాదం అంచున నిలబడాలని మృత్యువుతో పోరాటం చేస్తుంటారు.
D) కార్మికులు ప్రమాదం అంచున మృత్యువుతో పోరాటం చేస్తూ నిలబడతారు.
జవాబు.
A) కార్మికులు ప్రమాదం అంచున నిలబడి మృత్యువుతో పోరాటం చేస్తుంటారు.

ప్రశ్న 48.
శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపారు. శాస్త్రవేత్తలు విద్యుచ్ఛక్తి కనిపెట్టారు. – సంశిష్టవాక్యం గుర్తించండి. ( )
A) శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతూ విద్యుచ్ఛక్తి కనిపెట్టారు.
B) శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరపాలని విద్యుచ్ఛక్తి కనిపెట్టారు.
C) శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపి విద్యుచ్ఛక్తి కనిపెట్టారు.
D) శాస్త్రవేత్తలు విద్యుచ్ఛక్తి కనిపెట్టడానికి ఎన్నో పరిశోధనలు జరిపారు.
జవాబు.
C) శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపి విద్యుచ్ఛక్తి కనిపెట్టారు.

TS 8th Class Telugu Bits 10th Lesson సింగరేణి

అలంకారాలు:

క్రింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి.

ప్రశ్న 49.
రాజు చొక్కా మల్లెపువ్వు లాగా తెల్లగా ఉంది. ( )
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు.
A) ఉపమా

ప్రశ్న 50.
ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఏ అలంకారం అవుతుంది ? ( )
A) ఉపమ
B) రూపక
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు.
C) ఉత్ప్రేక్ష

ప్రశ్న 51.
ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలిక చెప్తే అది ఏ అలంకారం ? ( )
A) రూపకం
B) ఉత్ప్రేక్ష
C) ఉపమా
D) స్వభావోక్తి
జవాబు.
C) ఉపమా

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

These TS 8th Class Telugu Bits with Answers 9th Lesson అమరులు will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

ప్రశ్న 2.
స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.
గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

ప్రశ్న 3.
స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.
జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

ప్రశ్న 4.
అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు.
నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

నేపథ్యం / ఉద్దేశం:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.
జవాబు.
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360కి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్పించాడు.
తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి. )

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య కె. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:

ప్రశ్న.
అమరులు గేయ రచయితను పరిచయం చేయండి. (లేదా) అమరులు పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జవాబు.
సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె. రుక్నుద్దీన్. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో జన్మించాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ‘జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. 1969 సం॥లో “విప్లవఢంకా” మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుదిశ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, శెలిమె, సూక్తిసుధ, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. (పరీక్షల్లో గీత గీసిన వాక్యాలు రాస్తే చాలు)

ప్రవేశిక:

ప్రశ్న.
అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.
జవాబు.
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

కఠినపదాలకు అర్థాలు:

అసువులు = ప్రాణాలు
మాన్యులు = గౌరవనీయులు
పాసిన = పాయుట, వదిలిపెట్టుట
రుద్రుడు = శివుడు
సౌహార్దత = మంచి మనసు
జోహారులు = నివాళులు
పరిపాలన = ఏలుబడి
క్రాంతి = విప్లవం
సతి = భార్య
పతి = భర్త
లావు = బలము, ఎక్కువ, అధికం
ఉద్బోధ = సందేశం
అంధులు = గ్రుడ్డివారు, కళ్ళు లేనివారు
రుధిరం = రక్తం
సిక్త = తడిసిన
యమపాశం = యముని చేతిలోని దండం (పాశం)
ప్రతిజ్ఞ = ప్రతిన
భూవలయం = భూమండలం

గేయం – అర్థాలు – భావాలు:

1. మాకై అసువులు బాసిన
మాన్యులార ! ధన్యులార !
మాతృభూమి స్వేచ్ఛ కొరకు
బలియయ్యిన ప్రబలులార !
తెలంగాణ గర్భమ్మున
గలిగిన శ్రీ రుద్రులార
తను వొడ్డిన ఘనులారా !
సౌహార్దతతోడ నిచ్చు
జనని, సఖుల, సేవలకై
జోహారులు, జోహారులు
సకలజనుల సమూహములు
సమర్పించు జోహారులు

అర్థాలు:

మాకై = మాకోసం
అసువులు = ప్రాణాలను
పాసిన = వదిలిన
మాన్యులార = గౌరవనీయులారా !
ధన్యులార = ధన్యులారా !
మాతృభూమి = జన్మభూమి యొక్క
స్వాతంత్ర్యం కోసం = స్వేచ్ఛ కొరకు
బలి + అయ్యిన = ప్రాణాలు కోల్పోయిన
ప్రబలులార = బలవంతులారా !
తెలంగాణ గర్భమ్మున = తెలంగాణ తల్లి కడుపులో నుండి
కలిగిన = జన్మించిన
శ్రీ రుద్రులారా = = శివ స్వరూపులారా !
జనని = తల్లి యొక్క
సఖుల = మిత్రుల యొక్క
సేవలకు + ఐ = సేవకోసం
తనువు + ఒడ్డిన = శరీరం త్యాగం చేసిన
ఘనులారా = మహనీయులారా !
సౌహార్దత తోడన్ = మంచి మనసుతో
ఇచ్చు = మేమిచ్చు
జోహారులు జోహారులు = నివాళులు
సకల జనుల సమూహములు= ప్రజలందరూ కలిసి
సమర్పించు = మీకు అందించు
జోహారులు = నివాళులు (అందుకోండి)

భావం :
ఓ మాన్యులారా! ధన్యులారా! మహనీయులారా! రుద్రరూపులారా! ఈ తెలంగాణ తల్లి కడుపున పుట్టి మాతృభూమికి స్వేచ్ఛ కలిగించటానికి మీరు మీ ప్రాణాలనే త్యాగంచేశారు. అటువంటి ఘనులైన మీకు మా ప్రజలందరం కలిసి జోహారు చేస్తున్నాము. అందుకోండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. ఏ తల్లి కడుపు పంటల కొరకో
నీ తల్లి కడుపు మంటల మాడెను
ఏ సతి సౌభాగ్యమ్ముల కొరకో
నీ సతి కుంకుమ గోల్పోయెను
ప్రత్యేక తెలంగాణ కొరకై
ప్రవహించిన నీ రక్తం
పాపాత్ముల పరిపాలన
పటాపంచలౌ పర్యంతం
క్రాంతి విడదు – శాంత పడదు

అర్థాలు :

ఏ తల్లి = ఎవరో తల్లి
కడుపు పంటల కొరకు + ఓ = కన్న బిడ్డల కోసమో
మీ తల్లి కడుపు = మీ అమ్మసంతానం (మీరు)
మంటల మాడెను = మంట గలిసి పోయింది
ఏ సతి = ఎవరో భార్యల యొక్క
సౌభాగ్యమ్ముల కొరకు + ఓ = పసుపు కుంకుమల కోసం
నీ సతి = నీ భార్య
కుంకుమ + కోల్పోయెను = తన నుదుటి కుంకుమ పోగొట్టుకుంది
ప్రతి + ఏక = ప్రత్యేక = ప్రత్యేకమైన
తెలంగాణా కొరకు + ఐ = తెలంగాణ రాష్ట్రం కోసం
ప్రవహించిన = కాలువలు గట్టిన
నీ రక్తం = నీ నెత్తురు
పాప + ఆత్ముల = దుర్మార్గుల యొక్క
పరిపాలన = ఏలుబడి
పటాపంచలు + ఔ = నాశనమయ్యే
పర్యంతం = సమయం వచ్చే వరకు
క్రాంతి విడదు = విప్లవం
శాంత పడదు = శాంతింపదు

భావం :
ఎవరో తల్లి కన్న సంతానాన్ని కాపాడటానికి, ఎవరో పతివ్రతల సౌభాగ్యం కాపాడటానికి నీ ప్రాణాలను ధార పోశావు. తెలంగాణ గడ్డపై దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడేవరకు కాల్వలు గట్టిన అమరవీరుల రక్తం ప్రవాహం ఆగదు. శాంతించదు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

3. మీ వొక్కొక్క రక్తపు చుక్కే
లారైన విషమ్ముల గ్రక్కే
ఈ వీరుల ఉద్రేకాస్త్రం
ఈ వీరుల ఉద్బోధార్థం
నీ పెట్టిన రక్తపు తిలకం
నా పాలిటి దీక్షా బంధం
అధికారాంధుల పాలిటి
రుధిరసిక్త యమపాశం
అమరవీరులైన మీ యొక్క

అర్థాలు :

మీ = అవసరమైన మీ యొక్క
ఒక్క + ఒక్క = ప్రతి ఒక్క
రక్తము + చుక్క + ఏ = నెత్తురు బొట్టూ
ఈ వీరుల = ఈ ఉద్యమ వీరుల యొక్క
లావు + ఐన = అధికమైన
విషములన్ + క్రక్కే = విషాన్ని ప్రసరించే
ఉద్రేక + అస్త్రం = ఆవేశం అనే ఆయుధం
ఈ వీరుల = పోరాటం సాగిస్తున్న వీరులను
ఉద్బోధ + అర్థం = ప్రోత్సహించటానికే
నీవు + పెట్టిన = నీవు దిద్దిన
రక్తము + తిలకం = వీర తిలక
నా పాలిటి = నా విషయంలో
దీక్షా బంధం = దీక్షపూని కట్టిన కంకణం
అధికార + అంధుల పాలిటి = అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి
రుధిరసిస్త = రక్తంతో తడిసిన
యమపాశం = యముని పాశం వంటిది

భావం :
అమర వీరులైన మీ యొక్క ప్రతి నెత్తురు చుక్కా ఉద్యమ వీరుల చేతిలో విషాన్ని చిమ్మే ఆవేశమనే ఆయుధం ఔతుంది. వీరులను ఉత్సాహపరుస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం నాచేతికి కట్టుకున్న దీక్షా కంకణం. అధికారమదంతో కళ్ళుమూసుకుపోయిన పాలకులకు నెత్తురుతో తడిసిన యమపాశం వంటిది.

4. రక్త తర్పణమ్మయినా
రక్తితోడ యిచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో
మాయడుగుల నుంచేస్తాం
అనంతాకాశం
సువిశాల భూవలయం
మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా !
మా ప్రతిన వినుడు
ప్రత్యేక తెలంగాణా
బాహాటంగా సాధిస్తాం !
మృతవీరుల ఆత్మలలో
అమృత వర్షం కురిపిస్తాం.

అర్థాలు :

రక్త తర్పణమ్ము + అయినా = నెత్తురు ధార పోయుమన్నా
యిచ్చేస్తాం = త్యాగం చేస్తాం
మీ + అడుగు జాడల్లో = మీ కాలి గుర్తుల్లో
మా + అడుగులన్ = మా పాదాలను
ఉంచేస్తాం = కలిపేస్తాం
అనంత + ఆకాశం = విశాలమైన ఆకాశానికి
సువిశాల = మిక్కిలి విస్తారమైన
భూవలయం = భూగోళానికీ
మధ్యన + ఉన్న = మధ్యలో ఉన్న
ఓ సమస్త ప్రాణులారా = సమస్తమైన జీవులారా!
వినుడు = వినండి
మా ప్రతిన = మా ప్రతిజ్ఞను
ప్రతి + ఏక = ప్రత్యేకమైన
తెలంగాణా = తెలంగాణా రాజ్యాన్ని
సాధిస్తాం = సంపాదిస్తాం
మృతవీరుల = చనిపోయిన వీరుల యొక్క
ఆత్మలలో = ఆత్మలపైన
అమృతవర్షం = అమృతాన్ని వర్షంలాగా
కురిపిస్తాం = కురిసేట్లు చేస్తాం

భావం :
సంతోషంతో మా నెత్తురు ధారపోస్తాం. మీ కాలి జాడలను అనుసరించి మేము నడుస్తాం. ఆకాశానికి భూమికి మధ్య నివసించే ప్రాణులందరూ మా ప్రతిజ్ఞ వినండి. ప్రత్యేక తెలంగాణ రాజ్యాన్ని మేము సాధించి తీరుతాం. అమర వీరుల ఆత్మల మీద అమృత వర్షం కురిపిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
“మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ? (టెక్స్టపేజి నెం.91)
జవాబు.
మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం . మాకు అంటే తెలంగాణ ప్రజలు.

ప్రశ్న 2.
“జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ? (టెక్స్ట పేజి నెం.91)
జవాబు.
జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం. మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

ప్రశ్న 3.
“కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

ప్రశ్న 4.
ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

ప్రశ్న 5.
“మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

ప్రశ్న 6.
ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం.92)
జవాబు.
అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.

అ) సకలజనుల సమూహములు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

ఉ) రక్తితోడ ఇచ్చేస్తాం. (అదనపు ప్రశ్న)
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమరు వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

ఊ) బాహాటంగా సాధిస్తాం. (అదనపు ప్రశ్న)
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ పలికిన మాటలివి.
అర్థం : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది. ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.

ప్రశ్నలు :

అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

ఆ. ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు.
ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

ఇ. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు.
ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

ఈ. ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

ఉ. అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?
జవాబు.
అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లలోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

ఆ. అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు.
మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

ఇ. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు.
అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఈ. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
కవి ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

ఉ. కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ? (అదనపు ప్రశ్న)
జవాబు.
కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు. వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

ఊ. ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ? (అదనపు ప్రశ్న)
జవాబు.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
  2. అమరువీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది. శత్రువులను అంతం చేస్తుంది.
  3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
  4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
  5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు.
కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

ఆ. అమరులు కవితా సారాంశాన్ని రాయండి. (అదనపుప్రశ్న)
జవాబు.
‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు.

తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు. శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది.

మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.
జవాబు.
అమరవీరులకు భక్త్యంజలి

మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు నిండు వెలుగు బాటల్ని
చూపుతుంటారు నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.

అ) సమూహం = ______________
జవాబు.
గుంపు, సముదాయం

ఆ) అసువులు = ______________
జవాబు.
ప్రాణములు, ఉసురు

ఇ) స్వేచ్ఛ = ______________
జవాబు.
విడుదల, స్వాతంత్ర్యం

ఈ) సఖులు = ______________
జవాబు.
స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి.

అ) ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు.
సంవత్సరం, వాన

ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు.
పాలు, నీరు

3. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 3

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్య – బాగ్గెం
శ్రీ – సిరి

సంధులు:

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం = సవర్ణదీర్ఘ సంధి
ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

2. కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

  1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
  2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
  3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
  4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
    “ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

3. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.

అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

ఆ) తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు ఉపమానం. అటూ ఇటూ తిరగడం సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ ఉద్యమకాలంలో వచ్చిన పాటలు/ఒక కార్యక్రమం వివరాలు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : పాటలను వినడం ద్వారా ఉద్యమ సందర్భంలో ఆయా కార్యక్రమాలు దగ్గరగా చూడడం ద్వారా

ఆ) నివేదిక :

1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ

పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||

చరణం 1 :
పారేటి నీళ్ళల్ల పానాదులల్లా || 2 ||
పూసేటి పువ్వుల్ల ………………… పునాసాలల్లా
కొంగు జాపిన నేల ……………….. నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి ………………… నా తెలంగాణా నా తెలంగాణా

చరణం 2 :
తంగేడి పువ్వుల్ల …………. తంబల మంతా
తీరాక్క రంగుల్ల ……………. తీరిచ్చి నావూ ……………….
తీరొ రంగుల్ల ……………………. తీరిచ్చినావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా ………………… నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా …………………… నా తెలంగాణా ॥ నాగేటి ॥

చరణం 3 :
వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు …………. సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ || 2 ||
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా ……………….. నా తెలంగాణా || నాగేటి ||

చరణం 4 :
కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా …………………. నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా …………………… నా తెలంగాణా || నాగేటి ||

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

2. ఉస్మానియా క్యాంపస్లో

ఉస్మానియా క్యాంపస్లో ………… ఉదయించిన కిరణమా ………… వీర తెలంగాణమా .
వీర తెలంగాణమా ………… నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో ………… కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాలుగు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా …………
మహబూబ్నగర్ మట్టిలోన
మొలచిన మందారమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……… కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా …………
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
మెదక్ సీమ గాలిలోన త్యాగాలా గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ …………
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా …………
భలె ……… భలె ………… భలె ………… ॥ ఉస్మానియా ||
కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||
వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా ………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె ……… భలె ………… భలె ………… || ఉస్మానియా ||

ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు 2

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఆ) నివేదిక :

సకల జనుల సమ్మె

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.

సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం … జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది.

రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.

చివరకు ……. విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని ……………. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు ……… కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి
బాగా సహకరించారు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

జనని = మాత, అమ్మ, తల్లి, అంబ
తనువు = శరీరం, దేహం, మేను
ఆకాశం = గగనం, విహాయసం, ఖం
అస్త్రం = శరం, బాణం, తూపు
అధికారం = పదవి, ఏలుబడి
భూమి = ధర, ధాత్రి, ధరణి
గర్భము = కడుపు, పొట్ట
రక్తము = రుధిరము, నెత్తురు

నానార్థాలు:

తనువు = శరీరం, అల్పమైనది
వర్షం = వాన, సంవత్సరం,
అమృతం = పాలు, నీరు, నేయి, సుధ
పాసిన = వదలిన, పాడైపోయిన

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
భూమి – బూమి
విషము – విసము

సంధులు:

మాకై = మాకు + ఐ = ఉత్వసంధి
తనువొడ్డిన = తనువు + ఒడ్డిన = ఉత్వసంధి
రక్తతర్పణమ్మయినా = రక్త తర్పణమ్ము + అయిన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది.

అధికారాంధులు = అధికార + అందులు = సవర్ణదీర్ఘ సంధి
ఉద్బోధార్థ = ఉద్బోధ + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
పాపాత్ములు = పాప + ఆత్ములు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

స్వేచ్ఛ = స్వ + ఇచ్ఛ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

సమాసములు:

తెలంగాణ గర్భము = తెలంగాణ యొక్క గర్భము = షష్ఠీ తత్పురుష సమాసం
జనుల సమూహములు = జనుల యొక్క సమూహములు = షష్ఠీ తత్పురుష సమాసం
రక్తపు చుక్క = రక్తము యొక్క చుక్క = షష్ఠీ తత్పురుష సమాసం
రక్తపు తిలకం = రక్తము యొక్క తిలకం = షష్ఠీ తత్పురుష సమాసం
యమపాశం = యముని యొక్క పాశం = షష్ఠీ తత్పురుష సమాసం
అధికారాంధులు = అధికారముతో అంధులు = తృతీయాతత్పురుష సమాసం
రుధిరం = రుధిరముతో సిక్తం = తృతీయాతత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

కింది పదాలను సొంత వాక్యాలలో రాయండి.

ప్రశ్న 1.
అసువులు : ______________
జవాబు.
అసువులు = ప్రాణాలు
ఎందరో వీరులు అసువులు త్యాగం చేస్తేనే స్వాతంత్య్రం సిద్ధించింది.

ప్రశ్న 2.
సౌహార్దత : ______________
జవాబు.
సౌహార్దత = మంచి మనసు
మనిషికి సౌహార్దత అవసరం. అదే మనిషికి ఆభరణం.

ప్రశ్న 3.
లావు : ______________
జవాబు.
లావు = బలం
లావు వాడికంటే నీతిపరుడు బలవంతుడు.

ప్రశ్న 4.
యమపాశం : ______________
జవాబు.
యమపాశం = యముని చేతిలో పాలనాదండం (పాశం)
ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకరోజు యమపాశానికి చనిపోవలసినదే.

ప్రశ్న 5.
అమృతం : ______________
జవాబు.
అమృతం = చావుని కలిగించనిది, మృతి నొందింపనిది
అమృతం తాగిన దేవతలు అమరులు, సురలు.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

అర్థాలు :

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 6.
తెలంగాణా ఆశయ సాధనలో ఎందరో అసువులు కోల్పోయారు. ( )
A) ప్రాణాలు
B) అవయవాలు
C) డబ్బులు
D) నగలు
జవాబు.
A) ప్రాణాలు

ప్రశ్న 7.
నా సఖులు చాలా మంచివారు. ( )
A) సోదరులు
B) స్నేహితులు
C) అన్నలు
D) తమ్ములు
జవాబు.
B) స్నేహితులు

ప్రశ్న 8.
సతి తన పతి క్షేమం కోసం నోములు నోస్తుంది. ( )
A) అక్క
B) చెల్లెలు
C) అమ్మ
D) భార్య
జవాబు.
D) భార్య

ప్రశ్న 9.
పాపాత్ములతో స్నేహం చేయరాదు. ( )
A) మంచివారు
B) పిచ్చివారు
C) దుర్మార్గులు
D) సన్మార్గులు
జవాబు.
C) దుర్మార్గులు

ప్రశ్న 10.
మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి. ( )
A) కాలిగుర్తుల్లో
B) వీథిలో
C) ఊరిలో
D) ఇంటిలో
జవాబు.
A) కాలిగుర్తుల్లో

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

నానార్థాలు:

కింది వాక్యాలో గీతగీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 11.
తనువుకు తగిలిన గాయాలు తేలికగానే మానిపోతాయి. చీమ చాలా తనువైన ప్రాణి. ( )
A) వేలు, కాలు
B) శరీరము, అల్పము
C) మనసు, ముఖము
D) ఏనుగు, దోమ
జవాబు.
B) శరీరము, అల్పము

ప్రశ్న 12.
తనను పాసిన స్నేహితుని కోసం రాము చాలా బాధపడ్డాడు. పాసిన పదార్థం తినరాదు. ( )
A) విడిచిన, వదిలిన
B) పాడైన, చెడిన
C) విడిచిన, పాడైన
D) వచ్చిన, వెళ్ళిన
జవాబు.
C) విడిచిన, పాడైన

ప్రశ్న 13.
గరుడుడు పాములకు అమృతం ఇచ్చాడు. దాహం వేసిన వారికి కొంచెం అమృతం ఇవ్వాలి. ( )
A) అన్నం, పాలు
B) పాలు, నూనె
C) నీళ్ళు, చారు
D) పీయూషం, నీరు
జవాబు.
D) పీయూషం, నీరు

ప్రశ్న 14.
వర్షం తొందరగా వర్షం వచ్చేసింది. ( )
A) సంవత్సరం, వాన
B) వారం, వర్జ్యం
C) వరం, నరం
D) వీర, బూర
జవాబు.
A) సంవత్సరం, వాన

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

పర్యాయపదాలు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి. ( )

ప్రశ్న 15.
పార్వతీదేవి లోకాలకే జనని.
A) జానకి, జనులు
B) తల్లి, అమ్మ
C) అక్క, చెల్లి
D) అత్త, అమ్మ
జవాబు.
B) తల్లి, అమ్మ

ప్రశ్న 16.
శ్రీకృష్ణుడు దేవకి గర్భమున జన్మించాడు. ( )
A) కడుపు, పొట్ట
B) చెయ్యి, ఛాతి
C) కాలు, పాదం
D) గర్వము, గౌరవం
జవాబు.
A) కడుపు, పొట్ట

ప్రశ్న 17.
మనం రక్తం దానం చేస్తే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ( )
A) నీళ్లు, పానీయం
B) చల్ల, మజ్జిగ
C) అవయవం, కీలు
D) రుధిరం, నెత్తురు
జవాబు.
D) రుధిరం, నెత్తురు

ప్రశ్న 18.
స్వరాజ్య సమరంలో ఎంతో మంది తమ అసువులు ధారపోశారు. ( )
A) రక్తం, నెత్తురు
B) ప్రాణాలు, ఉసురు
C) నెయ్యి, నూనె
D) పాలు, నీళ్ళు
జవాబు.
B) ప్రాణాలు, ఉసురు

ప్రశ్న 19.
రోడ్డు ప్రమాదం జరిగినచోట జనం సమూహాలుగా చేరారు. ( )
A) ఒక్కరు, ఇద్దరు
B) మెల్లగా, నిదానంగా
C) బృందాలు, గుంపులు
D) కలిసి, ఒక్కటిగా
జవాబు.
C) బృందాలు, గుంపులు

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ప్రకృతులు – వికృతులు:

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి / వికృతి గుర్తించండి.

ప్రశ్న 20.
శివుడు విసం కంఠంలో దాచుకున్నాడు. ( )
A) విషం
B) విశం
C) వీసం
D) విశ్వం
జవాబు.
A) విషం

ప్రశ్న 21.
ఆకసంలో మబ్బులు కమ్ముకున్నాయి. ( )
A) ఆకషం
B) అక్కసం
C) ఆకాశం
D) అక్కా
జవాబు.
C) ఆకాశం

ప్రశ్న 22.
భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. ( )
A) ప్రతిగ్య
B) ప్రతిగ్న
C) ప్రతిగ్న
D) ప్రతిన
జవాబు.
D) ప్రతిన

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

భాషాంశాలు :

సంధులు:

కింది సంధులను గుర్తించండి.

ప్రశ్న 23.
తనువొడ్డిన – విడదీయండి. ( )
A) తనువు + ఒడ్డిన
B) తనువు + వొడ్డిన
C) తను + ఒడ్డిన
D) తనువొడ్డిన
జవాబు.
A) తనువు + ఒడ్డిన

ప్రశ్న 24.
మాకై – ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) ఉత్వసంధి
C) వృద్ధిసంధి
D) ఇత్వసంధి
జవాబు.
B) ఉత్వసంధి

ప్రశ్న 25.
స్వ + ఇచ్ఛ – కలిపి రాసే విధానం ( )
A) స్వాచ్ఛ
B) స్వయిచ్ఛ
C) స్వేచ్ఛ
D) స్వేచ్ఛ
జవాబు.
C) స్వేచ్ఛ

ప్రశ్న 26.
‘అ’ కారానికి ఏవి పరంగా ఉంటే ఏ ఓ అర్లు వస్తాయి ? ( )
A) అ ఇ ఉ ఋ
B) య వ ర
C) ఏ ఐ ఓ ఔ
D) ఇ ఉ ఋ
జవాబు.
D) ఇ ఉ ఋ

ప్రశ్న 27.
దీర్ఘాలు ఏకాదేశంగా వచ్చేది ఏ సంధి ? ( )
A) గుణసంధి
B) ఉత్వసంధి
C) సవర్ణదీర్ఘసంధి
D) ఇత్వసంధి
జవాబు.
C) సవర్ణదీర్ఘసంధి

ప్రశ్న 28.
అనంతాకాశం – ఎలా విడదీయాలి ? ( )
A) అనంత + అకాశం
B) అనంత + ఆకాశం
C) అన + అంతాకాశం
D) అనంతా + కాశం
జవాబు.
B) అనంత + ఆకాశం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

సమాసాలు:

ప్రశ్న 29.
‘చేత, తోడ’ ప్రత్యయాలు ఏ విభక్తి ? ( )
A) చతుర్థీ విభక్తి
B) ద్వితీయా విభక్తి
C) తృతీయా విభక్తి
D) షష్ఠీ విభక్తి
జవాబు.
C) తృతీయా విభక్తి

ప్రశ్న 30.
‘అధికారాంధులు’ ఏ సమాసం ? ( )
A) తృతీయా తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) పంచమీ తత్పురుష సమాసం
D) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు.
A) తృతీయా తత్పురుష సమాసం

ప్రశ్న 31.
‘జనుల సమూహములు’ – విగ్రహవాక్యం ( )
A) జనుల వలన సమూహములు
B) జనుల యొక్క సమూహములు
C) జనుల కొరకు సమూహములు
D) జనుల యందు సమూహములు
జవాబు.
B) జనుల యొక్క సమూహములు

వాక్యాలు – రకాలు:

కింది వాక్యాలు ఎటువంటి వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 32.
ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ? ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) విద్యర్థకం
జవాబు.
A) ప్రశ్నార్థకం

ప్రశ్న 33.
ఆహా ! అద్భుతమైన స్ఫూర్తినిచ్చారు. ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) విద్యర్థకం
జవాబు.
C) అనుమత్యర్థకం

ప్రశ్న 34.
మీరు అక్కడకి వెళ్ళవద్దు. ( )
A) ప్రశ్నార్థకం
B) నిషేధార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
B) నిషేధార్థకం

ప్రశ్న 35.
మీరంతా ఆ పని చేయగలరు. ( )
A) ప్రశ్నార్థకం
B) నిషేధార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
D) ప్రేరణార్థకం

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

క్రియను గుర్తించుట:

ప్రశ్న 36.
తెలంగాణా ఉద్యమం చేసి అమరులయ్యారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 37.
స్ఫూర్తిని అందిస్తూ వీరులు ప్రబోధం చేశారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్ధకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) శత్రర్ధకం

ప్రశ్న 38.
ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ మాతృభూమి విముక్తికై పోరాడుతూనే ఉన్నారు. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
D) అప్యర్థకం

ప్రశ్న 39.
ఉద్యమంలో పాల్గొంటే వీరుల వీరత్వం అందరికీ తెలుస్తుంది. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

ప్రశ్న 40.
ఉద్యమం చేశారు. తెలంగాణా సాధించారు – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) ఉద్యమం చేస్తూ తెలంగాణా సాధించారు
B) ఉద్యమం చేసి తెలంగాణా సాధించారు
C) ఉద్యమం చేయాలని తెలంగాణా సాధించారు
D) తెలంగాణా సాధించి ఉద్యమం చేశారు.
జవాబు.
B) ఉద్యమం చేసి తెలంగాణా సాధించారు

ప్రశ్న 41.
దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము. శాంతించము – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము మరియు శాంతించము.
B) దుర్మార్గుల పాలన అంతమైతేనే మేము విశ్రమించి శాంతిస్తాము.
C) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించం కాని శాంతిస్తాము.
D) మేము శాంతించం విశ్రమించం దుర్మార్గుల పాలన అంతమయ్యేవరకు
జవాబు.
A) దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు మేము విశ్రమించము మరియు శాంతించము.

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

అలంకారాలు:

కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

ప్రశ్న 42.
సీత మోము చంద్రబింబం వలె మనోహరంగా ఉంది ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) స్వభావోక్తి
జవాబు.
A) ఉపమ

ప్రశ్న 43.
ఆమె ముఖం చంద్రబింబమేమో అన్నట్లుంది ( )
A) ఉపమ
B) రూపకం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
జవాబు.
C) ఉత్ప్రేక్ష

ప్రశ్న 44.
ప్రవర్తన అనే సముద్రం దాటటానికి సత్యము ఓడవలె సహాయపడుతుంది. ( )
A) స్వభావోక్తి
B) అతిశయోక్తి
C) ఉత్ప్రేక్ష
D) ఉపమ
జవాబు.
D) ఉపమ

కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

“రక్త తర్పణమ్మయినా, రక్తితోడ ఇచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో మాయడుగుల నుంచేస్తాం
అనంతాకాశం సువిశాల భూవలయం
మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా! మా ప్రతిన వినుడు
ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం
మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం”

TS 8th Class Telugu Bits 9th Lesson అమరులు

ప్రశ్నలు :

ప్రశ్న 45.
పై కవితలో “మీయడుగులు” అంటే ఎవరివి ?
జవాబు.
అమరవీరులవి

ప్రశ్న 46.
“మాయడుగులు” అంటే ఎవరివి ?
జవాబు.
తెలంగాణ ప్రజలవి

ప్రశ్న 47.
సమస్త ప్రాణులు ఎక్కడున్నారు ?
జవాబు.
ఆకాశానికి భూమికి మధ్య

ప్రశ్న 48.
ప్రజల ప్రతిన ఏమిటి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం

ప్రశ్న 49.
అమృత వర్షం ఎక్కడ కురిపిస్తారు ?
జవాబు.
మృతవీరుల ఆత్మలలో

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

These TS 8th Class Telugu Bits with Answers 8th Lesson చిన్నప్పుడే will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి:

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే 1

ప్రశ్న 1.
పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు ?
జవాబు.
పై చిత్రంలోని సన్నివేశం గ్రామంలో ఒక చెట్టుకింద రచ్చబండ దగ్గర జరుగుతోంది.

ప్రశ్న 2.
మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా ? ఎప్పుడు ?
జవాబు.
మా గ్రామానికి మధ్యలో రావిచెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సిమెంటుతో దిమ్మ కట్టబడి ఉంది. దానిని అందరూ పెద్ద బజారు సెంటరు (కూడలి) అంటారు. సాయంకాలానికి రైతులందరూ అక్కడికి చేరి వ్యవసాయపు పనుల గురించి, గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఆ దృశ్యాన్ని నేను చాలా సార్లు చూశాను.

ప్రశ్న 3.
మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?
జవాబు.
మాట్లాడుతున్న నాయకుడు గ్రామ ప్రజలకు జరుగుతున్న మోసాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉండి ఉంటాడు. గ్రామీయులు పంటల విషయం, పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సౌకర్యాల గురించి చెబుతూ ఉండవచ్చు.
తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతోందో చెప్పి, గ్రామీయులు కూడా సమాజం మార్పునకు ఎలా కృషిచేయాలో చెబుతూ ఉండవచ్చు.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?
జవాబు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి గ్రామాలలో సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు ఉద్యమాలు నడిపి గ్రామప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అనే నినాదంతో బాలగంగాధర తిలక్ ప్రజలలో పౌరుషాన్ని నింపాడు. ఇవన్నీ మేము పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరికొన్ని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాము.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

పాఠం ఉద్దేశం:

అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభలద్వారా, పత్రికలద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
కథానిక ప్రక్రియను గురించి రాయండి.
జవాబు.
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఈ వచన ప్రక్రియనే “కథానిక” అంటారు. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.

రచయిత పరిచయం:

ప్రశ్న.
వట్టికోట ఆళ్వారుస్వామి పరిచయం రాయండి. (లేదా) వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత విశేషాలు వివరించండి.
జవాబు.
సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథారచయిత వట్టికోట ఆళ్వారుస్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్రమహాసభ నల్గొండజిల్లా శాఖకు అధ్యక్షుడుగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. ‘తెలంగాణ’; ‘గుమస్తా’లనే పత్రికలను నడిపించాడు. ‘జైలులోపల’ అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు.

రామప్పరభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వారుస్వామి రాసిన ‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
(గమనిక : పరీక్షల్లో గీత గీసిన వాక్యాలు రాస్తే చాలు)

ప్రవేశిక:

రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు ? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి ? ఇవన్నీ కళ్ళకు గట్టినట్లు వివరించే కథనం కోసం.. ఈ పాఠం చదువుదాం ……

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

కఠిన పదాలకు అర్థాలు:

పెత్తందారులు = పెత్తనం చేసేవారు, అధికార్లు, నాయకులు
దుర్భాషలు = చెడ్డ మాటలు
ఆగమనం = రాక
మాటామంతీ = మాటలు, ముచ్చట్లు, ప్రసంగం
పరిహాసం = ఎగతాళి
మాలిపటేలు = గ్రామాల్లో ఒక అధికారి
గిర్దావరు = రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆదాయ అధికారి
మిరం = కారం
ఎరుక = తెలియుట, జ్ఞానం, తెలివి
తట్ట = గంప
సౌభ్రాతృత్వం = మంచి సోదర భావం
అధ్వాన్నం = హీనము, తప్పుదారి, అపమార్గం
నేరుగా = సూటిగా, తిన్నగా
గ్రామీయులు = గ్రామంలో ఉండేవారు
సన్నాహాలు = ఏర్పాట్లు
నింద = అపవాదు
బర్రె = గేదె
బండల = రాళ్ళు
జ్ఞాపకం = గుర్తు
నాయన = తండ్రి
భ్రాతృత్వం = సోదర భావం
స్వతంత్రం = స్వేచ్ఛ
చిరము = చాలాకాలం
పరిచితం = తెలిసినది
మోతాడు = గొడ్ల ముక్కుకు వేసే తాడు
పసులు = పశువులు
జంగల్లో = అడవుల్లో
అవ్యాజం = కపటంలేనిది
దీక్ష = గట్టి పట్టుదల, నియమం

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
“వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ? (టెక్స్ట్ పేజి నెం.82) జవాబు. వ్యవసాయం చేసి పంటలు పండించే గ్రామీణులకు నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చడం అనే మూడు పనులూ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పంట పండాక దానిని తగిన సమయంలో కోయడానికి ఊళ్ళో జనం అంతా పొలాల్లోనే ఉంటారు. అటువంటి వరికోతల రోజులలో కూడా ప్రజలు పొలాలు విడిచి నాయకుల కోసం వెళ్ళారంటే వారికి ఆ నాయకుల మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం.82)
జవాబు.
ఊళ్ళోకి ఎవరైనా గౌరవనీయులు వస్తే వారికి ఎదురువెళ్ళి వాయిద్యాలతోనో, పూలదండలతోనో స్వాగతం పలికి ఊరిలోకి తీసుకురావడం మర్యాద. దీనినే ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటారు.

ప్రశ్న 3.
“పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ? (టెక్స్టపేజి నెం.82)
జవాబు.
తమ గ్రామంలోని పెత్తందారుడు ప్రతిరోజూ ప్రతివస్తువునూ తమ దగ్గరి నుంచి అన్యాయంగా అపహరిస్తాడు. కానీ నాయకుడు మాత్రం దుర్మార్గుడైన ఆ పెత్తందారును ఎదిరించాడు. గ్రామంలో పెత్తందారులు నిందలు లేకుండా చేశాడు. నేరాలు మోపడం, లంచాలు గుంజడం లేకుండా చేశాడు. నాయకుని కృషివల్లనే గ్రామంలో అందరూ గౌరవంగా, ఆకలి బాధలు లేకుండా బతుకుతున్నారు.

పైగా నాయకుడు పిల్లలందరినీ చేరదీసి వారి బాగోగులను తెలుసుకుంటాడు. వారిని ప్రేమతో పలకరిస్తాడు. అందువల్లనే పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు.

ప్రశ్న 4.
పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు? (టెక్స్ట్ పేజి నెం.83)
జవాబు.
నాయకులు వచ్చింది తమను బతికించడానికి అని పిల్లలు చెప్పడం ద్వారా ఆ నాటి గ్రామాలలో పెత్తందారీల దుర్మార్గాలు
తెలిశాయి. ఏదో సాకుతో బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడ చేలో పడిందని పదిరూపాయలు వసూలు చేయడం, దున్నపోతు బుస్సు మన్నదని, మోతాడు లేదని ముప్పయి రూపాయలు గుంజడం, సర్కారీ రకం కట్టలేదని నాయనకు బండలెత్తడం వంటి దౌర్జన్యాల ద్వారా ఆ నాటి గ్రామ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో తెలుస్తుంది. అంతేగాక చేలో కట్టెపుల్లలు ఏరుకుంటే ఆడ కూలీలను కొట్టడం. అడ్డువచ్చిన భర్తల్ని విరగబాదడం మొదలైన విషయాల ద్వారా ఆ నాటి గ్రామప్రజల దయనీయ దుర్భరస్థితి తెలుస్తున్నది.

ప్రశ్న 5.
“మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి? (టెక్స్టపేజి నెం.83)
జవాబు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో దయనీయ పరిస్థితిని ఉద్దేశించి నాయకుడు ఈ మాట అన్నాడు. ఏరోజు కారోజున వచ్చే కూలీ డబ్బులతో పేదలు పొట్ట పోషించుకుంటారు. పని లేకపోతే పస్తు పడుంటారు. లేకపోతే అప్పులు చేస్తారు. చేసిన అప్పుతీర్చలేక నానా అవస్థలూ పడతారు. రోగాలు వచ్చి పడతాయి. ఈ అప్పులు, రోగాలు, కష్టాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందువల్లనే నాయకుడు అట్లా అన్నాడు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
జవాబు.
స్వాతంత్ర్యం రాకముందు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. గౌరవ మర్యాదలు ఉండేవికాదు. పెత్తందార్లు, అగ్రకులాల వాళ్ళు పేదవారిని, బలహీన వర్గాల వారిని దోపిడీ చేసేవారు. స్త్రీలను నీచంగా చూడడం, అనరాని మాటలు అనడం చేసేవారు. పేద ప్రజలు గ్రామాలలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు. స్త్రీలు కూలికి పోయి చేలో కట్టెలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నారని సిగపట్టుకొని కొట్టేవారు. సర్కారుకు పన్నులు కట్టలేదని నెత్తిమీద బండరాళ్ళు ఎత్తి మోయించేవారు.

పిల్లలు బడికెళుతుంటే వాళ్ళను బెదిరించేవారు. పశువులు చేలో పడి గడ్డి తిన్నాయని వాటిని బందెల దొడ్లో పెట్టించేవారు. లేకపోతే డబ్బులు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం రాకముందు మన గ్రామాలలో పరిస్థితి పైవిధంగా ఉండేదని ఈ పాఠం చదివిన తరువాత అనిపించింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి.

అ) వీండ్లందరెవరో ఎరికేనా ?
జవాబు.
తమ గ్రామానికి వెంకట్రావు, ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిన గ్రామంలోని పిల్లలు వారు ఉన్నచోటికి వెళ్ళారు. నాయకులు పిల్లల్ని ప్రేమగా పలకరించారు. పిల్లలు వారికి తాము కోసుకున్న ఉసిరికాయలు పంచారు. అప్పుడు వెంకట్రావు నాయకుల్ని చూపించి. వీండ్లందరెవరో ఎరికేనా ? అని పిల్లల్ని ప్రశ్నించాడు.

ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
జవాబు.
ఒక నాయకుడు ఒక పిల్లవాణ్ణి “మీరెవరబ్బాయి!” అని ప్రశ్నించాడు. అపుడు ఆ అబ్బాయి “నేను సంగిశెట్టి కొడుకును” అని బదులిచ్చాడు.

ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
జవాబు.
మనం ఈరోజు స్వార్ధరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు మరొక నాయకునితో అన్నాడు.

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.

ప్రశ్నలు :

అ. అణచివేతకు గురైన వారెవరు ?
జవాబు.
నిజాం రాష్ట్రంలో అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు.

ఆ. వాళ్ళు ఏఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ?
జవాబు.
వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేతకు గురి అయ్యారు.

ఇ. తెలంగాణాలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?
జవాబు.
తెలంగాణాలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి ఆంధ్రోద్యమం విస్తరించింది.

ఈ. తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు.
తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు.

ఉ. తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన కొందరు మహనీయులు ఎవరు ?
జవాబు.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు తెలంగాణాలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషిచేసిన మహనీయులు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.
జవాబు.
వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక వారిలో చైతన్యం తీసుకొనిరావడానికి కృషిచేసిన మహానుభావుడు. ఆయనకు ప్రజలు హృదయపూర్వకంగా దండం పెట్టేవారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షకునిగా పనిచేశాడు. పెత్తందార్లు చేసే అగడాలను ఎదుర్కొని వారు చిన్న, పెద్దలను గౌరవించే విధంగా మార్పు తెచ్చాడు. వెంకట్రావు కృషి ఫలితంగా పెత్తందార్లు స్త్రీలను దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం లాంటివి పోయాయి.

ప్రజలంతా విరామం లేకుండా కూలి పనిచేసినా కడుపు నిండా తిండిలేకపోవడం చూసి వెంకట్రావు పెత్తందార్లపై తిరగబడి పేదలు కడుపునిండా అన్నం తినేటట్లుగా చేసిన మహనీయుడు. మనిషిని మనిషిగా చూడాలనే తత్త్వం కలవాడు వెంకట్రావు. అందుకే అటువంటి మంచి స్వభావం గల వెంకట్రావును గ్రామపెద్దలు, పిన్నలు కూడా గౌరవిస్తూ దేవుడిలా చూసుకునేవారు.

ఆ. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి ?
జవాబు.
వెంకట్రావు వంటి యువకుల వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ‘దండం – నమస్కరించడం’ అనే పదానికి సరైన అర్థం లభిస్తుంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. ప్రజలపై పెత్తందార్లు వేసే నిందలు తగ్గుతాయి. లంచాలు తీసుకొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. సమాజంలో ధనం ఆధారంగా ఎక్కువ, తక్కువ అనే భావనపోయి, మనుషుల్ని మనుషుల్లా చూడడం జరుగుతుంది. పేద ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుంది. పెత్తందార్లు ప్రజలను హింసించకుండా గౌరవ భావంతో చూస్తారు. నాయకులు పిల్లలు, పెద్దల కష్ట నష్టాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. పేద ప్రజలకు మేలు చేస్తారు. వెంకట్రావు వంటి యువకులవల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఇ. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జవాబు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న కాలం నాటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావులో దేశభక్తి, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపాలనే కోరిక అధికంగా కనిపిస్తున్నాయి. తనకు దేశం ఏమిచ్చింది అని చూడక, తాను దేశానికి ఏమి చేయాలి అని ఆలోచించిన వ్యక్తి వెంకట్రావు.

నేటి యువకుల్లో అలా ఆలోచించే వారు తక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మందికి తాము, తమ కుటుంబం బాగుంటే చాలనే స్వార్ధం పెరిగిపోయింది. సోమరితనం పెరిగిపోయింది. సమాజంలోని అవినీతిని దౌర్జన్యాలను, దురాచారాలను వెంకట్రావులా ఎదిరించాలనే ధోరణి, తన తోటి వారికి సాయపడాలనే సేవాభావం నేటి యువతలో తగ్గాయి. పెడధోరణులు, క్రమశిక్షణ లేకపోవడం నేటి యువతలో కనబడుతున్నాయి.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఈ. “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు.” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలిసి రంగాపురానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు తమ ఊరి పటేలు, దొర, ఇతర పెత్తందార్లు తమను, తమ తల్లిదండ్రులను ఎంతగా బాధపెడుతోందీ నాయకులకు చెప్పారు. హాయిగా, సంతోషంగా ఎదగాల్సిన బాలలు అంత చిన్న వయసులోనే తమ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే, సమాజ పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని నాయకులకు అర్థమైంది. వారి పసిమనస్సులు కష్టాల కారణంగా గాయపడితే, సమాజానికి ప్రమాదం.

అలాంటి కష్టాలేవి తెలియకుండా పిల్లలు ఎదగాలంటే, స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పెత్తందార్ల ఆగడాలను ఆపే నాయకులు రావాలి. వారు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. నాయకులు చేసే కృషి వల్లే సమాజంలో జరిగే అన్యాయాలు తగ్గి, పిల్లలు ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా ఎదుగుతారని నాయకుడన్నాడు.

ఉ. గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌష్ట్యాలను వివరించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రామంలోని పెత్తందార్లకూ, దొరలకూ దయాదాక్షిణ్యాలు లేవు. అన్యాయంగా బర్రెను బందులదొడ్లో పెట్టించారు. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు. దున్నపోతు బుస్సుమన్నదనీ, దానికి మోతాడు లేదనీ మాలిపటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రామ పంతులు పెట్టిన బడిలోకిపోతే దెబ్బలు కొడతానని దొర గుమస్తా బెదిరించాడు.

కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకున్నందుకు స్త్రీ అని కూడా చూడకుండా ఒక తల్లిని సిగపట్టుకొని కొట్టాడు దొర శేగిదారు. అడ్డువెళ్ళిన ఆమె భర్త చెయ్యి విరగగొట్టాడు కూడా. ఈ విధంగా గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

ఊ. గ్రామస్తుల కష్టాలను పిల్లలు నాయకులకు ఎలా వివరించారు ?
జవాబు.
వెంకట్రావు, ఇతర నాయకులూ వచ్చి పిల్లలను కుశల ప్రశ్నలతో ప్రేమగా పలకరించారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రాత్రి బువ్వెట్లా వండిందో వివరించాడు. అయ్య అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని అతణ్ణి పట్టుకుపోయాడు. పొయ్యిమీది అన్నం చెడిపోయింది. అయినా దాంట్లోనే మీరం, ఉప్పుపోసుకుని నీళ్ళుపోసుకొని తిన్నానన్నాడు ఆ పిల్లవాడు.

ఒకసారి వాళ్ళమ్మ పసుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకున్నాడనీ, ఆ తట్ట ఇప్పటిదాక ఇవ్వలేదని ఒక పిల్లవాడు చెప్పుకున్నాడు. పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కదా! అని నాయకులు బాధపడ్డారు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?
జవాబు.
‘చిన్నప్పుడే’ కథా కాలంలో పటేళ్ళ దొరల దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవి. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. 1947 సం||లో మనకు స్వాతంత్ర్యం వచ్చాక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన దేశానికి రూపొందించిన రాజ్యాంగం ప్రజలంతా సమానమేనని, కుల, మత, వర్గ విచక్షణ పనికిరాదని తేల్చి చెప్పింది. చట్టం ముందు అంతా సమనామేనని తేల్చింది. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్త్రీలకు ఆర్తిక స్వాతంత్ర్యం కల్పించింది. దీంతో సమాజంలో చైతన్యం తెచ్చింది.

పటేలు, దొర పెత్తనాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి గ్రామంలో విద్యాలయం స్థాపించడం వల్ల, విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా విద్యావంతులై తమ హక్కులను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి పెత్తందారీతనాన్ని అణచివేశాయి. అయితే ఇంకా మార్పు రావలసి ఉంది. ఢిల్లీ అత్యాచార సంఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్నా పెత్తందార్ల దౌర్జన్యాలు, దోపిడీల వల్ల సమాజంలో ఇంకా ఆనాటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనిపిస్తున్నా, చాలా వరకు పరిస్థితులు మారాయన్నది నిజం.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.

అ. ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జవాబు.
రామాపురం మారుమూల చిన్న పల్లెటూరు. అన్ని వర్గాల వాళ్ళు కలిసి మొత్తం 350 కుటుంబాలున్నాయి. ఆ ఊళ్ళో జానయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో రామయ్య అనే 100 ఎకరాలున్న రైతు ఉన్నాడు. రామయ్య దగ్గర వ్యవసాయం పనులు చేయడానికి, ఇంకా ఇతర పనులు చేయడానికి మొత్తం పదిమంది పనివాళ్ళున్నారు. రామయ్య పనివాళ్లను బాగా చూసుకుంటాడు.

జానయ్యకు తల పొగరు ఎక్కువ. పనిచేసే వాళ్ళను చాలా హీనంగా చూస్తాడు. అందుకే ఆయన ఇంట్లో పనివాళ్ళు ఎక్కువ కాలం పనిచేయరు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ అవసరమొచ్చినా రామయ్య ముందుంటాడు. అందుకే అంతా రామయ్యను గౌరవిస్తారు. ఆయన గ్రామానికి గత 30 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. ఈ మధ్యనే రామయ్య తన పొలంలో 40 ఎకరాల పొలాన్ని కొంత రైతులకు, కొంత ఇండ్ల స్థలాలకు ఇచ్చాడు. ప్రతి గ్రామంలో ఇటువంటి వారుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.

గ్రామాభివృద్దే దేశాభివృద్ధి కదా! అదే విధంగా 5 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేయించాడు. ఒకప్పుడు ఆ గ్రామ విద్యార్థులు దాదాపు 5 కి.మీ. నడచి వెళ్ళి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కలిగించాడు. పంచాయితీ భవనాన్ని కట్టించాడు. రోడ్ల నిర్మాణం చేయించాడు. రామయ్యను చూసి ఇప్పుడు జానయ్య కూడా మారాడు.

(లేదా)
ఆ. వెంకట్రావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను
ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు.

ఆర్మూర్,
ది. XX.XX.XXXX

పేద కుటుంబంలో, మురికివాడలో జన్మించిన ‘స్వామి’ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం.

స్వామి మా గ్రామ ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుంటాడు. యువకులను, విద్యావంతులను కలిసి ‘గాంధీ యువసేన’ అనే సంఘం ఏర్పాటు చేశాడు. వారంతా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం, నవంబరు 14 బాలల దినోత్సవం వంటి వాటిల్లో బాల బాలికలకు వివిధ రకాల పోటీలు ముఖ్యంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పాఠశాలలో నిర్వహిస్తారు. బాల బాలికలను చైతన్యవంతులను చేయడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవే కాకుండా పోలియో చుక్కలు వేసేటప్పుడు పసిపిల్లల తల్లులను చైతన్యపరుస్తాడు.

వివిధ రకాలైన సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించాడు. మొక్కల అవసరం, వినియోగం గురించి అందరికీ చెప్పి ఇండ్లలో, రహదారులపై, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటించేటట్లు చేశాడు. మన దేశ సమైక్యత, సమగ్రతలను గురించి, అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ప్రజలలోనూ, విద్యార్థులలోనూ అవగాహన కలిగిస్తాడు.

స్వామిలాంటి వారు ప్రతి గ్రామంలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని నా భావన.

ఇట్లు
రవికుమార్,
ఆర్మూర్.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఇ) పాఠం ఆధారంగా వెంకట్రావు, నాయకులు, బాలుర మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణల రూపంలో రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.

సంభాషణ

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలసి రంగాపురానికి బయలుదేరాడు.

వెంకట్రావు : (నాయకులతో) మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. మనం అలా వెళితే గ్రామ ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. వాళ్ళు మంగళవాయిద్యాలతో మనకు స్వాగతం పలికి తీసుకువెళతారు.
గ్రామ యువకుడు : (బాటసారితో) ఆంధ్రనాయకులు వచ్చారని గ్రామంలో తెలియజెయ్యి.
బాలకులు : మన గ్రామానికి నాయకులు వచ్చారట మనందరం ఉసిరికాయలు ఏరుకొని అక్కడకు వెళదాం పదండి.
నాయకులు : రండి ! పిల్లలూ ! రండి.
నాయకుడు – 1 : నీ పేరేంటి?
ఒక బాలుడు : లింగయ్య
రెండో బాలుడు : మేము ముందు లింగా అని పిలిచేవాళ్ళం. బడిలో అందరం లింగయ్య ! అని పిలుస్తున్నాం.
నాయకుడు – 2 : మీరు ఎవరు ?
లింగయ్య : మేము బట్టలుతుకుతాం.
నాయకుడు – 3 : నాకు ఒక ఉసిరికాయ ఇస్తావా ?
లింగయ్య : ఇదిగో తీసుకోండి.
బాలలందరూ (పిల్లలందరూ) : ఇవిగోండయ్యా ! ఇవన్నీ మీకే !
వెంకట్రావు : వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా ?
పిల్లలు (బాలురు) : వీళ్ళంతా మమ్మల్ని బతికించడానికి వచ్చినవాళ్ళు.
నాయకుడు : మీకేం మీరు బాగానే ఉన్నారు కదా !.
బాలుడు – 1 : ఏం బాగు బాబూ ! మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు.
బాలుడు – 2 : మా అన్న కోడెదూడ చేలో పడిందని పటేలు పది రూపాయలు వసూలు చేశాడు.
బాలుడు – 3 : మా దున్నపోతు బుస్సుమన్నదని మాలి పటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు.
బాలుడు – 4 : సర్కారు పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు.
బాలుడు – 5 : వెంకట్రావు పంతులు పెట్టిన బడికిపోతే దెబ్బలు కొడతానని మా దొర గుమాస్తా బెదిరించాడు.
బాలుడు – 6 : మా అమ్మ కూలి పనికిపోయి కట్టెపుల్లలు ఏరుకుందని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంపోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు.
నాయకుడు : నువ్వు ఎవరబ్బాయివి ?
బాలుడు : నేను సంగిశెట్టి కొడుకును.
నాయకుడు : మీకేమయినా కష్టాలున్నాయా ?
బాలుడు : ఏమో ? నాకేం ఎరుక ? మా నాయనకెరుక. (నాయకులందరూ ఒకరితో ఒకరు)
పాపం ! ఈ చిన్నపిల్లలు ఇప్పటినుంచే కష్టాలు పడాల్సి వచ్చింది. మనందరం స్వార్థం లేకుండా ఉంటే భావితరం పిల్లలు హాయిగా బతుకుతారు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి.

అ) వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.
జవాబు.
దండం = నమస్కారం, వందనం
తిరిగి రాయుట : వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో, పెత్తందార్లకు పెట్టే నమస్కారంలో తేడా ఉంది.
వెంకట్రావుకు పెట్టే వందనంలో, పెత్తందార్లకు పెట్టే వందనంలో తేడా ఉంది.

ఆ) ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.
జవాబు.
అవ్యాజం = కపటం లేనిది
తిరిగి రాయుట : పసిపిల్లలు కల్లాకపటంలేని వారు.
ఆ నాయకుడు పిల్లలకు కపటం లేని బంధువైపోయాడు.

ఇ) సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
జవాబు.
రకం = పైకం, ధనం
తిరిగి రాయుట : సర్కారీ పైకం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
సర్కారీ ధనం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్తారు.

ఈ) ఆ బువ్వలోనే మిరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.
జవాబు.
మిరం = మిరపపొడి
తిరిగి రాయుట : ఆ బువ్వలోనే మిరపపొడి, ఉప్పు పోసుకొని పిల్లవాడు తిన్నాడు.

ఉ) కష్టాల సంగతి నాయనకు ఎరుక.
జవాబు.
ఎరుక = జ్ఞానం, తెలుసు
తిరిగి రాయుట : కష్టాల సంగతి నాయనకు తెలుసు.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.

ఉదా : ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు.
దండం = నమస్కారం, అంజలి

అ) పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.
జవాబు.
విలువ = ధర, వెల, మూల్యం
i) వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
ii) ఆ పుస్తకం వెల కట్టలేనంత గొప్పది.
iii) ఆ వస్తువు మూల్యం ఎంత ?

ఆ) పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.
జవాబు.
కుప్పలు = రాసులు, పోగులు, గుంపులు
i) రైతులు ధాన్యాన్ని రాసులుగా పోశారు.
ii) మొక్కజొన్న కండెలు పోగులుగా ఉన్నాయి.
iii) నాయకుని ఉపన్యాసం వినడానికి జనం గుంపులుగా చేరారు.

ఇ) కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.
జవాబు.
అధ్వాన్నం = అమార్గం, తప్పుదారి
i) ఆ గ్రామానికి వెళ్ళే దారి అమార్గంగా ఉంది.
ii) విద్యార్థులు తప్పుదారిలో నడవకూడదు.

ఈ) పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.
జవాబు.
గభాలున = శీఘ్రంగా, తొందరగా, త్వరగా
i) ప్రమాదం జరిగిన చోటుకు శీఘ్రంగా అందరూ చేరారు.
ii) బడి గంట వినపడి పిల్లలు తొందరగా పరుగెత్తారు.

ఉ) నీ చేతులకు వెండి కడియాలున్నాయి.
జవాబు. రజతము, శ్వేతము
i) మా చెల్లి కాలి పట్టీలు రజతముతో చేసినవి.
ii) శ్వేతము స్వచ్ఛతకు మారు పేరు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి.

అ) నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు.
జవాబు.
ముఖం
మొగం (వి) – ముఖం (ప్ర)

ఆ) అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
జవాబు.
సంతోషం
సంతసం (వి) – సంతోషం (ప్ర)

ఇ) మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు.
జవాబు.
సుఖం
సుకం (వి) – సుఖం (ప్ర)

ఈ) గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి.
జవాబు.
గౌరవం
గారవం (వి) – గౌరవం (ప్ర)

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.

సమాసపదం  విగ్రహవాక్యం

 సమాసం పేరు

రాజ్యకాంక్ష  రాజ్యము నందు కాంక్ష  సప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వం  విజయం వల్ల గర్వం  పంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులు  ఎనిమిది అయిన దిక్కులు  ద్విగు సమాసం
బలరామకృష్ణులు  బలరాముడును, కృష్ణుడును  ద్వంద్వ సమాసం
ప్రజల భాష  ప్రజల యొక్క భాష  షష్ఠీ తత్పురుష సమాసం
అక్రమము  క్రమము కానిది  నఞ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

2. కింది వాటిని చదువండి.

ఔరౌర! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా! ఎంతో ఆనందం కలిగించావు.
పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే

ఔరౌర = ఔర + ఔర
ఆ = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా!

ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే
ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + అ

ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర
ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.
అట్లాగే ఆహా + ఆహా = ఆ (హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’
సూత్రం : “అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగానగు.”

కింది పదాలను కలిపి రాయండి.
అ) అప్పుడు + అప్పుడు = అప్పుడప్పుడు
ఆ) ఏమి + ఏమి = ఏమేమి
ఇ) ఊరు + ఊరు = ఊరూరు
ఈ) ఇంట + ఇంట = ఇంటింట
ఉ) ఓరి + ఓరి = ఓరోరి

ఈ కింది పదాలను చదవండి.
అ) పగలు + పగలు = పట్టపగలు
ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివరి పదం కూడా.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.

అ) నడుమ + నడుమ = నట్టనడుమ
ఆ) కొన + కొన = కొట్టకొన
ఇ) కడ + కడ = కట్టకడ
ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి సంస్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా!
సూత్రం : ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

అ) బయలు + బయలు = బట్టబయలు
జవాబు.
బయలు + బయలు – అని ఉన్నప్పుడు మొదటి పదమైన బయలులోని ‘బ’ తప్ప తక్కిన ‘యలు’ లోపించాయి. ఆ లోపించిన ‘యలు’ స్థానంలో ద్విరుక్తటకారం అంటే ‘ట్ట’ వచ్చింది. అపుడు బట్టబయలు అనే రూపం ఏర్పడింది.

ఆ) అంత + అంత = అంతంత
జవాబు.
అంత + అంత – అని ఉన్నప్పుడు అందులో మొదటిపదంలో చివరి ‘అ’ (త్ + అ) ఉన్నది. తరువాతి పదంలో మొదటి ‘అ’ ఉన్నది. అంటే ‘అ + అ’ అని ఉండగా మొదటి పదంలోని చివరి ‘అ’ లోపించి రెండవ పదంలో మొదట ఉన్న ‘అ’ మిగిలి ‘అంతంత’ అనే రూపం ఏర్పడింది.

ఇ) తుద + తుద = తుట్టతుద
జవాబు.
తుద + తుద – అని ఉండగా అందులోని మొదటి తుదలో మొదటి అక్షరము మాత్రం మిగిలింది. దాని మీద ఉన్న ‘ద’ లోపించింది. లోపించిన ‘ద’ స్థానంలో ద్విరుక్తటకారం ‘ట్ట’ వచ్చింది. అపుడు తుట్టతుద అనే రూపం ఏర్పడింది.

ఈ) ఎన్ని + ఎన్ని – ఎన్నెన్ని
జవాబు.
ఎన్ని + ఎన్ని – అని ఉండగా అందులోని మొదటి పదం చివర ఉన్న ‘ఇ’ (న్.న్ + ఇ), తరువాతి పదం మొదట ఉన్న ‘ఎ’ల స్థానంలో అంటే ‘ఇ + ఎ’లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మాత్రం మిగిలింది. అప్పుడు ‘ఎన్నెన్ని’ అనే రూపం ఏర్పడింది.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్లు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : పెద్దలు చెప్పిన కథ వాళ్ళు చెప్పిన రీతిలో రాయడం.
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : తాత/నానమ్మ/అమ్మమ్మ చెప్పగా విని

ఆ) నివేదిక :

రామయ్య శెట్టి 3 వరాల కథ

మా 8వ పాఠం ‘చిన్నప్పుడే’లో తాత/నానమ్మ/అమ్మమ్మలచే కథ చెప్పించుకుని చెప్పిన రీతిలోనే రాయాలని ప్రాజెక్టుపని ఉన్నదని, ఒక కథ చెప్పమని మా నానమ్మను అడగగా తన వంటపని ముగిశాక, భోంచేశాక తను నన్ను దగ్గర కూర్చుండబెట్టుకుని ఈ కథ నాకు చెప్పింది.

పూర్వం రంగాపురంలో రామయ్యశెట్టి అనే పరమ పిసినారి ఉండేవాడు. అతడు మిక్కిలి దురాశ గలవాడు. ఒకరోజు భగవంతుడు భిక్షకుని రూపంలో ‘అయ్యా భిక్షాందేహి’ అని అతని దుకాణం ముందుకు వచ్చి అడగ్గా…. కసురుకొని పంపివేశాడు. భిక్షకుని రూపంలో ఆ దేవుడు రామయ్య పక్కింటి వాడైన పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళగా, వారు ఆ భిక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భిక్షకుడు వారిని ఆశీర్వదించి బయటకు వెళ్ళగానే పేరయ్య పాత ఇంటి స్థానంలో పెద్ద భవనము, పరిచారకులు, ఇంటినిండా ధన, ధాన్య రాశులు ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన రామయ్యశెట్టి ఆ వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదని గ్రహించి, పరుగు పరుగున వెళ్ళి అతని కాళ్ళపైపడి అనుగ్రహించమనగా, ‘నీవు మొదట కోరిన 3 కోరికలు నిజమౌతాయి వెళ్ళు’ అని భగవంతుడు అతన్ని పంపివేశాడు.

3 కోరికలు ఏం కోరుకోవాలని, ఇంటి వెనుక రాయిపై కూర్చుని రామయ్యశెట్టి తీక్షణంగా ఆలోచిస్తుండగా నెత్తిపై కాకి రెట్ట వేసింది. ఛీ కాకి చచ్చిపోను అన్నాడు రామయ్యశెట్టి. మొదటి వరం ప్రకారం కాకి చచ్చిపోయింది. మిట్టమధ్యాహ్నం అయ్యింది, భర్త ఇంకా లోనికి రావడం లేదని భార్య ‘ఏమండీ లోపలికి రారా’ అంటే, నేను రాను అన్నాడు రామయ్యశెట్టి. అలా రెండవ వరం నిష్ప్రయోజనం అయ్యింది. రాయికే అతడు అతుక్కుపోయాడు. ఎండ తీవ్రత పెరుగుతోంది. రాయి వేడెక్కి కాలడం వల్ల దానిపై కూర్చోలేక తను రాయి నుండి విడివడాలని 3వ వరం కోరుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇలా అతని 3 వరాలు నిష్ఫలమయ్యాయి.

ఇ) ముగింపు / అభిప్రాయం:

దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ పనికిరాదు. జనులు మితిమీరిన సంపాదన మోజులో పడి, చిన్న చిన్న ఆనందాలకు, ఆత్మీయుల స్నేహపూర్వక పలకరింపులకు దూరం కారాదు. కేవలం సంపాదనే కాకుండా ఆనందంగా జీవించడం కూడా ఎంతో ముఖ్యం. అత్యాశకు పోయి రామయ్య తన 3 వరాలలో ఏ ఒక్క వరాన్నీ ఉపయోగించు కోలేకపోయాడు.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

రైతు = వ్యవసాయదారుడు, కృషీవలుడు, కర్షకుడు
ముఖము = వదనము, ఆననము, మోము
తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
ధనము = డబ్బు, ద్రవ్యము, విత్తము
కృషి = యత్నము, పూనిక, ఉద్యోగము
స్త్రీ = యువతి, ఉవిద, లలన, మగువ
మంతి = ముచ్చట, ప్రసంగం, ప్రస్తావన
కడుపు = ఉదరము, కుక్షి, పొట్ట
చెవి = కర్ణము, శ్రవణము, వీను
నేల = భూమి, ఇల, ధరణి, వసుధ

నానార్థాలు:

వయస్సు = ఈడు, పక్షి, ఆరోగ్యం
పొలం = వరిమడి, అడవి, విధం
గంట = అరవై నిమిషాల కాలం, చిఱుగంట, గడ్డిదుబ్బు
బడి = పాఠశాల, విధం, అనుసరణం
దండం = నమస్కారం, కఱ్ఱ, సమూహం

వ్యతిరేకార్థక వాక్యాలు:

బాలురంతా పరిగెత్తారు x బాలురంతా పరుగెత్తలేదు
నాయకులు పిల్లలతో అరగంట గడిపారు x నాయకులు పిల్లలతో అరగంట గడపలేదు
బాలుడు జవాబు చెప్పాడు x బాలుడు జవాబు చెప్పలేదు
అందరి ముఖాలు వికసించాయి x అందరి ముఖాలు వికసించలేదు.
పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చున్నారు x పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చోలేదు

సంధులు:

1. సవర్ణదీర్ఘసంధి :
జీవితాంతం = జీవిత + అంతం
గాఢాభిమానం = గాఢ + అభిమానం
అధ్వాన్నము = అధ్వ + అన్నము
స్వార్ధము = స్వ + అర్థము
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

2. గుణసంధి :
అమితోత్సాహం = అమిత + ఉత్సాహం
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

3. ఉత్వసంధి :
మేమెందుకొ = మేము + ఎందుకొ
బట్టలుతుకుతాం = బట్టలు + ఉతుకుతాం
బండలెత్తారు = బండలు + ఎత్తారు
కష్టాలున్నాయి = కష్టాలు + ఉన్నాయి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

4. అత్వసంధి :
బువ్వంత = బువ్వ + అంత
లింగయ్య = లింగ + అయ్య
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

5. ఇత్వసంధి :
ఏమైంది = ఏమి + ఐంది
ఇవన్ని = ఇవి + అన్ని
ఎవరబ్బాయి = ఎవరి + అబ్బాయి
ఏమయింది = ఏమి + అయింది
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇత్వసంధి : (ఆ)
పట్టిందంటే = పట్టింది + అంటే
అన్నదట = అన్నది + అట
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

6. గసడదవాదేశ సంధి:
హాయిగా = హాయి + కా
విలువగట్టు = విలువ + కట్టు
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

సమాసములు:

గాఢాభిమాన = గాఢమైన అభిమానం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దివ్యభవనాలు = దివ్యమైన భవనాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పెద్దకొడుకు = పెద్దయైన కొడుకు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వాద్యాల చప్పుడు = వాద్యాల యొక్క చప్పుడు – షష్ఠీ తత్పురుష సమాసం
పరహితము = పరులకు హితము – షష్ఠీ తత్పురుష సమాసం
మన సంతానము = “మన యొక్క సంతానము – షష్ఠీ తత్పురుష సమాసం
ఒకరైతు = ఒక సంఖ్యగల రైతు – ద్విగు సమాసం
పండ్రెండైన గంటలు = పండ్రెండు గంటలు – ద్విగు సమాసం
పదినిమిషాలు = పది అయిన నిమిషాలు – ద్విగు సమాసం
ప్రతి వస్తువు = వస్తువు వస్తువు – అవ్యయీభావ సమాసం
చేతికర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం
విశ్వమానవులు = విశ్వము నందలి మానవులు – సప్తమీ తత్పురుష సమాసం
గౌరవమర్యాదలు = గౌరవమును, మర్యాదయు – ద్వంద్వ సమాసం
స్వార్ధరహితము = స్వార్ధము చేత రహితము – తృతీయా తత్పురుష సమాసం
ఆగమనవార్త = ఆగమనమును గుఱించి వార్త – ద్వితీయా తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

ఎసైన్మెంట్:

ఈ క్రింది పేరాను చదివి, ఏవైనా ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు.
“మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకు వెళతారు” అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను.

ఉదయం 12 గంటల కాలం. వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనం అంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరిబయట మోటబావి వద్ద కూర్చున్నారు. చెట్టునీడను కూర్చున్న ఒక రైతు యువకుడు “దండమండే” అని పెద్దగొంతుతో అన్నాడు, వెంకట్రావువైపు చూస్తూ. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోను, భయంతో గ్రామ పెత్తందార్లకు పెట్టే దండంలోను, వెంకట్రావుకు పెట్టే దండంలోను ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు “దండమండే” అన్న శబ్దంలో నగ్నంగా కనిపించాయి. వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్తగా సుమారు రెండు నెల్ల నుండి ఏకదీక్షతో గ్రామీయుల సమస్యలను తీసుకుని పని చేస్తున్నాడు.

ప్రశ్నలు:
1. ………………………
2. ………………………
3. ………………………
4. ………………………
5. ………………………
జవాబు.
1. ఆంధ్రమహాసభ కార్యకర్త ఎవరు ?
2. ఆయన ఎవరితో కలిసి ఎక్కడికి బయలుదేరాడు?
3. ప్రజలంతా ఏ సన్నాహంలో ఉన్నారు ?
4. రైతు ఎక్కడ కూర్చున్నాడు ?
5. వెంకట్రావు ఎవరి సమస్యలను తీసుకొని పనిచేస్తున్నాడు ?

పదజాలం :

ప్రశ్న 6.
ఆగమనం : ……………..
జవాబు.
ఆగమనం : రాక
అధికారుల ఆగమనంతో కార్యక్రమం ప్రారంభించారు.

ప్రశ్న 7.
నింద : ……………..
జవాబు.
నింద : అపవాదు
ఎవరినీ అనవసరంగా నిందించరాదు.

ప్రశ్న 8.
పరిహాసం : ……………..
జవాబు.
పరిహాసం : ఎగతాళి
పెద్దలతో పరిహాసం పనికిరాదు.

ప్రశ్న 9.
అవ్యాజం : ……………..
జవాబు.
అవ్యాజం : కపటంలేని
తల్లిదండ్రులు పిల్లలపై అవ్యాజమైన ప్రేమ కల్గి ఉంటారు.

ప్రశ్న 10.
సహనం : ……………..
జవాబు.
సహనం : ఓర్పు
పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సహనం కలిగి ఉండాలి.

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

అర్థాలు:

కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 11.
చెట్టు నీడన రైతులు కూర్చొని ఉన్నారు. ( )
A) కార్మికులు
B) సభ్యులు
C) హాలికులు
D) సైనికులు
జవాబు.
C) హాలికులు

ప్రశ్న 12.
వెంకట్రావు రంగాపురం గ్రామానికి చేసిన కృషి అద్భుతమైంది. ( )
A) ప్రయత్నం
B) సాహసం
C) కష్టం
D) ప్రతిజ్ఞ
జవాబు.
A) ప్రయత్నం

ప్రశ్న 13.
నాయకులు మాటా మంతీ కలిపారు… ( )
A) పలుకు పర్యాయపదాలు
B) వాక్కు
C) మాట
D) ముచ్చట
జవాబు.
D) ముచ్చట

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

ప్రశ్న 14.
పసిపిల్లల వదనం నిర్మలంగా ఉంటుంది. అందుకే ఆ మోమును అంతా ఇష్టపడతారు. ( )
A) ఆననం
B) ఆస్యం
C) సస్యం
D) నస్యం
జవాబు.
A) ఆననం

ప్రశ్న 15.
మస్తకమున పాముకు మణి ఉన్నా అ మూర్ఖమున ఉన్న మణి జోలికి పోము. ( )
A) వెల
B) నెల
C) తల
D) శిల
జవాబు.
C) తల

ప్రశ్న 16.
ఇంతులు ఇంటి దేవతలు. లలనలు గృహలక్ష్మి లాంటివారు. ( )
A) మగువ
B) తెగువ
C) ఇంగువ
D) సొబగు
జవాబు.
A) మగువ

ప్రశ్న 17.
పొట్టకూటితోనే ఉదరమును నింపుకుంటాము. ( )
A) ఒడుపు
B) మడుపు
C) కడుపు
D) నేర్పు
జవాబు.
C) కడుపు

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

నానార్థాలు:

కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్ధపదం గుర్తించండి. ( )

ప్రశ్న 18.
వరిమడి బాగా ఏపుగా అడవిలాగా పెరిగింది. ( )
A) హలం
B) అనలం
C) పొలం
D) అహం
జవాబు.
C) పొలం

ప్రశ్న 19.
పట్టుబడ్డ నేరస్తుడు నమస్కారం పెట్టి తప్పు ఒప్పుకొని కఱ్ఱ దెబ్బలు తప్పించుకున్నాడు. ( )
A) దండం
B) షండం
C) గండం
D) తొండం
జవాబు.
A) దండం

ప్రశ్న 20.
పొలంలో దనియాలు చల్లి విత్తం సంపాదించాడు. ( )
A) వనం
B) ధనం
C) జనం
D) మనం
జవాబు.
B) ధనం

ప్రకృతులు – వికృతులు:

కింది గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాయండి.

ప్రశ్న 21.
పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ( )
A) గారవం
B) గవురవం
C) గౌరవము
D) గావరం
జవాబు.
A) గారవం

ప్రశ్న 22.
నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ( )
A) మొఖం
B) మొఖము
C) మొగం
D) మోగం
జవాబు.
C) మొగం

ప్రశ్న 23.
అతడు పట్టలేని సంతోషంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు. ( )
A) సంతోషము
B) సంతసం
C) సంతషము
D) సంతోశము
జవాబు.
B) సంతసం

ప్రశ్న 24.
మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుఖంగా ఉంటారు. ( )
A) శిఖం
B) సఖా
C) సుఖా
D) సుకం
జవాబు.
D) సుకం

ప్రశ్న 25.
అందరిపట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. ( )
A) మరియాద
B) మరోద
C) మర్యోద
D) మరది
జవాబు.
A) మరియాద

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

భాషాంశాలు :

సంధులు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 26.
జీవితాంతం మంచి పనులే చేయాలి. ‘జీవితాంతం’ – విడదీయండి. ( )
A) జీవిత + అంతం
B) జీవితా + అంతం
C) జీవి + అంతం
D) జీ + వితాంతం
జవాబు.
A) జీవిత + అంతం

ప్రశ్న 27.
అందరికీ కష్టాలున్నాయి. ‘కష్టాలున్నాయి’ – ఏ సంధి పదం ? ( )
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి
జవాబు.
C) ఉత్వసంధి

ప్రశ్న 28.
అమితోత్సాహంతో మనం పనిచేయాలి. ‘అమితోత్సాహం’ ఏ సంధి పదం ? ( )
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) యణాదేశసంధి
జవాబు.
B) గుణసంధి

సమాసాలు:

కింద గీతగీసిన పదాలకు సమాన పదాలు/సమాసం పేరు గుర్తించండి.

ప్రశ్న 29.
రెండయిన రోజులు ఏ సమాసం ? – ఏ సమాసం ? ( )
A) ద్విగు
B) ద్వంద్వ
C) బహువ్రీహి
D) నఞ తత్పురుష
జవాబు.
A) ద్విగు

ప్రశ్న 30.
వజ్రమూ, వైడూర్యమూ రెండూ విలువైన జాతిరత్నాలే. ( )
A) ద్విగు
B) బహువ్రీహి
C) అవ్యయీభావ
D) ద్వంద్వ
జవాబు.
D) ద్వంద్వ

ప్రశ్న 31.
తల్లియూ బిడ్డయూ క్షేమంగా ఉన్నారు. సమాస పదం ఏది ? ( )
A) తల్లీబిడ్డలు
B) తల్లిబిడ్డలు
C) బిడ్డతల్లి
D) తల్లిబిడ్డ
జవాబు.
A) తల్లీబిడ్డలు

ప్రశ్న 32.
విద్యను అర్థించువాడు నిరంతరం చదువుతూనే ఉంటాడు. ఏ సమాసం ? ( )
A) తృతీయా తత్పురుష సమాసం
B) చతుర్థీ తత్పురుష సమాసం
C) ద్వితీయా తత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు.
C) ద్వితీయా తత్పురుష సమాసం

ప్రశ్న 33.
మూడు సంఖ్య గల కళ్ళు – సమాస పదం ( )
A) మూడు కళ్ళు
B) కళ్ళు మూడు
C) మూడైన కళ్ళు
D) మూడు కాళ్ళు
జవాబు.
A) మూడు కళ్ళు

ప్రశ్న 34.
దొంగల వల్ల భయం పెరిగింది. ఏ సమాసం ? ( )
A) తృతీయా తత్పురుష సమాసం
B) పంచమీ తత్పురుష సమాసం
C) ద్విగు సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు.
B) పంచమీ తత్పురుష సమాసం

ప్రశ్న 35.
గౌరవమును, మర్యాదయు అందరూ పొందాలి. – ఏ సమాస పదం ? ( )
A) గౌరవమర్యాదలు
B) మర్యాదగౌరవం
C) గౌరవం మర్యాద
D) గౌరవంతో మర్యాద
జవాబు.
A) గౌరవమర్యాదలు

ప్రశ్న 36.
విశ్వము నందలి మానవులు సుఖంగా ఉండాలి. – ఏ సమాసం ? ( )
A) ప్రథమా తత్పురుష సమాసం
B) ద్వితీయా తత్పురుష సమాసం
C) సప్తమీ తత్పురుష సమాసం
D) ద్విగు సమాసం
జవాబు.
C) సప్తమీ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

వాక్యాలు – రకాలు:

క్రింది వాక్యాలు ఏ వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 37.
నీ పేరేంటి ? ( )
A) ప్రశ్నార్థకం
B) విధ్యర్థకం
C) నిషేధార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు.
A) ప్రశ్నార్థకం

ప్రశ్న 38.
అబ్బా ! ఉసిరికాయ ఎంత బాగుందో ( )
A) ప్రశ్నార్థకం
B) నిషేధార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు.
C) ఆశ్చర్యార్థకం

ప్రశ్న 39.
దయయుంచి ఆ పుస్తకం ఇవ్వవా ( )
A) ప్రశ్నార్ధకం
B) ప్రార్థనార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు.
B) ప్రార్థనార్థకం

ప్రశ్న 40.
పెత్తందార్లను వదలవద్దు ( )
A) ప్రశ్నార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) నిషేధార్థకం
జవాబు.
D) నిషేధార్థకం

క్రియను గుర్తించుట:

గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.

ప్రశ్న 41.
అమ్మ కట్టెలు తెచ్చి వంట చేసింది. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 42.
కూలి పని నుండి వస్తూ పుల్లలేరుకొని వచ్చింది. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) శత్రర్థకం

ప్రశ్న 43.
ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ( )
A) క్త్వార్థం
B) అప్యర్థకం
C) శత్రర్థకం
D) చేదర్థకం
జవాబు.
B) అప్యర్థకం

ప్రశ్న 44.
మంచి నాయకుడు వస్తే కష్టాలు తీరుతాయి. ( )
A) క్త్వార్థం
B) శత్రర్థకం
C) అప్యర్థకం
D) చేదర్థకం
జవాబు.
D) చేదర్థకం

TS 8th Class Telugu Bits 8th Lesson చిన్నప్పుడే

సామాన్య- సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 45.
నాయకులు వచ్చారు. కష్టాలు తీర్చారు. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) నాయకులు వచ్చి కష్టాలు తీర్చారు.
B) నాయకులు వస్తూ కష్టాలు తీర్చారు.
C) నాయకులు వస్తే కష్టాలు తీరుస్తారు.
D) నాయకులు కష్టాలు తీర్చడానికి వచ్చారు. ఉండాలి.
జవాబు.
A) నాయకులు వచ్చి కష్టాలు తీర్చారు.

ప్రశ్న 46.
మనిషికి వ్యక్తిత్వం ఉండాలి. మనిషికి సహనం – సంయుక్త వాక్య రూపం గుర్తించండి. ( )
A) మనిషికి వ్యక్తిత్వ సహనం ఉండాలి.
B) మనిషికి సహన వ్యక్తిత్వం ఉండాలి.
C) మనిషికి ఉండాలి సహనం, వ్యక్తిత్వం
D) మనిషికి వ్యక్తిత్వం మరియు సహనం ఉండాలి.
జవాబు.
D) మనిషికి వ్యక్తిత్వం మరియు సహనం ఉండాలి.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

These TS 8th Class Telugu Bits with Answers 7th Lesson మంజీర will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి:

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు ?
జవాబు.
పై బొమ్మలో ప్రవహిస్తున్న నది, నదికి అవతలిగట్టున స్నానాల రేవు, ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తున్నాయి. బొమ్మలోని బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక చూస్తున్నది. నది అంత అందంగా ఎలా పరుగెట్ట గలుగుతుందా అని ఆలోచిస్తుండవచ్చు.

ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు కృష్ణానదిని చూశాను. ఆ నదిని చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కణ్ణుంచి వచ్చాయి, వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెడతాయి, నది నీళ్ళు అంత స్వచ్ఛంగా, తియ్యంగా ఎందుకు ఉంటాయి, చలికాలం వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఎలా ఉంటాయి. అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటికోసం మనుషులు ఏం చేసేవారో కదా! మొదలైన భావాలు కలిగాయి.

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి.
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, గోదావరి, మంజీర, మూసీ, మొదలైన నదులు ప్రవహిస్తాయి.

ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదులు ప్రాణులన్నింటికీ తాగు నీటిని ఇస్తాయి. పంటలు పండించడానికి సాగు నీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు ఉపయోగపడతాయి. విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను ఇస్తాయి.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రశ్న, మంజీర పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణా రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, సింగూర్, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న. గేయ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
మంజీర పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం / పాట అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.

కవి పరిచయం:

ప్రశ్న.
వేముగంటి నరసింహాచార్యుల పరిచయం రాయండి.
జవాబు.
డా॥ వేముగంటి నరసింహాచార్యులు పూర్వపు మెదక్ జిల్లా నేటి సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేటలో రామక్క, రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. ‘సాహితీ వికాస మండలి’ సంస్థను, “మెదక్ జిల్లా రచయితల సంఘం”ను స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశాడు. “తిక్కన”, “రామదాసు” అనే పద్యకావ్యాలను, ‘మంజీర నాదాలు’ అనే గేయకావ్యాన్ని, ‘వివేకవిజయం’ అనే కావ్యఖండికతోబాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.

వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.
(గమనిక : పరీక్షలో గీత గీసిన వాక్యాలు రాస్తే సరిపోతుంది.)

ప్రవేశిక:

జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా నదీ పరీవాహాల్లో విస్తరించింది. ముఖ్యపట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదుల నానుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది. పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ‘మంజీర’ ఒకటి. ఆ నదీమతల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. అవగాహన చేసుకుందాం..

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

కఠినపదాలకు అర్థాలు:

క్వణము = శబ్దం
చిందిలిపాటు = పరవళ్ళు
చేవ = శక్తి, సారము
కూర్మి = ప్రేమ
చేతి చలువ = చేతి మంచితనము
కనుట = చూచుట
గిడసబారిన = ఎండిపోయిన
అంపి = పంపించి
ఆదులు = మొదలైనవన్నీ
తరచు = ఎల్లప్పుడు
లాలించు = బుజ్జగించు
వసించు = నివసించుట
పోలుట / పోలిక = సమానమైన
పురము = పట్టణం
తోబుట్టువు = తనతో పుట్టినవారు (అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు)

గేయం – అర్థాలు – తాత్పర్యాలు:

I. నీ కంకణకణము
నినదించి నంతనే
కర్షకుని నాగేలు
కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిం
దిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర = తల్లీ మంజీరా!
నీవు = నువ్వు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయనిదానవే! = ఎంత తీయని దానవో కదా!
నీ = నీ
కంకణక్వణము = చేతి గాజుల గలగలలు – ఇక్కడ ప్రవాహమని అర్థం
నినదించిన + అంతనే = సవ్వడి చేయగానే
కర్షకుని = రైతు
నాగేలు = నాగలి
కదలి ముందుకు = కదలిక వచ్చి
సాగు = ముందుకు సాగుతుంది.
నీ = నీ
చేతి చలువ = మంచితనపు (స్వచ్ఛమైన నీరు)
చిందిలిపాటు = పరవళ్ళు
కనిన + అంత = చూడగానే
పైరు పచ్చలు = పైరుల పచ్చదలు
కనుల పండువుగ = కన్నుల పండుగలాగా
విలసిల్లు = ప్రకాశిస్తాయి

తాత్పర్యం :
అమ్మా! మంజీర! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహపు సవ్వడి, నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి.

గిడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
చేదైన నేలలో
చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి
జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా
బలము చేకూర్చెదవు
నీవు మంజీర!

అర్థాలు :

మంజీర = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
గిడసబారిన = ఎండిపోయిన
పుడమి ఎడద = నేలతల్లి హృదయాన్ని
కరిగించెదవు = కరిగిస్తావు
చేదు + ఐన = చేదైన
నేలలో = నేలలో
చెరుక = తీయని చెరకు
పండించెదవు = పండిస్తావు
జీవకణములు = జీవ కణాలు కలిగిన
చేవ గలిగిన = సారవంతమైన
కనిన + అంత = చూడగానే
పైరు పచ్చలు పైరుల పచ్చదనాలు
మట్టి = మట్టిని
తెచ్చి = తీసుకొని వచ్చి
పొలముకు = పొలానికి
ఎరువుగా = ఎరువుగా ఇచ్చి
బలము = బలాన్ని
చేకూర్చెదవు = చేకూరుస్తావు

తాత్పర్యం :
తల్లీ! మంజీర చిన్నబోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

II.
ఆనాడు కుతుబు సు
ల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన
వసియించు పౌరులకు
పంచదారను బోలు
మంచి నీరొసగెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :

మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవో! = ఎంత తీయని దానవో కదా!
ఆనాడు = ఎప్పుడో
కుతుబుసుల్తాను = కులీకుతుబ్షా
నిలిపిన = నిర్మించిన
పురము = నగరమైన
భాగ్యనగరము లోన = భాగ్యనగరము (హైదరాబాదు)లోన
వసియించు = నివసించే
పౌరులకు = ప్రజలకు
పంచదారను + పోలు = పంచదార లాగా తీయనైన
మంచినీరు = మంచినీళ్ళను
ఒసగెదవు = అందిస్తావు

తాత్పర్యం :
అమ్మా! మంజీర! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగర్ (హైదరాబాద్) వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు.

పల్లెటూళ్ళను కూర్మి
తల్లివలె లాలించి
స్నానపానాదులను
సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములను తో
బుట్టువలె ప్రేమించి
ధాన్యరాసుల నంపి
తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :

మంజీర = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవో! = ఎంత తీయని దానవో కదా!
నీవు = నువ్వు
పల్లె + ఊళ్ళను = పల్లెటూళ్ళను
కూర్మి = ప్రేమగా
తల్లివలె = తల్లిలాగా
లాలించి = లాలించి
స్నాన పాన + ఆదులను = స్నానం, మంచినీరు వంటి అవసరాలను
సమకూర్చెదవు = తీరుస్తావు
పట్టణమ్ములను= నగరాలను
తోబుట్టువలె = తోడబుట్టిన వాళ్ళుగా
ప్రేమించి = ప్రేమించి
ధాన్యరాసులను = పల్లెల్లో పండిన ధాన్యాలను
అంపి = ఆ నగరాలకు పంపించి
తరచు = ఎల్లప్పుడూ
పోషించెవు = పోషిస్తావు

తాత్పర్యం :
తల్లీ! మంజీర! పల్లెలను అమ్మలాగ, ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగ ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి? (టెక్స్టపేజి నెం.70)
జవాబు.
మంజీర నది చల్లని తల్లివంటిది. అది పంట పొలాలకు తీయని నీరు అందిస్తుంది. మంజీరనది ప్రవాహపు సవ్వడి, గాజుల గలగలల వంటి ఆ నది తరంగాల శబ్దం వినగానే రైతు నాగలితో పొలం పనులు మొదలవుతాయి. ఆ నది మంచితనం చూడగానే రెప్పపాటులోనే పచ్చని పైరులు కనుల పండుగగా ప్రకాశిస్తాయి.

ప్రశ్న 2.
మంజీర నదిని కవి “ఎంత తీయని దానవే” అని అనడంలో ఆంతర్యమేమిటి ? (టెక్స్టపేజి నెం.70)
జవాబు.
మంజీర నది తన పరిసరాలలో నివసించే ప్రజలకు తాగటానికి తీయని మంచినీరు ఇస్తుంది. ఆ నది నీటి వల్ల పండిన రుచికరమైన పంటలు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అందువల్ల కవి మంజీర నదిని “ఎంత తీయని దానవే” అని అన్నారు.

ప్రశ్న 3.
“గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు? (టెక్స్ట్ పేజి నెం. 70)
జవాబు.
మంజీర నది నీరు చేరగానే అప్పటి వరకూ ఎండిపోయి బిగుసుకుపోయిన నేల మృదువుగా, పంటలు పండడానికి వీలుగా తయారవుతుంది. అందువల్ల కవి మంజీర గురించి “గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు” అని అన్నాడు.

ప్రశ్న 4.
‘మంజీర’ పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు ? (టెక్స్టపేజి నెం.71)
జవాబు.
ఆహార పంటలు పండించడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అటువంటి పల్లెటూళ్ళలో పంటలు పండటానికి నదుల నీరే ఆధారం. మంజీరా నది పల్లెవాసులకు స్నానాలకూ, తాగడానికీ, సాగు చేయడానికీ నీళ్ళను అందించి కన్నతల్లి లాగా వారిని లాలిస్తుంది. ‘అందువల్ల కవి మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని అన్నాడు. పిల్లల అన్ని అవసరాలను తల్లి తీర్చినట్లు పల్లె ప్రజల సాగునీటి, తాగునీటి మొదలైన అవసరాలను అన్నింటినీ మంజీర నది తీరుస్తుంది అని తాత్పర్యం.

ప్రశ్న 5.
పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు? (టెక్స్ట్ పేజి నెం.71)
జవాబు.
మంజీర నదికి పల్లెలు బిడ్డల వంటివి, పట్టణాలు తోబుట్టువుల వంటివి. బిడ్డలైన పల్లె ప్రజల అన్ని అవసరాలను తన తియ్యని నీటితో తీరుస్తుంది మంజీర తల్లి. తన బిడ్డలు పండించిన ఆహార పంటలను పంపించి తన తోబుట్టువులైన నగరాలను కూడ పోషిస్తుంది. అంటే పల్లెటూళ్ళలో ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ పంటలు పండుతాయి అని భావం. అంతేకాక ఆ ధాన్యం రవాణాకు కూడా మంజీర నది నీరు ఉపయోగపడుతుందని తాత్పర్యం.

ప్రశ్న 6.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి. (టెక్స్టపేజి నెం.71)
జవాబు.
మంజీరానది ప్రవహించడం వల్లనే పల్లెటూళ్ళలో ఆహారపంటలు అధికంగా పండుతున్నాయి. తమ మిగులు పంటలను పల్లె ప్రజలు పట్టణాలకు పంపిస్తారు. ఈ అధిక దిగుబడికి మంజీర నది అందిస్తున్న తియ్యని నీరే కారణం. అందువల్ల పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది అని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
భూమి మీద నివసించే అన్ని రకాల జీవుల దాహార్తిని తీర్చే నదులు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే స్నానానికి, సాగునీటికి ఉపయోగపడుతున్న నదులు నేడు విద్యుత్తు ఉత్పత్తికి, పర్యాటక కేంద్రాలుగా, రవాణా సౌకర్యాలకూ, ఇసుక ఇవ్వడం మొదలైన ఎన్నో విధాలుగా ఉపయోగపడు తున్నాయి.

నేటి కాలంలో ప్రవహించే నది నీటిని ఆపే ఆనకట్టలు, నీటిని నిలవ ఉంచే రిజర్వాయర్ల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల నది నీటిని గొట్టాలద్వారా నేరుగా ఇంటిదగ్గరకే పంపించగలుగుతున్నారు. దీనితో అందరూ నది నీటిని తాగునీరుగా ఉపయోగించుకోగలుగుతున్నారు.

నదుల నుంచి నీరు పెద్ద కాలువలోకి, అందులోనుంచి చిన్న కాలవలలోకి, వాటి నుంచి బోదెలలోకి, నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాక నది నీటి తలానికి ఎత్తులో ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్ళు అందుతున్నాయి.

నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలవల ద్వారా పంపేచోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం.
నదులలో ముఖ్యంగా ఆనకట్టల ప్రాంతాలలో బోటులు, మరపడవలలో విహారయాత్రలకు వీలు కలుగుతున్నది. ఇది ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది.

తక్కువ ఖర్చుతో ఎంతో బరువున్న వస్తువులను నది నీళ్ళలో రవాణా చేయడం సులువు. దీనివల్ల ఖర్చు, శ్రమ, కలిసివస్తాయి.
కొండల్లో నుంచి, గుట్టల్లోనుంచి ప్రవహించే నదులు తమతోపాటు తెచ్చిన ఇసుకను ఒడ్డుల్లో, మధ్యలో, మేటలు వేస్తాయి. ఆ ఇసుక భవన నిర్మాణాలకూ, వంతెన నిర్మాణాలకూ ఎంతో ఉపయోగపడుతున్నది.

ఈ విధంగా ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నదులు మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు

ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి; ఎడద కరిగించెదవు

ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.

ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి

2. గంగాపురం హనుమచ్చర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
లంటి వాని ని
ర్ఘరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా –

ప్రశ్నలు :

అ. ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం దుందుభినది ప్రవాహం గురించి చెప్పింది.

ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలయేఱుతో పోల్చాడు.

ఇ. కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు ?
జవాబు.
తెల్లగా ఉండే కొత్త జాజిపూల రంగుతో ప్రవహించడం వల్ల కవి దుందుభినదిని పాలయేఱు అని అన్నాడు.

ఈ. ‘దరులు’ అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
దరులు అంటే ఒడ్డులు అని అర్థం.

ఉ. దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం అమృతపు తుంపరల వలె ఉన్నదని కవి ఉద్దేశం.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
తియ్యని నదుల నీటితో పొలాలలో రుచికరమైన పంటలు పండుతాయి. కొండలు, అడవులలో నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులలో ఒండ్రుమట్టి, వన మూలికలు, ఆకులు అలములు మొ||వి కొట్టుకు వస్తాయి. ఇవి పొలాలలోకి చేరి పంటమొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తాయి. పంటల అధిక దిగుబడికి కారణం అవుతాయి. అందువల్లనే “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని కవి అన్నాడు.

ఆ. భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి.
జవాబు.
భాగ్యనగరం అంటే హైదరాబాదు. ఈ నగరాన్ని కులీకుతుబ్షా అనే సుల్తాను నిర్మించాడు. ఈ భాగ్యనగరంలో నేడు లక్షల మంది నివసిస్తున్నారు. వారందరికీ మంజీరా నదే మంచినీళ్ళు అందిస్తున్నది. ఆ నీరు తియ్యగా, రుచికరంగా ఆరోగ్యప్రదంగా ఉంటాయి. అందువల్ల భాగ్యనగరానికీ, మంజీరా నదికీ మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిది.

ఇ. మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
జీవులన్నింటికీ మంచినీరు ప్రాణాధారం. నదులు మంచినీరు అందించి ప్రాణాలను కాపాడతాయి. కనుక నదులను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నది నీటిని వ్యర్థాలతో, మలినాలతో కలుషితం చేయకూడదు. ప్రాణాలు నిలబెట్టే నదులలోని మంచినీటిని వృథా చేయకూడదు. భవన నిర్మాణాల కోసమో, నగర నిర్మాణాల కోసమో నదులను దారి మళ్ళించ కూడదు. అట్లా చేయడం వల్ల నదులు కనుమరుగు కావడమే కాక వరదలు, ముంపులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నదులను కాపాడుకోవాలి.

ఈ. నదులు ‘నాగరికతకు ఆలవాలం’ ఎందుకు ?
జవాబు.
నాగరీకరణం చెందిన మానవ జీవన విధానమే నాగరికత. మానవుడు కొండల్లో, గుహల్లో తలదాచుకున్న దశ నుంచి వ్యవసాయం చేయడం నేర్చుకొని స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాడు. అవే గ్రామాలు. గ్రామ దశ నుంచి వర్తక వాణిజ్యాల అభివృద్ధితో నగరాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో నదులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ మాటకొస్తే నదుల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలు అన్నీ దాదాపు నదుల ఒడ్డున ఏర్పడినవే.

ఉదాహరణకు మూసీనది ఒడ్డున హైదరాబాదు, గోదావరి ఒడ్డున రాజమండ్రి, యమునా నది ఒడ్డున ఆగ్రా, గంగానది ఒడ్డున కాశీ, నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, సీన్ నది ఒడ్డున రోమ్ మొదలైనవి. కనుక నదులు నాగరికతకు నిలయమైనవని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఉ. మంజీర నది మానవులకు చేసే మేలు ఏమిటి ? (అదనపు ప్రశ్న)
జవాబు.
మంజీర నది జీవులను కన్నతల్లిలా పోషిస్తుంది. తియ్యని మంచినీరు అందిస్తుంది. రుచికరమైన ఆహార పంటలు పండటానికి తోడ్పడుతుంది. ఎండిపోయిన, బీడుబోయిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా తయారు చేస్తుంది. ఎటువంటి నేలలో అయినా తీయని చెరకు వంటి పంటలు పండటానికి తోడ్పడుతుంది. తన ప్రవాహంతో పాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి పంటకు బలాన్ని ఇస్తుంది. భాగ్యనగర్ వాసులకు తీయని మంచినీరు అందిస్తుంది. స్నానం, తాగునీరు, సాగునీరు మొదలైన పల్లెవాసుల అవసరాలన్నీ తీరుస్తుంది. పల్లెల్లో పండించిన ధాన్యాన్ని పట్టణాలకు పంపడానికి దోహదపడుతుంది.

ఊ. మానవ నాగరికత పరిణామంలో నదుల పాత్ర ఏమిటి ? (అదనపు ప్రశ్న)
జవాబు.
మానవ నాగరికత పరిణామంలో నదులు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో విలసిల్లిన నాగరికతలు అన్నీ నదుల ఒడ్డున ఏర్పడి అభివృద్ధి చెందినవే. ఉదాహరణకు నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, యమునానది ఒడ్డున ఆగ్రా, మూసీనది ఒడ్డున హైదరాబాదు, సీన్ నది ఒడ్డున రోమ్ నగరం, గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, గంగానది ఒడ్డున కాశీనగరం మొదలైనవి. ప్రాచీనకాలం నుంచి నదులు జీవుల దాహం తీరుస్తున్నాయి. వ్యవసాయానికీ, రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఆధునికకాలంలో విద్యుత్ తయారీకి, పర్యాటకుల్ని ఆకర్షించడానికీ కూడా ఉపయోగపడుతూ మానవులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఎ. “నీ కంకణ క్వణము నినదించినంతనే” దీన్ని వివరించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
కంకణం అంటే గాజు, క్వణం అంటే ధ్వని. కంకణకణము అంటే గాజులు కదలేటప్పుడు వినిపించే గలగలల శబ్దం. సాధారణంగా నదిని స్త్రీతో పోలుస్తారు. ఇక్కడ కవి మంజీర నదిలోని అలల సవ్వడిని స్త్రీ గాజుల గల గలల లాగా ఉన్నాయని ఊహించాడు. ‘నీ కంకణ క్వణము నినదించినంతనే’ అంటే నీ (మంజీర నది) గాజుల సవ్వడి గలగలలు (అలల సవ్వడి) ధ్వనులు విన్న వెంటనే అని తాత్పర్యం.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగు కావడానికి వాతావరణ కాలుష్యం, జలకాలుష్యం, నీటివృథా, అజాగ్రత్త, నిర్వహణాలోపం మొదలైనవి ముఖ్యకారణాలు.

వాతావరణ కాలుష్యం : మేఘాలు వర్షించినప్పుడు భూమిపైన ఎత్తుమీద పడిన నీరు పల్లానికి ప్రవహించి చిన్న చిన్న వాగులై అవి మహానదిలా మారి చివరికి సముద్రంలో కలుస్తాయి. భూమి మీద వృక్షసంపద తగ్గిపోతూండడం వల్ల తగినంత వర్షం పడటంలేదు. అందువల్ల నదుల్లో ప్రవహించే నీటి శాతం క్రమంగా తగ్గుతున్నది. జలకాలుష్యం : ప్రవహించే నీటిలో అనేక పరిశ్రమల వ్యర్థాలు, మలిన పదార్థాలు కలిసిపోవడం వల్ల ఆ నీరు కలుషితమై పోతున్నది. ఆ నీరు తన సహజగుణాన్ని కోల్పోతున్నది.

నీటి వృథా : నీటిని వృథా చేయడం వల్ల కూడా కొంతకాలానికి నదుల్లో నీరు కనుమరుగైపోతుంది.

అజాగ్రత్త : నదుల్లో ప్రవహించే నీటిని జాగ్రత్త చేసుకోలేక పోవడం వల్ల ఎక్కువ శాతం నీరు సముద్రంలో కలిసిపోతున్నది.

నిర్వహణాలోపం : నది నీటికి శాస్త్రీయ పద్ధతులలో నిర్వహణ లేకపోవడం వల్ల కూడా నదినీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

ముగింపు : ఈ విధంగా మన నాగరికతకు మూలాధారాలైన నదులను జాగ్రత్తగా కాపాడకపోతే మానవ జీవనం ప్రశ్నార్థకమౌతుంది.

ఆ. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన ‘మంజీర’ అనే పాఠ్యభాగంలో మంజీరనది మానవాళికి చేసే మేలును గురించి తేలికైన తేటతెలుగు పదాలలో వివరించారు.
మాత్రాఛందస్సులో రచించిన ఈ గేయంలో మంజీరానది సాగునీటిగా తాగు నీరుగా ఉపయోగపడుతూ ప్రజలకు చేసే మేలును వివరించారు.

సాగునీరు : మంజీర నది చల్లని తల్లి వంటిది. గాజుల గలగలలు వంటి ఆమె ప్రవాహపు సవ్వడి వింటేనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. ఆమె చల్లని చూపు వంటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో కనుల పండుగలాగా ప్రకాశిస్తాయి. మంజీర నది ఎండిపోయిన నేలను కూడా తన తీయని నీటితో కరిగించి పంట పండటానికి అనువుగా తయారుచేస్తుంది. ఎటువంటి నేలలో అయినా చెరుకు వంటి తీయని పంటలు పండేటట్లు చేస్తుంది. అంతేకాక తన ప్రవాహంతోపాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తుంది. పంట మొక్కలకు బలాన్ని ఇస్తుంది.

తాగునీరు : మంజీర నది కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగరం (హైదరాబాదు)లో నివసించే వారికి తీయని మంచి నీరు అందిస్తుంది. తన పరీవాహక పరిసరాలలో నివసించే పల్లె ప్రజలను ప్రేమగా లాలిస్తుంది. వారి సాగునీటి అవసరాలతో పాటు స్నానాల, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది.

పట్టణానికి తోబుట్టువులా : మంజీరనది పల్లె ప్రజలను తల్లిలా లాలిస్తుంది. పట్టణ ప్రజలను తోబుట్టువులా ఆదరిస్తుంది. పల్లె ప్రజలకు అవసరమైన దానికంటే అధికంగా దిగుబడిని అందిస్తుంది. పల్లె ప్రజలు తమ మిగులు పంటను పట్టణాలకు పంపించడానికి తోడ్పడుతుంది. ధాన్యాన్ని, ఇతర వస్తువులనూ తరలించడానికి రవాణా కోసం కూడా
నది ఉపయోగపడుతుంది.

ముగింపు : ఈ విధంగా మంజీర నది సకల జీవులకూ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మానవులకు సాగునీటి అవసరాలను తీర్చి ఎంతో మేలు చేస్తున్నదని ‘మంజీర’ పాఠ్యభాగంలో కవి వర్ణించాడు.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

IV. సృజనాత్మకత/ప్రశంస:

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత / గేయాన్ని రాయండి.
జవాబు.
పల్లవి : మా వూరు వచ్చింది మా మంచి ఏరు
మనసార నివ్వింది సిరిమల్లె తీరు
మా దాహమును తీర్చి మా పంట పండించ ॥మా వూరు॥

చరణం 1 :
పగటి ఎండల్లోన పరవళ్ళు తొక్కింది
తెల్ల మబ్బుల వంటి నురగల్లు తెచ్చింది.
పండు వెన్నెల్లోన నిండుగా పారింది
ఎండు బీడుల్లోన గుండె ఉప్పొంగంగ ॥మా వూరు॥

చరణం 2 :
గలగలా పారుతూ గిలిగింత పెట్టింది.
హలము పొలము దున్న రైతును తట్టింది
తీయని నీటితో తేనెను పోలింది
చక్కని పంటతో సిరులు కురిపించంగ ॥మా వూరు||

చరణం 3 :
జలపాతములతోన జలకాలు ఆడింది
గులకరాళ్ళల్లోన సెల పాటపాడింది
మంచి నీటితోన చెరువు ముంచెత్తింది.
తేటనీటితోన ఏరై పరుగెత్తంగ ॥మా వూరు॥

V. పదజాల వినియోగం.

1. కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.

అ) రైతు
ఆ) చల్లదనం
ఇ) నేల
ఈ స్నేహం
ఉ) పంపి
ఊ) ప్రకాశించు

భాష పుడమి నాగలి
అంపి విలసిల్లు చలువ
కర్షకుడు కంకణము సోపతి

జవాబు.
అ) రైతు – కర్షకుడు
ఆ) చల్లదనం – చలువ
ఇ) నేల – పుడమి
ఈ) స్నేహం – సోపతి
ఉ) పంపి – అంపి
ఊ) ప్రకాశించు – విలసిల్లు

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.

“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.

ప్రకృతి – వికృతి
ఎడద – హృదయం
రాసులు – రాశులు

3. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విల్లసిల్లింది = ప్రకాశించింది
ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = స్నేహం, సోపతి
ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం = భూమి, ధరణి

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది ఖాళీలను పూరించండి.
ఉదా :

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
సీతజడ సీత యొక్క జడ షష్ఠీ తత్పురుషము
చెట్టునీడ చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుషము
వయోవృద్ధుడు వయసు చేత వృద్ధుడు తృతీయా తత్పురుషము
రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు తృతీయా తత్పురుషముషష్ఠీ తత్పురుషము
అమంగళం మంగళం కానిది నఞ తత్పురుషము
తిలకధారి తిలకమును ధరించినవాడు బహువ్రీహి సమాసం

2. కింది దానిని చదువండి.
ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతీదేవి ఒడి
మనకు నేర్పును నడవడి

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది ?
జవాబు.
ఈ కవిత చదువుతుంటే చెవికి ఇంపుగా ఉన్నది.

ప్రశ్న 2.
ఎందుకని వినసొంపుగా ఉన్నది ?
జవాబు.
ప్రతి పాదం ‘డి’ అనే అక్షరంతో ముగియడం వల్ల వినసొంపుగా ఉన్నది.

ప్రశ్న 3.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది ?
జవాబు.
దీనిలో ‘డి’ అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది.

పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.

అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్యను ప్రాస’ అలంకారం అంటారు.

3. మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.
1) పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
2) గిడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

1) ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ రాష్ట్రంలో నదులు – వాటిపై ప్రాజెక్టులు వాటి – తీరాల్లో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు.
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకాలు, పెద్దల నుండి సమాచార సేకరణ

ఆ) నివేదిక :

నది పేరు ప్రాజెక్టు పేరు పుణ్యక్షేత్రం (నదీతీరపు) దర్శనీయ స్థలాలు
1. గోదావరి 1) నిజాంసాగర్ ప్రాజెక్టు – అచ్చంపేట
2) సింగూరు ప్రాజెక్టు సింగూరు
3) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పోచంపాడు
4) దుమ్ముగూడెం పవర్ ప్రాజెక్టు పాములపల్లి ఖమ్మంజిల్లా
1) సత్యనారాయణ స్వామి దేవాలయం లక్షెట్టిపేట్ (గూడెంగుట్ట) ఆదిలాబాద్ జిల్లా
2) జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర, ఆదిలాబాద్ జిల్లా
3) నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా
4) శివాలయం, కాళేశ్వరం జి॥ కరీంనగర్
1) కొయ్యబొమ్మల పరిశ్రమ నిర్మల్, జి॥ ఆదిలాబాద్
2) చేతి బొమ్మల పరిశ్రమ ఆర్మూర్, జి॥ నిజామాబాద్
2. కృష్ణా 1) నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (నల్గొండ) నాగార్జున కొండ
2) జూరాల ప్రాజెక్టు రేవులపల్లి మహబూబ్నగర్
 1) శ్రీ జోగులాంబదేవి దేవాలయం, ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా
2) శ్రీరంగనాయక స్వామి దేవాలయం, వనపర్తి, మహబూబ్నగర్
1) పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లా
2) గద్వాల్ పోర్టు, మహబూబ్నగర్ జిల్లా

ఇ) ముగింపు :
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యనదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు మరియు ఆ నదుల పరీవాహక ప్రాంతాలలోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాల వివరాలను పట్టికలో పొందుపరిచాను. పెద్దల ద్వారా వాటి గూర్చి తెల్సుకొంటున్నప్పుడు ఆ స్థలాలను దర్శిస్తే బాగుండుననిపించింది.
ఉదా : మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రిలో 700 సం||ల క్రితపు మఱివృక్షం ఉందట. అలాంటి వింతలు విశేషాలు గల స్థలాలను సెలవులలో మా కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని నిర్ణయించుకొన్నాను.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

క్వణం = శబ్దం, సవ్వడి, చప్పుడు
కర్షకుడు = రైతు, వ్యవసాయదారుడు, కృషీవలుడు, హాలికుడు
నాగేలు = నాగలి, హలం
చేయి = కరం, హస్తం, పాణి
కన్ను = నేత్రం, అక్షం, చక్షువు
పండుగ = ఉత్సవం, వేడుక
పుడమి = నేల, ధరణి, భూమి
పొలం = చేను, క్షేత్రం
పురం = నగరం, పట్టణం
నీరు = జలం, ఉదకం, నీళ్లు, తోయం
తల్లి = అమ్మ, అంబ, జనని, మాత

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
హలము – నాగేలు, నాగలి
హృదయం – ఎద, ఎడద, డెందం
పృథివి, పృథ్వి – పుడమి

సంధులు:

చల్లనిదానవే = చల్లనిదానవు + ఏ = ఉత్వ సంధి
తీయనిదానవే = తీయనిదానవు + ఏ = ఉత్వ సంధి
చేదైన = చేదు + ఐన = ఉత్వ సంధి
నీరొసగెదవు = నీరు + ఒసగెదవు = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

నినదించినంతనే = నినదించిన + అంతనే = అత్వ సంధి
కనినంత = కనిన + అంత = అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

పల్లెటూళ్ళను = పల్లె + ఊళ్లను = టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చు పరమైనపుడు టుగాగం అవుతుంది.

స్నానపానాదులకు = స్నానపాన + ఆదులకు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

కంకణక్వణం = కంకణం యొక్క క్వణం – షష్ఠీ తత్పురుష సమాసం
ధాన్యరాసులు = ధాన్యం యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
పల్లెటూళ్ళు = పల్లె అయిన ఊళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవకణములు = జీవమైన కణములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
విలసిల్లు : _______________
జవాబు.
కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిలింది.

ప్రశ్న 2.
కన్నుల పండుగ : _______________
జవాబు.
పచ్చని పైర్లు కన్నుల పండుగగా కళకళలాడతాయి.

ప్రశ్న 3.
గిడసబారు : _______________
జవాబు.
సరైన పోషణ లేకపోవడంతో పంటంతా గిడసబారి పోయింది.

గీతగీసిన పదాలకు సరైన అర్థాలను గుర్తించండి.

ప్రశ్న 4.
‘స్వచ్ఛ భారత్’ కై ప్రతి భారతీయుడూ కంకణం కట్టుకొని దీక్ష చేపట్టవలసిన పవిత్ర జాతీయ యజ్ఞం. ( )
A) నడుం
B) మెడ
C) చేతి కడియం
D) ఉంగరం
జవాబు.
C) చేతి కడియం

ప్రశ్న 5.
మన జాతికి ఆహారపు ధాన్యాలు పుష్కలంగా ఉండడానికి కర్షకుల శ్రమే ముఖ్యకారణం. ( )
A) మేధావులు
B) రైతులు
C) పేదలు
D) హంతకులు
జవాబు.
B) రైతులు

ప్రశ్న 6.
గిడసబారిన నేలలో పంటలు పండవు. ( )
A) పచ్చని
B) ఎర్రని
C) తెల్లని
D) ఎండిన
జవాబు.
D) ఎండిన

ప్రశ్న 7.
పుడమితల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింప చేశాయి. ( )
A) భూమి
B) ఆకాశం
C) గాలి
D) పక్షి
జవాబు.
A) భూమి

ప్రశ్న 8.
చేవ లేని కలప తలుపు చేయడానికి పనికిరాదు. ( )
A) రంగు
B) రుచి
C) సారం
D) వంపు
జవాబు.
C) సారం

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

పర్యాయపదాలు:

గీతగీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

ప్రశ్న 9.
చిత్రకారుడికి కుంచె, రైతుకు హలం ముఖ్య ఆయుధాలు. ( )
A) కర్ర, వెదురు
B) నాగలి, సీరము
C) పలుగు, పార
D) కొడవలి, గిత్త
జవాబు.
B) నాగలి, సీరము

ప్రశ్న 10.
ఏనుగుకు తొండమే కరములా ఉపయోగపడుతుంది. ( )
A) కాలు, తొండం
B) కన్ను, కర్ర
C) వేలు, శాఖ
D) చేయి, హస్తము
జవాబు.
D) చేయి, హస్తము

ప్రశ్న 11.
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు మొదట బ్రహ్మగుప్తుడు కనుగొన్నాడు. ( )
A) పుడమి, ధరణి
B) నీరు, నేల
C) ఆకాశం, నింగి
D) సముద్రం, నేల
జవాబు.
A) పుడమి, ధరణి

ప్రశ్న 12.
నగరంలో నివసించే వారికి రాబడి కంటే ఖర్చులే ఎక్కువ. ( )
A) కొండ, మిద్దె
B) పల్లె, జనపదం
C) ద్వీపం, పట్టణం
D) పురం, పట్టణం
జవాబు.
D) పురం, పట్టణం

ప్రశ్న 13.
జనని సంస్కృతంబె సకల భాషలకును. ( )
A) తల్లి, మాత
B) అన్న, స్త్రీ
C) అక్క ఇంతి
D) చెల్లి, మహిళ
జవాబు.
A) తల్లి, మాత

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ప్రకృతి – వికృతులు:

కింది వాటిలో గీతగీసిన పదాలకు ప్రకృతి / వికృతి గుర్తించండి.

ప్రశ్న 14.
దేశాభివృద్ధిలో రాశి కంటే వాసి ముఖ్యమైనది. ( )
A) రాసి
B) రాశీ
C) రాసం
D) రసం
జవాబు.
A) రాసి

ప్రశ్న 15.
పొలాలను హలాలతో దున్ని రైతులు పంటలు పండిస్తారు. ( )
A) హల్వా
B) అల్వార్
C) కొడవలి
D) నాగలి
జవాబు.
D) నాగలి

ప్రశ్న 16.
పసిపిల్లల హృదయం పువ్వువలే స్వచ్ఛమైనది. ( )
A) మనసు
B) మెదడు
C) ఎద
D) నోరు
జవాబు.
C) ఎద

ప్రశ్న 17.
కాలుష్యం నుండి పృథ్విని కాపాడుకోవడం కేవలం మాటలతో జరగదు. ( )
A) నీరు
B) పుడమి
C) ఆకాశం
D) ఇల్లు
జవాబు.
B) పుడమి

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

భాషాంశాలు :

సంధులు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 18.
కిందివాటిలో అత్వసంధికి ఉదాహరణ ? ( )
A) చేదైన
C) పల్లెటూళ్లు
B) కనినంత
D) కాలుసేతులు
జవాబు.
B) కనినంత

ప్రశ్న 19.
కృష్ణానది అన్ని ప్రాంతాలకు నీరొసగుతుంది. నీరొసగు – విడదీసిన రూపం ? ( )
A) నీరొ + ఒసగు
B) నీరు + ఎసగు
C) నీరు + వెసగు
D) నీరు + ఒసగు
జవాబు.
D) నీరు + ఒసగు

ప్రశ్న 20.
పల్లెటూళ్ళు ప్రశాంతతకు నిలయాలు. పల్లెటూళ్లు – ఇందులో జరిగిన ‘సంధి’ ఏమిటి ? ( )
A) ఉత్వ సంధి
B) ఇత్వ సంధి
C) టుగాగమ సంధి
D) గుణ సంధి
జవాబు.
C) టుగాగమ సంధి

ప్రశ్న 21.
ద్రుతప్రకృతికం మీది పరుషాలు సరళాలు అవుతాయి – ఇది ఏ సంధికి సంబంధించిన సూత్రం ? ( )
A) సరళాదేశ సంధి
B) అత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు.
A) సరళాదేశ సంధి

ప్రశ్న 22.
కింది వాటిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ ? ( )
A) తీయని దానవే
B) స్నానపానాదులు
C) పల్లెటూళ్ళను
D) చల్లని దానవు
జవాబు.
B) స్నానపానాదులు

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

సమాసాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 23.
కింది వాటిలో షష్ఠీతత్పురుష సమాసానికి ఉదాహరణ ? ( )
A) తల్లిదండ్రులు
B) పల్లెటూళ్ళు
C) కంకణక్వణం
D) ముక్కంటి
జవాబు.
C) కంకణక్వణం

ప్రశ్న 24.
పల్లెటూళ్ళు ప్రగతికి సోపానాలు. పల్లెటూళ్ళు – ఏ సమాసం ? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) షష్ఠీ తత్పురుష
D) ద్విగు
C) ద్వంద్వ
జవాబు.
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 25.
సంక్రాంతి పండుగకు ధాన్యపురాసులు ఇంటికి వస్తాయి. ధాన్యపురాసులు – ఏ సమాస పదం ? ( )
A) షష్ఠీ తత్పురుష
B) సప్తమీ తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) ద్విగు
జవాబు.
A) షష్ఠీ తత్పురుష

ప్రశ్న 26.
జీవకణాల సముదాయం మానవశరీరం. జీవకణాలు – విగ్రహవాక్యం గుర్తించండి. ( )
A) జీవమైన కణాలు
B) జీవం లేని కణాలు
C) కణాలుగా ఉన్న జీవాలు
D) కణజీవాలు
జవాబు.
A) జీవమైన కణాలు

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

వాక్యాలు – రకాలు:

గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.

ప్రశ్న 27.
ఓహో! మంజీర మంచినీళ్ళు ఎంత తీయగా ఉన్నాయో ! ( )
A) ప్రశ్నార్ధకం
B) అనుమత్యర్థకం
C) ఆశ్చర్యార్థకం
D) సామర్థ్యార్థకం
జవాబు.
C) ఆశ్చర్యార్థకం

ప్రశ్న 28.
మంజీరా ! చక్కెరలాంటి తీయని నీటిని అందించగలవు. ( )
A) ప్రశ్నార్థకం
B) సామర్థ్యార్థకం
C) విధ్యర్థకం
D) నిషేధార్థకం
జవాబు.
B) సామర్థ్యార్థకం

ప్రశ్న 29.
మంజీర నది లోతు ఎక్కువ. దిగవద్దు. ( )
A) ప్రశ్నార్ధకం
B) ఆశ్చర్యార్థకం
C) అనుమత్యర్థకం
D) నిషేధార్థకం
జవాబు.
D) నిషేధార్థకం

ప్రశ్న 30.
సారవంతమైన మట్టి తెచ్చి బీడును బంగరు భూమిగా మారుస్తావు. ( )
A) క్త్వార్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థకం

ప్రశ్న 31.
మంజీర నీరు త్రాగితే నోరంతా తీపిగా ఉంటుంది. ( )
A) క్త్వార్థకం
B) శత్రర్థకం
C) అప్యర్థకం
D) చేదర్థకం
జవాబు.
C) అప్యర్థకం

ప్రశ్న 32.
మంజీర నీరు ఎన్ని త్రాగినా తనివి తీరలేదు. ( )
A) క్త్వార్థకం
B) అప్యర్థకం
C) శత్రర్థకం
D) చేదర్థకం
జవాబు.
B) అప్యర్థకం

ప్రశ్న 33.
మంజీర ప్రజలకు నీటిని అందిస్తుంది. ప్రజల అవసరాలు తీరుస్తుంది. – సంక్లిష్టవాక్యం గుర్తించండి. ( )
A) మంజీర ప్రజలకు నీటిని అందించి అవసరాలు తీరుస్తుంది.
B) మంజీర ప్రజలకు నీటిని అందించాలని అవసరాలు తీరుస్తుంది.
C) మంజీర ప్రజలకు నీటినిచ్చి అవసరాలు తీరుస్తుంది.
D) మంజీర ప్రజల అవసరాలకోసం నీటినిస్తుంది.
జవాబు.
A) మంజీర ప్రజలకు నీటిని అందించి అవసరాలు తీరుస్తుంది.

ప్రశ్న 34.
మంజీర నీరు చల్లనిది. మంజీర నీరు తియ్యనిది – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) మంజీర నీరు చల్లగా తియ్యగా ఉంటుంది.
B) మంజీర నీరు చల్లగా తియ్యగా ఉండాలి.
C) మంజీర నీరు ఉంటుంది చల్లగా తియ్యగా.
D) మంజీర నీరు చల్లనిది మరియు తియ్యనిది.
జవాబు.
D) మంజీర నీరు చల్లనిది మరియు తియ్యనిది.

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

ఛందస్సు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 35.
‘మంజీర’ పదం ఏ గణము ? ( )
A) రగణం
B) యగణం
C) తగణం
D) మ గణం
జవాబు.
C) తగణం

ప్రశ్న 36.
రెండు మాత్రల కాలంలో పలుకబడేవి ఏవి ? ( )
A) గురువులు
B) లఘువులు
C) ప్లుతములు
D) హ్రస్వాలు
జవాబు.
A) గురువులు

అలంకారాలు:

సరియైన అలంకారాన్ని గుర్తించండి.

ప్రశ్న 37.
మంజీర నది నీరు అమృతం వలె తియ్యగా ఉంది. ఇందులోని అలంకారం గుర్తించండి. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) యమకం
జవాబు.
A) ఉపమ

ప్రశ్న 38.
పంచదారను బోలు మంచి నీరొసగెదవు – ఇందులోని అలంకారం ఏది ? ( )
A) రూపకం
B) యమకం
C) ఉత్ప్రేక్ష
D) ఉపమ
జవాబు.
D) ఉపమ

TS 8th Class Telugu Bits 7th Lesson మంజీర

చదువండి – తెలుసుకోండి:

ఉద్యమదీపిక టి. ఎన్. సదాలక్ష్మి

సికింద్రాబాదు బొల్లారంలోని కలాసిగూడ మెహతర్ బస్తీలో 1928 డిసెంబర్ 25న సదాలక్ష్మి పుట్టింది. తండ్రి కొండయ్య, తల్లి కర్రె గోపమ్మలకు కలిగిన తొమ్మిదిమంది సంతానంలో ఏడవబిడ్డ సదాలక్ష్మి. దళిత ఉపకులమైన మెహతర్ కులం నుంచి వచ్చిన సదాలక్ష్మి కుటుంబం సికింద్రాబాద్ కంటోన్మెంటు ప్రాంతంలో జీవించడంవల్ల అంటరానితనం వెలివేతకు సంబంధించిన ప్రతికూలాంశాలు ఎన్ని ఉన్నా కొన్ని అనుకూలాంశాలను పొందగలిగింది. బాల్యం నుండే చదువుల్లో, క్రీడల్లో అమితమైన ఆసక్తి చూపింది. క్రమంగా సామాజిక సేవ, సంఘసంస్కరణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చింది.

1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి చివరిదాక తెలంగాణ ఉద్యమం వెంటనడిచిన ఉద్యమకారిణి సదాలక్ష్మి. తెలంగాణ రాష్ట్రం కోసం తన బంగారు వెండినగలను కరిగించి అమ్మిన డబ్బులతో ఉద్యమాన్ని నడిపించిన నిస్వార్థ నాయకురాలు సదాలక్ష్మి. ఒకవైపు ఆర్యసమాజ అనుయాయిగా, గాంధేయవాదిగా ఉంటూనే అవసరమైన వేళ నిజమైన పోరాటస్వభావాన్ని చూపించిన వ్యక్తి సదాలక్ష్మి.

“నాకు అసెంబ్లీ అయినా ఇల్లైనా ఒక్కటే. నా మట్టుకు నాకు రూల్సు తప్పితే ఊరుకోను” అంటూ తాను కచ్చితంగా పాటిస్తూ, తన సాధికారతను, ఆత్మగౌరవాన్ని కడదాక నిలుపుకున్న పాలనాదక్షురాలు సదాలక్ష్మి. ‘అడుగడుగునా నాకు చరిత్ర’ ఉన్నదని సాధికారికంగా ప్రకటించుకున్న సదాలక్ష్మి 2004 జూలై 24న తుదిశ్వాస వదిలింది.
(- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘నేనే బలాన్ని’ టి. ఎన్. సదాలక్ష్మి బతుకుకథ సౌజన్యంతో)

సూక్తి :
“నది పాదం మోపిన ప్రతిచోట నేలను
పచ్చబంగారంగా మారుస్తుంది.
అట్లాగే మనిషి అడుగు పెట్టిన ప్రతిచోట
మానవత్వం చెట్టె నీడనివ్వాలి.”

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

These TS 8th Class Telugu Bits with Answers 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

చదువండి ఆలోచించి చెప్పండి.

చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా సీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
బీరలు పూసే బారలు కాసే తీగో నాగో ఉయ్యాలో
బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
జవాబు.
ఈ గేయం తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను గురించి చెప్తుంది.

ప్రశ్న 2.
ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
జవాబు.
తెలుసు. ఈ గేయాన్ని జానపదగేయం అంటారు.

ప్రశ్న 3.
ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
జవాబు.
గోగులు పూచే గోగులు కాసే తీగో నాగో ఉయ్యాలో
నారలు తియ్యా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలో
నారలు తీయా వీరులు లేరా తీగో నాగో ఉయ్యాలో
వాగులు పొంగే వంకలు పొంగే తీగో నాగో ఉయ్యాలో
దారులు చెయ్యా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
దారులు ఇయ్యా ఏరులు లేవా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్న 4.
ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఇట్లాంటి గేయాలు తెలుగువారి ఆచార సంప్రదాయాలనూ, చరిత్రను, గొప్పదనాన్ని తెలియజేస్తాయి.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

పాఠ్యభాగ ఉద్దేశం:

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనం, వాటి వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.

కవి పరిచయం:

ప్రశ్న.
బిరుదురాజు రామరాజుగారి పరిచయం రాయండి. (లేదా) బిరుదురాజు రామరాజుగారి జీవిత విశేషాలు తెల్పండి.
జవాబు.
తెలుగు జానపద సాహిత్యమనగానే మనకు గుర్తుకువచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు.
కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్ గా పనిచేశాడు.

“తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ – తెలుగు నిఘంటువు, 08-02-2010 తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
గమనిక : పరీక్షలో గీత గీసిన వాక్యాలు రాస్తే జవాబు సరిపోతుంది.

ప్రవేశిక:

జానపద సాహిత్యమనగానే గుర్తుకు వచ్చేది గేయమే. పదాలని, పాటలని జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

కఠినపదాలకు అర్థాలు:

దర్పణం = అద్దం
ఇతివృత్తం = తీసుకున్న విషయము (content), కథా సారాంశం, కథా వస్తువు.
గాథ = కథ, చరిత్ర లేదా విషయం
చేవ = బలం
దళం = సమూహం
ప్రజాబాహుళ్యం = ఎక్కువ మంది ప్రజలలో
శాఖ = విభాగం, కొమ్మ
మార్ధవం = మృదుత్వం
విశ్వాసం = నమ్మకం, కృతజ్ఞతాభావం
ఉచ్ఛ్వాస, విశ్వాసాలు = గాలి పీల్చి వదలటం
నిష్కపటము = కపటం లేని (మోసం లేని)
జీవనోపాధి = జీవితానికి ఆధారం, బ్రతుకుతెరువు, మనుగడ, జరుగుబాటు, పొట్టకూడు.

ఆలోచించండి – చెప్పండి:

ప్రశ్న 1.
ఈ తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ? (టెక్స్టపేజి నెం. 59)
జవాబు.
మానవ సమాజం తాము పడే శ్రమను మరచిపోవడానికి సృష్టించుకొన్న కళే గేయం. ఈ గేయ సాహిత్యం భాష పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. రాసే పనిలేకుండా నోటి ద్వారానే ఒకతరం నుంచి మరొక తరానికి జానపదులు పాడుకుంటున్న ఈ గేయాల చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. భాష పుట్టిన చాలా ఏళ్ళకు కానీ దాన్ని రాయడానికి అవసరమైన లిపి పుట్టదు. అందువల్ల లిపి అవసరం లేకుండా ఆనోటా ఆనోటా ప్రచారం అవుతున్న జానపద గేయచరిత్ర ప్రాచీనమైనదని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ? (టెక్స్టపేజి నెం. 59)
జవాబు.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి మెచ్చుకోదగినది. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలు అన్నీ ఉండటం వారి భక్తికి నిదర్శనం. రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను జానపదులు గేయాలలో తమకు నచ్చిన విధంగా మలచుకున్నారు.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 3.
“ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు? (టెక్స్టపేజి నెం. 61)
జవాబు.
తెలుగు వారు నివసించే ప్రాంతం వీరులకు నిలయమనే విషయాన్ని చెబుతున్న సందర్భంలో దీనిని వాడారు. తెలుగు భూమి మీద పుట్టిన చిగురు కొమ్మ కూడా బలంగా ఉంటుంది అని దీని అర్థం. అంటే పని పిల్లలకు కూడా పౌరుషం ఉంటుంది అని భావం. దేశక్షేమం కోసం, తమ జాతి రక్షణ కోసం పసిపిల్లలు కూడా పోరాటానికి వెనకాడరని తాత్పర్యం.

ప్రశ్న 4.
వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు. దీనిని వివరించండి. (టెక్స్ట్ పేజి నెం. 61)
జవాబు.
వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని చాటుతాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. కనుకనే వీటిని వీరగీతాలు అని అంటారు. వీటినే చారిత్రక గేయాలు అని పిలుస్తారు. ఈ వీరగీతాలకు సంబంధించిన సన్నివేశాలను కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో గానం చేసి వినిపిస్తాడు. ఇలా వీరగేయాలు జానపదగేయాలు అవుతాయి. జానపదగేయాల్లో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు కూడా భాగాలే. వీరగేయాల్లో కేవలం వీరరసమే ప్రధానం.

ప్రశ్న 5.
భక్తిగీతాలు కొందరికి జీవనోపాది. ఎట్లాగో చెప్పండి. (టెక్స్టపేజి నెం. 61)
జవాబు.
తెలుగునాట భక్తిపాటలలో భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇటువంటి భక్తిగీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.

ప్రశ్న 6.
ఈ ‘నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
నిష్కపటం అంటే మోసం చేయాలనే ఆలోచనలు లేకపోవటం. నిర్మలం అంటే చెడు ఆలోచనలు లేకపోవడం. నిష్కపటము, నిర్మలము అయిన హృదయం కలిగి ఉండడం అంటే మోసం చేయాలనే ఆలోచనగానీ, చెడ్డ ఆలోచనలుగానీ లేని ‘స్వచ్ఛమైన మనసు’ కలిగి ఉండడం అని అర్థం.

ప్రశ్న 7.
జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
జానపదగేయాలు వేల సంవత్సరాల నుంచీ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తూ ఆనోటా ఆనోటా ప్రచారం అవుతూ ఉంటాయి. పని పాటలు చేసుకొని జీవించే చదువుకోని వారిని ఈ జానపదగేయాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మొదలైన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఈ జానపద గేయాలు ఎంతో ఉపకరిస్తాయి.

ప్రశ్న 8.
జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ? (టెక్స్టపేజి నెం. 62)
జవాబు.
జానపదగేయం సంపదపై విస్తృతంగా వివిధ కోణాలలో పరిశోధనలు జరగాలి. అమూల్యమైన గేయాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. జానపదగేయాల గొప్పదనాన్ని ప్రచారం చేయాలి. సేకరించిన వాటిని తగిన రీతిలో భద్రపరచాలి. వాటికోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గేయ సాహిత్యాన్ని, వాటికి సంబంధించిన విశేషాలను అందరికీ అందుబాటులోకి తేవాలి.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
“జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.
జవాబు.
పండితులైన కవులు దీక్ష పూని చేసే కావ్యం, శతకం, ప్రబంధం వంటి రచనలు శిష్టరచనలు. గ్రామీణ ప్రాంత ప్రజలు రోజంతా పనులు చేసుకుంటూ ఆ పని వల్ల కలిగే శ్రమను మరచిపోవడానికి అప్పటికప్పుడు తామే రచించుకొని లయబద్ధంగా పాడుకొనే పాటలే జానపదగేయాలు. శిష్ట రచనల్లాగే ఈ గేయాలన్నీ దాదాపుగా రామాయణం, భారతం, భాగవతం మొదలైన గ్రంథాలలోని ప్రసిద్ధ కథలకు సంబంధించినవే. శిష్ట సాహిత్యాన్ని చదువుకున్న వారు మాత్రమే చదువుకో గులుగుతారు.

కానీ జానపదుల గేయాలు లయాత్మకంగా ఉండి పండితులనూ, పామరులనూ అలరిస్తాయి. ఈ గేయాలలో తెలుగు వారి దైనందిన జీవితం కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయలతో ఈ గేయాలు నిండి ఉంటాయి. అందువల్ల తెలుగువారి నాలుకలపై నిత్యం నర్తించే జానపదగేయాలు తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.
జవాబు.
“చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు కట్టను చాతగాదు ఊరుకోండు!”
“రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు తొడగను చాతకాదు ఊరుకోండు!”
“పూవులొచ్చినాయి మామ కట్టమిందికి!
మల్లెపూవు లొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు ముడవను చాతకాదు ఊరుకోండు!”

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య. ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

అంశం-పేరా సంఖ్య-కీలక (ముఖ్యమైన) విషయాలు
పౌరాణిక గేయాలు-58వ పుటలో 4వ పేరా-జానపద గేయాలలో ప్రసిద్ధ పౌరాణిక గాథలు
చారిత్రక గేయాలు-59వ పుటలో 2వ పేరా-వీర గీతాల స్వరూప స్వభావాలు
శ్రామిక గేయాలు-61వ పుటలో 1వ పేరా-జానపదగేయాల పుట్టుక నేపథ్యం
పిల్లల పాటలు-61వ పుటలో 2వ పేరా-పిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్దవ గుణాలు

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి.

పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ. జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
జవాబు.
జానపదులు సహజంగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.

ఆ. పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
జవాబు.
పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది.

ఇ. పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
జవాబు.
పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది సమాజం నుంచే.

ఈ. జానపద సాహిత్యం దేనికి హేతువు ?
జవాబు.
జానపద సాహిత్యం జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.

ఉ. పొడుపు కథలు, ముక్తపదగ్రస్త్రాలు – వీటి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాల్లా పదజ్ఞానానికి సాటి అయింది మరొకటి లేదు.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జవాబు.
ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన జానపద గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది.

జానపదగేయాలకు సాహితీపరమైన విలువ మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువుల్లో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనుపిస్తాయి. అంతేకాక వాటిలో రమణీయమైన స్థానిక గాథలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జానపద గేయాలను భద్రపరచాలి.

ఆ. జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతీయ సంస్కృతికి తలమానికమైన రామాయణ మహాకావ్యం ముఖ్యమైనది. ప్రాచీనమైనది. తెలుగువారి జానపద గేయాలలో కథా వస్తువులలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలే ఎక్కువ. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను చదువుకుని అర్థం చేసుకోలేని గ్రామీణులు వాటిని జానపద గేయాలుగా మలుచుకొని నేర్చుకుంటారు. విద్యావంతుల రచనలలో లాగానే జానపదుల గేయాలలో కూడా రామాయణ సంబంధ గేయాలే ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాక ఈ రామాయణ సంబంధ కథలను జానపదులు తమ తమ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కూడా గమనించవచ్చు. అన్నదమ్ముల అనుబంధం, పిల్లలకు తల్లిదండ్రుల మాటపై గౌరవం, భార్యాభర్తల అనురాగం, రాజు ప్రజల అనుబంధం మొదలైన ఎన్నో కుటుంబ అనుబంధాలు, రాజ్యపాలన అనుభవాలు కలిగిన కథలు ఉండటం వల్ల జానపదగేయాల్లో రామాయణ సంబంధ గేయాలు ఎక్కువ ఉన్నాయి.

ఇ. “గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటె ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. భారతీయ కుటుంబ జీవనంలో ఇంటి యజమాని అయిన పురుషుడు కుటుంబ పోషణకోసం పొలంలోనో, పరిశ్రమలోనో, కొలువులోనో శ్రమచేసి సంపాదిస్తాడు. ఇల్లాలైన స్త్రీ భర్త శ్రమ చేసి తెచ్చిన సంపదను జాగ్రత్త చేస్తుంది. అర్థశాస్త్రవేత్తలా వాటిని అవసరాలకు వినియోగిస్తుంది. ఉత్తమ గృహిణిగా భర్త బాగోగులను చూసుకుంటుంది. బిడ్డలను కనిపెంచి పోషించి ప్రయోజకులను చేస్తుంది. పెద్దలను సాకుతుంది.

ఇంటిల్లిపాది ఆరోగ్యాలనూ కాపాడుతుంది. అయిన వాళ్ళను ఆదరిస్తుంది. అతిథులను గౌరవిస్తుంది. అవసరమైతే భర్తకు చేదోడుగా ఉంటూ తాను కూడా శ్రమపడి సంపాదిస్తుంది. తప్పని పరిస్థితులలో కుటుంబ భారాన్ని తానొక్కతే మోయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల కుటుంబంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించే స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.

ఈ. శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు. కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు, మాటలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి.

పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం, నాగలి దున్నడం మొదలైన పనులు ఈ పాటలు పాడుతూ చేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది.” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన తెలుగు జానపదగేయాలు అనే పాఠ్యభాగంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధమైన తెలుగువారి జానపదగేయాల గురించి అపూర్వంగా వివరించారు. జానపద గేయాలలోని రకాలు వివరిస్తూ స్త్రీల పాటల ప్రత్యేకతలను వర్ణించారు.

స్త్రీల పాటలు : గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు స్త్రీలే ఆలంబనం. వీటిని స్త్రీ పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

సాంఘిక, సాంస్కృతిక జీవనం : స్త్రీలకు జరిపే ఆయా వేడుకలలో పాడే స్త్రీల పాటలు అన్నింటిలో తెలుగు వారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. వీటిని పెళ్ళిపాటలు, ఇతర వేడుకల పాటలు అని రెండు అంశాలుగా తెలుసుకోవచ్చు.

పెళ్ళి పాటలు : స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంచనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, తలుపు దగ్గరపాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే.

ఇతర వేడుకల పాటలు : సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన ఆయా సందర్భాలలో పాడే పాటలు అతి రమణీయమైనవి. ముగింపు : ఈ విధంగా స్త్రీ జీవిత కాలంలో జరిపే వివిధ వేడుకలలో పాడే సందర్భోచితమైన ఆయా పాటలలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం అద్దంలా కనిపిస్తుంది.

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” దీన్ని వివరిస్తూ రాయండి. (లేదా)
జానపద గేయాల గొప్పతనం వివరించండి.
జవాబు.
పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయాలు’ అనే పాఠ్యభాగంలో జానపదగేయాలలో ప్రతిబింబించే మన సంస్కృతీ సంప్రదాయాలను అపూర్వంగా వివరించారు. మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు మొదలైన అంశాలతో తెలుగు ప్రజల జీవితమంతా జానపదగేయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ గేయాలను పౌరాణిక, చారిత్రక, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు, శ్రామిక గేయాలు, పిల్లలపాటలు, కరుణరసగేయాలు అనే విభాగాలలో రచయిత వివరించారు.

పౌరాణిక గేయాలు : ప్రసిద్ధ రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని గాథలన్నీ జానపద గేయాలలో ఉన్నాయి.
ఉదా : శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట మొదలైనవి.

చారిత్రక గేయాలు : వీరరసం ప్రధానంగా ఉండటం వల్ల వీటిని వీరగీతాలు అని కూడా అంటారు. ఇవి వీరత్వాన్ని, దేశభక్తిని బోధిస్తాయి. ఉదాహరణకు మియాసాబ్కథ, సోమనాద్రికథ, రామేశ్వరరావుకథ మొదలైనవి. పారమార్థిక గేయాలు : పారమార్థిక గేయాలకు భక్తిగీతాలని పేరు. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు మొదలైనవి.

స్త్రీల పాటలు : గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, వివిధ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు తెలిపే మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు మొదలైనవి.

శ్రామిక గేయాలు : పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం మొదలైన పనులకు, ఆయా వృత్తులకు సంబంధించి శ్రామికులు గేయాలు పాడుకుంటారు.

పిల్లల పాటలు : వీటిలో పిల్లల కోసం పెద్దలు రచించినవి కొన్ని కాగా పిల్లలు తమకు తామే సమకూర్చుకున్నవి మరి కొన్ని. ఉదాహరణకు చెమ్మచెక్క, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలలో పాడే పాటలు.

కరుణరస గేయాలు : ఎరుకల నాంచారమ్మకథ, రాములమ్మపాట, సరోజనమ్మపాట మొదలైనవి.

ముగింపు : ఈ విధంగా జానపదగేయాలలో గ్రామీణుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయలు, వారి మనోభావాలు మృదుహృదయం ప్రతిబింబిస్తుంది.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
పిల్లల పాటల గురించి రాయండి. (లేదా) పిల్లల పాటలు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
జానపదగేయాలలో పిల్లల పాటల దొక ప్రత్యేకశాఖ. పసిపిల్లల లేత హృదయం లాగానే వారి పాటలు కూడా నిష్కపటంగానూ, నిర్మలంగానూ, స్వచ్ఛంగానూ, మార్దవంగానూ ఉంటాయి. ఈ గేయాలు అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి ఆ) పిల్లలు రాసినవి అని రెండు విధాలు.

అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి : వీటిలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. పిల్లలను లాలించేందుకు జోలపాడి నిద్రపుచ్చేందుకు ఇవి రచించబడ్డాయి. ఈ పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కాకపోయినా వాటిలోని సంగీతం, లయ పిల్లలను లాలించి నిద్రపుచ్చుతాయి.

ఆ) పిల్లలు రాసినవి : పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరొకొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినవి ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలను అర్థంతో పనిలేకుండా గ్రహిస్తారు. వాటిని అర్థంలేని పాటలు అని కూడా అంటారు. బాలబాలికలు ఆడే చెమ్మచెక్క, బిత్తి, కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజరేకులు, గొబ్బిళ్ళు, చిట్టిచిట్టి చిర్ర మొదలైన ఆటలలో పాడే పాటలు ఇందుకు ఉదాహరణలు.

ప్రశ్న 2.
జానపదగేయాలలో పారమార్థిక గేయాల ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భక్తి, కర్మ, జ్ఞానం – అనే మూడు మోక్ష సాధనాలలో భక్తిమార్గం సులభమైనదని భారతీయులు నమ్ముతారు. ఈ భక్తిని ప్రబోధించే గేయాలే భక్తిగేయాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు వేల సంఖ్యలో ప్రచారం పొందాయి. భక్తిగీతాలు ప్రాచీనకాలం నుంచే ఉన్నట్లు తెలుస్తున్నది. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.

అంటే భక్తిగీతాలు వీరికి జీవనోపాధిని కల్పిస్తున్నాయన్నమాట. ఈ గీతాలలో భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మొదలైనవి తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దారువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి.

ప్రశ్న 3.
స్త్రీల పాటలలో కనిపించే తెలుగువారి వేడుకలను తెలపండి. (లేదా) స్త్రీల పాటల్లో సంపూర్ణ జీవనం కనిపిస్తుంది. ఎలాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల సంసార సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. కనుక వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకూ జరిపే ప్రతి వేడుకకు సంబంధించిన పాటలు గమనించవచ్చు. పిల్లల్ని ఉయ్యాలలో ఉంచి పాడే లాలిపాటలు, జోలపాటలు ఎంతో ప్రసిద్ధమైనవి.

కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొదలైన పాటల ద్వారా కట్నాలు, నలుగులు, అలుకలు, బంతులు, అప్పగింతలు మొదలైన తెలుగువారి వేడుకలు తెలుస్తాయి. అంతేకాక సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి కూడా తరతరాల తెలుగు వారి వేడుకలను తెలిపేవే.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 4.
పనికి, పాటకి దగ్గర సంబంధం ఉంది అని శ్రామిక గేయాల ఆధారంగా తెల్పండి.
జవాబు.
పాటలు పాడుతూ పనిచేయటంవల్ల తాము చేసే కాయకష్టాన్ని మరిచి, హృదయంలోను మనసులోను ఉండే బాధ తొలగిపోవటమేకాక, శారీరక శ్రమ కూడా తెలియదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటూ ఉంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రామికగేయాలకు, గీతాలకు తాళలయలు సమకూరి ఉంటాయి.

ఉదా :- తిరుగలి పాటలు, దంపుడు పాటలు, పల్లకీ పాటలు, దుక్కి పాటలు, పడవలాగేటప్పుడు పాడే పాటలు (హైలెస్సో పాటలు) మొ||వి. దీనినిబట్టి చేసే పనికి, పాడే పాటకి దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
జానపదాలను ఏయే సందర్భాలలో పాడటాన్ని నీవు గమనిస్తున్నావు ?
జవాబు.
1) పౌరాణిక గేయాలను పురాణేతిహాసాలపైన మక్కువగల గ్రామీణులు రామాయణం, భారతం, భాగవతాది పురాణాలలో కథలకు సంబంధించిన పాటలు మనోల్లాసానికి పాడుతారు.
ఉదా :- ఊర్మిళాదేవి నిద్ర, శ్రీరామ పట్టాభిషేకం.

2) చారిత్రక గేయాలను దేశభక్తిని కల్గించి వినోదాన్ని, ఉల్లాసాన్ని కల్గించి వీరరసంలో పాడుతారు.
ఉదా :- కాటమరాజు కథ, బొబ్బిలికథ, అల్లూరి సీతారామరాజు కథ.

3) పారమార్థిక గేయాలను భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో భక్తి మార్గం ద్వారా మోక్షప్రాప్తి కోసం ఈ గేయాలు పాడుతారు.
ఉదా :- భద్రాచల రామదాసు కీర్తనలు, లాలిపాటలు, తత్త్వాలు, బతుకమ్మ పాటలు మొ||వి.

4) స్త్రీల పాటలను ఇంట్లో జరిగే విభిన్న వేడుకలలో సందర్భాన్ననుసరించి పాడుతారు.
ఉదా :- వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొ||వి.

5) శ్రామిక గేయాలను కాయకష్టం చేసుకొనేవారు తమ కష్టం మరిచి పనిచేసుకోవడానికి పాడేవారు.
ఉదా :- తిరుగలి పాటలు, ఊడ్పు పాటలు, దంపుడు పాటలు.

6) పిల్లల పాటలను నిష్కపటంగా, నిర్మలముగా, మార్దవంగా ఉండే ఈ పాటలు పిల్లలకు పాడి, ఆటలు ఆడించేవారు.
ఉదా :- గుడిగుడిగుంచెం, గొబ్బిళ్ళు, కోతికొమ్మచ్చి మొ॥ వి.

7) కరుణరస గేయాలను విషాద సమయాలలో పాడి వినిపించేవారు. సందర్భాన్ని బట్టి పాడేవారు.
ఉదా :- ఎరుకల నాంచారి కథ, రాములమ్మ పాట.
ఈ విధంగా విభిన్న సందర్భాలలో సందర్భానికి తగిన జానపదగేయాలను పాడి వినోదం పొంది గ్రామీణులు ఆనందించేవారు.

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.
జవాబు.

ఆహ్వానం

శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పక్షంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన కళాప్రదర్శన వారోత్సవాలకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం. ది. 10-10-2019 నుంచి 16-10-2019 వరకూ వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో దిగువ తెలిపిన కళారూపాలు వివిధ వేదికలపై ప్రదర్శించబడతాయి.

తేదీ సమయం ప్రదర్శించబడే కళారూపం

వేదిక

1. 10-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు గుసాడినృత్యం తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్
2. 11-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లు కొండరెడ్ల మామిడి నృత్యం తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్
3. 12-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు బతుకమ్మ ఆటలు పాటలు రవీంద్ర భారతి
4. 13-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు తోలుబొమ్మలాట త్యాగరాయ గాన సభ
5. 14-10-2019 ఉదయం గం. 10.00 ని॥లు వీధి భాగవతాలు ఎ.వి. కళాశాల ప్రాంగణం
6. 15-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు యక్షగానాలు నెక్లెస్ రోడ్డు
7. 16-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లు కాటి పాపలు హరికళాభవనం, సికిందరాబాదు

కనుక ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం.

స్థలం : హైదరాబాదు,
తేదీ : 5-10-2019.

ఇట్లు
ఆహ్వాన కమిటి,
భాగ్యనగర్ దసరా ఉత్సవ సంఘం.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

V. పదజాల వినియోగం:

కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.

ఉదా : కవితా సౌరంభం వెదజల్లుతుంది.
సౌరభం = సువాసన, పరిమళం

అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
జవాబు.
ఆలంబనం = ఆధారం, ఆశ్రమం

ఆ) భక్తి మార్గం మోక్ష సాధనం.
జవాబు.
మోక్షం = కైవల్యం, ముక్తి

ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
జవాబు.
కష్టం = ఇక్కట్టు, శ్రమ

2. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

ఆ) పురోగతి
జవాబు.
ప్రజలంతా శక్తి వంచన లేకుండా కృషిచేసినప్పుడే జాతి పురోగతి సాధ్యం అవుతుంది.

ఆ) రూపురేఖలు
జవాబు.
మనిషికి రూపురేఖలు కంటే మంచి గుణమే ముఖ్యం.

ఇ) కూనిరాగాలు
జవాబు.
కూనిరాగాలు తీస్తూ గొప్ప గాయకులమని ఊహించుకోకూడదు.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జవాబు.
మావయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జవాబు.
కొమ్మ విరిగిపోయి కింద పడింది.

ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జవాబు.
శత్రువులు భయపడి పారిపోయారు.

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు.
శివ అన్నము, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
జవాబు.
ఆమె పూలు, కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
జవాబు.
నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి కానీ వర్షం పడలేదు.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

తత్పురుష సమాసం:

3. కింది వాక్యం చదువండి.

‘రాజభటుడు వచ్చాడు.’

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.
తిండి గింజలు తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి
పై రెండు వాక్యాలను కూడ గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

పూర్వ పదాలు ఉత్తర పదాలు
రాజు భటుడు
తిండి గింజలు
పాప భీతి

సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

కింది పట్టికను చూడండి. చదువండి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ
ప్రథమా తత్పురుషం డు, ము, వు, లు మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య భాగం (సమాసంలోని మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉన్నది కనుక ప్రథమా తత్పురుషం. ‘యొక్క’ వచ్చింది అని షష్ఠీతత్పురుషంగా పొరపాటు పడకూడదు)
ద్వితీయా తత్పురుషం ని, ను, ల, కూర్చి గురించి జలధరం – జలమును ధరించినది.
తృతీయా తత్పురుషం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధి చేత హీనుడు.
చతుర్థీ తత్పురుషం కొరకు, కై దూడగడ్డి – దూడకొరకు గడ్డి
పంచమీ తత్పురుషం వలన (వల్ల), కంటె, పట్టి దొంగభయం-  దొంగవలన భయం
షష్ఠీ తత్పురుషం కి, కు, యొక్క, లో, లోపల  రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుషం  అందు, న  దేశభక్తి – దేశము నందు భక్తి

కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (న అంటే వ్యతిరేకార్థం)

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

4. కింది పదాలు చదువండి. వాటి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.

సమాసపదం-విగ్రహవాక్యం-సమాసం పేరు
అ) గదాధరుడు = గదను ధరించినవాడు = ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) అగ్నిభయం = అగ్ని వలన భయం = పంచమీ తత్పురుష సమాసం
ఇ) గుణహీనుడు = గుణముల చేత హీనుడు = తృతీయా తత్పురుష సమాసం
ఈ) ధనాశ = ధనము నందలి ఆశ = సప్తమీ తత్పురుష సమాసం
ఉ) దైవభక్తి = దైవము నందలి భక్తి = సప్తమీ తత్పురుష సమాసం
ఊ) అజ్ఞానం = జ్ఞానం కానిది = నఞ తత్పురుష సమాసం

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : పెండ్లిళ్ళు మరియు శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఇంటిలో పెద్దవాళ్ళ ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :

1. పెండ్లిళ్ళలో పాడే పాటలు :

1) నూతన వధువు గృహ ప్రవేశము :

పల్లవి : మహాలక్ష్మి రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మ
మా ఇంట కొలువుండ రావమ్మ
మంగళ హారతులు గొనుమమ్మ

చరణాలు :
1. అష్టలక్ష్మీ నీకు స్వాగతము పలికేము
ఇష్టముగ మా ఇంటి సౌభాగ్యములు కలుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………….. || మంగళ ||

2. పదము పెట్టిన చోట సిరిసంపదలు గలుగ
కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా ……… || మంగళ ||

3. పతి భక్తితో నీవు పతివ్రతగా వర్ధిల్లు
పదికాలములు పిల్లపాపలతో రాజిల్లు
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………… ॥మంగళ ॥

4. సకల సుఖశాంతులతో సంసారమును నడుప
తులసిదాసుడు నీకు శుభ మంగళము పలుక
గృహలక్ష్మివై నీవు రావమ్మా ………….. ॥మంగళ ॥

2) అప్పగింతల పాట :

పల్లవి : కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మ
ముక్కోటి వేల్పుల దీవెలనతో వెలయు మాయమ్మ ॥కోటి॥

చరణాలు :
1. కీర్తికాంతుల భాగ్యరాశుల శోభ నీదమ్మా
పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తేవమ్మా

2. అత్తమామలె తల్లిదండ్రులు ఈ క్షణము నుండి
ఉత్తమ ఇల్లాలిగా నువు మసలుకోవమ్మా

3. మగని మనసెరిగి నీవు నడుచుకోవమ్మా
ప్రేమ మీరగ భర్త సేవలు చేసుకోవమ్మా

4. మరిది బావల ఆడపడచుల కలిసిమెసలమ్మా
బంధుమిత్రులు సేవకులను ఆదరించమ్మా.

5. అల్లుడా మా ముద్దు పట్టిని ఒప్పగించేము
మనసుదీరగ మురిపెమారగ ఏలుకోవయ్యా

6. కల్ల కపటము లేని పిల్లను మీకు ఇచ్చేము
కంటి పాపగ వెంట నుండి చూసుకో వదినా ॥కోటి॥

3) బెస్తవాళ్ళ పాట :

ఏలియాల – ఏలియాల – ఏలియాల
ఐలేసా జోరిసెయ్యి – ఐలేసా బారుసెయ్యి
గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ
కాళిందికి తెల్ల కల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి ……….. జోర్సెయ్యి బార్సెయ్యి || ఏలియాల ॥
గోదారి తల్లికి ……….. గొజ్జంగి పూదండ
సరస్వతికి ……….. సన్నజాజి దండ
కృష్ణవేణమ్మకు ……….. గౌదంగి పూదండ
కావేరికి చంద్రకాంత దండా
ఐలేసా జోరుసెయ్యి – ఐలేసా బారుసెయ్యి || ఏలియాల ॥

ఇ) ముగింపు : ఈ విధంగా పెండ్లిళ్ళ పాటలలో వరుడికి నలుగు పెట్టేప్పుడు పాట, వధువుకు నలుగు పెట్టేటపుడు పాట, అప్పగింతల పాట, నిశ్చయ తాంబూలం పాట, నూతన వధువు గృహప్రవేశం పాట.. ఇలా ఎన్నో పాటలు ఆయా సందర్భాలను బట్టి ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని పాడేవాళ్ళు బహు అరుదు.

అదే విధంగా కర్షకులు పొలం పని చేసేప్పుడు, శ్రామికులు ఆయా పనులు చేస్తున్నప్పుడు, తమ శ్రమను మరచి పోవడానికి అనేక జానపద గీతాలను పాడుతుంటారు. జానపదం అంటే జనం నోటితో పాడుకుంటూ, ఒక తరం నుండి మరొక తరానికి అందించే పాటలు. వీటికి లిఖిత రూపం ఉండదు. ఇలా సంస్కృతి వారసత్వంగా వస్తున్న ఈ పాటలను పరిరక్షించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

హృదయం = ఎద, మది, మనస్సు, గుండె
గేయం = గీతం, పాట, కీర్తన, సంకీర్తన
ప్రజలు = జనం, పౌరులు, పాలితులు, మనుషులు
భాష = మాట, వాక్కు
సాహిత్యం = వాఙ్మయం, సారస్వతం
తొలి = ముందు, తొల్లి, పూర్వం
పెక్కు = చాలా, అనేక
పండితులు = విద్వాంసులు, విద్యావంతులు, చదువుకున్నవారు, శిష్టులు

నానార్థాలు:

అర్థం = శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు
కాలం = నల్లని, సమయం, మరణం, ఇనుము
పదం = మాట, పాట
కవి = కవిత్వం చెప్పేవాడు, హంస, శుక్రాచార్యుడు, పండితుడు
వృత్తి = పని, జీవనోపాయము, స్థితి, పద్ధతి
అమూల్యం = వెలలేనిది, మిక్కిలి వెలగలది
వృత్తాంతం = సంగతి, కథ, విధం, అవసరం, ఉదాహరణం

వ్యుత్పత్త్యర్థాలు:

అదృష్టం = దైవకృతమగుట వలన కనబడనిది (భాగ్యము)
సాహిత్యం = హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది (సారస్వతం)
కృష్ణుడు = కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు (విష్ణువు)
గ్రామము = ప్రాణుల చేత అనుభవించబడునది (ఊరు)
పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు)

ప్రకృతి – వికృతులు:

ప్రకృతి – వికృతి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి, సత్తు
కవిత – కైత, కయిత,
కథ – కత, కద
స్నానం – తానం
ముఖం – మొకం, మొగం

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

సంధులు:

ప్రాంతమంతటా = ప్రాంతము + అంతటా = ఉత్వసంధి
దేశమంతటా = దేశము + అంతటా = ఉత్వ సంధి
ఆవిష్కృతమవుతుంది = ఆవిష్కృతము + అవుతుంది = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

ఎంతైనా = ఎంత + ఐనా = అత్వసంధి
ప్రాచీనమైనట్టిది = ప్రాచీనమైన + అట్టిది = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

ప్రేమాభిమానాలు = ప్రేమ + అభిమానాలు = సవర్ణదీర్ఘసంధి
నాదామృతం = నాద + అమృతం = సవర్ణదీర్ఘసంధి
రామాయణాదులు = రామాయణ + ఆదులు = సవర్ణదీర్ఘసంధి
భాగవతాది = భాగవత + ఆది = సవర్ణదీర్ఘసంధి
అభీష్టానుగుణం = అభీష్ట + అనుగుణం = సవర్ణదీర్ఘసంధి
వైష్ణవాది = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

పురాణేతిహాసాలు = పురాణ + ఇతిహాసాలు = గుణసంధి
విమోచనోద్యమం = విమోచన + ఉద్యమం = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

అత్యుత్తమ = అతి + ఉత్తమ = యణాదేశసంధి
అత్యంత = అతి + అంత = యణాదేశసంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశమవుతాయి.

సమాసములు:

ఇతర భాషలు = ఇతరమైన భాషలు – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
మృదుహృదయం = మృదువైన హృదయం – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
లేత హృదయం = లేతదైన హృదయం – విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం
భాషా సంస్కృతులు = భాషయునూ సంస్కృతియునూ – ద్వంద్వ సమాసం
ఉచ్ఛ్వాస నిశ్వాసలు = ఉచ్ఛ్వాసయునూ నిశ్వాసయునూ – ద్వంద్వ సమాసం
తాళలయలు = తాళమునూ లయయునూ – ద్వంద్వ సమాసం
దైవ సమానుడు = దైవముతో సమానుడు – తృతీయ తత్పురుష సమాసం
వీరపూజ = వీరుల యొక్క పూజ – షష్ఠీ తత్పురుష సమాసం
జానపద గేయాలు = జానపదుల యొక్క గేయాలు – షష్ఠీ తత్పురుష సమాసం
శిష్ట సాహిత్య = శిష్టుల యొక్క సాహిత్యం – షష్ఠీ తత్పురుష సమాసం
సీతా కళ్యాణం = సీత యొక్క కళ్యాణము – షష్ఠీ తత్పురుష సమాసం
కాటమరాజు కథ = కాటమరాజు యొక్క కథ – షష్ఠీ తత్పురుష సమాసం
మోక్ష సాధనాలు = మోక్షము యొక్క సాధనాలు – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్ని ప్రవేశం = అగ్ని యందు ప్రవేశం – సప్తమీ తత్పురుష సమాసం
వేదాంత సత్యాలు = వేదాంతము నందలి సత్యాలు – సప్తమీ తత్పురుష సమాసం

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
జీవనోపాధి : _____________
జవాబు.
ప్రతి ఒక్కరి జీవనోపాధి నిజాయితీగా సాగాలి.

ప్రశ్న 2.
మార్దవం : _____________
జవాబు.
పసిపిల్లల మనసు ఎంతో మార్దవంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఇతివృత్తం : _____________
జవాబు.
ఇతివృత్తం బాగుంటే దానిని అందరూ ఆదరిస్తారు.

కింది వాటిలో గీతగీసిన పదాలకు అర్థం గుర్తించండి.

ప్రశ్న 4.
చిన్న చిన్న నీటి కుంటలు బహుళంగా ఏర్పాటు చేసుకోవడం మేలు. ( )
A) మిక్కిలి
B) తక్కువ
C) లోతు
D) విశాలం
జవాబు.
A) మిక్కిలి

ప్రశ్న 5.
రమణీయములైన అర్థాన్ని ఇచ్చే శబ్దాల కూర్పే కవిత్వం. ( )
A) ఎక్కువ
B) తక్కువ
C) సొగసు
D) సొంత
జవాబు.
C) సొగసు

ప్రశ్న 6.
నేడు దేశంలో మేధావుల కొరత ఉన్నదనేది వాస్తవం. ( )
A) చెప్పుడు మాట
B) సత్యం
C) అబద్ధం
D) విన్నమాట
జవాబు.
B) సత్యం

ప్రశ్న 7.
విద్యావంతులు పూనుకుంటే దేశాభివృద్ధి పెద్ద కష్టంకాదు. ( )
A) అధికారులు
B) నాయకులు
C) పేదవారు
D) పండితులు
జవాబు.
D) పండితులు

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

పర్యాయపదాలు:

కింది వాటిలో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు గుర్తించండి.

ప్రశ్న 8.
పసివారి హృదయం పువ్వుల్లా మృదువైనది. ( )
A) శరీరం, తనువు
B) ఎద, తల
C) మనసు, మది
D) ఎద, తలపు
జవాబు.
C) మనసు, మది

ప్రశ్న 9.
కాళిదాసు భారతీయ సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహాకవి. ( )
A) సారస్వతం, వాఙ్మయం
B) సంస్కృతం, వంశం
C) జాతి, వెల
D) నాగరికత, సంస్కృతి
జవాబు.
A) సారస్వతం, వాఙ్మయం

ప్రశ్న 10.
భారతీయ తత్త్వశాస్త్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించిన రాధాకృష్ణ పండితుడు మనదేశానికి తొలి ఉపరాష్ట్రపతి. ( )
A) అధికారి
B) విద్వాంసుడు, విద్యావంతుడు
C) మంత్రి
D) రాయబారి
జవాబు.
B) విద్వాంసుడు, విద్యావంతుడు

ప్రశ్న 11.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు. ‘ప్రజలు’ పర్యాయపదాలు. ( )
A) జనులు, పౌరులు
B) సురలు, దానవులు
C) లోకులు, దాతలు
D) నాయకులు, అసురులు
జవాబు.
A) జనులు, పౌరులు

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

నానార్థాలు:

కింది వాటిలో గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 12.
ఉదయ కాలంలో ముసిరిన కాల మేఘాలు కురవకుండా పోవు. ( )
A) సమయం, సంధ్య
B) సంధ్య, తెల్లని
C) సమయం, నల్లని
D) సూర్యుడు, తెల్లని
జవాబు.
C) సమయం, నల్లని

ప్రశ్న 13.
నాగేశభట్టు అనే గొప్ప పండితుడు సంస్కృత వ్యాకరణానికి వృత్తి రచించడమే వృత్తిగా జీవించాడు. ( )
A) జీవనం, పౌరుషం
B) వివరణ గ్రంథం, జీవనోపాయం
C) అనువాదం, వివరణం
D) జీతం, భత్యం
జవాబు.
B) వివరణ గ్రంథం, జీవనోపాయం

ప్రశ్న 14.
కవి కుమార్తె అయిన దేవయాని కథను నన్నయ కవి చక్కగా చిత్రించాడు. ( )
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు
B) పండితుడు, హంస
C) హంస, శుక్రుడు
D) హంస, రాజు
జవాబు.
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు

ప్రకృతులు – వికృతులు:

కింది గీత గీసిన పదాలకు ప్రకృతులు – వికృతులు గుర్తించండి.

ప్రశ్న 15.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – వికృతి పదం ( )
A) మంట
B) ఆగ్నేయం
C) విఘ్నం
D) అగ్గి
జవాబు.
D) అగ్గి

ప్రశ్న 16.
లోకంలో శక్తితో సాధ్యం కాని పనులను యుక్తితో సాధించాలి. – వికృతి పదం ( )
A) సత్తు
B) ఆసక్తి
C) భక్తి
D) సకితి
జవాబు.
A) సత్తు

ప్రశ్న 17.
కథా నిలయం స్థాపించిన కాళీపట్నం రామారావు గొప్ప కథకుడు. – ‘కథ’ వికృతి పదం ( )
A) కద
B) నవల
C) కత
D) కదము
జవాబు.
C) కత

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

భాషాంశాలు :

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 18.
దేశమంతటా ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) యడాగమసంధి
జవాబు.
C) ఉత్వసంధి

ప్రశ్న 19.
ఎంతైనా – విడదీసిన రూపం ( )
A) ఎంతై + నా
B) ఎంత + అయినా
C) ఎంతో + ఐనా
D) ఎంత + ఐనా
జవాబు.
D) ఎంత + ఐనా

ప్రశ్న 20.
భాగవతాది – ఏ సంధి ? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) అత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు.
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 21.
అకారానికి ఇ ఉ ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్ లు ఏకాదేశమవుతాయి – ఇది ఏ సంధి ? ( )
A) అత్వసంధి
B) గుణసంధి
C) ఉత్వసంధి
D) వృద్ధిసంధి
జవాబు.
B) గుణసంధి

ప్రశ్న 22.
కింది వాటిలో యణాదేశసంధికి ఉదాహరణ. ( )
A) వైష్ణవాది
B) పురాణేతిహాసాలు
C) అత్యంత
D) దేశమంతటా
జవాబు.
C) అత్యంత

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

సమాసాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 23.
కింది వాటిలో విశేషణ పూర్వపదకర్మధారయ సమాసానికి ఉదాహరణ ? ( )
A) సీతాకళ్యాణం
B) ఉచ్ఛ్వాసనిశ్వాసలు
C) మృదుహృదయం
D) అగ్నిప్రవేశం
జవాబు.
C) మృదుహృదయం

ప్రశ్న 24.
వేదాంత సత్యాలు – ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష
B) సప్తమీ తత్పురుష
C) ద్వంద్వ
D) బహువ్రీహి
జవాబు.
B) సప్తమీ తత్పురుష

ప్రశ్న 25.
కింది వాటిలో షష్ఠీ తత్పురుష సమాసం కానిది ఏమిటి ? ( )
A) తాళలయలు
B) శిష్టసాహిత్యం
C) కాటమరాజు కథ
D) మోక్ష సాధనాలు
జవాబు.
A) తాళలయలు

ప్రశ్న 26.
కింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ( )
A) వీరపూజ
B) జానపద గేయాలు
C) లేత హృదయం
D) ఉచ్ఛ్వాసనిశ్వాసలు
జవాబు.
D) ఉచ్ఛ్వాసనిశ్వాసలు

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

వాక్యాలు – రకాలు:

క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 27.
ఆహా! ఆ పాటలు ఎంత బాగున్నాయో. ( )
A) ఆశ్చర్యార్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం

ప్రశ్న 28.
గీతాలు గేయాలు ఒకటేనా ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) హేత్వర్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం

ప్రశ్న 29.
అందరూ జానపద గేయాలు పాడగలరు. ( )
A) ప్రశ్నార్థకం
B) సామర్ధ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
B) సామర్ధ్యార్థకం

ప్రశ్న 30.
మీరు రావచ్చు. ( )
A) ప్రశ్నార్థకం
B) సామర్థ్యార్థకం
C) నిషేధార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
D) అనుమత్యర్థకం

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

క్రియను గుర్తించుట:

క్రింది గీతగీసిన పదాలు ఏ క్రియా పదమో గుర్తించండి.

ప్రశ్న 31.
పాటలు విని ఆనందించండి. ( )
A) క్వార్థం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్వార్థం

ప్రశ్న 32.
శ్రామికులు పనిచేస్తూ పాటలు పాడుతారు. ( )
A) కార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) శత్రర్థకం

ప్రశ్న 33.
పాటలు వింటే అందులో మాధుర్యం తెలుస్తుంది. ( )
A) క్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 34.
జానపద గేయాలు వినోదాన్నిస్తాయి, చైతన్యాన్నిస్తాయి.- సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) జానపద గేయాలు వినోదానిస్తూ చైతన్యాన్నిస్తాయి.
B) జానపద గేయాలు వినోదాన్నీ మరియు చైతన్యాన్నిస్తాయి.
C) జానపద గేయాలు వినోదంతో పాటు చైతన్యాన్నిస్తాయి.
D) వినోదం, చైతన్యం ఇస్తాయి జానపద గేయాలు.
జవాబు.
B) జానపద గేయాలు వినోదాన్నీ మరియు చైతన్యాన్నిస్తాయి.

ప్రశ్న 35.
పిల్లలను లాలిపాటలు లాలిస్తాయి. బుజ్జగిస్తాయి. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) పిల్లలను లాలిపాటలు లాలించి బుజ్జగిస్తాయి.
B) పిల్లలను లాలిపాటలు లాలించాలని బుజ్జగిస్తాయి.
C) లాలించి బుజ్జగిస్తాయి పిల్లల్ని లాలిపాటలు.
D) పిల్లలను లాలిపాటలు లాలిస్తూ బుజ్జగిస్తాయి.
జవాబు.
A) పిల్లలను లాలిపాటలు లాలించి బుజ్జగిస్తాయి.

TS 8th Class Telugu Bits 6th Lesson త్యాగనిరతి తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 36.
భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. జానపద గాయకులకు పుట్టినిల్లు. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) భారతదేశం తత్త్వవేత్తలకేగాక జానపద గాయకులకు పుట్టినిల్లు.
B) తత్త్వవేత్తలకు, జానపద గాయకులకు పుట్టినిల్లు భారతదేశం.
C) తత్త్వవేత్తలకు, జానపద గాయకులకు భారతదేశం పుట్టినిల్లు.
D) భారతదేశం తత్త్వవేత్తలకు మరియు జానపద గాయకులకు పుట్టినిల్లు.
జవాబు.
D) భారతదేశం తత్త్వవేత్తలకు మరియు జానపద గాయకులకు పుట్టినిల్లు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

These TS 8th Class Telugu Bits with Answers 5th Lesson శతక సుధ will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

చదువండి – ఆలోచించి చెప్పండి.

యాదగిరీశుని వేడుకొంటూ తిరువాయిపాటి వేంకటకవి రచించిన కింది పద్యాన్ని చదవండి.

వాదము చేయఁగా నరులు వాక్య పరుండని యెగ్గు చేతురున్
మోదముతో భుజించునెడ ముందుగఁ బిల్తురు తిండిపోతుగా,
ఏదియుఁ బల్కకున్న యెడ నీతఁడు మూగని యెంచుచుంద్రుగా,
నీ దయగల్గఁగా సుఖము నేర్పును యాదగిరీంద్ర మ్రొక్కెదన్. – శ్రీ యాదగిరీంద్ర శతకం

భావం :
ఒక వ్యక్తి తగాదాపడితే, జనం ఈ వ్యక్తి తగవుల మారి అంటారు. ప్రియంగా భోజనం చేస్తూ ఉంటే తిండిపోతు అంటారు. ఏమీ మాట్లాడకుండా ఉంటే మూగవాడు అంటారు. ఇలా ప్రతిదానికి జనం విమర్శిస్తూనే ఉంటారు. ఒక్క యాదగిరీశుని మ్రొక్కితేనే సుఖం దొరుకుతుంది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ పద్యం ఏ శతకం లోనిది ? కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యం శ్రీయాదగిరీంద్ర శతకం లోనిది. కవి తిరువాయిపాటి వేంకటకవి.

ప్రశ్న 2.
ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు ?
జవాబు.
ప్రజలు ప్రతి విషయానికీ ఎదుటి వారిని విమర్శిస్తూనే ఉంటారు. జనుల మెప్పుపొందడం తేలికకాదు అని ఈ పద్యాన్ని చదివి గ్రహించాను.

ప్రశ్న 3.
కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు ?
జవాబు.
ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సమాజంలోని మంచి చెడ్డలు తెలియజెప్పడానికి, ప్రజలకు మంచి నడవడి అలవర్చడానికి కవులు శతక పద్యాలు రాస్తారు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని మకుటం ఏమిటి ?
జవాబు.
“యాదగిరీంద్ర” అనేది ఈ పద్యంలోని మకుటం.

ప్రశ్న 5.
మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలను చెప్పండి.
జవాబు.
యాదగిరీంద్ర !
విశ్వదాభిరామ వినురవేమ |
సుమతీ !
దాశరథీ కరుణాపయోనిధీ,
శ్రీ కాళహస్తీశ్వరా !
కుమారా !
కుమారీ !
నరసింహ ! దురిత దూర మొదలైనవి.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రశ్న.
శతకసుధ పాఠ్యభాగం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
శతక ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గివుంటుంది.

ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.

కవి పరిచయం:

ప్రశ్న 1.
నారాయణ శతక కర్తను గురించి తెల్పండి.
జవాబు.
నారాయణ శతకం : ‘నారాయణా!’ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.

ప్రశ్న 2.
చిత్త శతకం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
చిత్త శతకం : శ్రీపతి భాస్కర కవి ‘చిత్తమా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ప్రశ్న 3.
భాస్కర శతకం రాసిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
భాస్కర శతకం : మారద వెంకయ్య ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

ప్రశ్న 4.
దాశరథీ శతక కర్తను పరిచయం చేయండి.
జవాబు.
దాశరథీ శతకం : కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు.

ప్రశ్న 5.
నరసింహ శతకం రచించిన కవిని గురించి వివరించండి.
జవాబు.
నరసింహ శతకం : ఈ శతక కర్త కాకుత్థ్సం శేషప్పకవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీరామాయణం మొదలగు
రచనలు చేశాడు.

ప్రశ్న 6.
పండిత రామ సింహ కవిని పరిచయం చేయండి.
జవాబు.
విశ్వకర్మ శతకం :
‘విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!’ అనే మకుటంతో పండిత రామసింహకవి ‘విశ్వకర్మ’ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలోని పూర్వపు రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.

ప్రశ్న 7.
శ్రీ వేంకటేశ్వర శతక కర్తను గురించి రాయండి.
జవాబు.
శ్రీ వేంకటేశ్వర శతకం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్ కవి’గా ప్రసిద్ధి పొందాడు.

ప్రశ్న 8.
శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన కవిని గురించి తెల్పండి.
జవాబు.
శ్రీ బాకవరాంజనేయ శతకం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా! అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ప్రవేశిక:

ప్రశ్న.
శతక ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు.
విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాలనుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.

కఠినపదాలకు అర్థాలు:

సూనృతం = మంచిమాట
శీలము = స్వభావం
నతి = వినయం
ధృతి = ధైర్యం
తుచ్ఛము = నీచము
మెయి = శరీరం
తిరము = శాశ్వతం
గతి = దిక్కు, ఆధారం
లవణము = ఉప్పు
విత్తం = ధనం
కుడువన్ = తినుటకు, అనుభవించుటకు
మరుగు = రహస్యము
తెరువరి = బాటసారి
రీతి = విధం
మక్కువ = ఇష్టం, కోరిక
దురితం = పాపం
విర్రవీగు = అహంకారంతో ఉండు
గుడము = బెల్లం
మౌక్తికం = ముత్యం
కృషి = వ్యవసాయం, ప్రయత్నం
వెలివేయు = సమాజానికి దూరంగా ఉండు
లేశ్యము = కొంచెము
వనట = బాధ
చేకురు= చేకూరును, కల్గును
ప్రియము = ఇష్టాన్ని కల్గించేది

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు:

1. మ. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా! (నారాయణ శతకం – బమ్మెరపోతన)

ప్రతిపదార్థం :

మానాథా = లక్ష్మీదేవికి భర్త అయిన వాడా
నారాయణా = ఓ విష్ణుమూర్తీ!
సతత = ఎల్లప్పుడు
ఆచారము = పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం
సూనృతంబు = మంచి మాట
కృపయున్ = దయ
సత్యంబునున్ = నిజము మాట్లాడుట
శీలమున్ = మంచి స్వభావము
నతి = వినయంగా ఉండటము
శాంతత్వము = ఓర్పుతో ఉండటము
చిత్తశుద్ధి = మనస్సు నిర్మలంగా ఉండటము
కరమున్ = మిక్కిలిగా
అధి+ఆత్మయున్ = దేవుని మీద భక్తి
ధ్యానమున్ = స్మరణ
ధృతియున్ = ఇంద్రియ నిగ్రహము
ధర్మము = ధర్మ ప్రవర్తనము
సర్వజీవ = ప్రాణులన్నింటికి
హితమున్ = మేల కోరుట
దూరంబు గాకుండా = ఇవేవి వదిలి పెట్టకుండా
మీ చేరువన్ = మీ సమీపంలో
సమ్మతికిన్ = మీకిష్టమగునట్లుగా
నివాస = నివసించుట అనే
సుఖమున్ = సౌఖ్యమును (ప్రసాదించుము)

తాత్పర్యం :
లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణుడా! ప్రియవచనం, దయ, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ, సర్వప్రాణుల మేలు కోరేవాడిగా, మీ సన్నిధిలో మీ కిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి (ఇవ్వుమని అర్థం).

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

2. ఉ. బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా! (చిత్తశతకం – శ్రీపతి భాస్కర కవి)

ప్రతిపదార్థం :

చిత్తము + ఆ = ఓ మనసా !
బీదలకున్ = పేదవారికి
అన్న వస్త్రములు = కూడును, గుడ్డయు (గ్రాసవాసములు)
పేర్మిన్ = ప్రేమతో, అధికముగా
ఒసంగుము = ఇమ్ము, దానము చేయుము
తుచ్ఛ = నీచమైన, అల్పమైన
సౌఖ్య = సుఖముల యొక్క
సంపాదనకున్ + ఐ = గడనకై, ఆర్జనమునకై
అబద్ధములన్ = అసత్యములను, కల్లలను
పల్కకు = మాటలాడకుము, చెప్పకుము
వాదములు = వాగ్వాదములు, తగవులు
ఆడన్ = చేయుటకు, నడపుటకు
పోకు = వెళ్ళకుము
మర్యాదన్ = నీతి పద్దతిని, హద్దును
అతిక్రమింపకు = మీఱకుము
పరస్పర = అన్యోన్యమైన
మైత్రిన్ = స్నేహము
మెలంగుము = నడచుకొనుము
వేదములు = ఆగమములు
ఇట్టి + అవి + ఔన్ = ఇటువంటి యగును
అంచున్ = అని
ఎరుంగుము = తెలిసికొనుము
ఇది = ఇద్ది (ఈ పద్ధతి, ఈ గుణము)
వివేక = మంచి చెడులను తెలిసికొను తెలివి కలవారి యొక్క
ధనంబు = సంపద
నమ్ము = విశ్వసింపుము

తాత్పర్యం :
ఓ చిత్తమా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోను వాదనకు దిగకు. హద్దుమీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

3. ఉ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న
నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా! (భాస్కర శతకం – మారద వెంకయ్య)

ప్రతిపదార్థం :

భాస్కరా ! = ఓ సూర్యదేవా !
చదువు + అది = విద్య అనునది
ఎంత = ఏ కొలది
కల్గినన్ = ఉన్నప్పటికిని
ఇంచుక = కొంచెము
రసజ్ఞత = రసికత
చాలక + ఉన్నన్ = సరిపడక పోయినచో
ఆ చదువు = ఆ గొప్ప చదువు
నిరర్థకంబు = ప్రయోజనం లేనిది (అవుతుంది)
గుణసంయుతులు = సుగుణములతో కూడినవారు (సుగుణవంతులు)
ఎవ్వరున్ = ఎవరైనను
ఎచ్చటన్ = ఎక్కడ కూడా
మెచ్చరు = మెచ్చుకోరు
పదనుగన్ = అన్నీ కుదిరేటట్లు చక్కగా
మంచి కూరన్ = మంచికూరను, ఇష్టమైన కూరను
నలపాకము = నలమహారాజు వంటవలె
చేసినన్ + ఐనన్ = వండినప్పటికిని
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = ఇష్టమును కలిగించే (రుచిని కలిగించే)
ఉప్పులేక = ఉప్పు లేకపోయినచో
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చున్ + ఆట + అయ్య = కలుగుతుందా ? (కలుగదని భావం)

తాత్పర్యం :
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

4. ఉ. పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! (దాశరథి శతకం – కంచర్ల గోపన్న)

ప్రతిపదార్థం :

దాశరథీ! = దశరథుని కుమారుడవైన శ్రీరామా!
కరుణా = దయకు
పయోనిధీ = సముద్రం వంటి వాడా
పెంపునన్ = పిల్లలను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లి వంటి దానివై
కలుషబృంద = పాపాల సమూహంతో
సమాగమము = కలయిక
ఒందకుండా = కలుగకుండా
రక్షింపను = కాపాడే విషయంలో
తండ్రివి + ఐ = తండ్రి వంటి వాడవై
మెయి = శరీరంలో
వసించు = ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియములకు సంబంధించిన
రోగముల్ = జబ్బులను
నివారింపను = తొలగించుటకు
వెజ్జువు + ఐ = వైద్యుని వంటి వాడివై
కృప గురించి = దయతో
పరంబు = మోక్షము
తిరంబు + కాగ = శాశ్వతమగునట్లుగా
సత్ సంపదలు = సత్యమైన మోక్ష సంపదలు
ఈయన్ = ఇచ్చుటకు
నీవు + ఎ = నీవు మాత్రమే
గతి = ఆధారము

తాత్పర్యం :
దయా సముద్రుడవైన రామా! పెంపకంలో తల్లివి. చెడుదారిన నడువకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ (జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ) రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

5.సీ. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని, కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపలపెట్టి దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునా ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
(నరసింహ శతకం – కాకుత్థ్సం శేషప్పకవి)

ప్రతిపదార్థం :

భూషణ వికాస! = ఆభరణములతో ప్రకాశించువాడా!
శ్రీ ధర్మ పుర నివాసా = ధర్మపురంలో నివసించే స్వామీ
దుష్ట సంహార! = దుర్మార్గులను సంహరించేవాడా
దురితదూర! = పాపములను పోగొట్టే వాడా
నరసింహ = నరసింహ స్వామీ
ఎవ్వడు = ఎవరూ కూడా
తల్లి గర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము తేడు = డబ్బు తీసుకురాడు
వెళ్ళి పోయెడినాడు = మరణించే సమయంలో
వెంటరాదు = తనతో పాటు రాదు
లక్ష + అధికారి + ఐన = లక్షలకు అధిపతి అయినప్పటికీ
లవణము + అన్నము + ఎ మెరుగు = ఉప్పు అన్నము తప్ప
మెరుగు = మెరిసిపోయె
బంగారంబు = బంగారాన్ని
మ్రింగన్ + పోడు = తినలేడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విర్రవీగుట + ఎ + కాని = అహంకరించడమే తప్ప
కూడన్ + పెట్టిన = పోగు చేసిన
సొమ్మున్ = సంపదను
కుడువన్ + పోడు = అనుభవించబోడు
పొందుగా = చక్కగా
మరుగు + ఐన = రహస్యంగా ఉన్న
భూమిలోపల = భూమిలో
పెట్టి = పాతిపెట్టి
దాన ధర్మము లేక = దానము ధర్మము లేకుండా
దాచి దాచి = ఎంతో కాలం దాచిపెట్టి
తుదకు = చివరికి
దొంగలకు + ఇత్తురో? = దొంగల పాలు చేస్తారో ?
దొరలకు + అవునో? = రాజుల పాలవుతుందో ?
తేనెజుంటి + ఈగలు = తేనెటీగలు
తెరువరులకు = బాటసారులకు
తేనె = తేనెను
ఇయ్యవు + ఆ = ఇవ్వడం లేదా

తాత్పర్యం :
శ్రీ ధర్మపురి నివాసుడా! ఆభరణాలచేత ప్రకాశించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! దుర్మార్గులను పారదోలేవాడా! ఓ నరసింహా! తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొనిరాడు. పోయేటప్పుడు వెంటతీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోడమే కానీ, తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటిదాన్ని దానం, ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో, రాజులపాలో చేస్తాడు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

6. సీ. మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహోత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!
(విశ్వకర్మ శతకం – పండిత రామసింహకవి)

ప్రతిపదార్థం :

విశ్వపాలన ధర్మ! = ప్రపంచాన్ని రక్షించుటయే ధర్మముగా కలవాడా!
శ్రీవిశ్వకర్మ! = ప్రపంచాన్ని సృష్టించిన వాడా!
మొదట = వేళ్ళ దగ్గర
కర్దమము + ఉంటే = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలిపువ్వు తప్పేమిటి
పశువుల దోషముల్ = జంతువుల తప్పులు
పాలకు + ఏమి = పాలకెందుకుంటాయి
అరయ = ఆలోచించినట్లయితే
వైద్యుని కులంబు = వైద్యుని యొక్క కులముతో
ఔషధంబునకు = మందుకు
ఏమి = పనేముంది
కప్పదోషము = కప్పల వలన దోషం జరిగితే
మౌక్తికములకు + ఏమి = ముత్యాల గొప్పదనం తగ్గుతుందా ?
కృషి కర్మమునకు = వ్యవసాయమునకు
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్నన్ + ఏమి = ఎలా ఉంటే ఏమిటి ?
వెలి + ఐన = సమాజమునకు దూరమైనప్పటికీ
వాని = అతడి
సత్ + విద్యకు + ఏమి = విద్యాభ్యాసానికి అడ్డేమిటి
అగ్నిహోత్రునకు = అగ్నిదేవునకు
అపవిత్రదోషంబులు + ఏమి = పాపమెందుకు అంటుతుంది
కులముకు = వంశానికి
గుణ దోషముల వల్ల ఏమి = పాపపుణ్యాలతో సంబంధం ఏముంది ?
మలినమై = మురికి పట్టినంత మాత్రాన
చందనము = గంధము యొక్క
పరిమళము = సువాసన
చెడును + అ = చెడిపోతుందా ?
రాతికి + అంటు = గుండ్రాయికి అంటుకున్న
గుడము = బెల్లముయొక్క
మధురంబు = తియ్యదనము
చెడును + అ = తగ్గిపోతుందా ?
వినయములు చెడన్ = గౌరవము లోపించినంత మాత్రాన
మా వృత్తి = మా పని యొక్క
ఘనత = గొప్పదనము
చెడును + అ = పాడైపోతుందా ?

తాత్పర్యం :
శ్రీ విశ్వకర్మా! విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా! మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బందిరాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు.

అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికిపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

7. ఉ. లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
మక్కువలన్ సృజించుచు నమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె ? వేంకటేశ్వరా!
(శ్రీ వేంకటేశ్వర శతకం – ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు)

ప్రతిపదార్థం :

వేంకట + ఈశ్వరా! = పాపాలను పోగొట్టే దైవమా!
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = అనంతమైన
కోరికల రీతులలో = కోరికల సమూహంలో
పడి = చిక్కుకు పోయి
ఇటుల్ = ఈ విధముగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచూ = ఇంకా ఇంకా పెంచుకుంటూ
అమాయకుడై = తెలివిలేనివాడై
పదే పదే = మాటి మాటికి
సుడులన్ = కోరికల సుడిగుండాలలో
ఉక్కిరి బిక్కిరి + ఐ = ఊపిరాడకుండా
తిరుగుచు + ఉండును + కాని = తిరుగుతుంటాడే తప్ప
విశిష్ట మార్గముల్ = మంచి దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశ్యము = కొంచెమైన
కుదుర్కొననీయడు + ఎ ? = స్థిరపడనివ్వడు కదా ?

తాత్పర్యం :
ఓ వేంకటేశ్వరా! మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి, ఉక్కిరిబిక్కిరై తిరుగుతుంటాడే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయడం లేదు కదా!

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

8. ఉ ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!
(శ్రీ బాకవరాంజనేయ శతకం – వేంకటరావు పంతులు)

ప్రతిపదార్థం :

ఖల భంజన! = దుష్టులను శిక్షించే వాడా
సాధుజన = మంచివారిని
అనురంజన! = సంతోషపెట్టేవాడా
బాకవర + ఆంజనేయ ! = బాకవరంలో వెలసిన ఆంజనేయ స్వామీ!
ఆకలిదప్పుల = ఆకలితోనూ, దాహంతోనూ
వనటన్ = బాధను
అందినవారికి = పొందినవారికి
పట్టెడు = గుప్పెడు
అన్నము + ఓ = ఆహారమో
శాకము + ఓ = కూరనో
నీరము + ఓ = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతులన్ = శాంతి పొందిన వారిగా
చేసినన్ = చేసినట్లయితే
సర్వపుణ్యముల్ = అన్ని పుణ్యములు
చేకురు = కలుగును
ఎంతయున్ = మిక్కిలి
శ్రేయము = మేలు కలిగించేది
ప్రేయము = ఇష్టాన్ని కలిగించేది
అటంచు = అంటూ
నీవు = దేవుడవైన నీవు
మెచ్చెదవు = మెచ్చుకుంటావు

తాత్పర్యం :
పాపులను నశింపజేసేవాడ! సాధుజనులను ఆనందింపజేసేవాడ! బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా! ఆకలిదప్పులతో అలమటించే వారికి పట్టెడన్నంగాని, శాకంగాని, నీళ్ళుగాని ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే, అది వారికి మేలయినదని, ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ఆలోచించండి- చెప్పండి:

ప్రశ్న 1.
కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి ? ‘వివేకధనం’గా కవి వేటిని పేర్కొన్నాడు ? (టెక్స్ట్ పేజి నెం. 47)
జవాబు.
పేదలకు సమృద్ధిగా అన్నము, వస్త్రాలు దానం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకూడదు. ఇతరులతో తగవులు పెట్టుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించరాదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవే తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడమే వివేకధనం అని కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు ? (టెక్స్టపేజి నెం. 48)
జవాబు.
మంచికూర ఎంత కమ్మగా నలభీమ పాకంగా చేసినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోతే అటువంటి చదువు వ్యర్థం అని అనుకుంటున్నాను.

ప్రశ్న 3.
సత్సంపదలు అంటే ఏవి ? (టెక్స్టపేజి నెం. 48)
జవాబు.
మంచివారితో స్నేహం, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మోక్షాన్ని పొందడం – ఇవీ సత్సంపదలు.

ప్రశ్న 4.
డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు ? (టెక్స్టపేజి నెం. 48)
జవాబు.
తేనెటీగ పువ్వు పువ్వుకూ తిరిగి తేనెను తెచ్చి పట్టులో దాచి పెడుతుంది. అది తాగదు. చివరికి బాటసారులు ఆ తేనెను పిండుకుంటారు. అలాగే పిసినారి దానధర్మాలు చేయకుండా డబ్బు దాచిపెట్టి తాను అనుభవించకుండా కష్టపడతాడు. చివరికి ఆ దాచిన డబ్బు రాజులపాలో దొంగలపాలో అవుతుంది. అందుచేత దానధర్మం చేయనివాడిని తేనెటీగతో పోల్చారు.

ప్రశ్న 5.
మంచిమార్గంలో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి కారణాలేవి ? (టెక్స్టపేజి నెం. 49)
జవాబు.
మానవుడు అంతంలేని కోరికలతో ఇష్టాలను పెంచుకుంటూ కొత్త కొత్త వాటికోసం ఆశపడుతూనే ఉంటాడు. అవి తీర్చుకోడానికి మంచి చెడు తెలుసుకోలేని అమాయకుడై ఉక్కిరిబిక్కిరైపోతూ చెడుదారులలో తిరుగుతుంటాడు. అందుకనే మంచి మార్గంలో నడిచే ఆలోచన చెయ్యడానికి కూడా అతడికి తీరిక దొరకదు.

ప్రశ్న 6.
“చెప్పుట చేయుటేకమై” నడవటమంటే ఏమిటి ? (టెక్స్టపేజి నెం. 49)
జవాబు.
మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు మనమేమి చెప్పామో అదే ఆచరించాలి. ఆలోచనచేసే మనస్సు, చెప్పే మాట, చేసే పని ఈ మూడూ ఒకటిగా ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధిగా ఉండటం అంటారు. చెప్పుట చేయుట ఏకమై నడవడమంటే ఇదే.

ప్రశ్న 7.
కవి చెప్పిన పుణ్యపు పనులేవి ? (టెక్స్టపేజి నెం. 49)
జవాబు.
ఆకలితో, దప్పికతో బాధపడేవారికి కొంచెం అన్నము గాని, కూరగాని, నీరుగాని ఇచ్చి వారి బాధను తీర్చాలి. అలాచేస్తే ఎన్నో పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు కలిగే పని చేసినందుకు, ప్రియమైన పనిచేసినందుకు దేవుడు మెచ్చుకుంటాడు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి చర్చించండి.
జవాబు.
శతక పద్యాలలో కవులు వారి సమకాలికమైన సమాజంలోని ఆచారాలు, అలవాట్లు, నీతి నియమాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని వివరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అని తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుచేత శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి అని చెప్పవచ్చు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన పదాలతో వేటిని పోల్చినారో రాయండి.

అ) ఉప్పు
జవాబు.
రసజ్ఞతను

ఆ) వేదాలు
జవాబు.
వివేకధనాన్ని

ఇ) సుడిగుండాలు
జవాబు.
కోరికలను

2. కరీంనగర్ జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు.

అ. అందంగా ఉండాలంటే ఇది అవసరం ( )
ఎ) నగలు
బి) రంగు
సి) అన్నం
డి) వస్త్రాలు
జవాబు.
సి) అన్నం

ఆ. పరువు అంటే అర్థం ( )
ఎ) ధనం
బి) గౌరవం
సి) పండుగ
డి) ప్రాణం
జవాబు.
బి) గౌరవం

ఇ. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది ? ( )
ఎ) అన్నం
బి) చదువు
సి) ప్రార్థన
డి) భక్తి
జవాబు.
ఎ) అన్నం

ఈ. జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం ( )
ఎ) దుర్మార్గం
బి) కోపం
సి) ద్వేషం
డి) సోయగం
జవాబు.
డి) సోయగం

ఉ. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినది ( )
ఎ) పరువు
బి) సంబరం
సి) అన్నం
డి) పైవన్నీ
జవాబు.
ఎ) పరువు

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు?
జవాబు.
ఎవరైనా మంచి ప్రవర్తన గలవారినే ఇష్టపడతారు. అబద్ధాలాడేవారిని, అన్యాయంగా ఒకరి సొమ్ము కాజేసే వారిని సమాజం హర్షించదు. అందరితో తగవులు పెట్టుకొని అబద్ధాలాడి అన్యాయాలు చేసి నీచమైన సుఖాలు పొందవలసిన పనిలేదు. అందువల్ల మంచి మార్గంలో నడిచి పది మందితో మంచి అనిపించుకోవాలని భాస్కర కవి చెప్పాడు.

ఆ. వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకి అయినవాడు తనకు ఉన్న దానిలో నుండి కొంతైనా అనాథలకు, పేదలకు సాయం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకూడదు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అమర్యాదగా ప్రవర్తించ కూడదు. అందరితోనూ స్నేహంగా మెలగాలి. పైన చెప్పిన లక్షణాలన్నింటిని వేదాలుగా భావించాలి. ఇవే వివేకులకు ఉండవలసిన లక్షణాలు.

ఇ. పెంపునదల్లివై …. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
భగవంతుడు సర్వ సమర్థుడు. ఆయన శరణు జొచ్చిన వారి పోషణ, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మానసిక శారీరకమైన అన్ని జబ్బులను దూరంచేసి తన భక్తులను ఆరోగ్యంగా ఉంచుతాడు. పాపాలంటనీకుండా మంచిదారిలో నడిపిస్తాడు. శాశ్వతమైన మోక్ష పదాన్ని అనుగ్రహిస్తాడు. అని “పెంపున తల్లివై’ అనే పద్యం ద్వారా తెలుస్తుంది.

ఈ. “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు మనిషి మనుగడకు ఆటంకాలు. కోరికలు ఒకసారి మొదలైతే ఒకటి తీర్చుకుంటే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మనిషి ఆ కోరికల సాగరంలో కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరై పోతాడు. వాటిని సాధించుకోడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటాడు. అనేక కష్టనష్టాలకు గురి అవుతాడు. అందుకే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవటం మంచిది.

ఉ. అంతరార్థం తెలుసుకోని చదువు వృథా అనడానికి భాస్కర శతక కర్త ఏ ఉదాహరణ చెప్పారు ? (అదనపు ప్రశ్న)
జవాబు.
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా! అని భాస్కర శతక కర్త అన్నాడు.

ఊ. “ఇతరులు గౌరవించనంత మాత్రాన తాను చేస్తున్న మంచి పనిని, వృత్తిని తక్కువగా అనుకోనక్కర్లేదు”. ఉదాహరణలతో రామసింహకవి ఎట్లా సమర్థించాడు ? (అదనపు ప్రశ్న)
జవాబు.
మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దు స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు.

చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికీపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు అని పండిత రామసింహకవి చెప్పాడు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
పరిచయం : వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి, మారద వెంకయ్య, భక్త రామదాసు, శేషప్పకవి … ఇలా ఎందరో శతక కవులు మన సాహిత్యంలో కనబడతారు.

నిశిత పరిశీలన : శతక కవులు తమ కాలంలో తమ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం, మనుషులు, వారి ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ధనవంతుల అత్యాచారాలు, పేదవారి అగచాట్లు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. వాటిని గమనిస్తూ వారి మనసుల్లో కలిగే భావాలను పద్యరూపంలో పెట్టి శతకాలుగా రాసి ఉంటారు.

సమాజాన్ని సంస్కరించాలనే తహతహ : కొన్ని భక్తి శతకాలు, కొన్ని నీతి శతకాలు మనకు లభిస్తున్నాయి. ఏ శతకమైనా పైన చెప్పిన అంశాలను ప్రజలకు వివరించడం, వాటిలోని మంచిచెడులను గుర్తింపజేయడం, మంచిమార్గంలో నడిచేందుకు స్ఫూర్తినివ్వడం, లక్ష్యంగా పెట్టుకొని శతక కవులు ఈవిధమైన పద్యాలు రాసి ఉండవచ్చు. ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోకుండా ఉండడానికి, సమాజం చెడుమార్గంలో వెళుతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడానికి శతకాలు రాసి ఉంటారు.

ఆ. శతక పద్యాలలోని విలువలు విద్యార్థులను తీర్చి దిద్దుతాయి” ఎట్లాగో వివరించండి. (లేదా)
శతక పద్యాలలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదా! వాటిని విద్యార్థులు తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో సమాజం చాలా బాగుంటుంది. ఎట్లాగో వివరించండి. (లేదా)
“శతక సుధ” పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలు ఏమిటి? (లేదా)
సమాజం యొక్క మేలుకోసం శతక పద్యాలు ఏ విధంగా తోడ్పడుతాయి? (అదనుపు ప్రశ్న)
జవాబు.
సమాజహితాన్ని కోరి శతక కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెల్పుతూ, మానవుడిలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలోని ఆచారాలు, నీతిని వివరించుటే లక్ష్యంగా నీతి, భక్తి శతకాలను రచించారు. సమాజహితమే వీరి లక్ష్యం.

సత్యం, దయ, శాంతం, భక్తి, ధ్యానం, మంచి మనసు, ధర్మం, ధైర్యం లాంటి గుణాలు నాకు ఇచ్చి నీ భక్తుడుగా ఉండే సుఖం ఇవ్వమని భక్తుల లక్షణాలు తెలిపారు.
పేదవారికి దానం, నీచ సుఖాలకి అబద్ధాలాడకుండుట, వాదనకు దిగకుండుట, హద్దు మీరి ప్రవర్తించకుండా సఖ్యంగా ఉండటం వివేకుల ధనం అని తెల్పారు.

శాశ్వత సంపదలు ఇచ్చేది భగవంతుడు. దానం చేయకుండా దాస్తే పోయేముందు తీసుకెళ్ళడు. చివరికి బాటసారుల పాలౌతుంది. ఇతరులు గౌరవించనంతమాత్రాన వృత్తి ఘనతకు భంగం కలుగదు.

భగవంతుని భక్తులను సేవించుట భగవంతుని సేవయే అని, మంచిదారిలో నడిచే ఆలోచన కల్గించేది భగవంతుడే అని తెలియచేశారు.

శతక పద్యాలలో ఇటువంటి ఎన్నో మంచి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచివారుగా ఉండటమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు.
ఇట్లాంటి మంచి నీతులు తెల్పే శతక పద్యాలు విద్యార్థులు చదవటం ఎంతో అవసరం. ఈ నీతులు విద్యార్థులను మంచివారుగా తీర్చి దిద్దుతాయనుటలో అతిశయోక్తి లేదు.

ఇ. “చెడ్డ వారితో ఉన్నంత మాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవు” శతక సుధ పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.

  1. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నా పువ్వు ప్రాధాన్యత తగ్గదు.
  2. పశువుల దోషాలు పాలకు అంటుకోవు.
  3. వైద్యుడిచ్చే మందులకు అతని కులంతో సంబంధమేమీ ఉండదు.
  4. కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు.
  5. ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు.
  6. మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటురాదు.
  7. అపవిత్ర దోషాలు అగ్నికి అంటవు.
  8. చందనం మలినమైనంత మాత్రాన దాని సువాసనలు ఎక్కడికీపోవు.
  9. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెంకూడా తగ్గదు.
  10. ఇతరులు గౌరవించనంత మాత్రాన వృత్తి ఘనతకు ఏ భంగం కలుగదు.
    దీనిని బట్టి చెడ్డవారితో ఉన్నంతమాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవని చెప్పవచ్చు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేదీ, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి)
జవాబు.

ప్రకటన
పద్య పఠనం పోటీలు

ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అంతర పాఠశాలలతో పద్య పఠనం పోటీలు నిర్వహించబడతాయి. పోటీ ఆగష్టు 13వ తేదీన జరుగుతుంది. పోటీలో గెలిచినవారికి ఆగష్టు 15న జరిగే జెండా వందనం ఉత్సవంలో బహుమతులు అందించబడతాయి.

నిబంధనలు : పద్యాలు రాగయుక్తంగా పాడాలి.
తప్పులు లేకుండా పాడాలి.
స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి.
నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
ఆసక్తిగల విద్యార్థులు ఆగష్టు 5వ తేదీ నాటికి తమ పేర్లు నమోదు చేయించుకోగలరు.

వేదిక : ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల, వరంగల్.
నిర్వహణ తేదీ : XX.XX.XXXX
సమయం ఉదయం 10 గంటల నుంచి

ఇట్లు
కార్యదర్శి,
ఎస్. ఆర్. ఎమ్. పాఠశాల,
వరంగల్.

ఆ) శతక సుధ పాఠంలో నీవు చదివిన పద్యాల్లో నీకు బాగా నచ్చిన వాక్యం గురించి మీ చెల్లికి లేఖ రాయండి. (అదనపు ప్రశ్)

ది. XX.XX.XXXX,
ఖమ్మం.

ప్రియమైన చెల్లి దేవికకు!

నీవు బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేనిక్కడ హాస్టల్లో బాగానే చదువుకుంటున్నాను.
ఈమధ్యే మా తెలుగు మాస్టారు ‘శతక సుధ’ పాఠం చెప్పారు. అందులో ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులోని ప్రతి పద్యమూ మన జీవితాలకు ఉపయోగపడేదే.

అందులో పండిత రామసింహకవి రాసిన విశ్వకర్మ శతకం నుండి ‘మొదట కర్దమముంటే మొగలి పుష్పముకేమి’ అనే పద్యం నాకు బాగా నచ్చింది.

బురద ఉన్నా మొగలిపువ్వు వాసన తగ్గదు. అపవిత్ర దోషాలతో అగ్నిదేవునికి వచ్చిన చిక్కులేదు. ఇలా ఎన్నో ఉదాహరణలతో మనం చేసే మంచి పనిని ఒకరు గుర్తించకపోయినా నష్టం లేదు అని చెప్పారు. ఒకరి మెప్పుకోసం కాక మన పనిని మనం ఇష్టంతో చేయాలని దీనర్థం.

నీవు కూడా నీ పుస్తకంలోని శతక పద్యాలు చదువు. నీకిష్టమైన పద్యం గూర్చి రాయి.
అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పు.

చిరునామా :
కొప్పురావూరి దేవిక
C/o. రమేష్
పుణ్యపురం
వైరా మండలం
ఖమ్మం జిల్లా.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

V. పదజాల వినియోగం.

1. కింది వాక్యాలలోని సమానార్థక పదాలను గుర్తించి గీత గీయండి.

అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు.
జవాబు.
దోషాలు = తప్పులు

ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
తేనె = మధువు

2. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
సహృదయత = మంచి మనసు

అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
జవాబు.
పరిమళం = మంచివాసన

ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
జవాబు.
మైత్రి = స్నేహ

3. కింద ఇవ్వబడిన ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 1

జవాబు.

ప్రకృతి  వికృతి
గుణం  గొనం
దోషం  దోసం
సుఖం  సుకం
పుణ్యం  పున్నెం
అగ్ని  అగ్గి
వైద్యుడు  వెజ్జ
ధర్మం  దమ్మం

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) దశేంద్రియ = దశ + ఇంద్రియ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

ఆ) లక్షాధికారి = లక్షా + అధికారి = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఇ) పట్టెడన్నము = పట్టెడు + అన్నము = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

ఈ) రాతికంటు = రాతికి + అంటు = ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఉ) చాలకున్న = చాలక + ఉన్న = అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళం.

2. కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం  విగ్రహవాక్యం  సమాసం పేరు
ఆకలి దప్పులు  ఆకలియు, దప్పియు  ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రములు  అన్నము, వస్త్రము  ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియములు  దశ సంఖ్య గల ఇంద్రియములు  ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు  నాలుగైన వేదాలు  ద్విగు సమాసం

3. కింది వానిని చదివి తెలుసుకోండి.

ఛందస్సు : పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.

అ) “లఘువు” – క్షణకాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “ | ” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 2

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ఆ) “గురువు” – రెండు క్షణాల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అని సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 3

ఇ) కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.
చిక్కని
పాలపై
మూర్ఖులు
అందం
ధనము పుణ్యముల్
చెందిన
పాకము
పంచదార
నమోనమః
రైతులు
గౌరీపతి

జవాబు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 4

గణాలు : గణం అంటే మాత్రల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ‘|’ అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 5

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 6

రెండు అక్షరాల గణాలు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 7

కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 8

4. కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.

అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 9

ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ 10

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ఈ కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : “శతకాలు – శతక కర్తలు”
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : పాఠ్యపుస్తకాలు మరియు గ్రంథాలయంలోని వివిధ శతక పుస్తకాలు.

ఆ) నివేదిక :
విషయ వివరణ :

శతకమనగా “నూరు” (వంద) అని అర్థం.

పూర్వం ఎందరో కవులు, కేవలం 4 పాదాల పద్యంలోనే ఎంతో విస్తృతార్థాన్ని ఇమిడ్చి, ఆనాటి కాలంలోని కుల వివక్షత, అజ్ఞానం, మూఢనమ్మకాలు లాంటి వాటిని ఖండిస్తూ ఎన్నో అద్భుతమైన పద్యాలను రాశారు. ఈ నాటికీ వేమన పద్యాలు, సుమతీ శతక కర్త బద్దెన పద్యాలు ప్రజల నోళ్ళలో నానుతున్నాయంటే వాటి ప్రాముఖ్యతను అర్థం చేసికోవచ్చు. నేను, నా గత తరగతులు, ప్రస్తుత తరగతి, ఇతర గ్రంథాలయ పుస్తకాలను పరిశీలించిన వివిధ శతకాలు వాటిని రచించిన కవుల వివరాలను పట్టికలో పొందుపరిచాను.

శతకం పేరు  కవి పేరు
1. వేమన శతకము  వేమన
2. సుమతీ శతకము  బద్దెన
3. శ్రీకాళహస్తీశ్వర శతకము  ధూర్జటి
4. వృషాధిప శతకము  పాల్కురికి సోమన
5. దాశరథీ శతకము  కంచర్ల గోపన్న
6. సుభాషిత త్రిశతి  ఏనుగు లక్ష్మణకవి
7. భాస్కర శతకము  మారద వెంకయ్య
8. నారాయణ శతకము  పోతన
9. కుమార శతకము  పక్కి అప్పల నర్సయ్య
10. చిత్త శతకము  శ్రీపతి భాస్కరకవి
11. కాళికాంబ శతకము  శ్రీ పోతులూరి వీరబ్రహ్మం
12. తెలుగుబాల శతకము  జంధ్యాల పాపయ్యశాస్త్రి

ఇ) ముగింపు :

ఈ విధంగా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా నేను వివిధ శతక కర్తలు, వారి పద్యాల గొప్పదనం తెలుసుకొన్నాను. అంత పురాతన కాలంలో, సాంఘిక రుగ్మతలు రూపు మాపటానికి కలాన్ని ఎన్నుకొని కృషి చేసిన ఆ మహనీయులు ఎంతో అభినందనీయులు.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

కృప = దయ, కరుణ
చిత్తము = మతి, మనస్సు
కరము = మిక్కిలి, అధికము
మా = రమ, లక్ష్మీదేవి
తుచ్ఛము = నీచము, అల్పము
ఉపు = లవణం, రుచి
మెయి = మేను, శరీరం
విత్తము = ధనము, డబ్బు
పుష్పము = పూవు, కుసుమము
పరిమళము = సుగంధము, సువాసన
కలుషము = దోషము, పాపము

నానార్థాలు:

కరము = మిక్కిలి, చేయి, ఏనుగుతొండం, పన్ను
మర్యాద = గౌరవము, హద్దు
పెంపు = అభివృద్ధి, పెద్దచేయుట
కృషి = వ్యవసాయము, కష్టము

ప్రకృతులు – వికృతులు:

మర్యాద = మరియాద
శుద్ధి = సుద్ది
స్థిరము = తిరము
భృంగారము = బంగారము
కులము = కొలము
విద్య = విద్దె

వ్యుత్పత్త్యర్థాలు:

ఆంజనేయుడు = అంజనీదేవి కుమారుడు (హనుమంతుడు)
దాశరథి = దశరథుని యొక్క కుమారుడు (శ్రీరాముడు)
పయోనిధి = నీటికి నిలయమైనది (సముద్రము)
భాస్కరుడు = వెలుగునిచ్చు కిరణములు కలవాడు (సూర్యుడు)

సంధులు:

సతతాచారము = సతత + ఆచారము = సవర్ణదీర్ఘసంధి
లక్షాధికారి = లక్ష + అధికారి = సవర్ణదీర్ఘసంధి
సాధు జనానురంజన = సాధుజన + అనురంజన = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ప్రేమటంచు = ప్రేమము + అటంచు = ఉత్వ సంధి
వెజ్జువై = వెజ్జువు + ఐ = ఉత్వ సంధి
సంపదలీయ = సంపదలు + ఈయ = ఉత్వ సంధి
తేడెవ్వడు = తేడు + ఎవ్వడు = ఉత్వ సంధి
లవణమన్నము = లవణము + అన్నము = ఉత్వ సంధి
విత్తమార్జన = విత్తము + ఆర్జన = ఉత్వ సంధి
మరుగైన = మరుగు + అయిన = ఉత్వ సంధి
కర్దమముంటే = కర్దమము + ఉంటే = ఉత్వ సంధి
ఎట్లున్న = ఎట్లు + ఉన్న = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

కాకుండ = కాక + ఉండ = అత్వ సంధి
నేర్చునటయ్యా = నేర్చునట + అయ్యా = అత్వ సంధి
ఒందకుండ = ఒందక + ఉండ = అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

తల్లివై = తల్లివి + ఐ = ఇత్వ సంధి
జుంటీగ = జుంటి + ఈగ = ఇత్వ సంధి
రాతికంటు = రాతికి + అంటు = ఇత్వ సంధి
ఇట్టివౌ = ఇట్టివి + ఔ = ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు:

ప్రశ్న 1.
సూనృతం : _____________
జవాబు.
మనిషికి సూనృతమే మంచి ఆభరణము.

ప్రశ్న 2.
లవణం : _____________
జవాబు.
లవణం లేని కూరను ఇష్టంగా తినలేము.

ప్రశ్న 3.
తెరువరి : _____________
జవాబు.
పులి బంగారు కడియానికి ఆశపడి తెరువరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ప్రశ్న 4.
మరుగు : _____________
జవాబు.
బంగారు ఆభరణాలను మరుగున ఉంచి దాచిపెడతాము.

ప్రశ్న 5.
లేశము : _____________
జవాబు.
మనిషిలో లేశ్యమైనా దానగుణం ఉండాలి.

అర్థాలు:

గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.

ప్రశ్న 6.
మా తాతగారు తన దగ్గరున్న విత్తం ధర్మకార్యాలకు ఉపయోగించేవారు. ( )
A) ధనం
B) తెలివి
C) విత్తనం
D) చిత్తం
జవాబు.
A) ధనం

ప్రశ్న 7.
వానపడ్డప్పుడు మా వీధిలో కర్దమము లో నడవటం చాలా కష్టం. ( )
A) దుమ్ము
B) బురద
C) రాళ్లు
D) గుంటలు
జవాబు.
B) బురద

ప్రశ్న 8.
మా చెల్లెలికి పూలంటే ఎంతో మక్కువ. ( )
A) ఎక్కువ
B) తక్కువ
C) అయిష్టం
D) ఇష్టం
జవాబు.
D) ఇష్టం

ప్రశ్న 9.
పదేపదే ఆ విషయాన్ని గుర్తుచెయ్యకు. ( )
A) పాదము
B) అడుగు
C) మాటిమాటికి
D) అప్పుడప్పుడు
జవాబు.
C) మాటిమాటికి

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

పర్యాయపదాలు:

గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

ప్రశ్న 10.
ఈ శిల్పము కరము సుందరము. ( )
A) చేయి, హస్తము
B) మిక్కిలి, అధికము
C) కారము, తీపి
D) గొడద, గార్దభం
జవాబు.
A) చేయి, హస్తము

ప్రశ్న 11.
ఇతరులను గేలిచేయటం తుచ్ఛమైన పని. ( )
A) నీచం, అల్పం
B) పుచ్ఛం, తోక
C) ఆశ్చర్యం, అబ్బురం
D) గొప్ప, మెచ్చదగిన
జవాబు.
A) నీచం, అల్పం

ప్రశ్న 12.
శిరీష పుష్పం చాలా సుకుమారంగా ఉంటుంది. ( )
A) పుప్పొడి, గంధోళి
B) బాలిక, అమ్మాయి
C) కుసుమం, పువ్వు
D) కొమ్మ, రెమ్మ
జవాబు.
A) పుప్పొడి, గంధోళి

ప్రశ్న 13.
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ( )
A) నిప్పు, పప్పు
B) లవణం, రుచి
C) కప్పు, చెప్పు
D) పప్పు, కూర
జవాబు.
B) లవణం, రుచి

నానార్థాలు:

గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.

ప్రశ్న 14.
ఏనుగు కరము చేసే పనులు కరము ఆశ్చర్యకరములు. ( )
A) తొండము, తోక
B) కార్యము, కర్జము
C) కాలు, చెవి
D) తొండం, మిక్కిలి
జవాబు.
D) తొండం, మిక్కిలి

ప్రశ్న 15.
మర్యాదగా ప్రవర్తించి పెద్దల మర్యాద కాపాడాలి. ( )
A) వీధి, పెద్దలు
B) హద్దు, గౌరవం
C) హద్దు, గొప్పదనం
D) సత్యం, ధర్మం
జవాబు.
B) హద్దు, గౌరవం

ప్రశ్న 16.
రైతు కష్టపడి వ్యవసాయం చేసి పట్టుదలతో పంట పండించాడు. ( )
A) హాలికుడు
B) కృషి
C) కర్షకుడు
D) సైరికుడు
జవాబు.
B) కృషి

ప్రశ్న 17.
వ్యాపారాన్ని పెద్దచేసి దానిని అభివృద్ధి చేశాడు మహోన్నత వ్యాపారి. ( )
A) వంపు
B) పంప
C) సొంపు
D) పెంపు
జవాబు.
D) పెంపు

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

ప్రకృతి – వికృతులు:

గీత గీసిన పదాలకు ప్రకృతి/వికృతులు రాయండి.

ప్రశ్న 18.
మనం మరియాద తప్పి ప్రవర్తించ కూడదు. ( )
A) మరేద
B) మార్యద
C) మర్యాద
D) మర్రియాద
జవాబు.
C) మర్యాద

ప్రశ్న 19.
ఒక్క చోట స్థిరంగా ఉండవెందుకు ? ( )
A) శిరం
B) థిరం
C) స్తిరం
D) తిరం
జవాబు.
D) తిరం

ప్రశ్న 20.
వెజ్జు రోగికి పథ్యం పెట్టమన్నాడు. ( )
A) వైద్యుడు
B) వేద్యుడు
C) ఉపాధ్యాయుడు
D) విద్య
జవాబు.
A) వైద్యుడు

ప్రశ్న 21.
గుణవంతుడైన కొడుకు వలన కులమునకు మంచి పేరు వస్తుంది. ( )
A) కుళము
B) కొలము
C) కూలము
D) కోలము
జవాబు.
B) కొలము

వ్యుత్పత్త్యర్థాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 22.
దాశరథి – దీనికి వ్యుత్పత్తి ఏమిటి ? ( )
A) దశరథుని తమ్ముడు
B) దశరథుని కుమారుడు
C) దశరథుని తండ్రి
D) దశరథుని తాత
జవాబు.
B) దశరథుని కుమారుడు

ప్రశ్న 23.
అంజనీ దేవి కుమారుడు ……….. దీనికి సరిపోయే పదం ఏది ? ( )
A) హనుమంతుడు
B) పావని
C) ఆంజనేయుడు
D) మారుతి
జవాబు.
C) ఆంజనేయుడు

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

భాషాంశాలు :

సంధులు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 24.
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి ఔతుంది ……… ఇది ఏ సంధి సూత్రం ? ( )
A) ఉత్వ సంధి
B) ఇత్వ సంధి
C) అత్వ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు.
A) ఉత్వ సంధి

ప్రశ్న 25.
ఏది ఎట్లున్నా మొదలుపెట్టిన పని ఆపకూడదు. ఎట్లున్న – ఈ పదం ఎలా విడదీయాలి ? ( )
A) ఎట్లు + న్న
B) ఎట్ల + ఉన్న
C) ఎట్లు + ఉన్న
D) ఎట్లా + ఉన్న
జవాబు.
C) ఎట్లు + ఉన్న

ప్రశ్న 26.
ఎవ్వరికీ ఏమీ కాకుండ పనిని పూర్తి చేస్తాడు నేర్పరి. కాకుండా. ……………… ఏ సంధి ? ( )
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) ఇత్వ సంధి
D) సవర్ణదీర్ఘసంధి
జవాబు.
B) అత్వ సంధి

ప్రశ్న 27.
లక్ష + అధికారి ………….. దీనిని ఎలా కలపాలి ? ( )
A) లక్షధికారి
B) లక్షఅధికారి
C) లక్షణాధికారి
D) లక్షాధికారి
జవాబు.
D) లక్షాధికారి

సమాసాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 28.
సమాసంలో మొదటి పదం సంఖ్యను తెలియజేస్తే అది ( )
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) రూపక సమాసం
D) బహువ్రీహి సమాసం
జవాబు.
A) ద్విగు సమాసం

ప్రశ్న 29.
ఆకలిదప్పులు ప్రాణికోటికి సహజం – ‘ఆకలిదప్పులు’ విగ్రహవాక్యం ? ( )
A) ఆకలియు, దప్పియు
C) ఆకలితో దప్పి
B) ఆకలి చేత దప్పి
D) ఆకలి కొరకు దప్పి
జవాబు.
A) ఆకలియు, దప్పియు

ప్రశ్న 30.
మనిషి అన్నవస్త్రాల కోసం నిరంతరం శ్రమిస్తాడు. – ‘అన్న వస్త్రాలు’ ఏ సమాసం ( )
A) ద్విగుసమాసం
B) ద్వంద్వసమాసం
C) బహువ్రీహిసమాసం
D) రూపకసమాసం
జవాబు.
B) ద్వంద్వసమాసం

ప్రశ్న 31.
మనిషి ఎంత సంపాదించుకున్నా లవణాన్నమునే తింటాడు. లవణాన్నము – ఏ సమాసపదం ? ( )
A) ద్విగు
B) ద్వంద్వ
C) బహువ్రీహి
D) తృతీయా తత్పురుష
జవాబు.
D) తృతీయా తత్పురుష

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

వాక్యాలు – రకాలు:

క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.

ప్రశ్న 32.
అబద్ధాలాడకు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) విధ్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) ప్రేరణార్థకం
జవాబు.
A) విధ్యర్థకం

ప్రశ్న 33.
కులంతో సంబంధం ఏంటి? ( )
A) విధ్యర్థకం
B) నిషేధార్థకం
C) ప్రశ్నార్థకం
D) హేత్వర్ధకం
జవాబు.
C) ప్రశ్నార్థకం

ప్రశ్న 34.
దయయుంచి మంచి బుద్ధిని ప్రసాదించు. ( )
A) నిషే
B) ప్రార్థనార్థకం
C) అనుమత్యర్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు.
B) ప్రార్థనార్థకం

ప్రశ్న 35.
నువ్వు ఆ పని చెయ్యవద్దు. ( )
A) నిషేధార్థకం
B) అనుమత్యర్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
A) నిషేధార్థకం

క్రియను గుర్తించుట:

గీతగీసిన పదాలు ఏ క్రియా పదాలో గుర్తించండి.

ప్రశ్న 36.
ఎంత బాగా వండినా ఉప్పు వేయకపోతే రుచిరాదు. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
D) అప్యర్థకం

ప్రశ్న 37.
మంచి సంపదలు ఇచ్చి కాపాడు. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
A) క్త్వార్థం

ప్రశ్న 38.
లోభి ధనం దాచిపెడుతూ ఆనందిస్తాడు. ( )
A) క్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
C) శత్రర్థకం

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రశ్న 39.
అతడు ధనము దాచాడు. ధనము దొంగిలించబడింది. సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) అతడు ధనం దాస్తే దొంగిలించబడింది.
B) అతడు ధనము దాచాడు కానీ దొంగిలించబడింది.
C) అతడు ధనం దాచాడు మరియు ఆ ధనం దొంగిలించారు.
D) దొంగిలించబడిన ధనం అతడు దాచాడు.
జవాబు.
B) అతడు ధనము దాచాడు కానీ దొంగిలించబడింది.

ప్రశ్న 40.
పెంపకంలో తల్లివి. కాపాడే తండ్రివి. సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) పెంపకంలో తల్లివి తండ్రివి
B) నా తల్లీదండ్రీ నువ్వే
C) పెంపకంలో, కాపాడటంలో నీవే తల్లీ తండ్రీ
D) పెంపకంలో తల్లివి మరియు కాపాడే తండ్రివి
జవాబు.
D) పెంపకంలో తల్లివి మరియు కాపాడే తండ్రివి

ప్రశ్న 41.
పద్యాలను చదివాడు. ఆనందించాడు. సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) పద్యాలను చదివి ఆనందించాడు.
C) అతడు ఆనందిస్తూ పద్యాలను చదివాడు.
B) పద్యాలను చదువుతూ ఆనందించాడు.
D) అతడు పద్యాలు చదవాలని ఆనందించాడు.
జవాబు.
A) పద్యాలను చదివి ఆనందించాడు.

ఛందస్సు:

ప్రశ్న 42.
క్రింది పద్యపాదాలలో చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి. ( )
A) ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
B) పదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం
C) వేదములం చెరుంగుము వివేకధనంబిది నమ్ము, చిత్తమా
D) లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
జవాబు.
B) పదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం

ప్రశ్న 43.
ఉత్పలమాల పద్యపాదంలోని గణాలు ఏవి ? ( )
A) సభరనమయవ
B) మసజసతతగ
C) భరనభభరవ
D) నజభజజజర
జవాబు.
C) భరనభభరవ

ప్రశ్న 44.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ – ఈ పద్యపాద గణాలు గుర్తించండి. ( )
A) నజభజజజర
B) మసజసతతగ
C) భరనభభరవ
D) సభరనమయవ
జవాబు.
B) మసజసతతగ

TS 8th Class Telugu Bits 5th Lesson శతక సుధ

అలంకారాలు:

ప్రశ్న 45.
అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం ఉండేలా పదాలను ప్రయోగిస్తే అది ఏ అలంకారం ? ( )
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
జవాబు.
D) లాటానుప్రాస

ప్రశ్న 46.
తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి. ( )
A) లాటానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకం
జవాబు.
A) లాటానుప్రాస

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

These TS 8th Class Telugu Bits with Answers 4th Lesson అసామాన్యులు will help students to enhance their time management skills.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

బొమ్మను చూడండి. ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు 1

ప్రశ్నలు:

ప్రశ్న 1.
బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వీధుల్లో పోగయిన చెత్తను, వ్యర్థాలను తీసి శుభ్రం చేస్తున్నారు.

ప్రశ్న 2.
అట్లా చెత్తను ఎత్తిపోసే వారు లేకుంటే ఏమవుతుంది ?
జవాబు.
అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే వీధులన్నీ మురికి కూపాలుగా మారతాయి. దోమలు, ఈగలు చేరి మలేరియా వంటి అంటురోగాలు వ్యాపిస్తాయి.

ప్రశ్న 3.
ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు ? వారి గొప్పదనమేమిటి ?
జవాబు.
ఇట్లా మనకు సేవ చేసే వారిలో వీధులను ఊడ్చేవారు, మురికి కాల్వలను బాగుచేసేవారు, హాస్పిటల్స్లో రోగులను శుభ్రం చేసేవారు ఉన్నారు. వీరే లేకపోతే మానవ మనుగడకే చేటు వస్తుంది. అంటురోగాలు విజృంభిస్తాయి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

పాఠం ఉద్దేశం:

అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది.
వృత్తులు సమాజ సేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి.
దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ప్రశ్న.
‘వ్యాస ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.

ప్రవేశిక:

శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం!

కఠినపదాలకు అర్థాలు:

దృష్టి = చూపు
ప్రతిభ = నేర్పు
పరిశీలన = నిశితమైన గమనింపు
మార్గం = దారి / త్రోవ
అద్భుతం = గొప్పది
ఆపాదమస్తకం = కాలిగోటి నుండి తల వరకు
సొమ్ములు = ధనము / పశువులు
ఆకృతి = రూపం
ఔదార్యము = ఉదారగుణం
క్షుధ = ఆకలి
ఇక్కట్లు = కష్టాలు
కృషీవలుడు = రైతు
చిచ్చు = అగ్ని
హలము = నాగలి
గొంగడి = కంబళి, రగ్గు
ఆవిష్కరణ = కనిపెట్టుట
తోవ = మార్గము
అమాంతం = ఒక్కసారిగా
గురుగులు = ఆడపిల్లలు చిన్న వయస్సులో ఆడుకొనే బొమ్మలు (వంటసామగ్రితో ఉన్నవి)
గిరాకీ = ఎక్కువగా కావలసినవి, ప్రియమైనవి, బాగా కావలసినవి (డిమాండ్)
సెగ = వేడి బాగా తగులుట, దగ్గరగా వేడి ఉండుట
తొలి = మొదటి, రంధ్రం
వెల = రేట
వక్కాణించు = గట్టిగా చెప్పు
కాటికి = కాడు + కి = శ్మశానానికి
బొక్కెన = బకెట్టు
బాయి = బావి
క్షురము = కత్తి
క్షురకుడు = మంగలి
శరీరమర్దనం = మసాజ్ లేదా మాలిష్

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఆలోచించండి – చెప్పండి.

ప్రశ్న 1.
ఈ నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా ? వాటి గురించి చర్చించండి. (టెక్స్ట్ పేజి నెం.33)
జవాబు.
నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆకాశం మేఘావృతమై జడివాన కురుస్తుంది. అంతలోనే వర్షం ఆగగానే ఆకాశంలో వెలసిన ఇంద్రధనుస్సును చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అది ప్రకృతి అందించిన అందాల హరివిల్లు. దాన్ని చూసి ఆశ్చర్యానందాలను పొందని వారెవరుంటారు ? ఎంత జడివాన కురిసినా, సాలెగూడు తడవదు. సాలెపురుగు ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యమేస్తుంది.

ప్రశ్న 2.
ప్రతి వృత్తి పవిత్రమైందే, అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది ? (టెక్స్ట్ పేజి నెం.33)
జవాబు.
ప్రతి వృత్తి పవిత్రమైందే. విమానం నడిపేవాని వృత్తి ఎంత గొప్పదో, ఆటో నడిపేవాని వృత్తీ అంత గొప్పదే. ఏ వృత్తీ తక్కువకాదు. ఒక వృత్తి లేనిదే మరొకటి లేదు. ప్రతి వృత్తిలోను ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలసి ఉంటాయి. ఒకరికొకరు చేదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు.

ప్రశ్న 3.
చక్రం సమాజగతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు ? (టెక్స్ట్ పేజి నెం.33)
జవాబు.
చక్రాన్ని కనుగొనడానికి ముందు ఒక చోట నుండి మరొకచోటకు వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గంలేదు. చక్రం ఆవిష్కరణతో మానవ జీవనంలో పరుగు మొదలయింది. ప్రయాణం మొదలయింది. చరిత్ర గతి మారింది.

ప్రశ్న 4.
బంగారానికే సౌందర్యం తెచ్చే స్వర్ణకారుల జీవితాలు ఎందుకు కళ తప్పుతున్నాయో చర్చించండి. (టెక్స్ట్ పేజి నెం.35)
జవాబు.
బంగారం అంత సులభంగా కరగదు. మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. దానికోసం బాగా ఊదాల్సివస్తుంది. అద్భుతమైన బంగారు నగలు చేసే వృత్తి కళాకారుల జీవితాలు యాంత్రిక విధానం రావటంతో కళతప్పాయి. బంగారాన్ని కరిగించటానికి ఊది ఊది రోగాల బారిన పడుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకడంలేదు.

ప్రశ్న 5.
“కమ్మరి పని ఒక ఇంజనీరు ప్రక్రియ” అని ఎట్లా చెప్పగలవు ? (టెక్స్ట్ పేజి నెం.35)
జవాబు.
ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే సాంకేతిక ప్రక్రియ. ఇనుముతో నిత్యం సహవాసం చేసేవారు కమ్మరులు. ఎంతో నైపుణ్యంతో గొడ్డలి, పార, కొడవలి, బండి చక్రాలను తయారు చేస్తారు. సరైన కొలతలు తెలియందే అవి తయారుకావు. అందుకే పైకి తేలికగా కనపడే కమ్మరి పనిలో ఇంజనీరు ప్రక్రియ దాగి ఉంది.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ప్రశ్న 6.
వస్తుసామగ్రి, ఇంటిసామగ్రి తయారుచేయడంలో వడ్రంగి శ్రమ విలువను గురించి మాట్లాడండి. (లేదా) వడ్రంగుల పనితనం గురించి రాయండి. (టెక్స్ట్ పేజి నెం.35)
జవాబు.
వడ్రంగి శ్రమకు మారుపేరు. కలపను ఎంపిక చేసుకునే దగ్గర నుండి దానిని వివిధ ఆకారాలలోకి మార్చటం కోసం ఎంతగా శ్రమిస్తాడో చెప్పలేము. వ్యవసాయపు పనిముట్లు, ఇండ్లకు వాడే కలప దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు వీటి తయారీలో ఆయన శ్రమ విలువ దాగి ఉంటుంది. ఏమాత్రం కొలతలు తప్పినా, తయారు చేసిన వస్తువులు సరిగా కుదరవు.

ప్రశ్న 7.
వ్యర్థ పదార్థాల నుండి పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు సృష్టించిన వారి తెలివి ఎంత గొప్పదో చెప్పండి.
(టెక్స్ట్ పేజి నెం.35)
జవాబు.
మనం అడుగు బయట పెట్టాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే; ఒక చనిపోయిన జంతువు యొక్క చర్మమనే వ్యర్థ పదార్థం నుండి అందరికి అవసరమైన వస్తు సృష్టి చేయటం వారి తెలివికి నిదర్శనం.

ప్రశ్న 8.
మానవుని సౌందర్యం వెనుక క్షురకుని పాత్ర ఉన్నది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి. (టెక్స్ట్ పేజి నెం.37)
జవాబు.
క్షురకుడంటే తల వెంట్రుకలను కత్తిరించే వాడని అర్థం. ఆ వెంట్రుకలను కత్తిరించడంలో ఒక పద్ధతి ఉంది, ఒక అమరిక ఉంది. వారు సరిగా వెంట్రుకలను కత్తిరించకపోతే వికారంగా తయారవుతాము.

ప్రశ్న 9.
అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసిన నేతపనివారి పనితనాన్ని ప్రశంసిస్తూ మాట్లాడండి. (టెక్స్ట్ పేజి నెం.37)
జవాబు.
శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. వాటిని తయారుచేసేవారు నేతపనివారు. బట్టలు నేసే మగ్గంలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అగ్గిపెట్టె చిన్నది. చీర పెద్దది. అంత పెద్ద చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా, చీరను నేయడం అంటే మాటలు కాదు. ఎంతో పనితనం, నైపుణ్యం ఉండాలి.

ప్రశ్న 10.
దేశానికి అన్నంపెట్టే రైతు జీవనం దుర్బరంగా ఎందుకు మారిందో చర్చించండి. (టెక్స్ట్ పేజి నెం.37)
జవాబు.
దేశానికి వెన్నెముక రైతు. రైతులు కష్టపడి పనిచేసి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లభించటం లేదు. దళారి వ్యవస్థ ప్రజలకు, రైతుకు మధ్య ఉండి ఇద్దరినీ దోపిడీకి గురిచేస్తోంది. అందుకే రైతు జీవనం దుర్భరంగా మారింది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, చీడ పీడలు….. ఇలా పెట్టిన పెట్టుబడి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతు జీవనం దుర్భరంగా మారింది.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఇవి చేయండి:

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.

ప్రశ్న 1.
“ఒక్కొక్క వృత్తి దేనికదే గొప్పది” దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
వృత్తి అంటే చేతివృత్తులని అర్థం. భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. చేతి వృత్తులవారిలో కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు, మంగళ్ళు, నేతవారు, చాకలివారు, వ్యవసాయదారులు ఉన్నారు. వారిలో ఎవరి వృత్తి వారికి గొప్ప. కుమ్మరి కుండలు చేసే చాకచక్యం కంసాలికి ఉండదు. అలాగే కంసాలి చేసే నగల సున్నితమైన పనితనం కుమ్మరికి ఉండదు. అలాగే మిగిలిన వృత్తుల వారికి కూడా! ఏ వృత్తి గొప్పదనం దానిదే. కుమ్మరి చక్రం తిప్పందే కుండ తయారవదు. ఆ చక్రం కావాలంటే వడ్రంగి, కమ్మరి చెక్కపని, ఇనుము పని చేయాలి. ఇలా ఒక వృత్తి మరొక వృత్తి మీద ఆధారపడి ఉంది. అందుకే దేనికది గొప్పది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. దాని ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.
జవాబు.
లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దంముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ను సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దంముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు. దుప్పట్లు, దిండ్లు, కుషన్కవర్లు, లంగాలు, జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి, తేలికపాటి చెక్కల బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.

వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల, జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.

హస్తకళల పేర్లు దొరికే పాత్రలు వాటి ప్రత్యేకతలు
1. లక్క గాజులు హైదరాబాదు అద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగు రాళ్ళతో చేతులకు అందాన్నిస్తాయి.
2. చెక్క బొమ్మలు, వర్ణ చిత్రాలు నిర్మల్ చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు.
3. ఇత్తడి సామగ్రి వరంగల్లు జిల్లా పెంబర్తి ఇత్తడి ఖనిజంతో వివిధరకాలైన సామానులు, కళారూపాలను తయారుచేయు వృత్తి కళాకారులున్నారు.
4. వెండి నగిషీకళ (ఫెలిగ్రీ) కరీంనగర్ సన్నని వెండిదారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేస్తారు.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ప్రశ్న 2.
ఆయా వృత్తిపనులవారు తయారుచేసేవి, వాడే వస్తువుల పేర్లను పాఠం ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి.
జవాబు.

వృత్తులు వాటికి సంబంధించిన పేరా సంఖ్య పేరాలో ఇచ్చినవారు వాడే వస్తువులులేదా తయారుచేసే వస్తువుల పేర్లు
1. కుమ్మరి 33వ పేజీలో 1, 2 పేరాలు కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, మట్టి బొమ్మలు (చక్రం, సారెలు వాడతారు.)
2. కంసాలి 33వ పేజీలో 3, 4 పేరాలు హారాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కుబిళ్ళ, వడ్డాణం, కడియాలు, ఉంగరాలు, గజ్జెలు, గొలుసులు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి కొలిమి, చిన్నపాటి సుత్తులను వాడతారు.
3. కమ్మరి 3వ పేజీ 2వ పేరా నాగటికర్రు, పార, గొడ్డలి, కొడవలి, సుత్తి, ఇరుసులు, బండిచక్రము మొదలగునవి. వీటిని తయారుచేయటానికి సుత్తి, కొలిమి, దాయి మొదలగువాటిని వాడతారు.
4. వడ్రంగి 34వ పేజీ 3వ పేరా నాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు, బెంచీలు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి ఉలి, బాడిశ మొదలగు వాటిని వాడతారు.
5. తోలు పనివాళ్ళు 35వ పేజీ 1, 2, 3 పేరాలు చెప్పులు, డప్పులు, మోట బావిలో నీళ్ళు తోడే బొక్కెనలకు తొండాలను చర్మంతో తయారు చేస్తారు.
6. నేత పనివాళ్ళు 36వ పేజీ 2, 3 పేరాలు బట్టలు, కలంకారీ దుస్తులు, పట్టు వస్త్రాలు కంబళ్ళు మొదలగునవి తయారు చేస్తారు.

III. స్వీయరచన.

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జవాబు.
ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా జీవించేవారు. ప్రకృతిలో రేయింబవళ్ళు కలసిపోయి ఉండేవారు. ప్రకృతి పరిశీలకులు వారు. ఏమి తినాలో ఏమి తినకూడదో పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ పరిశీలన కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలి ఉంటారు. వారికున్న విజ్ఞానం చాలా గొప్పది. వాళ్ళు నిజంగా వృక్ష శాస్త్రజ్ఞులే! వన మూలికా వైద్యాన్ని వారి నుండే సభ్య ప్రపంచం తెలుసుకుంది.

ప్రజలు రోగాల బారిన పడినప్పుడు చెట్ల ఆకుల రసాలతో ఆరోగ్యవంతులను చేయటం వారికి తెలిసినంతగా మనకు తెలీదు. యుద్ధాల్లో గాయపడిన వారికి స్వస్థతచేకూర్చగల శక్తి వారి నాటు వైద్యానికి ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. కావున వారు సభ్య సమాజానికి మార్గదర్శకులని చెప్పాలి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి. (లేదా) నీకు తెలిసిన ఒక వృత్తి గొప్పతనాన్ని తెల్పండి.
జవాబు.
కుమ్మరి వేసవి కాలపు చంద్రుడు. చల్లని నీటిని అందించే మట్టి కుండల తయారీలో నేర్పరి. చక్రం త్రిప్పుతూ తయారు చేసిన బంకమట్టిని దానిపై ఉంచి చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కుతూ ఆశ్చర్యపడే విధంగా వివిధ రూపాలలో మట్టి వస్తువులను తయారు చేయగల నేర్పరి. ఆయన చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపిస్తుంది. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక నైపుణ్యం కుమ్మరిదే.

వేసవిలో పేదవాడి ఫ్రిజ్ నీటి కుండల నుండి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయగల నేర్పరి అతడు. ఆయనకు ఆధారభూతమైన వస్తువు ‘సారె’ ఒక్కటే. కుమ్మరి చేసే కుండలు, మట్టిపాత్రలు, దీపపు ప్రమిదలు లేనిదే ఇప్పటికీ మనకు రోజు గడవదంటే, కుమ్మరి గొప్పదనం అర్థమవుతుంది.

ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి. (లేదా) “రైతుకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని కవి అనడంలోని ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రైతులు మన అన్నదాతలు. రైతే దేశానికి వెన్నెముక. అతడు పంట పండించకపోతే మనకు ఆహారం ఉండదు. కష్టపడి ఆరుగాలం పంటను సంరక్షించుకుంటూ దాన్నే తన జీవిత సర్వస్వంగా భావించేవాడు రైతు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సమస్యలతో నలిగి సడలని ధైర్య సాహసములతో పంటలు పండించి అన్నదాత అనిపించుకున్నాడు. ఆయన కష్టం మనకు భుక్తినిస్తుంది.

ఒక్కపూట ఆహారం లేకపోతే అల్లాడిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడతాం. కోటి విద్యలు కూటికొరకే కదా! మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు ఊరికే రావు కదా! రైతు కష్టించి పని చేస్తేనే మన కడుపులు నిండుతాయి. అందుకే రైతు మన అన్నదాత. అతనికి చేతులెత్తి నమస్కరిస్తానని కవి అన్నాడు.

ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. ఇది నిజం. ఏ అవయవం లేకపోయినా దేహానికి పరిపూర్ణత ఉండదు. అలాగే ఏ వృత్తిదారుడు లేకపోయినా అది సమాజం అనిపించుకోదు. ఒక వృత్తిని ఆధారం చేసుకొని మరొక వృత్తి నిలబడుతుంది. ప్రతి వృత్తిలోను శ్రమ, నైపుణ్యాలుంటాయి. ప్రతివృత్తి పవిత్రమైందే. ఏ వృత్తినీ చిన్నచూపు చూడకూడదు.

ఒక శుభకార్యం జరగాలంటే ఎంతో మంది వృత్తిదారుల ప్రమేయం దానిపై ఉంటుంది. మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు కావాలి. వాటిని తయారు చేసే అన్ని వృత్తులవారి సహకారం కావాలి కదా! ఇలా ఒకరికొకరై ఒకరితో ఒకరు సహకరించుకొంటేనే సమాజం నిలబడుతుంది. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెబుతాం. దేనికదే గొప్ప. అన్ని అవయవాలు కలసి ఉండి పనిచేస్తేనే దేహం, అన్ని వృత్తులవారు కలసి ఉంటేనే సమాజం.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఉ) నేతపనివారల కళా నైపుణ్యాన్ని వివరించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
బట్టలను తయారు చేసేవారు నేతపనివారు. మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. మగ్గం ద్వారా బట్టలను తయారుచేసి అందించే నేతపనివారి నైపుణ్యం చాలా గొప్పది. బట్టలు నేయడానికి వాడే మగ్గం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. నేతపనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను తయారు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ.

దూది నుండి సన్నని దారాన్ని తీయటం, దాన్ని పడుగు పేకలలో అమర్చటం, మగ్గంపై వస్త్రాలను తయారుచేయటం నేత పనివారలు ఎంతో నైపుణ్యంతో చేస్తారు. గొర్రెల బొచ్చును కత్తిరించి ఉన్నిదారం వడికి కంబళ్ళను చేస్తారు. పట్టువస్త్రాల తయారీ వీరి నైపుణ్యానికి ఒక మచ్చుతునక.

ఊ) క్షురకుల సేవలు మరువలేనివి. సమర్థించండి. (లేదా) సమాజంలో వృత్తి చాలా గొప్పది. మీకు తెలిసిన ఒక వృత్తిని గురించి ఐదు వాక్యాలు రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
క్షురకుల సేవలు మరువరానివి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటంలో వీరి పాత్ర అనిర్వచనీయమైనది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం ఎంతో నైపుణ్యంతో కూడినది. వీరికి తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళతో, ఆకులతో, చేపలతో చేసే మందుల పట్ల వీరికి మంచి అవగాహన ఉంది. తైలంతో శరీర మర్దన వీరి నైపుణ్యానికి నిదర్శనం. స్త్రీలకు క్షురకస్త్రీలే పూర్వం ప్రసవం చేసేవారట. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైనవి. సమాజానికి వీరి సేవలు అత్యవసరం.

ఋ) “అన్నమయములైనవన్నీ జీవమ్ములు” అని కవి అనడంలోని ఉద్దేశమేమి? (అదనపు ప్రశ్న)
జవాబు.
సకల ప్రాణులు అన్నం తినే జీవిస్తాయి. ఆ అన్నమే లేకపోతే ప్రాణికోటి లేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార నియమాల గురించి ఆదివాసులకు మొదటనే తెలుసు. అన్నం అందరికీ అవసరం అని కవి చెప్పాడని భావం.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి. (లేదా) కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది. సమర్థిస్తూ క్లుప్తంగా రాయండి.
జవాబు.
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది. ఇది వాస్తవం. ‘శ్రమయేవ జయతే’. ‘కృషి ఉంటే మనుషులు ఋషిలవుతారు’ అన్న నానుడులు ఉండనే ఉన్నాయి. శ్రమించటానికి ఎవరూ సిగ్గుపడనవసరం లేదు. సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడ్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారి భావన. శ్రమను గౌరవించటం నేర్చుకోవాలి.

శ్రమ సంస్కృతిలో జీవించటం నేర్చుకోవాలి. సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ఉన్న వారందరి కృషి అవసరం. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయింది. దేశ ప్రజలందరు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై శ్రమించి ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దారు.

కాబట్టి శ్రమ పునాదులపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుందన్నది యథార్థం. దానికి సమాజంలోని ప్రజలందరూ కులమత వృత్తి భేదం లేకుండా ఒకరికొకరు కలసిమెలసి సహజీవనం చేస్తూ శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే నిజమైన సమాజపు భవనం నిర్మించబడుతుంది. రైతు నాకెందుకులే అని వ్యవసాయం మానేస్తే, ఒక్కపూట కూడా మనకు తిండి గడవదు.

ఇలాగే ఇతర వృత్తుల వాళ్ళు శ్రమ చేయనిదే మనకు రోజు గడవదు. అసలు మన శరీరమే శ్రమను కోరుతుంది. కేవలం తిండితిని కూర్చుంటే, ఆ తిండి అరగక, అనారోగ్యం పాలవుతాము. అందుకే శ్రమలోనే అభివృద్ధి ఉంది.

ఆ) గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి ? (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరి సమిష్టి కృషి ఎంతో అవసరం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తులవారు కలసి మెలసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాల కుమ్ములాటలు ఉండేవి కావు. అందరూ అక్కా, బావా, మావా, అత్తా… అని నోరారా పిలుచుకుంటూ ఆత్మీయతతో జీవించేవారు.

మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వారిది. కలసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఒకరికొకరు సహకరించుకోవటం మన సంస్కృతిలో గొప్పతనం. వీటిని అలవరచుకొని పాటిస్తే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. సమాజంలోని వారు ఒకరినొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించలేవు.

ఇ) అసామాన్యులు వ్యాసం రాయటంలో ఉద్దేశమేమిటి ? చర్చించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం వృత్తి జీవనంపై ఆధారపడి ఉంది. మన సమాజంలోని రహస్యమిదే. పనిని విభాగించటం. మన సమాజం నేర్చుకున్న ఈ చేతివృత్తులు అందరికి సామాజిక స్థాయిని అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వివాహం జరగాలనుకోండి దానికి కావలసిన వస్తు సామగ్రి ఒక్కరే తయారు చేయటం అసాధ్యం.

ధాన్యం ఒకరు, పప్పు ఉప్పులు ఒకరు, కుండలు ఒకరు, తాళిబొట్టు ఒకరు, వస్త్రాలు ఒకరు, పాలు మిగిలిన ఆహార పదార్థాలు ఇంకొకరు. ఇలా సమాజంలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును లేక పదార్థాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచితేనే కదా, వివాహం జరిగేది.

భారతదేశంలోని ప్రజల మధ్య ఉండే సహకారం సమన్వయాలకు ఒక నిదర్శనం వృత్తులు అని చెప్పేందుకు ఈ వ్యాసాన్ని రచించారు. బ్రాహ్మణుడు లేకపోయినా. కుమ్మరి లేకపోయినా పెళ్ళితంతు జరగటం కష్టమే! సమసమాజ నిర్మాణం ధ్యేయంగా కులవృత్తులు ఏర్పడ్డాయి. కాని ఇప్పుడు నిరాదరణకు గురై వ్యక్తులకు జీవన భృతిని కల్పించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఈ) రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్నందిస్తుంది. సమర్థించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
భారతీయ సమాజంలో చేతివృత్తులకు ఒక విశిష్టత ఉంది. “కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా” అన్నమాటలు మన సమాజానికి ప్రతినిధిగా వచ్చినవే! రజకుల కాయకష్టం నిజంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టల మురికిని శుభ్రం చేయటం ద్వారా మనకు వారు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరేయటంతో వాటికి అంటుకున్న మురికితోపాటు చాలా క్రిములు నశిస్తాయి.

అలా ఉతికిన బట్టలకు గంజిపెట్టి చలువ చేసి, ఇస్త్రీ చేయటంతో శుభ్రమైన బట్టలుగా అవి తయారవుతాయి. ఇస్త్రీతో మిగిలిన క్రిములు కూడా నశిస్తాయి. శుభాశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో చేతివృత్తుల వారి ప్రమేయమే ఎక్కువ.

అందునా రజకుల ప్రమేయం మరీ ఎక్కువ. శుభకార్యక్రమాల శుభవార్తలను బంధువులకు తెలియజేయటం దగ్గర నుండి ఆ సమయంలో ఇళ్ళను, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించే బాధ్యతను వీరు చక్కగా నిర్వహిస్తారు. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలే! కనుక రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

IV. సృజనాత్మకత/ప్రశంస.

ప్రశ్న 1.
మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు.
ఉదా :

  1. నమస్కారం! మీ పేరేమిటి ?
  2. మీరు ఏం చేస్తుంటారు ?
  3. మీది కులవృత్తా ? కాదా ?
  4. దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారు ?
  5. ఇది మీకు తృప్తినిస్తుందా ?
  6. ఈ వృత్తి మీకు భుక్తినిస్తుందా ?
  7. మీ వృత్తిలోని ప్రత్యేకత ఏమిటి ?
  8. మీ వృత్తిలో మీరు ఏం సాధించారు ?
  9. సమాజంలో మీ వృత్తికి మంచి ఆదరణ ఉందా ?
  10. ప్రజల అభిమానాన్ని పొందాలంటే మీ వృత్తి పట్ల మీరు ఎలాంటి శ్రద్ధను చూపుతారు ?
  11.  మీ వృత్తిదారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

ప్రశ్న 2.
మీ ఊరిలో ఉన్న కుల వృత్తులను తెలియజేయండి. (లేదా) మీ గ్రామంలోని వివిధ వృత్తులవాళ్ళు ఎలాంటి సేవలు చేస్తున్నారో తెలపండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
మా ఊరిలో దాదాపు అన్ని కులవృత్తులవారు జీవనం చేస్తున్నారు. మాది కరీంనగర్ జిల్లా మంథని గ్రామం. మా ఊరు చాలా పెద్దది. మా గ్రామంలో జాలర్లు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగులు, నేత పనివారు, క్షురకులు, మేదర్లు, రజకులు జీవిస్తున్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఒకరిపై మరొకరు ఆధారపడి హాయిగా జీవిస్తున్నారు. కర్షకులకు కావలసిన అన్ని రకాల పరికరాలను అంటే నాగలి దగ్గర నుండి బండి కాడి వరకు కమ్మరులతో, వడ్రంగులతో తయారు చేయబడతాయి.

అలాగే జాలర్లు చేపలు పట్టి జీవిస్తుంటారు. నేతపనివారు బట్టలు నేస్తూ ఊరి వారికి అందిస్తుంటారు. క్షురకులు జుత్తు కత్తిరించి శుభకార్యాలలో మంగళ వాయిద్యాలు మోగిస్తుంటారు. మేదర్లు రైతులకు ఇంటికి కావలసిన బుట్టలు, తట్టలు, చాటలు తయారు చేస్తారు. రజకులు ఊరి వారి బట్టలను శుభ్రం చేస్తూ శుభకార్యాలలోను అశుభకార్యాలలోను అందరికి తోడుగా ఉంటారు. ఇన్ని వృత్తులవారు. మా గ్రామంలో ఉండటం వలన అందరూ సమిష్టిగా బతుకుతున్నాం. మా గ్రామం స్వయం సమృద్ధిని పొంది హాయిగా జీవిస్తున్నాం.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ప్రశ్న 3.
“రైతు దేశానికి వెన్నెముక” దీనిని సమర్థిస్తూ వ్యాసం వ్రాయండి. (లేదా) రైతే రాజు అంటారు కదా! రైతు దేశానికి అందించే సేవలు వివరించండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ లాల్బహదూర్ శాస్త్రిగారు ‘జై జవాన్ జై కిసాన్’ అని నినదించారు. దేశ సరిహద్దులను కాపాడటానికి సైనికులు ఎంత ముఖ్యమో దేశంలోని మానవులకు భుక్తిని (ఆహారాన్ని) అందించటానికి రైతు అంత ముఖ్యం. రైతు దేశానికి వెన్నెముక. రైతే రాజు. అతడు పంట పండిస్తేనే అందరికి ఆహారం దొరుకుతుంది. రైతు సమాజ గమనానికి వేగుచుక్క రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తాడు. సోమరితనం అతని ముందు బలాదూర్.

ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా అతని లక్ష్యం పంట పండించటం. అదే దేశ ప్రజలకు జవం జీవం. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చాటిచెప్పే శ్రామికుడు రైతు. రైతు గాలి సోకితే, రైతు స్పర్శ తగిలితే పంట పులకరించి పోతుందట. పశుసంపద రైతు కనుసన్నలలో మెదులుతూ సమాజానికి పలువిధాలుగా ఉపకరిస్తోంది.

ప్రస్తుతం రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి బీభత్సాల వలన, నకిలీ విత్తనాల వలన, దళారుల వలన తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. పండ్ల రైతులు పలు రకాల తెగుళ్ళవలన, గాలి వానల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుండి రైతులను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.

అ) చేదోడు వాదోడు :
జవాబు.
పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి.

ఆ) చాకచక్యం :
జవాబు.
చాకచక్యంగా వ్యవహరించటం తెలివిగల వారి లక్షణం.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు 2

ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవము
ఆ) ఆహారం – ఓగిర
ఇ) రాత్రి – రాతిరి

3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.

అ) చెట్టు : వృక్షము, తరువు, భూరుహము
ఆ) పాదము : పద్యపాదము, కాలిఅడుగు, చరణము
ఇ) శరీరం : దేహము, తనువు, కాయము, మేను

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

VI. భాషను గురించి తెలుసుకుందాం.

కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

వాక్యం అసమాపక క్రియ సమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది. వెళ్ళి కొన్నది
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు. చదివి చెప్పాడు.
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది. గీసి వేసింది
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఎక్కి వెళ్ళింది
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు. వచ్చి వెళ్ళాడు.
5. వాళ్ళు అన్నం తిని నీళ్ళు తాగారు. తిని తాగారు

కింది వాక్యాలు చదవండి. కలిపి రాసిన విధానం చూడండి.
ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంటచేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది.
ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే, ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

3. కింది వాక్యాలు చదవండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
జవాబు.
వనజ చురుకైనది. అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
జవాబు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
జవాబు.
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము తేలేము.
జవాబు.
మేము రాము, తేలేము.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

భాషా కార్యకలాష్ట్రాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న .
వివిధ వృత్తి పనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తుల వారు పాడుకొనే పాటలు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తి పనుల వారిని కలిసి సేకరించడం

ఆ) నివేదిక :

1. రైతు కూలీల పాట

వానమ్మ వానమ్మ వానమ్మా
ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా ॥వానమ్మ॥ 2
తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి
తినటానికి తిండిలేక … ఉండడానికి గుడిసె లేక
తాగేందుకు నీరు లేక … కాపాడే నాథుడు లేక ॥వానమ్మ|| 2
చెర్లర్లో నీళ్ళూలేవూ … సెలకల్లో నీళ్ళూలేవూ
వాగుల్లో నీళ్ళూలేవూ … వంపుల్లో నీళ్ళూలేవూ
నిన్నే నమ్మిన రైతూ … కళ్ళల్లో నీళ్ళూలేవూ ॥వానమ్మ॥ 2
ఎదిగేటి మిరపసేనూ
ఎండల్లో ఎండిపోయే
సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వబట్టె…
పాలోసుకున్న కంకి … పాలన్నీ ఉడిగిపాయె
నీళ్ళోసుకున్నా నేను … నీళ్ళడలేకపాయే ॥వానమ్మ|| 2
నల్లానీ గౌడీ బర్రె … తెల్లాని ఎల్లన్నావు సైదన్నా మేకపోతూ సక్కని లేగదూడా
కరువంటూ పీనుగెల్లా … కటికోని కమ్ముకునిరి ॥వానమ్మ|| 2
కొంగునా నీళ్ళూ దెచ్చే … నింగిలో మబ్బులేవీ
చెంగూ చెంగూనా ఎగిరే … చెరువుల్లో చేపాలేవీ
తెల్లనీ కొంగ బావా … కళ్ళల్లో ఊసూలేవీ ॥వానమ్మ|| 2

2. కుమ్మరిపాట

అన్నల్లారా రారండోయ్ … తమ్ముల్లారా చూడండోయ్
కుండలు చేసే కుమ్మరి నేను
కూజాలు చేసే కుమ్మరి నేను
గిర గిర సారెను తిప్పేస్తా
గురుగులు ముంతలు చేసేస్తా
బంకమట్టికే ఆకృతినిస్తూ
మట్టి ముంతలకు సొగసులద్దుతూ
ఇళ్ళలో వాడే మట్టి పాత్రలను
చల్లని నీటి మట్టి కూజాలను
తయారుచేసే కుమ్మరి నేనూ
పెళ్ళిళ్ళకు వాడే కూరాళ్ళను
దీపవళి నాటి దీపపు ప్రమిదలను
చక చక తయారుచేస్తాను
చిటికెలో మీకు ఇస్తాను ॥అన్నల్లారా రారండోయ్||

ఇ) ముగింపు :
ఇలా వివిధ వృత్తి పని వాళ్ళు తాము పనిచేస్తున్నప్పుడు కలిగే అలసటను పోగొట్టుకోవడానికి, మానసిక ఉ ల్లాసానికి ఇలాంటి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. పల్లెటూళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రాచీన కళలకు పట్టుగొమ్మలు. ఈ కళలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ప్రశ్న.
మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తిపని వారి సమస్యలు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తిపని వారిని కలువడం ద్వారా

ఆ) నివేదిక :

విషయ వివరణ :

మన దేశంలో ఎన్నో రకాల వృత్తుల వాళ్లు ఉన్నారు. యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి చాలామంది వారి కుల వృత్తులు వదిలివేసి వేరే పనులు చేస్తున్నారు. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. మా ప్రాంతంలో గల చేనేత, కుమ్మరి, మేదర వృత్తి పనుల వారిని కలిసి వారి సాదక బాధకాల గూర్చి నివేదిక తయారుచేశాను.

1. చేనేత వృత్తి

పూర్వకాలం చేనేత వృత్తికి ఎంతో ఆదరణ ఉండేది. మగ్గంపై చేతితో నేసిన చీరలు, ధోవతులకు చాలా గిరాకీ ఉండేది. కానీ మరమగ్గాలు వచ్చిన తర్వాత చేనేత బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. కారణం, మరమగ్గం మీద నేసిన దుస్తుల కంటే వీటి నాణ్యత, మన్నిక తక్కువ, ధర ఎక్కువ. ఒక చేనేత కార్మికుడు గుంట మగ్గంపై 10 గం||లు కూర్చుండి నేస్తే
అతడి రోజువారీ కూలీ రూ. 150/- లు మాత్రమే ! కేవలం 10 గజాల గుడ్డను మాత్రమే నేయగలడు. 150 రూ॥లు ఈ కాలంలో అతని జీవితావసరాలను ఎంతమాత్రం తీర్చలేవు. ఇక మరమగ్గాల కార్మికుల జీవితాలేమైన సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒక మరమగ్గం కార్మికుడు రోజుకు 12 గం||లు పనిచేయాలి.

ఒక వారం Day shift లో పనిచేస్తే, మరో వారం Night shift లో పనిచేయాలి. ఏక కాలంలో 8 మరమగ్గాలను చూసుకోవాలి. 10 పీకుల గుడ్డకు 30 పైసలు, అంటే సుమారు 1 మీటర్ గుడ్డకు 1 రూపాయి గిట్టుబాటవుతుంది. ఒక్కో మగ్గంపై 40 మీటర్ల గుడ్డ నేయగలడు. అంటే 8 మరమగ్గాలపై 12 గం||లలో 320 మీటర్ల గుడ్డ మాత్రమే నేయగలడు. సగటున వారానికి 6 రోజులు పనిచేస్తే, 320 × 6 = 1920 రూ॥ నెలకు 1920 × 4 = 7680 రూ॥ సంపాదించగలడు. కానీ, శబ్ద కాలుష్యం, నిద్రలేమి, 12 గంటలు నిలబడే పనిచేయడం లాంటి సమస్యల వల్ల నెలకు 6000/- కంటే ఎక్కువగా సంపాదించలేక పోతున్నారు. అది ఇల్లు కిరాయి, పిల్లల చదువు, జీవించడానికి సరిపోక ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

2. కుమ్మరి వృత్తి

పూర్వకాలం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లిన వీరి వృత్తి యాంత్రీకరణ తర్వాత, అల్యూమినియం, స్టీలు పాత్రలు, వంట ఇళ్ళను ఆక్రమించిన తర్వాత, వెల వెల బోయింది. చేతినిండా పనిలేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు. ఎవరో యోగా సాధకులు, కుండలో నీరు, మట్టి పాత్రల్లో వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఎవరూ వీటిని వాడడం లేదు. పెళ్లికి వాడే కూరాటి కుండలు, దీపావళి నాడు వాడే ప్రమిదలు తప్ప, ఇతర మృణ్మయ పాత్రల వాడకం శూన్యం.

3. మేదర వృత్తి

వీరు వెదురు బొంగును బద్దలుగా చీల్చి, ఆ బద్దలతో గాదెలు, తట్టలు, చేటలు, తడికెలు లాంటివి తయారుచేస్తారు. పూర్వం ప్రతి గ్రామంలో ఈ మేదరవాళ్లు ఉండేవారు. ఒక ఇంటిని రెండు భాగాలుగా వేరు చేయుటకు తడికెలు వాడేవారు. దానికి బదులు ఇప్పుడు కార్డుబోర్డును వాడుతున్నారు. పెళ్ళిళ్ళలో తడికెల పందిరి వేసేవారు, దాని స్థానంలో ఇప్పుడు టెంట్లు వచ్చాయి. ప్లాస్టిక్ చేటలు, తట్టలు, బుట్టలు వచ్చి వెదురుతో చేసిన చేటలు, తట్టలు, బుట్టల స్థానాన్ని ఆక్రమించాయి. చేయడానికి పనిలేక వీరు పట్టణాలకు వలస వెళుతున్నారు.

ఇ) ముగింపు :
ఈ విధంగా యాంత్రీకరణ, వివిధ చేతి వృత్తుల వారికి పనిలేకుండా చేసింది. వీరి సాదక బాధకాలు, ప్రభుత్వం తెలుసుకొని చేయూత నివ్వాలి. చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెట్లో స్థానం కల్పించి, తగిన ధర ఇప్పించాలి. వీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, తక్కువ వడ్డీకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి.

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఇతర అంశాలు:

పర్యాయపదాలు:

ఆకాశము = నింగి, గగనము
సొమ్ములు = డబ్బు, సంపద
హలము = నాగలి, సీరము
కర్షకుడు = రైతు, హాలికుడు
పశువులు = జంతువులు, పసరములు
విప్లవం = ఉద్యమము, మేలుకొలువు

నానార్థాలు:

కాలము = సమయము, మరణము
చేవ = సారము, ధైర్యము
పాడి = ధర్మము, న్యాయము, క్షీర సంపద (పెరుగు, పాలు, నెయ్యి మొదలైనవి)
శక్తి = బలము, పార్వతి
అర్థము = శబ్దార్థము, ప్రయోజనం

ప్రకృతులు – వికృతులు:

ప్రకృతి – వికృతి
ఆశ్చర్యము – అచ్చెరువు
శక్తి – సత్తి
ఆకాశము – ఆకసము
త్యాగము – చాగము
అటవి – అడవి
విజ్ఞానము – విన్నాణము
కష్టము – కస్తి
ధర్మము – దమ్మము
స్త్రీ – ఇంతి

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

వ్యుత్పత్త్యర్థాలు:

అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు)
హాలికుడు = హలముతో నేలను దున్నువాడు (రైతు)
పక్షి = పక్షములు గలది
పౌరుడు = పురంలో నివసించువాడు

సంధులు:

దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి – సవర్ణదీర్ఘసంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.

సున్నితమైన = సున్నితము + ఐన – ఉత్వసంధి
అద్భుతమైన = అద్భుతము + ఐన – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

ప్రత్యక్షము = ప్రతి + అక్షము – యణాదేశసంధి
అత్యంతము = అతి + అంతము – యణాదేశసంధి
సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా యవరలు వచ్చును.

సమాసములు:

వ్యర్థపదార్థం = వ్యర్థమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయము
మహా పురుషుడు = గొప్పవాడైన పురుషుడు – విశేషణ పూర్వపద కర్మధారయము
మధుర జీవనము = మధురమైన జీవనము – విశేషణ పూర్వపద కర్మధారయము
తోడు నీడ = తోడుయును నీడయును – ద్వంద్వ సమాసం
రేయింబవలు = రేయియును పవలును – ద్వంద్వ సమాసం
బండి చక్రము = బండి యొక్క చక్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జంతువుల మనసు = జంతువుల యొక్క మనసు – షష్ఠీ తత్పురుష సమాసం
కళా దృష్టి = కళ యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
మూడు తరాలు = మూడు అను సంఖ్యగల తరాలు – ద్విగు సమాసం
నవగ్రహాలు = తొమ్మిది అను సంఖ్యగల గ్రహాలు – ద్విగు సమాసం
మృదుమధురము = మృదువైనది మధురమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
శీతోష్ణము = శీతలమైనది ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

TS 8th Class Telugu Bits 4th Lesson అసామాన్యులు

ఎసైన్మెంట్:

పదజాలం :

సొంతవాక్యాలు :

ప్రశ్న 1.
హలము : _______________
జవాబు.
రైతు హలమును ఉపయోగించి పొలం దున్నుతాడు.

ప్రశ్న 2.
ఔదార్యం : _______________
జవాబు.
మనిషికి ఔదార్య గుణం ఎంతో అవసరం.

ప్రశ్న 3.
ఇక్కట్లు : _______________
జవాబు.
ఇక్కట్లు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా

ప్రశ్న 4.
ఆపాదమస్తకం : _______________
జవాబు.
దుర్మార్గ