AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

These AP 9th Class Social Important Questions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 7th Lesson Important Questions and Answers భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social 7th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మౌలిక వనరులు అనగానేమి?
జవాబు:
పరిశ్రమలకు అవసరమయ్యే వివిధ ముడి సరుకుల తయారీకి ఖనిజాలు, ‘ముడిలోహాలు మౌలిక వనరులువుతాయి.

ప్రశ్న 2.
మౌలిక పరిశ్రమలు అనగానేమి?
జవాబు:
ఈ అవసరమైన సరుకులను, యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు.

ప్రశ్న 3.
బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అని వేటిని అంటారు?
జవాబు:
పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవలను ఉపయోగించుకోవటానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి కనపడుతుంది. వీటిని బృహత్ పారిశ్రామిక వ్యవస్థలంటారు.

ప్రశ్న 4.
వ్యవసాయాధారిత పరిశ్రమలేవి?
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా : వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 5.
ఖనిజ ఆధారిత పరిశ్రమలు అని వేటిని అంటారు?
జవాబు:
ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు.

ప్రశ్న 6.
NALCO ను విస్తరించండి.
జవాబు:
NALCO (నాల్కో) – నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్.

ప్రశ్న 7.
BALCO ను విస్తరించండి.
జవాబు:
BALCO (బాల్కో) – భారత్ అల్యూమినియం కార్పొరేషన్.

ప్రశ్న 8.
కింది పటాన్ని పరిశీలించి ప్రశ్నకు జవాబు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
కర్ణాటక రాష్ట్రం నందు ఎక్కడెక్క ఇనుము-ఉక్కు కర్మాగారాలు వున్నాయి?
జవాబు:
భద్రావతి, విజయనగర్

9th Class Social 7th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
దిగువ – పై చార్టుని చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2
i) “పై – చిత్రాలు” దేనిని తెలుపుతున్నాయి?
ii) అత్యధిక శాతంలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది?
iii) ఏ రంగంలో ఉపాధి రెండింతలు పెరిగింది?
iv) 2009 – 2010 నాటికి ఉపాధి కల్పనలో రెండవ స్థానంలో ఉన్న రంగమేది?
జవాబు:
i) పై చిత్రాలు 1972-73 మరియు 2009-10 సంవత్సరాలలో వివిధ రంగాలలో ప్రజలు పొందుతున్న ఉపాధిని తెలియచేస్తున్నాయి.
ii) వ్యవసాయరంగం అత్యధికంగా ఉపాధిని కల్పిస్తుంది.
iii) పరిశ్రమల రంగంలో ఉపాధి రెండింతలు పెరిగింది.
iv) 2009-10 నాటికి ఉపాధికల్పనలో రెండవ స్థానంలో ఉన్న రంగం సేవల రంగం.

AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 2.
“మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినపుడు పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి. అనతికాలంలోనే ప్రజలు నీళ్ళు నిల్వచేయడానికి చెరువులు, పొలాలకు నీళ్లు మళ్లించడానికి కాలువలు, ఆనకట్టలు నిర్మించారు.”
ప్రశ్న : “అభివృద్ధి పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తున్నదా?” వ్యాఖ్యానించండి.
జవాబు:
అభివృద్ధి పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది. దానికి గల కారణాలు :

  1. అభివృద్ధి ప్రక్రియలో మనం చాలా రకాల వనరులను ఉపయోగిస్తాం. ఉదా : పరిశ్రమలలో మనం చాలా రసాయనాలను వాడి మనం అభివృద్ధి చెందుతున్నాం. కాని అదే తరుణంలో ఆ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వలన కాలుష్యం పెరిగిపోతుంది.
  2. అభివృద్ధి చెందుతున్నామనే భావనలో అవసరం ఉన్నా లేకపోయినా వివిధ రకాల వాహనాలను, ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తూ పర్యావరణ కాలుష్యానికి మనం కారణం అవుతున్నాము.
  3. అభివృద్ధి అనే పదాన్ని వాడుతూ ప్రతి చిన్నదానికి వాడే ఎలక్ట్రానిక్ పరికరాల వలన మనకు తెలియకుండానే పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఉదా : రిఫ్రిజిరేటర్లు, ఎ.సి.లు మొ||వి.
  4. మనం ఉపయోగించి వదిలివేసే ప్లాస్టిక్ వ్యర్థాల వలన పర్యావరణం చాలా కలుషితమవుతుంది.
  5. సాధ్యమైనంత వరకు మనం పర్యావరణ కాలుష్యానికి దారితీసే పనులు చేయకుండా ఉంటే మనకు మంచిది.

ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన ‘పై’ చార్టులను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2
ఎ) పైన చూపబడిన ‘పై’ చార్టులు ఏ విషయం గురించి తెలియచేస్తున్నాయి?
బి) పరిశ్రమలలో ఉపాధి 1972-73 సం||తో పోలిస్తే 2009-10 సంవత్సరమునకు ఎంత శాతం పెరిగింది?
సి) 2009-10 నాటికి ఎక్కువ ఉపాధిని కల్పించిన రంగం?
డి) సేవారంగంలోని ఏవైనా రెండు ఉపాధులను రాయండి.
జవాబు:
ఎ) ‘పై’ చార్టులు పరిశ్రమలలో 1972-73 సం|| మరియు 2009-10 సం||లలో గల ఉపాధిని తెలియచేస్తున్నాయి.
బి) పరిశ్రమలలో ఉపాధి 1972-73లో పోల్చితే 2009-10 సం||రానికి రెండింతలు పెరిగింది. అనగా 11% నుండి 22% కి పెరిగింది.
సి) వ్యవసాయరంగం 2009-10 సం||రం నాటికి ఎక్కువ ఉపాధిని కల్పించింది.
డి) సేవారంగంలో ఉపాధిని కల్పించే అంశాలు :

  1. బ్యాంకులు
  2. రవాణా సదుపాయాలు
  3. టెలివిజన్, న్యూస్ పేపర్ మొ||వి.

ప్రశ్న 4.
“దేశాభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణ సమస్యలకు దారితీస్తున్న విషయం కూడా వాస్తవమే” దీనిపై మీ అభిప్రాయాలను వివరించండి.
జవాబు:
దేశాభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కాని వాటి కార్యకలాపాలు పర్యావరణ సమస్యలకు కూడా దారి తీస్తున్నాయి.

పై విషయంపై నా అభిప్రాయం ఏమిటంటే మొదటగా పరిశ్రమలు దేశానికి పట్టుకొమ్మలు. వాటి అభివృద్ధి లేనిదే మన అభివృద్ధి కూడా లేదు. అలాగని మన మనుగడకే ప్రమాదం తెచ్చేంతగా వాటిని అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. పరిశ్రమల నిర్మాణంలో ముఖ్యంగా ఈ క్రింది విషయాలను పాటించాలి.

  1. విడుదల చేసే వ్యర్థ పదార్థాలను పునరుత్పత్తికి వినియోగించాలి.
  2. ప్రతి పరిశ్రమ కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలి.
  3. పరిశ్రమలకు లైసెన్సులను పొందేటప్పుడు ప్రతి పరిశ్రమ కాలుష్య నివారణ నిబంధనలు పాటించున్నదో లేదో గమనించాలి.
  4. ఏదైనా పరిశ్రమ వలన మన పర్యావరణం దెబ్బతింటుంది అని మనకు అవగాహన కలిగితే సత్వరమే ఆ పరిశ్రమ మూసివేత చర్యలను చేపట్టాలి.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

These AP 9th Class Social Important Questions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 6th Lesson Important Questions and Answers భారతదేశంలో వ్యవసాయం

9th Class Social 6th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జీవనాధార వ్యవసాయమునందు ఎన్ని పద్ధతులు కలవు? అవి ఏవి?
జవాబు:
జీవనాధార వ్యవసాయం నందు రెండు రకాల వ్యవసాయ పద్ధతులు కలవు. అవి

  1. సాధారణ జీవనాధార వ్యవసాయం,
  2. సాంద్ర జీవనాధార వ్యవసాయం.

ప్రశ్న 2.
సాధారణ జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ పద్ధతి?
జవాబు:
సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే చిన్న కమతాలలో, పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన వ్యవసాయ పద్ధతి.

ప్రశ్న 3.
సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ విధానం?
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 4.
వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
జవాబు:
అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం.

ప్రశ్న 5.
వ్యవసాయ పంటలు వేటిపైన ఆధారపడి ఉంటాయి?
జవాబు:
వ్యవసాయ పంటలు ఋతువుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో ఎన్ని రకాల పంట కాలాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
భారతదేశంలో మూడు రకాల పంట కాలాలు కలవు. అవి రబీ, ఖరీఫ్, జయాద్.

ప్రశ్న 7.
రబీ పంటకాలం ఏది?
జవాబు:
రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంటను కోస్తారు.

ప్రశ్న 8.
రబీ పంటలు కొన్నింటిని రాయండి.
జవాబు:
గోధుమ, బార్లీ, బఠాణి, శనగలు, ఆవాలు ముఖ్యమైనవి.

ప్రశ్న 9.
ఖరీఫ్ పంటకాలం ఏది?
జవాబు:
నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమగును.

ప్రశ్న 10.
ఖరీలో పండించే కొన్ని పంటల పేర్లు రాయండి.
జవాబు:
వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, ప్రత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు.

ప్రశ్న 11.
‘జయాద్’ అనగానేమి?
జవాబు:
ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును ‘జయాద్’ అంటారు. పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొ||వాటిని జయాద్ కాలంలో పండిస్తారు.

ప్రశ్న 12.
HYVను విస్తరించండి.
జవాబు:
HYV – అధిక దిగుబడి విత్తనాలు – High Yielding Varieties.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 13.
జనుము ఉపయోగమేమి?
జవాబు:
జనుము ‘బంగారు పీచు’గా ప్రసిద్ధి. దీనిని గోనెసంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొ||నవి చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 14.
భారతదేశంలోని ఏవైనా రెండు పంటకాలాలు రాయండి.
జవాబు:
సాధారణంగా భారతదేశంలో 3 రకాల పంటకాలాలు కలవు. వానిలో ఖరీఫ్, రబీ అనేవి రెండు ముఖ్యమైన పంటకాలాలు. మూడవది జయాద్.

ప్రశ్న 15.
కింది పటంలో గుర్తించబడిన ప్రాంతాలలో పండే ప్రధాన పంట ఏది?
జవాబు:
వరిని ఈ ప్రాంతాలలో ప్రధాన పంటగా పండిస్తారు.

ప్రశ్న 16.
NABARD ను విస్తరించండి.
జవాబు:
NATIONAL BANK FOR AGRICULTURAL AND RURAL DEVELOPMENT.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 17.
MSP ను విస్తరింపుము.
జవాబు:
Minimum Support Price.

9th Class Social 6th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“హరిత విప్లవం వలన చాలా ప్రాంతాలలో భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది” – ఈ వ్యాఖ్యతో ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
“హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాలలో భూముల సారం తగ్గి రైతుల వ్యవసాయ పెట్టుబడి ఖర్చు కూడా పెరిగింది.” – పై వాక్యంతో మీరు ఏకీభవిస్తున్నారా? సరైన వివరణలతో మీ వాదనను సమర్థించుకొనండి.
జవాబు:
అవును, నేను పై వ్యాఖ్యతో ఏకీభవిస్తాను.

  1. రసాయన ఎరువులలో నీటిలో వెంటనే కరిగే ఖనిజాలు ఉండడం వలన మొక్కలకు పోషకాలు త్వరగా అందుతాయి. అయితే ఇవి ఎక్కువ కాలం నేలలో నిలవ ఉండవు.
  2. వీటివలన చెరువులు, నదులలోని నీరు, భూగర్భజలాలు కలుషితమవుతాయి.
  3. మట్టిలో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి.
  4. దానితో కొంతకాలం తరువాత నేల మునుపటికంటే నిస్సారంగా తయారవుతుంది.
  5. నేలలో సూక్ష్మజీవుల ద్వారా అందే పోషకాలు అందకపోవడం వలన రైతు మరిన్ని ఎరువులు వాడవలసి ఉంటుంది.
  6. ఈ విధంగా హరిత విప్లవం వలన రైతుకి ఖర్చు పెరిగి భూములకి సారం తగ్గింది.

ప్రశ్న 2.
భారతదేశంలో పంటకాలాలు పేర్లు రాసి, అవి ఏయే నెలల మధ్య ఉంటాయో రాయండి.
జవాబు:
భారతదేశంలో మూడు పంటకాలాలు కలవు. అవి ఖరీఫ్, రబీ, జయాద్.

నైఋతీ రుతుపవనాల రాకతో అనగా జూన్ నెలలో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబరు మధ్యకాలంలో పంటకోతలు ప్రారంభమగును.

రబీ పంటను శీతాకాలంలో అక్టోబరు నుండి డిసెంబర్ మధ్య కాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో పంటకోతలు ప్రారంభమగును. – ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్ అంటారు. ఇది ఏప్రిల్, మే నెలలో ఉంటుంది.

ప్రశ్న 3.
వ్యవసాయ దారులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించండి. దీని ఆధారంగా మీ పరిశీలనను రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం
జవాబు:
పై బార్ గ్రాఫ్ 1951 నుండి 2001 వరకు భారతదేశంలో వ్యవసాయ కూలీలు ఎందరు మరియు వ్యవసాయదారులు ఎంతశాతం అనేది తెలియచేస్తుంది.

వ్యవసాయకూలీలు % వ్యవసాయదారులు %
1951 28% 72%
1961 24% 76%
1971 38% 62%
1981 37% 63%
1991 40% 60%
2001 46% 54%

పై బార్ గ్రాఫ్ పరిశీలిస్తే వ్యవసాయదారుల సంఖ్య తగ్గిపోతూ వ్యవసాయ కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 4.
కింది పట్టికలో ఇవ్వబడిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ లో చూపి నీ యొక్క పరిశీలనను రాయుము.

సంవత్సరం ఆహారధాన్యాల ఉత్పత్తి (మి. టన్నులలో)
1980 – 81 130
1990 – 91 176
2000 – 01 197
2010 – 11 242

జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1
పై బార్ గ్రాఫ్ ని పరిశీలించినట్లయితే 1980-81 సం|| నుండి 2010 – 11 సం||రాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీనిని గమనించినట్లయితే పెరుగుతున్న జనాభాకు మనం ఆహారధాన్యాల సరఫరాను సక్రమంగా అందించగలం.

ప్రశ్న 5.
నేడు భారతదేశపు దిగుమతులలో ఆహార వస్తువులు కేవలం మూడు శాతం మాత్రమే. ఈ ఘనత సాధనలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
గడచిన ఏడు దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారుగా 5 రెట్లు.

రైతులు అధిక మొత్తంలో ఆహారధాన్యాల, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగుచేయడానికి హరిత విప్లవం దోహదపడింది. అయితే వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. 1960లో ఒక రైతు ఎకరాభూమిలో 287 కిలోల ఆహారధాన్యాలను పండించగా ప్రస్తుతం అదే రైతు ఒక ఎకరా సాగు భూమిలో 800 కిలోల ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. ఈ పెరుగుదల హరిత విప్లవం వలన జరిగింది. దానివలన మనం ఆహారధాన్యాల దిగుమతిని తగ్గించుకున్నాం. ఎందుకనగా హరిత విప్లవం వలన మనకు అవసరమైన ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుచున్నది.

హరిత విప్లవం ప్రాధాన్యత :

  1. హైబ్రిడ్ విత్తనాల వాడకం
  2. ఎరువుల వాడకం
  3. క్రిమిసంహారక మందుల వినియోగం
  4. సరియైన నీటి పారుదల సౌకర్యాల కల్పన.

9th Class Social 6th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గ్రాఫ్ ను పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
అ) వ్యవసాయదారునికి, వ్యవసాయ కూలీకి మధ్యగల భేదం ఏమిటి?
ఆ) 1971 సం||లో వ్యవసాయదారుల శాతం ఎంత?
ఇ) భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సూచించండి.
ఈ) ఏ సంవత్సరంలో అత్యధిక వ్యవసాయదారుల శాతం నమోదయింది?
జవాబు:
అ) స్వంత పొలం కలిగినవారిని వ్యవసాయదారులు గానూ, ఇతరుల పొలాలలో పనిచేసేవారిని వ్యవసాయకూలీలు గానూ పిలుస్తారు.
ఆ) 62%
ఇ) పాడి పశువుల పెంపకం, కూరగాయల అమ్మకం, ఇటుక బట్టీలలో పనిచేయడం.
ఈ)1961.

ప్రశ్న 2.
ప్రస్తుతం భారతదేశ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీరు చేసే సూచనలేవి?
జవాబు:

  1. మంచి విత్తనాలను మాత్రమే వినియోగించాలి. ప్రభుత్వంచే గుర్తించబడిన విత్తనాలను మాత్రమే వాడాలి.
  2. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.
  3. ఆ ప్రాంతంలో దొరికే నీటి మీద ఆధారపడి పంటలు పండించాలి.
  4. ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కువ సబ్సిడీలను ఇవ్వాలి.
  5. వాతావరణ విశేషాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం రైతులకు తెలియచేయాలి.
  6. ప్రభుత్వం రైతులకు ధాన్యాలను నిల్వ ఉంచడానికి అవసరమైన గిడ్డంగుల సదుపాయాలను ఉచితంగా అందించాలి.
  7. ఆహార పంటల పెంపకానికి అనువుగాని ప్రదేశాలలో ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇచ్చి వాణిజ్య పంటలను లేదా పశువుల పెంపకానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అవసరమైతే సబ్సిడీలను ఇవ్వాలి.

ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3
ఎ) పై పట్టికను అనుసరించి ఎవరు పెద్ద రైతులుగా పరిగణించబడతారు?
బి) ఏ రకమైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది?
సి) భారతదేశంలో రైతులచే సాగుచేయబడుతున్న మొత్తం భూమి ఎంత?
డి) ఉపాంతర రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం ఎంత?
జవాబు:
ఎ) 25 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగియుండి మరియు సాగుచేసే రైతులు పెద్ద రైతులుగా పరిగణించబడతారు.
బి) ఉపాంత రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది.
సి) 3932 లక్షల ఎకరాల విస్తీర్ణం గల భూమి రైతులచే సాగు చేయబడుతుంది.
డి) ఉపాంత రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం 0.95 ఎకరాలు.

ప్రశ్న 4.
“వర్షాధార ప్రాంతంలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవటం మొదటి బాధ్యత. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించ నీయకుండా చూడగలగాలి. దీనివలన నీరు భూమిలోకి ఇంకటానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.”
ప్రశ్న : వర్షాధార ప్రాంతాలలోని భూగర్భజల వృద్ధి కార్యక్రమాల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
వర్షాధార ప్రాంతాలలో భూగర్భజల వృద్ధి కార్యక్రమాలు :

  1. మొదటగా ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి వర్షం పడినప్పుడు నీటిని భూమిలోపలికి ఇంకేలా చేయాలి.
  2. కెమికల్ (రసాయన) వ్యర్థ పదార్థాలను భూమి లోపలికి పంపించకూడదు.
  3. రసాయన వ్యర్థ పదార్థాల విడుదలలో, సరియైన విధానాలను పాటిస్తే భూగర్భజలం కాలుష్యానికి గురికాకుండా ఉంటుంది.
  4. మనం ప్రతిరోజూ ఉపయోగించే నీరు వృథా చేయకుండా జాగ్రత్త వహించాలి.
  5. భూగర్భ జల వినియోగం ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా తెలియచేయాలి.
  6. ఇంకుడు గుంతల కార్యక్రమం మరియు వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా భూగర్భజలాన్ని వృద్ధి చేయాలి.
  7. భూగర్భ జలం తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీరు ఎక్కువగా వినియోగించే పంటలను పండించకూడదు.

ప్రశ్న 5.
ఒకదేశ ఆహారభద్రత ఆ దేశపు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ వ్యవసాయ రంగమును గూర్చి వివరింపుము.
జవాబు:
దేశ ఆహారభద్రతకు వ్యవసాయరంగం భరోసానిస్తుంది.

  1. భారతదేశ వ్యవసాయ రంగం ఆహారభద్రతకు భరోసా ఇవ్వడమే కాకుండా పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థములను అందిస్తుంది.
  2. లక్షల మంది ప్రజలకు భారతీయ వ్యవసాయం ఉపాధిని కల్పిస్తుంది.
  3. మన దేశం యొక్క శ్రామికులలో సగం మందికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో పనిచేస్తున్నారు.
  4. వ్యవసాయరంగంలో దాదాపుగా 70% మహిళా శ్రామికులు ఉపాధిని పొందుతున్నారు.
  5. భారతీయ వ్యవసాయం హరిత విప్లవం వలన అభివృద్ధి చెంది ఆహారభద్రతను పెంపొందించగలుగుతోంది.
  6. దీని వలన మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సంఖ్య తగ్గినది.

ప్రశ్న 1.
భారతీయ రైతులు ప్రధానంగా చిన్న కమతాలు కలిగి ఉన్నారు.
చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం. అనేక మంది రైతులు చిన్న చిన్న కమతాలలోనే సాగుచేస్తున్నారు. కింది పట్టికను గమనించండి.
పట్టిక – 1 భారతదేశంలోని రైతుల సంఖ్య, వారు కలిగి ఉన్న భూమి (2010 – 2011)
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4
ఈ కింది వివరణ చదివి దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు వివరణ ఇవ్వండి.
అత్యధికమైన రైతులు చిన్న కమతాలను నిర్వహిస్తున్నారు. భారతీయ రైతులకు సంకేతం లాంటి ఉపాంత రైతులకు 2.5 ఎకరాల సాగు భూమి కలదు. మొత్తం రైతులలో 924 లక్షల మంది ఉపాంత రైతులు, అంటే మొత్తం రైతులలో 67 శాతం మంది ఉపాంత రైతులే. ఉపాంత రైతులు, చిన్న రైతులను కలిపితే వీరి సంఖ్య మొత్తం రైతులలో 85 శాతం అవుతారు. పెద్ద, మధ్యతరహా రైతులు కలిసి తక్కువ శాతం ఉన్నప్పటికిని వారి ఆధీనంలో వాస్తవంగా ఉన్న కమతాల విస్తీర్ణం ఎక్కువ. 1760 లక్షల మంది రైతులు ఈ సమూహానికి చెంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వీరు అత్యంత ప్రభావవంతంగా ఉన్నారు. ఈ సమూహంలోని రైతులు 32 శాతం వ్యవసాయ భూమిని సాగుచేస్తున్నారు. ఉదాహరణకు ప్రతి పెద్ద రైతుకు సగటున 42.9 ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. దీనితో పోల్చి చూస్తే ప్రతి ఉపాంత రైతుకు సగటున 0.94 ఎకరాలు మాత్రమే అందుబాటులో కలదు. భూమి పంపిణీలో అసమానతలు, రైతులు ఎదుర్కొంటున్న అవకాశాలలో అసమానతలు, పేదరికం, అభివృద్ధి అవకాశాలు మొదలైన అంశాలను వివరిస్తాయి.

1. మీ అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించడానికి అతడికి “కనీస సాగుభూమి” ఎంత ఉండాలి. పై పట్టికలో ఎంతమంది రైతులు మీరు అంచనా వేసిన కనీస భూమిని కలిగి ఉన్నారు?
జవాబు:
నా అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించటానికి అతడికి కనీస సాగుభూమి 2.6 నుండి 5 ఎకరాల వరకు ఉండాలి.

పై పట్టిక ప్రకారం ఇలాంటి రైతులు మనదేశంలో దాదాపు 454 లక్షలమంది ఉన్నారు.

2. కొద్దిమంది రైతులు ప్రభావవంతంగా ఉన్నారు ఎందుకు?
జవాబు:
924 లక్షలమంది గల ఉపాంత రైతుకు సగటున 2.5 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. అందువలన మధ్యతరహా, పెద్ద రైతులు ప్రభావవంతంగా ఉన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

These AP 9th Class Social Important Questions 5th Lesson జీవావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 5th Lesson Important Questions and Answers జీవావరణం

9th Class Social 5th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అనగానేమి?
జవాబు:
ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది. దీనినే ‘ఆహారపు గొలుసు’ అంటారు.

ప్రశ్న 2.
మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని తినే జంతువులు ఏవి?
జవాబు:
మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.

ప్రశ్న 3.
మాంసాహార జంతువులు అనగానేమి?
జవాబు:
శాకాహార జంతువులను తినే వాటిని మాంసాహార జంతువులంటారు. కుక్క, పిల్లి, డేగ, పులి, సింహం మొ||నవి ఉదాహరణలు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 4.
సహజ వృక్షజాలాన్ని ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? అవి ఏవి?
జవాబు:
సహజ వృక్ష జాలాన్ని ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు.

  1. తగినంత వర్షపాతం, ఎండ ప్రాంతాల్లో అడవులు
  2. ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో గడ్డిభూములు
  3. శుష్క ప్రాంతాలలో పొదలు.

ప్రశ్న 5.
టండ్రా వృక్షజాలం అనగానేమి?
జవాబు:
బాగా చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే నాచు, లిచెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు.

ప్రశ్న 6.
మధ్యధరా వృక్షజాలానికి ఆ పేరు ఎలా వచ్చింది?
జవాబు:
ఇవి మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో కనబడతాయి. కాబట్టి వీటికి మధ్యధరా వృక్షజాలం అని పేరు వచ్చింది.

ప్రశ్న 7.
టైగా అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో 50 నుంచి 70° అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనపడతాయి. వీటిని ‘టైగా’ అని కూడా అంటారు.

ప్రశ్న 8.
స్టెప్పీలు అనగానేమి?
జవాబు:
ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘స్టెప్పీలు’ అంటారు. ఇక్కడి గడ్డి కురచగా ఉంటుంది.

ప్రశ్న 9.
ఏ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం’ అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో వృక్షజాలం తక్కువ. నాచు, లిచెన్, చిన్న చిన్న పొదలు’ వంటివి ఇక్కడ ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 10.
శిలాజ ఇంధనాలు వేటిని అంటారు?
జవాబు:
లక్షల సం||రాల క్రితం అడవులు భూమిలోపలికి తిరగబడటం వల్ల బొగ్గు, చమురులు ఏర్పడ్డాయి. అందుకే వీటిని ‘శిలాజ ఇంధనాలు’ అంటారు.

ప్రశ్న 11.
శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తే విడుదలగు రసాయనాలు ఏవి?
జవాబు:
శిలాజ ఇంధనాలు ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారలోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.

ప్రశ్న 12.
ఆమ్లవర్షం అని దేనిని అంటారు?
జవాబు:
వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్లశాతం పెరుగుతుంది. దీనినే ఆమ్ల వర్షం అంటారు.

ప్రశ్న 13.
‘ప్రపంచం వేడెక్కటం’ అనగానేమి?
జవాబు:
వివిధ రకాల కాలుష్యాల వలన – పర్యావరణం విషపూరితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారుతాయి. దీనినే ‘ప్రపంచం వేడెక్కటం’ (Global warming) అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 14.
“భూగోళం వేడెక్కడానికి” గల ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. అడవుల నిర్మూలన, శిలాజ ఇంధన వినియోగం.
  2. పరిశ్రమల నుండి విడుదల చేసే వివిధ రకాల కాలుష్యకారకమైన వాయువులు.

ప్రశ్న 15.
పర్యావరణ కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన కల్గించడానికి చేపట్టదగిన ఏవైనా రెండు కార్యక్రమాలను రాయండి.
జవాబు:

  1. గ్రామాలలో మరియు పట్టణాలలో డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన ద్వారా కాలుష్యం ఎలా పెరుగుతుంది మరియు ఎలా అరికట్టాలి అనేది తెలియచేయాలి.
  2. జానపద పాటలు, మరియు నాటకాల ద్వారా పర్యావరణం మనకు ఎంత అవసరమో మరియు దానిని ఎలా పరిరక్షించాలో తెలియచేయాలి.

ప్రశ్న 16.
అటవీ సంరక్షణ మీద నినాదాలు రాయండి.
జవాబు:
అటవీ సంరక్షణ మీద నినాదాలు :

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. మొక్కలను కాపాడండి – అవి మన ప్రాణాలను కాపాడుతాయి.

9th Class Social 5th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గాలి, నీరు, నేలలో విషపూరితమైన పదార్థాలు కలవటం వలన జీవావరణ సంక్షోభానికి దారితీస్తుంది. దీని నివారణకు విద్యార్థిగా మీరు సూచించే పరిష్కార మార్గాలు తెలపండి.
జవాబు:
గాలి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. గాలిలో ఉన్న మరియు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం తక్కువ దూరాలకు నడిచి కాని, సైకిల్ ద్వారా కాని, మరియు ప్రభుత్వ రవాణా సదుపాయాల ద్వారా కాని చేరుకోవాలి.
  2. ఎక్కువగా మొక్కలను పెంచాలి.
  3. రైతులు పొలంలో మిగిలిన వ్యర్థ పదార్థాలను తగులు పెట్టకుండా వాటిని వేరే విధంగా ఉపయోగించాలి.
  4. పరిశ్రమలలో కూడా కాలుష్య నియంత్రణ చేసే యంత్రాలను వాడేవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.

నీటి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. పరిశ్రమలలోని వ్యర్థాలను చెరువులు, నదులు, సముద్రాలలోనికి వదలకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
  2. రైతులు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.

నేల కాలుష్యం – నివారణ చర్యలు :

  1. రైతులు రసాయన ఎరువులను వాడటం వలన నేల కలుషితం అయి సారాన్ని కోల్పోతుంది.
  2. కావున వారు రసాయన ఎరువుల వాడకాన్ని చాలావరకు తగ్గించాలి.

ప్రశ్న 2.
AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం 1
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ. భారతదేశంలో అధికభాగం ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి?
బి. హిమాలయాలలోని అడవుల రకం ఏవి?
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏవి?
డి. టేకు, వేప లాంటి చెట్లు ఏ రకమైన అడవులలో పెరుగుతాయి?
జవాబు:
ఎ. భారతదేశంలో అధికభాగం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్నాయి.
బి. భారతదేశంలోని హిమాలయాలలో శృంగాకారపు అడవులు ఉన్నాయి.
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు, రోజ్ వుడ్, ఎబోని, మహాగని, గట్టి కలపనిచ్చే చెట్లు.
డి. టేకు, వేప లాంటి చెట్లు ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో పెరుగుతాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

These AP 9th Class Social Important Questions 4th Lesson వాతావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 4th Lesson Important Questions and Answers వాతావరణం

9th Class Social 4th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నాసా వాతావరణాన్ని గురించి ఏమి వివరించింది?
జవాబు:
నాసా (NASA) ‘నేషనల్ ఏరోనాటిక్స్ ఎండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (అమెరికా) – భూమి బాస్కెట్ బాల్ అంత ఉంటే, వాతావరణం దానిచుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుందని వివరించింది.

ప్రశ్న 2.
వాతావరణంలో ఉండే వాయువులు ఏవి?
జవాబు:
వాతావరణంలో ప్రాణవాయువు (21%), నత్రజని (78%), ఆర్గాన్, నియాన్, బొగ్గుపులుసు వాయువులు (0.03%), మీథేన్, అమ్మోనియా, ఓజోన్ వంటి అనేక వాయువులున్నాయి.

ప్రశ్న 3.
వాతావరణంలో ఉండే ప్రధాన పొరలేవి?
జవాబు:
వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా రెండు ప్రధాన పొరలుగా విభజించారు.

  1. సమరూప ఆవరణం (Homosphere)
  2. బహురూప ఆవరణం (Heterosphere)

ప్రశ్న 4.
సమరూప ఆవరణంలో ఎన్ని పొరలుంటాయి? అవి ఏవి?
జవాబు:
సమరూప ఆవరణం ’90’ కిలోమీటర్లు ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో మూడు పొరలుంటాయి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణంలు. ఈ పొరలు వాయువుల నిష్పత్తి అంతటా ఒకేరకంగా ఉంటుంది.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 5.
బహురూప ఆవరణలోని పొరలని వివరించండి.
జవాబు:
బహురూప ఆవరణం 90 కి.మీ. కంటే పైన ఉన్న వాతావరణ పొర. దీనిలో థర్మోఆవరణం, ఎక్సో ‘ఆవరణం అని రెండు పొరలున్నాయి. దీంట్లో వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది.

ప్రశ్న 6.
వాయుపీడనం అనగానేమి?
జవాబు:
గాలిలో వాయు పరమాణువులు ఏ వస్తువు పైన అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్ని “వాయు పీడనం” అంటారు.

ప్రశ్న 7.
సమీరం అంటే ఏమిటి?
జవాబు:
గాలి నిదానంగా వీచి, హాయిగా ఉన్నపుడు దానిని ‘సమీరం’ (తెమ్మెర) అంటారు. దీనిని ‘అంతర అయన రేఖ అభిసరణ’ ప్రాంతం అంటారు.

ప్రశ్న 8.
అంతర అయన రేఖ అభిసరణ ప్రాంతం అంటే ఏది?
జవాబు:
అధిక వేడిమి వల్ల భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గి అల్ప పీడనం ఏర్పడుతుంది. దీనినే భూమధ్యరేఖ తక్కువ (అల్ప) పీడన మేఖల లేదా అంతర అయన రేఖ అభిసరణ ప్రాంతం అంటారు.

ప్రశ్న 9.
‘కొరియాలిస్ ప్రభావం’ అంటే ఏమిటి?
జవాబు:
భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న దాని ప్రభావంను ‘కొరియాలిస్ ప్రభావం’ అంటారు.

ప్రశ్న 10.
పవనాలను ఎన్ని రకాలుగా విభజిస్తారు? అవిఏవి?
జవాబు:
పవనాలను మూడు రకాలుగా విభజిస్తారు.
ప్రపంచ పవనాలు – భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి.
ఋతు పవనాలు – ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితమై ఉంటాయి.
స్థానిక పవనాలు – స్థానికంగా వీస్తాయి.

ప్రశ్న 11.
ప్రపంచ పవనాలు అనగానేమి?
జవాబు:
ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా, క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలంటారు. ఇవి మూడు రకాలు. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధృవ పవనాలు.

ప్రశ్న 12.
ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
భూమి, నీరు (సముద్రం)చల్లబడటం, వేడెక్కడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 13.
చినూక్ అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ‘చినూక్’ అంటారు. ‘చినూక్’ అన్న పదానికి ‘మంచు తినేది’ అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు.

ప్రశ్న 14.
ఫోన్ అంటే ఏమిటి?
జవాబు:
యూరప్ లో వీచే ఉష్ణపవనాలను ఫోన్ అంటారు. ఇవి ఆర్ట్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ద్రాక్షపళ్లు త్వరగా పండటానికి ఇవి సహాయం చేస్తాయి.

ప్రశ్న 15.
‘లూ’ అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తర భారతదేశంలో మే – జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి, పొడి పవనాలను ‘లూ’ అంటారు.

ప్రశ్న 16.
‘మిస్ట్రాలు’ అంటే ఏమిటి?
జవాబు:
ఆల్ప్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రంవైపుకు వీచే శీతల పవనాలు ‘మిస్ట్రాలు’. ఇది రోమ్ లోయగుండా వీస్తాయి.

ప్రశ్న 17.
‘పాంపెరో’ అంటే ఏమిటి?
జవాబు:
దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డిమైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలను ‘పాంపెరో’ అంటారు.

ప్రశ్న 18.
స్థానిక వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
తక్కువ కాలానికి (10 రోజులకు మించని) వాతావరణ పరిస్థితులను (వర్షపాతం, ఉష్ణోగ్రత) వివరించటాన్ని స్థానిక వాతావరణం అంటారు.

ప్రశ్న 19.
వాతావరణంలోని అంశాలు ఏవి?
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో తేమ, వర్షపాతం మొ||వి వాతావరణంలోని అంశాలు.

ప్రశ్న 20.
శీతోష్ణస్థితులు అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితులు (క్లైమేట్) అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 21.
సాపేక్ష ఆర్థత అనగానేమి?
జవాబు:
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరికి, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదుకు గల నిష్పత్తిని సాపేక్ష ఆర్ధత అంటారు.

ప్రశ్న 22.
హిమపాతం అనగానేమి?
జవాబు:
నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో నీటి ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా మారి కిందకు మంచు తునకలుగా పడుతుంది. దీనిని హిమపాతం అంటారు.

ప్రశ్న 23.
స్లీట్ అనగానేమి?
జవాబు:
భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వానకురుస్తున్నపుడు వర్షబిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనిని ‘స్లీట్’ (హిమశీకరాలు) అంటారు.

ప్రశ్న 24.
వర్షపాతమును ఎన్ని రకాలుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
వర్షపాతం సంభవించే దాన్ని బట్టి దానిని మూడు ప్రధాన రకాలుగా విభజించారు. అవి సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం.

ప్రశ్న 25.
ఒక విద్యార్థిగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి నీవు చేయదగిన రెండు కృత్యాలను సూచింపుము.
జవాబు:

  1. సౌరశక్తిని వినియోగించడం (సోలార్ శక్తి)
  2. మొక్కలను పెంచడం (ఖాళీ ప్రదేశాలలో మొక్కలను ఎక్కువగా పెంచాలి).

9th Class Social 4th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘వాతావరణ మార్పు’ సమకాలీన ప్రపంచంపై ఎటువంటి ప్రభావాలను చూపుతోందో తెల్పండి.
జవాబు:
వాతావరణ మార్పు సమకాలీన ప్రపంచం మీద ఇలా ప్రభావాన్ని చూపుతుంది.

  1. మన జీవన విధానం మారుతుంది.
  2. వాతావరణంలో ఆర్థత పెరుగుతుంది.
  3. కాలానుగుణంగా వచ్చే ఋతువులలో మార్పు వస్తుంది.
  4. గ్లోబల్ వార్మింగ్ సమస్య ఇంకా పెరుగుతుంది.
  5. తీరప్రాంతాలలో ఉండే ప్రజలు తరచుగా తుఫానులను ఎదుర్కొంటారు.
  6. ‘ఎల్ నినో’ మరియు ‘లానినో’ సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి.
  7. మానవులు ఆరోగ్య సమస్యలచే ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు.
  8. కొన్ని రకాలైన పక్షులు, జంతువులు అంతరించిపోతాయి.

ప్రశ్న 2.
ఈ కింది పట్టికను పరిశీలించి క్రింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పొరపేరు విస్తీర్ణం లక్షణములు
ట్రోపో ఆవరణం 13 కి.మీ. వరకు భూమధ్య రేఖ మొత్తం వాతావరణ మార్పులన్నీ ఈ పొరలోనే జరుగుతాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది.
స్ట్రాటో ఆవరణం 50 కి.మీ. వరకు ఈ పొరలో మబ్బులు, తుఫానులు వంటివి ఉండవు. కనుక జెట్ విమానాలు ఎగరడానికి అనువుగా ఉంటుంది. ఓజోన్ పొర ఉండడం ఒక ముఖ్యమైన అంశం. ఎత్తుకు పోయే కొలదీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
మీసో ఆవరణం 80 కి.మీ. ఎత్తు వరకు విశ్వంలోనుంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తుకు పోయే కొలదీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
థర్మో ఆవరణం 400 కి.మీ. ఎత్తు వరకు ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. ఇక్కడ ఉండే అయాన్లు విద్యుదావేశం కలిగి ఉంటాయి. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు అయాన్ల వలన భూమి పరావర్తనం చెందుతాయి.
ఎక్సో ఆవరణం 400 కి.మీ. – ఆ పైన ఇది వాతావరణంలో పై పొర, అత్యంత ఎత్తులో ఉండే ఈ సొగ గురించి మనకి తెలిసింది తక్కువ.

ఎ) జెట్ విమానాలు ఎగరడానికి స్ట్రాటో ఆవరణం ఎందుకు అనుకూలం?
బి) అత్యంత ఎత్తులో గల పొర ఏది?
సి) అయాన్లు ఏ పొరలో ఉంటాయి?
డి) ఏ పొరలో అవపాతం, తుఫాను సంభవిస్తాయి?
జవాబు:
ఎ) స్ట్రాటో ఆవరణంలో మబ్బులు, తుఫానులు వంటివి ఉండవు కావున జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది.
బి) ఎక్సో ఆవరణం 400 కి.మీ. పైన ఎత్తులో గలదు. కావున ఇది అత్యంత ఎత్తులో ఉండే పొర.
సి) అయాన్లు థర్మో ఆవరణంలో ఉంటాయి.
డి) ట్రోపో ఆవరణంలో అవపాతం, తుఫాను సంభవిస్తాయి.

ప్రశ్న 3.
వర్షపాతం సంభవించే విధానాన్ని బట్టి వర్షపాతాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? అవి ఏవి? ఏదైనా ఒకదాని గురించి వివరించండి.
జవాబు:
వర్షపాతం సంభవించే విధానాన్ని బట్టి దానిని మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు.

  1. సంవహన వర్షపాతం
  2. పర్వతీయ వర్షపాతం
  3. చక్రీయ వర్షపాతం

సంవహన వర్షపాతం :
వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు. ఈ రకమైన వర్షపాతం తక్కువ ఎత్తులలోనూ, ఖండాల లోపలి ప్రాంతాల్లో వేసవిలో ఎక్కువగా కురుస్తుంది. సాధారణంగా ఇటువంటి వానలు రోజులో బాగా వేడెక్కిన తరువాత హఠాత్తుగా కురిసే పెద్ద జల్లుగా ఉంటాయి. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఉరుములు, మెరుపులు ఉంటాయి.

ప్రశ్న 4.
ఇవ్వబడిన చిత్రమును పరిశీలించి ప్రపంచ పవనాలు మరియు పీడన మేఖలల గూర్చి నాలుగు వాక్యములు వ్రాయుము.
AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం 1
జవాబు:
ఇచ్చిన చిత్రం ప్రకారం గాలి అధిక పీడన ప్రాంతం వైపు నుండి అల్పపీడన ప్రాంతం వైపు వీయడం జరుగుతుంది.

సహజంగా భూమధ్యరేఖా ప్రాంతంలో అల్ప పీడనం ఉంటుంది. ఈ భూమధ్య ఈ రేఖా ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండి గాలులు వేడెక్కి వేడెక్కిన గాలి పైకి లేస్తుంది. దీని వలన భూమధ్యరేఖా ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. దీనిని అల్ప పీడనం అంటారు. అదే సమయంలో ఉప అయన రేఖా ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. దీని వలన గాలులు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

సాధారణంగా పవనాలు సమశీతోష్ణ మండలం నుండి ఉష్ణమండలానికి, ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 1.
శీతల స్థానిక పవనాలను గురించి రాయుము.
జవాబు:
1. మిస్ట్రాల్ :
శీతల స్థానిక పవనాల్లో ఆల్ఫ్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపునకు వీచే మిస్ట్రాల్ – గాలులు పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయగుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగానూ, పొడిగానూ ఉంటాయి.

2. ప్యూనా :
ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.

3. పాంపెరో :
ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డి మైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు.

ప్రశ్న 2.
ఉష్ణస్థానిక పవనాలను గురించి రాయుము.
జవాబు:
ఉష్ణ స్థానిక పవనాలు :
1. చినూక్ :
ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ‘చినూక్’ అంటారు. చినూక్ అన్న పదానికి ‘మంచును తినేది’ అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చినూక్. ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాలలో – శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. యూరపులో వీచే ఇటువంటి పవనాలను ‘ఫోన్’ అంటారు. ఇవి ఆల్ప్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్లు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి.

2. పడగాలులు (లూ) :
ఉత్తర భారతదేశంలో మే – జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పునకు వీచే వేడి, పొడి పవనాలను ‘లూ’ అంటారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ’ తగలవచ్చు.

స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారిలో సైమూన్, జపాన్లో యోమా, న్యూజిలాండ్ లో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలు:

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

These AP 9th Class Social Important Questions 3rd Lesson జలావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 3rd Lesson Important Questions and Answers జలావరణం

9th Class Social 3rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నీటిచక్రం అంటే ఏమిటి?
జవాబు:
నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ‘నీటి చక్రం’ అంటారు.

ప్రశ్న 2.
నీటిచక్రంలో ఎన్ని దశలున్నాయి? అవి ఏవి?
జవాబు:
నీటిచక్రంలో ఆరు దశలు ఉన్నాయి. బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భజలం.

ప్రశ్న 3.
బాష్పీచలనం అంటే ఏమిటి?
జవాబు:
నేలమీద నున్న నీరు ఆవిరి అయి వాతావరణంలోకి ప్రవేశించటాన్ని ‘బాష్పీభవనం’ అంటారు.

ప్రశ్న 4.
ద్రవీభవనం అంటే ఏమిటి?
జవాబు:
‘నీటిఆవిరి ‘ నీరుగా (చిన్న నీటి బిందువులు, మబ్బులుగా) మారటాన్ని ద్రవీభవనం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
అవపాతం అంటే ఏమిటి?
జవాబు:
వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని అవపాతం అంటారు.

ప్రశ్న 6.
భూస్వరూపాలు అంటే ఏవి?
జవాబు:
భూమి మీది ఖండాలను, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు.

ప్రశ్న 7.
భూమిమీద గల నీటి భాగం ఎన్ని భాగాలుగా విభజింపబడింది? అవి ఏవి?
జవాబు:
భూమి మీద గల నీటి భాగాన్ని చూశాస్త్రజ్ఞులు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ (అంటార్కిటిక్), ఆర్కిటిక్ అనే అయిదు మహాసముద్రాలుగా విభజించారు.

ప్రశ్న 8.
సముద్రం అంటే ఏమటి?
జవాబు:
చుట్టూ లేదా కనీసం ఒక వైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు.

ప్రశ్న 9.
‘పాంథాల్సా’ అంటే ఏమిటి?
జవాబు:
మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేవి, దీన్ని ‘పాంథాల్సా’ అంటారు.

ప్రశ్న 10.
సమలోతుగీత అంటే ఏమిటి?
జవాబు:
ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీత (ఐసోబాక్స్) అంటారు.

ప్రశ్న 11.
సమలవణీయత రేఖ అంటే ఏమిటి?
జవాబు:
సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖను సమలవణీయత రేఖ (Isohaline) అంటారు.

ప్రశ్న 12.
సముద్ర ప్రవాహాలు అని వేటిని అంటారు?
జవాబు:
ఒక కచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని సముద్రపు ప్రవాహాలు అంటారు.

ప్రశ్న 13.
ఉష్ణోగ్రతల ఆధారంగా సముద్ర ప్రవాహాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి?
జవాబు:
ఉష్ణోగ్రతల ఆధారంగా సముద్రప్రవాహాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఉష్ణప్రవాహాలు, శీతల ప్రవాహాలు.

ప్రశ్న 14.
వేగాన్ని బట్టి సముద్ర ప్రవాహాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను డ్రిప్ట్ అనీ, స్ట్రీం అనీ వర్గీకరిస్తారు. నిదానంగా ప్రవహించే దానిని డ్రిప్ట్ అనీ, వేగంగా ప్రవహంచే దానిని స్ట్రీం అనీ పిలుస్తారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 15.
సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసేవి ఏవి?
జవాబు:
లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 16.
వనరులుగా మహాసముద్రాలను ఏవిధంగా అభినందిస్తారు?
జవాబు:
అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలో వెలిశాయి. సముద్రాలే ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతివిలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మహాసముద్రాలు పునరావృతమయ్యే వనరులు.

ప్రశ్న 17.
నేడు మనం మహాసముద్రాలను ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో తెలపండి.
జవాబు:
మనం ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నాం,

9th Class Social 3rd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

మహాసముద్రం వివరాలు
1. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఆసియా, ఓషియానా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియా) లను వేరుచేస్తుంది.
2. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
3. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది.
4. అంటార్కిటిక్ మహాసముద్రం
(దక్షిణ మహాసముద్రం)
అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు.
5. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేసియా తీరాలను తాకుతుంది.

పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం ఏది?
ii) అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మహాసముద్రం ఏది?
iii) హిందూ మహాసముద్రంచే వేరు చేయబడుతున్న ఖండాలు ఏవి?
iv) ఓషియానాలో ఉండే భూభాగాలు ఏవి?
జవాబు:
i) అంటార్కిటిక్ మహాసముద్రం దక్షిణ మహాసముద్రంగా పిలువబడుతుంది.
ii) అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది.
iii) ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తుంది.
iv) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియాలు ఓషియానాలో ఉన్న భాగాలు.

9th Class Social 3rd Lesson Extra Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జలచక్రం అనగా నేమి?
జవాబు:
నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని నీటిచక్రం అంటారు. మహాసముద్రాల నుంచి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాలలోకి నీళ్ళు తిరుగుతూ ఉండటాన్ని “జలచక్రం” అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
భూమి మీద గల నీటి వనరుల వివరాలను తెల్పండి.
జవాబు:

జలభాగం మొతం నీటిలో శాతం
1) మహాసముద్రాలు 97.25%
2) ధృవ మంచుప్రాంతాలు ( హిమానీనదాలు) 2.05%
3) భూగర్భజలం 0.68%
4) సరస్సులు 0.01%
5) నేలలో తేమ 0.005%
6) వాతావరణం 0.001%
7) నదులు 0.0001%
8) జీవావరణం 0.00004%

ప్రశ్న 3.
మహాసముద్రాల యొక్క వివరాలను తెల్పండి.
జవాబు:
మహాసముద్రాల యొక్క వివరాలు :

మహాసముద్రం వివరాలు
1. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుంచి ఆసియా, ఓషియానా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియా) లను వేరుచేస్తుంది.
2. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
3. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది.
4. అంటార్కిటిక్ మహాసముద్రం
(దక్షిణ మహాసముద్రం)
అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు.
5. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేసియా తీరాలను తాకుతుంది.

ప్రశ్న 4.
మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
(లేదా)
మహాసముద్రాల లవణీయతను ప్రభావితం చేసే ఏవేని రెండు కారకాలను రాయండి.
(లేదా)
జలభాగాలలో లవణీయతని ప్రభావితం చేసే రెండు అంశాలేవి?
జవాబు:
మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు :

  1. నీరు ఆవిరి కావటం, అవపాతం.
  2. తీరప్రాంతంలో నదులనుంచి ప్రవహించే మంచినీళ్లు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటం.
  3. నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు.
  4. సముద్రపు ప్రవాహాలు / తరంగాలు.

ప్రశ్న 5.
అత్యధిక, అత్యల్ప లవణీయత గల జల భాగాలు ఏవి?
జవాబు:

అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు
1) వాన్ సరస్సు – టర్కీ – 330% 1) బాల్టిక్ సముద్రం – 3 నుంచి 15%
2) మృత సరస్సు – ఇజ్రాయెల్ 238% 2) హడ్సన్ అఖాతం – 3 నుంచి 15%
3) మహాలవణ సరస్సు – అమెరికా 220%

ప్రశ్న 6.
మహాసముద్ర ప్రవాహాలకు కారణాలు ఏవి?
జవాబు:
మహాసముద్ర ప్రవాహాలకు కారణాలు :
1) అపకేంద్ర బలం :
భూమి తనచుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధ్రువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్యరేఖా ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు – ధ్రువాల వైపు ప్రవహిస్తాయి.

2) పవనాలు :
పవనాలు, పవనాల కడలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవటం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ల వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ల వేగంతో వెళ్లే ప్రవాహాలు ఏర్పడతాయి.

3) అవపాతం :
భూమధ్యరేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది. కాబట్టి ఇక్కడి సముద్ర నీటిమట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్యరేఖ నుంచి ఉత్తర, దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది.

4) సౌరశక్తి :
సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో , పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి, ఆ వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 7.
వనరులుగా మహాసముద్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం 1
జవాబు:
వనరులుగా మహాసముద్రాలు :

  1. మహాసముద్రాలు మత్స్యసంపదకు నిలయాలు.
  2. ఆదిమకాలం నుంచి మానవులు ఆహారం కోసం మహాసముద్రాల మీద ఆధారపడ్డారు.
  3. చేపల వేటకు ఉత్తర సముద్రంలోని డాగర్ బ్యాంక్, న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని గ్రాండ్ బ్యాంక్ ప్రసిద్ధిగాంచాయి.
  4. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వంటివి మహాసముద్రాలలో దొరుకుతాయి.
  5. అలలు, కెరటాలు వంటివి పునరుద్ధరింపబడే ఇంధన వనరులు.
  6. వర్షపాతానికి మహాసముద్రాలే మూలం.
  7. మహాసముద్రాలు అంతర్జాతీయ రహదారులుగా పనిచేస్తాయి.
  8. నాగరికతకు మూలాలు : గ్రీకు, రోమ్ వంటి నాగరికతలు మహాసముద్రాలు, నదుల తీరాలలోనే వెల్లివిరిశాయి.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
మహాసముద్రాల ఉపరితలం గురించి వ్రాయుము.
జవాబు:
మహాసముద్రాల ఉపరితలం :
మహాసముద్రాల ఉపరితలం చాలావరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. నీటిలోపల కొండలు, పీఠభూములు, కాన్యాన్లు, టెర్రాస్ వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు.

1) ఖండతీరపు అంచు :
భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. ఖండపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ సముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.

ఖండపు అంచు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే :

  • ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ.
  • ఈ ప్రాంతంలోనే ముడిచమురు, సహజవాయువులు దొరుకుతాయి.
  • ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం 2

2) ఖండతీరపు వాలు :
200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15 శాతం వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ దరలు ఉంటాయి. హిమానీనదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి.

3) మహాసముద్ర మైదానాలు :
మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతమిదే. ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2% వరకు ఉంటుంది.

4) మహాసముద్ర అగాధాలు :
ఈ అగాధాలు సన్నగా, లోతుగా 6000 మీటర్ల వరకు ఉంటాయి. మనం ఊహించినదానికి భిన్నంగా అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ప్రశ్న 9.
సముద్రాల లవణీయతను గురించి వ్రాయుము.
జవాబు:

  1. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియచేయటానికి లవణీయత అన్నదానిని ఉపయోగిస్తారు.
  2. 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు (గ్రాములలో) కరిగి ఉందో ఇది సూచిస్తుంది.
  3. దీనిని సాధారణంగా వెయ్యిలో ఎంత మోతాదు (Parts per Thousand – PPT) గా వ్యక్తపరుస్తారు.
  4. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది.
  5. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి, వీటిల్లో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది.

ప్రశ్న 10.
నీటి చక్రంలోని వివిధ దశలను వివరించండి.
(లేదా)
“నీటి చక్రం” దశలను గురించి వివరించండి. .
జవాబు:
నీటి చక్రంలో ఆరు దశలు ఉన్నాయి.

  1. బాష్పీభవనం
  2. రవాణా
  3. ద్రవీభవనం
  4. అవపాతం
  5. ఉపరితల ప్రవాహం
  6. భూగర్భజలం

1) బాష్పీభవనం :
నేలమీద నున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో నీరు ద్రవ రూపం నుండి వాయురూపంలోకి మారుతుంది. దీనిని బాష్పీభవనం అంటారు.

2) రవాణా :
వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది. ఉపరితల వాయువులు, భూభాగ, జలభాగాలను ఆనుకుని వీచే చల్లని గాలుల వంటివాటి వల్ల మేఘాలు ఒకచోటు నుంచి మరొక చోటుకి కదులుతాయి.

3) ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెందిన చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారుతుంది.

4) అవపాతం :
వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని అవపాతం అంటారు.

5) ఉపరితలంపై నీటి ప్రవాహం :
భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దానిలో కొంత భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి.

6) భూగర్భ జలం :
లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలమవుతుంది. లక్ష్యాత్మక నియోజనము

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

These AP 9th Class Social Important Questions 2nd Lesson భూమి – ఆవరణములు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 2nd Lesson Important Questions and Answers భూమి – ఆవరణములు

9th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
శాస్త్రజ్ఞులు ప్రస్తావించిన భూమి మీద ఉన్న నాలుగు ఆవరణములు ఏవి?
జవాబు:
భూ శాస్త్రజ్ఞులు భూమి మీద నాలుగు ఆవరణాల గురించి ప్రస్తావిస్తుంటారు. అవి –

  1. శిలావరణం
  2. జలావరణం
  3. వాతావరణం
  4. జీవావరణం

ప్రశ్న 2.
జలావరణం అంటే ఏమిటి?
జవాబు:
నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘హైడ్రోస్ఫియర్’ అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్న ‘హ్యడర్’ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.

ప్రశ్న 3.
వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘అట్మాస్ఫియర్’ అంటారు. ‘అట్మాస్’ అన్న గ్రీకు పదానికి ‘ఆవిరి’ అని అర్థం.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 4.
జీవావరణం అని దేనినంటారు?
జవాబు:
గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు, బాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని ‘జీవావరణం’ అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘బయోస్ఫియర్’ అంటారు. జీవం అన్న అర్థం ఉన్న ‘బయోస్’ అనే గ్రీకు పదం నుంచి ఇది వచ్చింది.

ప్రశ్న 5.
అగ్నిపర్వతం అంటే ఏమిటి?
జవాబు:
భూగర్భం నుండి బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖ ద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణం ఏర్పడుతుంది, దీనినే అగ్నిపర్వతం (Volcano) అంటారు.

ప్రశ్న 6.
అగ్నిశిలలు అనగానేమి?
జవాబు:
కరిగిన శిలాద్రవం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది, వీటిని అగ్ని శిలలు అంటారు.

ప్రశ్న 7.
మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏవి?
జవాబు:
నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూ శాస్త్రవేత్తలు “మూడవ శ్రేణి భూస్వరూపాలు” అంటారు.
ఉదా : చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు మొదలైనవి.

ప్రశ్న 8.
శిలాశైథిల్యం అనగానేమి?
జవాబు:
వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

ప్రశ్న 9.
క్రమక్షయం అంటే ఏమిటి?
జవాబు:
గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవటాన్ని క్రమక్షయం అని అంటారు.

ప్రశ్న 10.
గార్జెస్ అంటే ఏమిటి?
జవాబు:
రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి, వీటిని ‘గార్జెస్’ అంటారు. గోదావరి నది మీద పాపి కొండల వద్ద బైసన్ గార్జ్, కాశ్మీరులోని ఇండగార్జ్ లు ‘గార్జెస్’కు ఉదాహరణలు.

ప్రశ్న 11.
అగాధదరులు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
నది అంచులు తీవ్రవాలుతో చాలా లోతుకు కోతకు గురైనప్పుడు అగాధదరులు ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఒండ్రు అంటే ఏమిటి?
జవాబు:
నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురి చేస్తుంది, వరద తగ్గు ముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని ఒండ్రు అంటారు.

ప్రశ్న 13.
ఆక్స్-బౌ సరస్సు అని దేనిని అంటారు?
జవాబు:
వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపు తిరిగి ఉంటుంది, ఈ మెలికలలో పక్కలకు మేట వేస్తుండటంతో అవి చేరువ అవుతూ కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక సరస్సులాగా ఏర్పడుతుంది, దీనినే ‘ఆక్స్-బౌ సరస్సు అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 14.
మెరైన్లు అనగానేమి?
జవాబు:
హిమానీనదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేటవేస్తుంది, ఇలా మేటవేసిన వాటిని ‘మోరైన్లు’ అంటారు.

ప్రశ్న 15.
మేటవేయటం కారణంగా ఏర్పడేవి ఏవి?
జవాబు:
‘సముద్రపు తోరణాలు’, ‘పేర్పుడు స్తంభాలు’, సముద్ర బృగువు (శిఖరం), అగ్రం మొదలైన సముద్ర తీర భూ స్వరూపాలు, సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురికావటం, మేటవేయటం కారణంగా ఏర్పడతాయి.

ప్రశ్న 16.
లోయస్ మైదానాలు అంటే ఏవి?
జవాబు:
మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్లి పక్క భూముల మీద పడుతుంది, ఇటువంటి నేలను ‘లోయిస్’ మైదానాలంటారు.

ప్రశ్న 17.
నీటి ప్రభావంచే ఏర్పడే ఏవేని రెండు భూస్వరూపాలను రాయండి.
జవాబు:
నీటి ప్రభావంచే ఏర్పడే రెండు భూస్వరూపాలు :

  1. లోయలు
  2. డెల్టాలు మొ||వి.

9th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“మానవ కార్యకలాపాలైన గనుల తవ్వకం, ఇటుకలు, సిమెంటుతో నగరాల నిర్మాణం, వ్యవసాయం, ఆనకట్టలు నిర్మించడం వంటివి శిలావరణాన్ని ప్రభావితం చేస్తాయి” ~ వ్యాఖ్యానించండి.
జవాబు:
గనుల తవ్వకం :
గనుల తవ్వకం వలన భూమి పొరలలో లోపలికి తవ్వడం వలన భూమిలోపలి భాగం బాగా దెబ్బతిని భూకంపాలు అవీ సంభవిస్తాయి.

ఇటుకలు – సిమెంటులతో నగరాల నిర్మాణం :
ఇటుకల తయారీలో పంట పండే భూములలోని మట్టి వాడటం వలన భూసారం దెబ్బతింటుంది. అలాగే సిమెంటులోని దుమ్ము, ధూళి వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

వ్యవసాయం :
వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

డ్యామ్ నిర్మాణం :
డ్యామ్ ల నిర్మాణం వలన అక్కడ ఉన్న సహజ వృక్ష సంపద దెబ్బ తింటుంది. మరియు ఎక్కువ భాగం ఆయకట్టు ప్రాంతంగా మారి ఎక్కువ మంది నీటి కొరత సమస్యతో బాధపడతారు.

ప్రశ్న 2.
ఈ క్రింద ఇచ్చిన వాటిని పట్టికలో తగిన విధంగా అమర్చండి.
పుట్టగొడుగురాయి, సముద్రతోరణాలు, దుముకు మడుగు, ‘U’ ఆకారపులోయ.

కారణం ఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావం
2. హిమానీనదాల ప్రభావం
3. గాలి ప్రభావం
4. అలల ప్రభావం

జవాబు:

కారణం ఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావం దుముకు మడుగు
2. హిమానీనదాల ప్రభావం ‘U’ ఆకారపు లోయ
3. గాలి ప్రభావం పుట్టగొడుగురాయి
4. అలల ప్రభావం సముద్రతోరణాలు

9th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నీరు మరియు గాలి భూమి ఉపరితలాన్ని ఎలా మార్చివేస్తున్నాయో వివరించండి.
జవాబు:
నీరు, గాలి భూమి ఉపరితలాన్ని ఈ క్రింద చూపినట్లు నాలుగు ప్రక్రియల ద్వారా మార్చివేస్తాయి.

శిలాశైథిల్యం :
నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తాయి. రాళ్ళలోని రసాయనాలతో నీళ్ళు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. రాళ్ళు బలహీనమై, పగిలిపోయే ఈ ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

క్రమక్షయం :
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించి వేస్తుంది. వాన, నది, భూగర్భజలం, సముద్ర అలలు వంటి రూపాలలో నీళ్ళు, ఈదురుగాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాలలో గాలి భూమి యొక్క పై పొర కొట్టుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీన్ని క్రమక్షయం అంటారు.

రవాణా :
కోతకు గురైన రాళ్ళు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి, నీళ్ళు మోసుకుపోవడాన్ని రవాణా అంటారు.

నిక్షేపణ :
రాళ్ళ నుంచి పై పొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువులను మోసుకు వెళ్ళలేక వాటిని మేటవేస్తాయి. ఇలా మేట వేసిన మట్టివల్ల మైదానాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. ఈ మేటలు సముద్రపు నేలలో పొరలు పొరలుగా నిక్షిప్తమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారతాయి.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

These AP 9th Class Social Important Questions 1st Lesson భూమి – మనం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 1st Lesson Important Questions and Answers భూమి – మనం

9th Class Social 1st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కక్ష్య అనగానేమి?
జవాబు:
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్ష్య తలం అంటారు.

ప్రశ్న 2.
‘సంవత్సరం’ అనగానేమి?
జవాబు:
ఈ వేగంతో సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయటానికి 365¼ రోజులు పడుతుంది. దీనిని మనం ‘సంవత్సరం’ అంటాం.

ప్రశ్న 3.
సంస్కృతంలో భూమికి గల పేర్లు ఏవి?
జవాబు:
సంస్కృతంలో భూమి, పృథ్వి, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు భూమికి ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే.

ప్రశ్న 4.
భూమిని ఎన్ని పొరలుగా విభజింపవచ్చును?
జవాబు:
భూమిని ప్రధానంగా భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం అని మూడు పొరలుగా విభజించవచ్చును.

ప్రశ్న 5.
భూపటలం అని దేనినంటారు?
జవాబు:
మనం భూమి బయటిపొర మీద నివసిస్తున్నాం, దీనిని భూపటలం అంటాం. భూపటలం 30 – 100 కిలోమీటర్ల మందం ఉంది.

ప్రశ్న 6.
భూప్రావారం గురించి రాయండి.
జవాబు:
భూప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుంచి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

ప్రశ్న 7.
భూకేంద్రమండలం ఎక్కడ వరకు ఉంటుంది? దీనిలో ఏమి ఉన్నాయి?
జవాబు:
భూ కేంద్ర మండలం 2,900 కి.మీ. నుండి 6,376 కి.మీ. వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి.

ప్రశ్న 8.
ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు, ఎందుకు ప్రతిపాదించారు?
జవాబు:
ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించటానికి 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన ఉల్కాపాత భూ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 9.
వెజినర్ పాంజియాను గురించి ఏమి చెప్పాడు?
జవాబు:
పాంజియా అనే ఈ మహాఖండం లారెన్షియా (ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యూరేసియా మొత్తం) గోండ్వానా భూమి (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేసియా, తూర్పుఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా) అనే రెండు భాగాలుగా విడిపోయిందని వెజిగ్ ప్రతిపాదించాడు.

ప్రశ్న 10.
గ్రిడ్ అనగానేమి?
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని ‘గ్రిడ్’ అంటారు.

ప్రశ్న 11.
భూమధ్యరేఖ అని దేనినంటారు?
జవాబు:
భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమ దూరాలలో ఉంటుంది. ఇది భూమిని రెండు సమ భాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అంటారు. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రశ్న 12.
అక్షాంశాలను ఎలా సూచిస్తారు?
జవాబు:
రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (ి)నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు. 13. లాటిట్యూడ్ అంటే ఏమిటి ? జ. ఇంగ్లీషులో ‘లాటిట్యుడ్’ అనే పదం ‘వెడల్పు’ అనే అర్థం సూచించే లాటిన్ పదం అయిన ‘లాటిట్యుడో’ నుంచి వచ్చింది.

ప్రశ్న 14.
ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం అని వేటిని అంటారు?
జవాబు:
భూమధ్యరేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.

ప్రశ్న 15.
వివిధ అక్షాంశాల పేర్లు రాయండి.
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అని, 23½° దక్షిణ అక్షాంశాన్ని మకరరేఖ అని, 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అని, 66½° దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు.

ప్రశ్న 16.
లాంగిట్యూడ్ అంటే ఏమిటి?
జవాబు:
రేఖాంశాన్ని ఇంగ్లీషులో లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం ‘పొడవు’ అనే అర్థం ఉన్న ‘లాంగిట్యుడో’ అన్న లాటిన్ పదం. రేఖాంశం పటం పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది.

ప్రశ్న 17.
ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండ్ లోని ‘గ్రీన్ విజ్’లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

ప్రశ్న 18.
మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియాసిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రేఖాంశాలను మధ్యాహ్నరేఖలని కూడా అంటారు.

ప్రశ్న 19.
ప్రామాణిక సమయం అనగానేమి?
జవాబు:
కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు, దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 20.
IST అనగానేమి?
జవాబు:
IST అనగా భారతదేశ ప్రామాణిక సమయం (Indian Standard Time).

ప్రశ్న 21.
యాంటీ మెరీడియన్ అనగానేమి?
జవాబు:
0° రేఖాంశమునకు వ్యతిరేక దిశలో 180° లలో ఉన్న రేఖాంశమును యాంటీ మెరీడియన్ అని పిలుస్తారు. అవి 180° తూర్పు రేఖాంశము మరియు 180° లలో ఉన్న పశ్చిమ రేఖాంశములు.

9th Class Social 1st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు, మరియు రేఖాంశాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? అది ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. ఒక ప్రాంతం గూర్చి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం యొక్క అక్షాంశ రేఖాంశాల గూర్చి తెలుసుకోవాలి.
  2. అక్షాంశాల సహాయంతో ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును.
  3. మరియు ఆ ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని కూడా తెలుసుకోవచ్చు.
  4. రేఖాంశాల సహాయంతో ఆ ప్రాంతంలో సమయాన్ని తెలుసుకోవచ్చును.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 2.
జినర్ మహాఖండమైన పాంజియా రెండు ఖండాలుగా విడిపోయిందని ప్రతిపాదించాడు –
అవి 1) లారెన్షియా
2) గోండ్వానా భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న రూపం, స్థానంలోకి రావడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది.

1) లారెన్షియా :
ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం.

2) గోండ్వానా :
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

పైన ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) గోండ్వానా నుండి ఏర్పడి, ప్రస్తుతం ఆసియా ఖండంలో భాగంగా ఉన్న ఏవైనా రెండు భూభాగాలను పేర్కొనుము.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ ఏ భాగం నుండి ఏర్పడింది?
జవాబు:
ఎ) భారతదేశం, అరేబియా, మలేషియా మొ||వి.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ లారెన్షియా భాగం నుండి ఏర్పడింది.

ప్రశ్న 3.
గ్లోబు చిత్రమును గీచి, దానిమీద ప్రత్యేక పేర్లు కలిగిన అన్ని అక్షాంశములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం 1

9th Class Social 1st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భూమి అంతర్నిర్మాణం గూర్చి వివరించండి (లేదా) భూమి అంతర్గత నిర్మాణమును వర్ణించుము.
జవాబు:
భూమి అంతః మరియు బాహ్య భాగాన్ని కలిపి 3 పొరలుగా విభజించడం జరిగింది.
అవి :

  1. భూ పటలం
  2. భూ ప్రావారం
  3. భూ కేంద్ర మండలం.

1) భూ పటలం :
భూమి యొక్క బాహ్య పొర అయిన భూపటలం మీద మనం నివసిస్తున్నాం. ఈ భూపటలం యొక మందం 30-100 కిలోమీటర్లు. ఈ భూ పటలం వివిధ రకాల శిలలతో నిర్మితమైనది.

2) భూ ప్రావారం :
భూ ప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుండి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో – సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

3) భూ కేంద్ర మండలం :
భూ కేంద్ర మండలం రెండు భాగాలుగా విభజింపబడింది. 1) బాహ్య కేంద్రం, 2) అంతః కేంద్రం.

బాహ్య కేంద్రం :
2,900 నుండి 5, 100 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో నికెల్ మరియు ఐరన్ ఉన్నాయి.

అంతః కేంద్రం :
5,100 నుండి 6,376 కి. మీ. వరకు ఉంటుంది. ఇక్కడ ఇనుము మరియు బంగారం ఎక్కువగా ఉంటుంది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

These AP 10th Class Social Studies Important Questions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 22th Lesson Important Questions and Answers పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social 22th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది?
జవాబు:
2005 లో.

2. న్యాయ సేవల ప్రాధికార చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2002 లో.

3. ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
పౌర సమాచార అధికారికి (PIO)

4. లోక్ అదాలత్ ముఖ్య ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సత్వర న్యాయం.

5. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
జవాబు:
జిల్లా జడ్జి.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

6. న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి?
జవాబు:
ఒక లక్ష రూపాయల లోపు.

7. మీ గ్రామంలో వేసిన రోడ్డుకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
జవాబు:
ప్రజా పనుల శాఖకు.

8. సమాచార హక్కు చట్టంలో సవరణలు / మార్పులు చేయుటకు ఎవరికి అధికారం కలదు?
జవాబు:
పార్లమెంటుకు.

9. కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించే అవకాశం ఏ న్యాయస్థానాల్లో ఉంది?
జవాబు:
లోక్ అదాలత్ లో.

10. “కోర్టు బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం,” దేని యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
జవాబు:
న్యా య సేవల ప్రాధికార సంస్థ.

11. మీ పాఠశాలలో పౌర సమాచార అధికారి ఎవరు?
జవాబు:
ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాల్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

12. లోక్ అదాలలు ఏ వర్గాల వారికి న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాటు చేయబడ్డవి?
జవాబు:
బలహీన వర్గాల.

13. సైనిక దళాల సమాచారం ….. హక్కు పరిధిలోకి రావు.
జవాబు:
సమాచార

14. PWDని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పనుల శాఖ

15. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని ……… హక్కు ద్వారా పొందలేం.
జవాబు:
సమాచార

16. ఎవరు ఇచ్చిన తీర్పులకు అప్పీలును అనుమతించరు?
జవాబు:
లోక్ అదాలనే

17. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థని పనిచేసేలా చూడటానికి వేటిని ఏర్పాటు చేసారు?
జవాబు:
లోక్ అదాలత్.

18. న్యాయ సేవా పీఠాలు ఎవరి కోసం ఏర్పాటు చేసారు?
జవాబు:
పేద, బలహీన వర్గాలవారికోసం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

19. సమాచారాన్ని పొందటానికి పౌరులు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంది?
జవాబు:
5 – 10 రూ||

20. పురుషులు, ముసలివారు, నిరుద్యోగులు, స్త్రీలలో ఎవరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు?
జవాబు:
స్త్రీలు

21. ఏవి కోర్టుల్లో చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తక్కువ కాలంలో ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది?
జవాబు:
లోక్ అదాలలు.

22. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి జవాబు దారీగా ఉంటారు?
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి,

23. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం సమాచారం కోరుతూ దరఖాస్తులను క్రింది ఏ పద్ధతి/తుల్లో కోరాలి?
i) చేత్తో వ్రాసిన ఉత్తరం ద్వారా
ii) ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా
iii) మౌఖికంగా చెప్పడం ద్వారా
జవాబు:
i, ii & iii

24. న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టంకు ఏఏ సంవత్సరాల్లో సవరణ చేసారు?
జవాబు:
1994, 2002

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

25. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు పాట్రన్-ఇన్- ఛీ ఎవరు ఉంటారు?
జవాబు:
ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

26. తాలుకా న్యాయ సేవా సంఘాల అధిపతి?
జవాబు:
సీనియర్ సివిల్ జడ్జి.

27. లోక్ అదాలత్ లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోలేం.
→ వైవాహిక విభేదాలు
→ గృహహింస కేసులు.
→ భరణానికి సంబంధించిన కేసులు
→ ఆర్థిక నేరానాకి సంబంధించిన కేసులు
జవాబు:
ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులు.

28. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ప్రతి ప్రభుత్వ శాఖ రికార్డులను నిర్వహించి, వాటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి.
ii) ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగానే కొన్ని వివరాలను బహిర్గతం చేయాలి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (i) మరియు (ii)

29. PIOని విస్తరించండి.
జవాబు:
పౌర సమాచార అధికారి.

30. SPICని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర పౌర సమాచార కమీషనర్.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

31. CPIC ని విస్తరించండి.
జవాబు:
కేంద్ర పౌర సమాచార కమిషనర్

32. NALSA ని విస్తరించండి.
జవాబు:
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ.

33. SLSA ని విస్తరించండి.
జవాబు:
రాష్ట్ర న్యాయ సేవల ప్రాథికార సంస్థ

34. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) వ్యభిచార వృత్తి నివారణ చట్టం ( ) a) 1956
ii) బాల నేరస్తుల న్యాయ చట్టం ( ) b) 1986
iii)న్యా య సేవల ప్రాధికార చట్టం ( ) c) 2002
iv)మానసిక ఆరోగ్య చట్టం ( ) d) 1987
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 22th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వివాదాల పరిష్కారానికి సంబంధించి లోక్ అదాలత్ వలన కలిగే ఏవైనా రెండు ప్రయోజనాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము లేకపోవడం.
  2. వివాదాల వేగవంతమైన విచారణ.
  3. విధానంలో వెసులుబాటు.
  4. కక్షిదారులు నేరుగా న్యాయమూర్తులతో సంభాషించే అవకాశం.

ప్రశ్న 2.
లోక్ అదాలత్ యొక్క ప్రయోజనాలను తెల్పండి.
జవాబు:
i) లోక్ అదాలత్ వల్ల సత్వర, వేగవంతంగా న్యాయం అందుతుంది.
ii) లోక్ అదాలత్ వల్ల తక్కువ వ్యయంతో న్యాయం చేకూరుతుంది.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టంను ఎవరు, ఎప్పుడు చేశారు?
జవాబు:
సమాచార హక్కు చట్టంను కేంద్రప్రభుత్వం 2005లో చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు లేనపుడు ఆయా శాఖలను ఎవరు తనిఖీ చేసేవారు?
జవాబు:
ఆ శాఖలోని పై అధికారులు, లేదా మంత్రి మాత్రమే ఆ వివరాలను తీసుకొని, తనిఖీ చెయ్యగలిగి ఉండేవాళ్లు.

ప్రశ్న 5.
ప్రతి ప్రభుత్వశాఖ యొక్క కనీస బాధ్యత ఏమిటి?
జవాబు:
సమాచారా హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

ప్రశ్న 6.
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి బాధ్యత వహిస్తారు?
జవాబు:
అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.

ప్రశ్న 7.
జరిమాన విధించే అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు సంబంధిత పౌరసమాచార అధికారికి జరిమానా విధించవచ్చు.

ప్రశ్న 8.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎవరు రుసుము చెల్లించనవసరం లేదు?
జవాబు:
సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు రుసుము చెల్లించనవసరం లేదు.

ప్రశ్న 9.
ఏ చట్టం ప్రకారం మనదేశంలో ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు?
జవాబు:
“న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002”, ప్రకారం ఉచిత సేవలు అందిస్తున్నారు.

ప్రశ్న 10.
న్యాయ సేవా పీఠాలను ఏర్పాటుచేయుటలో ఉద్దేశం ఏమిటి?
జవాబు:
ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 11.
దేని ప్రకారం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేశారు?
జవాబు:
న్యాయసేవల పీఠాల చట్టం 1987ని 1994 లోనూ, తిరిగి 2002 లోనూ సవరించారు. దీని కింద లోక్ అదాలత్ లను (ప్రజాస్వామ్య పీఠాలను) ప్రతి రాష్ట్రంలోను ఏర్పాటుచేశారు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 12.
రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థకి అధిపతిగా ఎవరుంటారు?
జవాబు:
అధిపతిగా, ప్యాట్రన్ – ఇన్ చీఫ్ గా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు.

10th Class Social 22th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సమాచార హక్కు చట్టం గూర్చి సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా సుసంపన్నం చేస్తుందో వివరించండి.
జవాబు:

  1. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఆమోదించింది.
  2. ప్రజా ఉద్యమాల కారణంగా, పౌరులకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలోని అంశాల కారణంగా ఈ చట్టం రూపొందించబడింది.
  3. రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థలు ఈ చట్టంలో విధులు నిర్వహిస్తాయి.
  4. ప్రస్తుతం ఏ పౌరుడైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడిగినప్పుడు ఈ శాఖలో వారు పౌరునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలెను.
  5. ఈ చట్టం న్యాయసహాయాన్ని కూడా ప్రజలకు అందిస్తుంది. దాని కోసం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేయటం జరిగింది.
  6. సమాచార హక్కు చట్టం వలన, ప్రతి ప్రభుత్వ శాఖ కూడా వారి పనులకు సంబంధించిన విషయాలను రికార్డు రూపంలో ఉంచి ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటున్నారు.

ప్రశ్న 2.
న్యాయ సేవల సంస్థ ద్వారా ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు?
(లేదా)
ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరు అర్హులు?
జవాబు:
క్రింద పేర్కొన్న వ్యక్తులు న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందవచ్చును.

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు,
  3. స్త్రీలు, పిల్లలు,
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు,
  5. పెను విపత్తు, జాత్యహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు,
  6. పారిశ్రామిక కార్మికులు,
  7. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు,
  8. లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న వ్యక్తులు.

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడిచేయడానికి గల మినహాయింపులను తెలపండి.
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి?
జవాబు:
సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసిన ఉత్తరం రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కానీ ఇవ్వవచ్చు. సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికార భాషలో కానీ, లేదా ఇంగ్లీషులో కానీ, లేదా హిందీలో కానీ ఇవ్వవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి ఉత్తరం రాయలేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పటం ద్వారా, కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు.

ప్రశ్న 5.
సమాచారం కోరే వ్యక్తి ఎంత రుసుం చెల్లించాలి?
జవాబు:
సమాచారాన్ని పొందటానికి పౌరులు నామమాత్రమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి కార్యాలయం అనేదాన్ని బట్టి 5-10 రూపాయల మధ్య ఉంటుంది. సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే అతను/ఆమె ఈ రుసుము చెల్లించనవసరం లేదు. కాబట్టి ఈ చట్టం అనేక విధాలుగా అందరికీ సమాచారం అందుబాటులో ఉండేలా చేసింది.

ప్రశ్న 6.
లోక్ అదాలలు ఏ విధంగా పనిచేస్తాయి?
జవాబు:
ఇప్పుడు వీటి ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలు ఇప్పుడు లోక్ అదాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది. ఒకవేళ అప్పటికే కక్షిదారులు కోర్టు రుసుము చెల్లించి ఉంటే అది కూడా వెనక్కి ఇస్తారు.

ప్రశ్న 7.
న్యాయ సేవల ప్రాధికార సంస్థలు నిర్వర్తించే విధులు ఏవి?
జవాబు:

  1. చట్టంలో పొందుపరిచిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలను అందించటం.
  2. లోక్ అదాలలను నిర్వహించటం.
  3. ముందస్తు నివారణ, వ్యూహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలను చేపట్టటం.
  4. న్యాయసేవల ప్రాధికార సంస్థ నిర్ణయించే ఇతర విధులను నిర్వర్తించటం.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 8.
న్యాయసేవల ప్రాధికార సంస్థ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:

  1. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత, సమర్ధ న్యాయసేవలను అందించటానికి న్యాయసేవ ప్రాధికార సంస్థ చట్టాన్ని చేయడం.
  2. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరునికీ న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడడం.
  3. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం.
  4. కోర్టుల బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం.

ప్రశ్న 9.
సమాచార కమిషన్లో ప్రధాన బాధ్యులు ఎవరు?
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు.
  2. అదేశాఖలో ఒక అప్పీలేట్ అధికారి ఉంటారు.
  3. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు.
  5. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 10.
చమురు ధరలు పెరిగితే ప్రజాజీవనంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
పై వ్యాఖ్యపై మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:

  1. చమురు ధరలు పెరిగితే ప్రజాజీవితంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
  2. దాని వలన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, పండ్లు తదితరాల రేట్లు పెరగడం జరుగుతుంది.
  3. మనదేశం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కావున అత్యధిక మొత్తాలు ఖర్చవుతాయి.
  4. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రశ్న 11.
ప్రజా సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీనిపై మీ సలహాలు, సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ప్రజా సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో అధికార పక్షాలు, అధికారుల అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం ఉండటం వలన అందరికీ ఫలాలు సరిగా అందడం లేదు.
  2. రాజకీయ పక్షపాతంకన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి.
  3. పథకాలలో అవినీతి జరగనీయకుండా చూడాలి.
  4. అలాంటి వాటికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

10th Class Social 22th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘సమాచార హక్కు చట్టము ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు దర్పణము’ – వివరించండి.
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి అన్ని విషయాలు తెలిసిన పౌరులు కావాలి.
  2. సమాచారంలో పారదర్శకత ఉండాలి.
  3. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులందరూ ఇటువంటి సమాచారాన్ని పొందగలరు.
  4. ఇది అవినీతిని అరికట్టడానికి తోడ్పడుతుంది.
  5. ప్రభుత్వాలు పౌరులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.
  6. గతంలో ప్రభుత్వ శాఖలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మాత్రమే ప్రతిస్పందించేవి.
  7. కానీ ఇప్పుడు సాధారణ పౌరులకు సైతం జవాబులు చెబుతున్నాయి.

ప్రశ్న 2.
లోక్ అదాలలు సామాన్య మానవునకు ఏ విధంగా సహకరిస్తున్నాయి? వివరించండి.
జవాబు:

  1. ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెసులుబాటు కల్పించబడ్డాయి.
  3. వాది ప్రతివాదులిరువురూ ప్రత్యక్షముగా న్యాయమూర్తితో సంభాషించవచ్చును.
  4. ఉచిత న్యాయసలహా అందజేయబడుతుంది.
  5. వివాదాల పరిష్కారములో కాలయాపన నివారించబడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 3.
“సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగు పరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.” దీనితో మీరు ఏకీభవిస్తారా ? మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
సమాచార హక్కుచట్టం:

  1. అవును. ఇవ్వబడిన వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
  2. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనిని మెరుగుపరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
  3. పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది.
  4. ఇది లంచగొండితనాన్ని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రభుత్వాలను సాధారణ పౌరులకు, వ్యక్తులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థలేవి?
జవాబు:
సమాచార హక్కు చట్టం కిందికి వచ్చే ప్రభుత్వ సంస్థలను చట్టం ఈ కింది విధంగా గుర్తించింది.
అ) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ
ఆ) పార్లమెంటు, లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థ
ఇ) సంబంధిత ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ నియంత్రిత సంస్థ, ప్రభుత్వం నిధులు సమకూర్చిన సంస్థలు ఈ చట్టం కిందికి వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయ మొత్తంలో ప్రభుత్వ నిధులు అందే స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చట్టం కిందికి వస్తాయి.

ప్రశ్న 5.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు ఎవరికి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు తమ కేసు పూర్వపరాలు, కావలసిన పరిష్కారం, వివరిస్తూ సంబంధిత పత్రాలు మరియు తమ అర్హతను తెలియజేసే పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి సత్వర, ఉచిత న్యాయాన్ని కోరవచ్చు.

వివిధ స్థాయిలలో ఎవరికి దరఖాస్తు చేయాలో దిగువన పేర్కొనబడినది.
జిల్లాస్థాయిలో – కార్యదర్శి, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు.
రాష్ట్రస్థాయిలో – సభ్యకార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, న్యాయ సేవాసదన్, సిటీ సివిల్ కోర్టు భవనాలు, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066
(లేదా)
హైకోర్టులో ఉన్న కేసులలో న్యాయ సహాయం కోరే వ్యక్తులు కార్యదర్శి, హైకోర్టు న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066.

ప్రశ్న 6.
లోక్ అదాలత్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే లోక్ అదాలత్ కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  2. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెలుసుబాటు అన్నవి లోక్ అదాలత్ లోని ముఖ్యమైన అంశాలు. వివాదాలను లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి సాక్షాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను కచ్చితంగా పాటించాలని లేదు.
  3. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యంకాదు.
  4. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. వివాద అంతిమ పరిష్కారం ఆలస్యం కాకుండా ఉండటానికి దీనిపై అప్పీలును అనుమతించరు.
  5. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్ధతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

ప్రశ్న 7.
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 1
ఇచ్చిన వార్తా కథనాలను చదివి సమాచార హక్కు ఉపయోగం గురించి చర్చించండి.
జవాబు:
పైన ఇచ్చిన వార్తా కథనాలను పరిశీలించినట్లయితే సమాచార హక్కు చట్టం మూలంగా అనేక అక్రమాలను, అవినీతి చర్యలను అరికట్టవచ్చని తెలుస్తుంది. మరియు ఈ చట్టం మూలంగా చాలా ఉపయోగాలున్నాయని తెలుస్తుంది.

కొన్ని ఉపయోగాలు :

  1. “తానే” నగరంలో అనుమతి లేని 40,000 ఆటోలు తిరుగుతున్నట్లుగా “సమాచార హక్కుచట్టం” ప్రకారం తెలిసింది.
  2. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషనర్ జరిమానాలను విధించినట్లుగా తెలియుచున్నది.
  3. ఇతర దేశాలలో 117 మంది భారతీయులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖైదీలుగా బంధించారని సమాచార హక్కు చట్టం మూలంగా తెలుసుకోగలిగాం.
  4. సమాచారం అడిగేవారు. వారి అడ్రసులను ఇవ్వవలసిన అవసరం లేదు. కాని సమాచారం పొందడానికి కనీసం పోస్ట్బక్స్ నంబరు అయినా ఇవ్వవలయును అని ఢిల్లీ వార్తాపత్రిక తెలియచేయుచున్నది.
  5. చెన్నై కార్పొరేషనులో విద్యాపన్నుకు సంబంధించి 175 కోట్ల రూపాయలను వసూలు చేశారు, కాని గత 8 సంవత్సరాల నుండి ఆ డబ్బును ఉపయోగించలేదనే ఫిర్యాదు సమాచార హక్కు చట్టం ప్రకారం చెన్నైలో నమోదు అయ్యింది.

ఈ సమాచార హక్కు మూలంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం మరుగున పడిపోయిందనే వార్తలు కూడా తెలుస్తున్నాయి.

ప్రశ్న 8.
మీకిచ్చిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
1) ఢిల్లీ 2) చెన్నై 3) ముంబయి 4) కోల్ కత 5) హైదరాబాద్ 6) బెంగళూరు
AP 10th Class Social Important Questions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు 2

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

These AP 10th Class Social Studies Important Questions 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 21th Lesson Important Questions and Answers సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social 21th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. “నాకొక కల ఉంది ……” అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసినది ఎవరు?
జవాబు:
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

2. అనేక మంది నలవాళ్ళు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించినది ఎవరు?
జవాబు:
మాల్కం ఎక్స్

3. అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన ‘చెర్నోబిల్’ ఉన్న దేశం ఏది?
జవాబు:
రష్యా

4. ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జవాబు:
కేరళ.

5. మణిపూర్‌ను భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనం చేసినారు?
జవాబు:
1949.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

6. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ ఏది?
జవాబు:
యూనియన్ కార్బైడ్ కంపెనీ.

7. యూనియన్ కార్బైడ్ కంపెనీని తర్వాత ఏ కంపెనీ కొనుగోలు చేసింది?
జవాబు:
డౌ కంపెనీ (DOW)

8. 1980లో విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ కేంద్రం అన్న సంస్థను స్థాపించిన దెవరు?
జవాబు:
అనిల్ అగర్వా ల్.

9. మైటై భాషలో మైరాపైబీ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కాగడాలు పట్టుకున్నవాళ్ళు.

10. ఆంధ్రప్రదేశ్ లో సారాను ఏ సంవత్సరంలో నిషేధించారు?
జవాబు:
1993

11. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మధ్యపాన నిషేధం ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1995.

12. మణిపూర్ లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ ఎవరు?
జవాబు:
తంగజం మనోరమ.

13. మణిపూర్‌లో సైనిక బలాల ప్రత్యేకాధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
మైరా పైబీ.

14. సైలెంట్ వ్యాలీలోని అరుదైన (అంతరించి పోతాయని భావించిన) జాతి కోతి ఏది?
జవాబు:
లయన్ టేల్డ్ మకాక్ (సింహపు తోక కోతి)

15. నందిగ్రాం సంఘటన (పోరాటం) ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

16. 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడలను స్పాన్సరు చేసిన ఏ కంపెనీకి వ్యతిరేకంగా సంతకాలు చేసారు?
జవాబు:
డౌ కంపెనీ. (DOW)

17. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్ – NBA

18. ఎవరినీ అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించ కూడదు, బహిష్కరించకూడదు అని ఏ మానవ హక్కుల అధికరణ చెబుతుంది?
జవాబు:
అధికరణం తొమ్మిది (9).

19. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు?
జవాబు:
ఆమ్ స్టర్డాం

20. SALT ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు

21. START ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

22. నయా ఉదారవాదం, ప్రపంచీకరణ ఏ సంవత్సరం నుంచి మొదలయ్యాయి?
జవాబు:
1990 నుంచి.

23. అమెరికా బలగాలను ఎదుర్కోటానికి వియత్నాం ఏ యుద్ధ పంథాని అవలంభించింది.?
జవాబు:
గొరిల్లా యుద్ధ పంథా.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

24. మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందినది ఎవరు?
జవాబు:
ఇరోం షర్మిలా

25. ‘దూబగుంట’ గ్రామం ఏ జిల్లాలో కలదు?
జవాబు:
నెల్లూరు.

26. ‘నర్మదా బచావో ఆందోళన్’ దీనికి సంబంధించిన ఉద్యమం.
A) నీటి ఉద్యమం
B) ప్రకృతి సేద్య ఉద్యమం
C) పర్యావరణ ఉద్యమం
D) సామాజిక ఉద్యమం
జవాబు:
C) పర్యావరణ ఉద్యమం

27. పడవ పేరునే ఉద్యమంగా మార్చుకున్న ఉద్యమమేది?
జవాబు:
గ్రీన్, పీస్ ఉద్యమం.

28. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం తీవ్రదశకు చేరుకున్న సమయమేది?
జవాబు:
1960 లలో.

29. అమెరికాలోని నల్లజాతి వారు ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించిన ప్రాంతమేది?
జవాబు:
మాంట్ గోమరి.

30. ప్రఖ్యాత వాషింగన్ ప్రదర్శన ఏ రోజున నిర్వహించారు?
జవాబు:
ఆగస్టు 28, 1963.

31. డా॥ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క కల ఏమిటి?
జవాబు:
ప్రజలు చర్మ రంగు ఆధారంగా కాకుండా వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గౌరవించబడాలి.

32. సోవియట్ రష్యాలోని (USSR) మానవ హక్కుల ఉద్యమకారులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ్ నిత్సిన్ & ఆండ్రే సఖరోలు.

33. అమెరికా వియత్నంలో యుద్ధం నుండి ఏ సంవత్సరంలో విరమించుకుంది?
జవాబు:
1975.

34. గ్రీన్‌పీస్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు:
1971 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

35. గ్రీన్‌పీస్ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం.

36. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల డిమాండ్/డిమాండ్లు ఏవి?
i) సరైన వైద్య సౌకర్యం
ii) అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
iii) యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం.
iv) భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడడం.
జవాబు:
i, ii, iii & iv.

37. ఏ విషయాన్ని పరిశీలించటానికి జస్టిస్ B.P. జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది?
జవాబు:
మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసే అంశంపై.

38. NBAకు నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
మేథా పాట్కర్.

39. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించిన సంస్థ ఏది?
జవాబు:
KSSP (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్)

40. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్క్ గా మార్చారు?
జవాబు:
1985.

41. సామాజిక ఉద్యమాలన్నింటిలో ఉన్న సారూష్య అంశాలు ఏవో గుర్తించి రాయండి.
i) సమానత్వం
ii) మానవ హక్కులు
iii) ప్రజాస్వామ్యం
జవాబు:
i, ii & iii

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

42. అమెరికాలో నల్లజాతి అమెరికన్లు పట్ల క్రింది వానిలో ఏ విషయాలలో వివక్షత ఉండేది?
i) ఉద్యోగాలు
ii) గృహవసతి
iii) ఓటుహక్కు
జవాబు:
i, ii & iii

43. 1957 సెప్టెంబరు 4న లిటిల్ రాక్ స్కూల్ లో ప్రవేశించటానికి ప్రయత్నించిన నల్లజాతి అమ్మాయి ఎవరు?
జవాబు:
ఎలిజబెత్ ఎక్ఫోర్డ్.

44. USSR పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరుకున్న దేశాలు ఏవి?
జవాబు:
హంగరీ, చెక్ స్లోవేకియా, పోలండ్.

45. USSRలో సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ఉద్యమించిన నాయకులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ నిత్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్.

46. అమెరికా – వియత్నాం యుద్ధంలో వియత్నాం, లావోస్, అమెరికా, కాంబోడియా దేశాల్లో ఏ దేశ పౌరులు చనిపోలేదు?
జవాబు:
అమెరికా

47. START పై అమెరికా, USSR ఎప్పుడు సంతకాలు చేసాయి?
జవాబు:
1991 లో.

48. 1971లో అమెరికా అణుపరీక్షలను ఎక్కడ చేపట్టింది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్రగర్భంలో

49. ప్రస్తుతం గ్రీన్ పీస్ ఉద్యమం ఎన్ని దేశాలలో విస్తరించి ఉంది?
జవాబు:
40 దేశాలలో

50. “సుస్థిర అభివృద్ధి” అనే భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది?
జవాబు:
గ్రీన్ పీస్ ఉద్యమం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

51. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1984 లో

52. సైలెంట్ వ్యాలీకి ఆపేరు ఎందుకు వచ్చింది?
జవాబు:
ఇక్కడ కీచురాళ్ళు లేవు అందుకే ఈ అడవి నిశబ్దంగా ఉంటుంది.

53. KSSP ని విస్తరించండి.
జవాబు:
కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్.

54. మణిపూర్‌పై బ్రిటిషువారు ఎప్పుడు నియంత్రణ సాధించారు?
జవాబు:
1891లో.

55. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనలోని ఏ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి?
జవాబు:
అధికరణం 13(2)

56. APSPA ని విస్తరింపుము.
జవాబు:
(Armed Forces Special Power Act.)

57. AFSPA చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
1958 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సైలెంట్ వ్యా లీ ఉద్యమం ( ) a) మధ్య ప్రదేశ్
ii) మైరా పైబీ ( ) b) ఉత్తరాఖండ్
iii)చిప్కో ( ) c) మణిపూర్
iv) నర్మదా బచావో ( ) d) కేరళ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

59. సైలెంట్ వ్యాలీ ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, మైరా పై బీ, గ్రీన్ పీస్ ఉద్యమాల్లో పర్యావరణ ఉద్యమం కానిది ఏది?
జవాబు:
మైరా పైబీ ఉద్యమం.

60. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మేథాపాట్కర్ ( ) a) నర్మదాబచావో
ii) మార్టిన్ లూథర్ కింగ్ (b) అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం
iii)ఆండ్రే సఖరోవ్ ( c) USSR లో మానవ హక్కుల ఉద్యమం
iv) ఇరోం షర్మిలా ( ) d) మణిపూర్ లో మానవ హక్కుల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

61. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించబడిన రాష్ట్రం ఏది?
జవాబు:
గుజరాత్.

62. ఏ ఉద్దేశ్యంతో మైరాపైబీ ఉద్యమం మొదలయ్యింది?
జవాబు:
1970 ల కాలంలో, తాగి బజారుల్లో గొడవ చెయ్య కుండా నివారించటానికి

63. ఏ సంవత్సరంలో అమెరికాలోని బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి?
జవాబు:
1956 లో.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

64. సూర్యుని హానికర (అతి నీలలోహిత) కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోను పొర.

65. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణను అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ ఏది?
జవాబు:
B.P. జీవన్ రెడ్డి కమిటి.

క్రింద నీయబడిన పటమును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
66. పటంలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
1

67. పటంలో చిప్కో వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
4

68. పటంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
2

69. పటంలో మైరా పైజీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
5

70. పటంలో నర్మదాబచావో ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
3

71. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఉత్తరాఖండ్.

72. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
కేరళ.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

73. సారా వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

10th Class Social 21th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంలో కింది సామాజిక ఉద్యమాలు జరిగిన ఏదేని ఒక్కొక్క రాష్ట్రాన్ని గుర్తించండి.
A) నర్మదా బచావో ఆందోళన్
B) చిప్కో ఉద్యమం
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1

ప్రశ్న 2.
క్రింది పటమును చదివి, ప్రశ్నకు సమాధానము ఇవ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
ప్రశ్న : ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
ఇందిరా సాగర్ ప్రాజెక్టు నర్మదానదిపై, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
(లేదా)

ప్రశ్న 3.
పై పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) నర్మదా నది యొక్క ప్రవాహ దిశ ఏది?
జవాబు:
తూర్పు నుండి పడమర

ii) నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కారణాలు :
జవాబు:
ప్రజలు నిర్వాసితులు కావడం
సారవంతమైన భూభాగం కోల్పోవడం
అడవులు, పొలాలు, ప్రజలు, జంతువులు నివసించే ప్రాంతాలు మునిగిపోవడం.

ప్రశ్న 4.
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాల పేర్లు తెలపండి.
జవాబు:
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాలు :

  1. మూలవాసీ ప్రజల ఉద్యమము.
  2. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమము.

ప్రశ్న 5.
ఉద్యమాలలో ముఖ్యమైన ఉద్యమం ఏది?
జవాబు:
ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం.

ప్రశ్న 6.
‘పౌరనిరాకరణ’ అనగానేమి?
జవాబు:
వివక్షత కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 7.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమ నాయకులు ఎవరు?
జవాబు:
ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్ నిత్సిన్, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోన్లు యుఎస్ఎస్ఆర్ లోని మానవ హక్కుల ఉద్యమ నాయకులు.

ప్రశ్న 8.
గోర్బచేవ్ ఎవరు?
జవాబు:
యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్. ఈయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి గ్లాస్ నోస్తే అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.

ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ఏ దేశం మీద అణుబాంబులను వేసింది?
జవాబు:
1945 ఆగష్టులో “జపాన్లోని హిరోషిమా, నాగసాకిల” పై అమెరికా అణుబాంబులను వేసింది.

ప్రశ్న 10.
వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన ఆయుధాలేమిటి?
జవాబు:
రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను అమెరికా కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేసింది.

ప్రశ్న 11.
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలేవి?
జవాబు:
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలు 2. అవి :

  1. అమెరికా
  2. యుఎస్ఎస్ఆర్ (రష్యా).

ప్రశ్న 12.
చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఏది?
జవాబు:
START (ఎసీఏఆర్) స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.

ప్రశ్న 13.
ప్రజలు ఈ మధ్య దేనివల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాలు వంటి వాటి నుంచి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు.

ప్రశ్న 14.
గ్రీన్‌పీస్ అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది?
జవాబు:
గ్రీన్ పీస్ అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డాం (హాలెండ్)లో ఉంది.

ప్రశ్న 15.
భోపాల్ దుర్ఘటన దేనికి సంబంధించినది?
జవాబు:
భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీ (ఔ) నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు, దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాదిమంది బాధపడుతున్నారు. ఈ దుర్ఘటన 1984లో జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 16.
పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి?
జవాబు:
ఈ పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా అడవుల రక్షణ కోసం ఆరంభమయ్యాయి.

ప్రశ్న 17.
కొన్ని బహుళార్థసాధక ఆనకట్టల పేర్లు తెలుపుము.
జవాబు:

  1. భాక్రానంగల్
  2. హీరాకుడ్
  3. నాగార్జునసాగర్

ప్రశ్న 18.
సారా వ్యతిరేకత ఎక్కడ ప్రారంభమైంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, దూబగుంట గ్రామంలో ఈ ‘సారా వ్యతిరేక’ ఉద్యమం ప్రారంభమైంది.

ప్రశ్న 19.
సారా నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1993 అక్టోబరులో సారాని అధికారికంగా నిషేధించారు. 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు.

ప్రశ్న 20.
‘మైరా పైబీ ఉద్యమం’ యొక్క ఆరోపణలు ఏమిటి?
జవాబు:
సాయుధ దళాల ప్రత్యేక చట్టం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రశ్న 21.
మైరా పైబీ ఉద్యమకారులు నిరసనను ఏవిధంగా తెలియజేస్తున్నారు?
జవాబు:
గ్రామాలు, పట్టణాలలోని వార్డులలోని మహిళలు రోజూ పహారాలో పాల్గొంటారు. కాపలా కాస్తారు.

ప్రశ్న 22.
సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు సమాజంలోని ఎవరిని ఎదుర్కొన్నారు?
జవాబు:
సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులను ఎదుర్కోగలిగారు.

10th Class Social 21th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పర్యావరణ ప్రాముఖ్యతను తెల్పుతూ ఒక కరపత్రంను తయారు చేయండి.
జవాబు:

భూమి మనుగడకు పర్యావరణమే ప్రధానం

భూమిపై ప్రతీ ప్రాణి తన అవసరాలను పర్యావరణం నుంచే తీర్చుకుంటుంది. పర్యావరణం క్షీణించితే మానవ మనుగడ, భూమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

నేల, నీరు, గాలి, కాలుష్యాలు పర్యావరణానికి పెద్ద గాయాలు. వీటి మూలంగా సహజ వనరులను నష్టపోతున్నాము. దురదృష్టవశాత్తు ఇవన్నీ మానవ తప్పిదాలే. భవిష్యత్తులో ఇవే గనుక ఇదే విధంగా కొనసాగితే విశ్వంలో మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

కాబట్టి, మానవులారా ! ప్రకృతిని గాయపరచికాక, ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతో రక్షతి రక్షిత :
ప్రతుల సంఖ్య : 1000
ప్రచురణ కర్త : పర్యావరణ పరిరక్షణ సమితి, ……………..

ప్రశ్న 2.
అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి గల కారణాలేమిటి?
(లేదా)
నల్లజాతి అమెరికన్లు 1960లో పౌరహక్కుల ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చింది.
(లేదా)
అమెరికా పౌరహక్కుల ఉద్యమంను ఎవరు, ఎందుకొరకు చేశారు?
జవాబు:
ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లను వేరుగా ఉంచటానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్లపట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో-అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 3.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి రెండు నినాదాలు రూపొందించండి. రణ పరిరక్షణకు సంబందించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:

  1. భూమి. కాలుష్యం – మన మనుగడకు ముప్పు.
  2. వృక్షో రక్షతి రక్షితః

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి మీ అభిప్రాయం వ్రాయండి.
“పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు.”
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఈయబడిన పేరా మరోసారి ఇదే అంశాన్ని తెలియచేస్తోంది. గృహపరమైన అంశాల నుండి దేశ రాజకీయాల వరకు మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సాధారణంగా వారు ఎన్ని పోరాటాలు సల్పినా శతాబ్దాల తరబడి వారి పరిస్థితి అలానే ఉన్నది. మానవ హక్కుల గురించి అనునిత్యం పాఠాలు చెప్పే అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే మిగతా దేశాల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విద్య, వృత్తి, ఉద్యోగాలలో మాత్రం మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో మాత్రం తండ్రి లేదా భర్త లాంటి పురుషులు ఆ రంగంలో ఉంటేనే మహిళలు ఆ రంగంలో ఎదగగలుగుతున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళల కోసం రిజర్వు చేయబడిన స్థానాలలో వారు నామమాత్రపు నాయకులుగా ఉంటే వారి భర్తలు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఈ పోరాటాలు పురుషులు కాక మహిళలే ముందుకొచ్చి చేయాలి. వారే వారికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అపుడే మహిళలు ముందంజ వేయగలుగుతారు.

ప్రశ్న 5.
‘సారా నిషేధం’ సమస్యను పరిష్కరించడానికి, నీవైతే ఏం చేసియుండేవాడివి?
జవాబు:

  • ప్రజలలో అవగాహనను కల్పించడం
  • సారా నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలుపరచడం
  • గ్రామ సంఘాలను ఏర్పరచడం
  • మహిళలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవాడిని.

ప్రశ్న 6.
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం రోజు రోజుకీ ఎందుకు పెరిగిపోతోంది?
జవాబు:
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం పెరిగిపోవటానికి గల కారణాలు :

  • పరిశ్రమలు పెరగడం
  • వాహనాల సంఖ్య పెరగడం
  • రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం పెరగడం
  • అడవుల నరికివేత

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ బాధితుల నాలుగు ముఖ్యమైన కోరికలేవి?
జవాబు:
భోపాల్ గ్యాస్ బాధితుల ముఖ్యమైన కోరికలు:

  • ప్రభావితులైన వారికి సరైన వైద్య సౌకర్యం,
  • అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
  • బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని నేరానికి బాధ్యులుగా చేయడం
  • భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
i) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది?
జవాబు:
గుజరాత్

ii) నర్మదా నదిపై కట్టే ఆనకట్టలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్

iii) నర్మదా నది జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.

iv) నర్మదా నది పరివాహక ప్రాంతంలోని ఏవేని రెండు జలవిద్యుత్ కేంద్రాల పేర్లు రాయండి.
జవాబు:
సర్దార్ సరోవర్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్.

ప్రశ్న 9.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల కలిగిన నష్టాలను రాయండి.
జవాబు:
భోపాల్ గ్యాస్ దురటన వల్ల కలిగిన నష్టాలు :

  1. వేలాదిమంది మరణాలు
  2. ప్రజలు నిరాశ్రయులు కావడం
  3. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపించడం
  4. పర్యావరణం దెబ్బతినడం.

ప్రశ్న 10.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసిద్ధ ఉపన్యాసం “నాకొక కల ఉంది” యొక్క సందర్భం గురించి రాయండి.
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా॥ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా|| కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గుహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి. ఒక సంవత్సరం పాటు డా|| కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేజాతి, “నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా||కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 11.
వియత్నాం యుద్ధంలో ఎంత పౌరనష్టం జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులే కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకి ఎటువంటి పౌరనష్టం జరగలేదు. కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు, అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు.

ప్రశ్న 12.
ఆయుధ పోటీ ఏ విధంగా జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో అణ్వాయుధ పోటీ తీవ్రరూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు), ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.

ప్రశ్న 13.
ఏ ఒప్పందంతో ఆయుధ నియంత్రణ జరిగింది?
జవాబు:
1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి – ఎఎఆర్డ్) మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలలో 80 శాతాన్ని తొలగించారు.

ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిర్వాసితులు కావడానికి కారణాలేమిటి?
జవాబు:
ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవటంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.

ప్రశ్న 15.
గ్రీన్ పీస్ ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా, ఈ ఉద్యమం మొదలయ్యింది. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.

ప్రశ్న 16.
గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
వాతావరణ మార్పుపై పలు దేశాలలో, గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటోంది.

ప్రశ్న 17.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
ప్రభావితులైన వాళ్లకి సరైన వైద్య సౌకర్యం; ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం; బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చెయ్యటం; చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.

ప్రశ్న 18.
“నర్మదా బచావో” ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజల కోరికలేమిటి?
జవాబు:
ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్లకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.

ప్రశ్న1 9.
భారత పర్యావరణ కేంద్రం ఎప్పుడు ఏర్పడింది? దాని ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
1980లో విజ్ఞానశాస్త్రం, పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్) అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించాడు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చెయ్యటం దీని ఉద్దేశం.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 20.
సాయుధ దళాల ప్రత్యేక చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావటానికి వ్యతిరేకించిన వాళ్లను నియంత్రించటానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి, భద్రతలను నెలకొల్పటానికి చేసిన చట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958. దేశవిద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యటానికి, లేదా కాల్చి చంపటానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది.

ప్రశ్న 21.
సాయుధ దళాల ప్రత్యేక చట్టం మీద ఉన్న ఆరోపణలేమిటి?
జవాబు:
ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమయ్యాయని, అమాయకులైన వ్యక్తులు తరచు వేధింపులు, హింసకి గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలను దోపిడీ, అత్యాచారాలకు గురిచేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను, భర్తలను నిర్బంధించి, హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా, తల్లులుగా వీళ్లకు ఉండేది. తల్లులు, కూతుళ్లు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రశ్న 22.
మీకిచ్చిన ప్రపంచపటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.

  1. అలస్కా
  2. గ్రీన్లాండ్
  3. ఇంగ్లాండ్
  4. క్యూబా
  5. చిలీ
  6. బ్రెజిల్
  7. కాంగో
  8. ఈజిప్టు
  9. దక్షిణాఫ్రికా
  10. రష్యా
  11. చైనా
  12. ఇండోనేషియా
  13. న్యూజిలాండ్

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 5

ప్రశ్న 23.
ఆనకట్టలు, పరిశ్రమలు వంటి నిర్మాణాల వల్ల రైతులకు, గిరిజనులకు కలిగే ఇబ్బందులను వ్రాయండి.
జవాబు:

  1. ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్ళు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.
  2. దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలలో చెల్లాచెదురై గిరిజన సంస్కృతి విధ్వంసమవుతోంది.
  3. రైతులు తమ వ్యవసాయ భూములు, జీవనాధారాలకు దూరమవుతున్నారు.
  4. ఈ ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడటంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 24.
“అంటరానితనం నిషేధం వల్ల సామాజిక సమానత్వం సాధించవచ్చు” దీనిపై మీ స్పందనలు తెలియజేయండి.
జవాబు:

  1. అంటరానితనం నిషేధించడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు.
  2. అంటరానితనం తొలగాలంటే కులవివక్షను రూపుమాపాలి.
  3. రాజ్యాంగంలోని 17వ అధికరణం ద్వారా అంటరానితనాన్ని నిషేధించి దానికి చట్టబద్ధత కలుగజేసింది.
  4. ప్రభుత్వాలు సదరు చట్టాల్ని నిజస్పూర్తితో అమలుపరచాలి.
  5. ప్రజలు అందరూ సమానమని గుర్తెరిగి అంటరానితనాన్ని రూపుమాపగలరు.

ప్రశ్న 25.
బహుళార్థక సాధక ఆనకట్టల వల్ల దేశానికి లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని సమర్ధించండి.
జవాబు:

  1. బహుళార్థ సాధక ఆనకట్టల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్నారు.
  2. అయితే వాటి నిర్మాణాలకు విపరీతమైన ధనవ్యయం కావడం, అనుకున్న మేర విద్యుత్ ఉత్పాదన, జలాల అందుబాటు, సాగునీటి సరఫరా చేయలేకపోవడం వల్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు.
  3. వాటి వలన లక్షలమంది ప్రజలు నిర్వాసితులవడం, లక్షల ఎకరాల అటవీ, సాగుభూములు పోవడం, ప్రత్యామ్నాయంగా అందించడానికి ప్రభుత్వ భూములు చాలినన్ని లేకపోవడం, నష్టపరిహారం ప్రభుత్వాలు సరిగా అందించకపోవడం, అరుదైన వృక్ష, జంతురాశులు అంతరించిపోవడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి.
  4. అయినప్పటికీ ఈ పథకాల నిర్మాణం తప్పనిసరి అవుతోంది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 26.
పౌరహక్కుల ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యాసదుపాయాలు వంటివి వీళ్ల ప్రధాన కోరికలు.

10th Class Social 21th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలేమిటి?
జవాబు:

  1. న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులను కాపాడటం
  2. సంస్కృతిని కాపాడుకోవడం
  3. సామాజిక నిర్మాణం, విలువల పరిరక్షణ,
  4. ప్రజల ఆరోగ్యం , ప్రాణ రక్షణ
  5. సాంఘిక సమానత్వ సాధన
  6. మద్యపానము, మత్తు పదార్థాల నుండి రక్షణ పొందుట
  7. పర్యావరణ పరిరక్షణ
  8. పంట పొలాలను పరిరక్షించుకోవడం

ప్రశ్న 2.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరాను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 4
జవాబు:

  1. పై పట్టిక మనకు కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో దేశాల ర్యాంకింగ్ మరియు ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులను విడుదల చేస్తున్నాయో తెలియజేస్తుంది.
  2. మొత్తంగా గమనించినట్లయితే ఎక్కువగా తలసరి కార్బన్ డైయాక్సెడ్ ఉదారాలను విడుదల చేసేది అమెరికా.
  3. మొత్తంగా చైనా ఉన్నట్లయినా, తలసరిలో అమెరికానే ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.
  4. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ తలసరి విడుదలలో అన్ని దేశాల కన్న తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.
  5. దానిని బట్టి మనం గమనించే విషయం ఏమిటంటే భారతదేశం శక్తి వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాలుష్యం చేయడంలో కూడా వెనుకస్థానంలో ఉన్నది.
  6. ఇలా ప్రతిదేశం కాలుష్యాన్ని పెంచుతూపోతే చివరకు మానవ జీవనం భూమి మీద అంతరించిపోతుంది. ముప్పు వాటిల్లుతుంది. మన వినాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. కావున ప్రతిదేశం వారు విడుదల చేసే కర్బన సమ్మేళనాల శాతాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మరియు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి.

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాల విశిష్టతను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
సామాజిక ఉద్యమాలలో సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనటం వలన అనుకూలత ఏర్పడి ఉద్యమం బలపడుతుంది. ఈ ఉద్యమాలు న్యాయం, ప్రజాస్వామ్యం పౌర హక్కులు అనే అంశాలతో సమ్మిళతమై ఉంటాయి. పర్యావరణం, మానవ హక్కులు అనే సరిహద్దులను చెరిపేస్తే ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం కలిగించే దిశగా ఉద్యమాలు ఉంటాయి. — ఈ ఉద్యమాలు అహింసాయుత పద్ధతులలో కొనసాగుతూ ప్రజల స్వేచ్ఛపూరిత భావనలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను రాజకీయ వ్యవస్థలు సరిచేయలేనప్పుడు వాళ్ళ ఆశయ సాధనం కోసం ఉద్యమిస్తాయి. ఈ ఉద్యమాలు ఏ ఒక్కరి ప్రయోజనం కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆశయ సాధన కోసం చేయడం జరుగుతుంది.
ఉదా :
1) గ్రీన్‌పీస్ ఉద్యమం,
2) పౌర హక్కులు,
3) మైరా పైబీ మొ||వి.

ప్రశ్న 4.
మైరా పైబీ ఉద్యమం గూర్చి వివరించండి.
జవాబు:
మైటీ భాషలో మైరాపైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం.

1970ల చివరి కాలంలో త్రాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించడానికి మైరాపైబీ ఉద్యమం మొదలైంది.

సైనిక చర్యల వలన మానవహక్కులు దెబ్బ తింటున్నాయనే భావనతో ఈ ఉద్యమం అనుసంధానం అయినది. రాత్రిళ్ళు బజారులలో మైరాపైబీ పహరా కాయటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లోని మహిళలు రోజూ ఈ పహరాలో పాల్గొనేవారు. అయితే వాళ్ళ చేతులలో ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు వాటిల్లకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వారులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా కాసేవారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతుంది. వీరికి సహకారంగా ఇరోం షర్మిల అనే మహిళ 14 సం|| రాల నుండి గృహనిర్బంధంలో నిరాహారదీక్ష చేస్తుంది. ఈ ఉద్యమం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:

  1. గిరిజనులు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరి కంటే ఎక్కువగా నష్టపోయారు.
  2. వీళ్ళకు మంచి చదువు, నైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
  3. అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు అందుబాటులో లేవు.
  4. గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.

ప్రశ్న 6.
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలు ఎదుర్కొనే సమస్వలను వివరించండి.
జవాబు:
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు:
ప్రయోజనాలు :

  1. పెద్ద మొత్తంలో నీటి నిల్వ
  2. సాగునీరు
  3. విద్యుదుత్పత్తి
  4. వరదల నియంత్రణ
  5. కరవు నియంత్రణ

సమస్యలు :

  1. సారవంతమైన భూములు కోల్పోవడం
  2. అడవులు ముంపునకు గురికావడం
  3. జంతుజాలం నశించడం
  4. ప్రజలు నిర్వాసితులు కావడం
  5. ఖర్చు అధికం

ప్రశ్న 7.
బహుళార్థ సాధక పథకాల నిర్మాణం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేయండి.
జవాబు:
లాభాలు :

  1. పెద్దమొత్తంలో నీటిని నిల్వచేయడం.
  2. వ్యవసాయాభివృద్ధి.
  3. పెద్దమొత్తంలో విద్యుదుత్పత్తి చేయడం.
  4. వరదలు, కరువులను నియంత్రించడం.
  5. ఈ అసమానతలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరింపబడాలి.

నష్టాలు:

  1. స్థానిక ప్రజలు నిర్వాసితులవుతారు.
  2. నిర్వాసితులందరికీ సరైన పునరావాసం కల్పించడం కష్టతరం, నిజానికి అసాధ్యం.
  3. జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
  4. ఆశించిన స్థాయిలో నీటి నిల్వ, విద్యుదుత్పత్తి జరగలేదు.

ప్రశ్న 8.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

1990ల నుంచి ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచ వ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరి కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేదు.
జవాబు:
ఈ పేరాగ్రాఫ్ ప్రపంచీకరణ యొక్క పరిణామాలను గురించి వివరిస్తోంది. అది ప్రధానంగా పేద ప్రజలను, గిరిజనులను ప్రభావితం చేస్తోంది. మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారిపై కూడా ప్రపంచీకరణ ప్రభావం ఉంది. నిరక్షరాస్యులు మరియు పోషకాహార లోపంతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

సాంకేతిక ప్రగతి కారణంగా అనేక రకాల యంత్రాలు కనుగొనబడ్డాయి. అభివృద్ధి చెందిన సాంకేతికత అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలో కంబైన్డ్ హార్వెస్టర్లు, నూర్పిడి యంత్రాలు (ధైషర్లు) ఉపయోగిస్తున్నారు. టాకరు మరియు టాన్‌ ప్లాంటేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. కనుక కూలీలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. రైల్వేలు, ఆనకట్టల వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేల విస్తరణ పనులు చేపట్టినప్పుడు పట్టాల క్రింద పరచడానికి గాను అనేక చెట్లు నరకబడతాయి. కావున అటవీ ప్రాంత నివాసితులు తరలింపు సమస్యను ఎదుర్కొంటారు. నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి ఉద్దేశించినపుడు వాటిని అడవుల సమీపంలోనే నిర్మించడం తప్పనిసరి. ఈ పరిస్థితి గిరిజనుల తరలింపు సమస్యకు కారణమవుతుంది. గిరిజనులలో చాలామంది నిరక్షరాస్యులు. వారు తేనె, గింజలు, విత్తనాలు సేకరించడం వంటి తమ జీవనోపాధులను కోల్పోతారు. పట్టణాలు, నగరాల, పొలిమేరల సమీపంలో పారిశ్రామిక వాడలు కూడా పెరిగాయి. ఇది కాలుష్యానికి దారితీస్తుంది. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, టెలికమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు పెరిగాయి మరియు పేద ప్రజలు, గిరిజనులపై దీని ప్రభావం పడుతోంది.

ప్రభుత్వానికి నా సూచన ఏమిటంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరియు వారి పునరావాసం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సకాలంలో తగిన నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా సంబంధిత చట్టాలను సరిగా అమలుచేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 9.
“వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.” వ్యాఖ్యానించండి.
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది :

  1. వియత్నాంపై యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.
  2. ఏజెంట్ ఆరంజ్ వంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడం ఈ క్రూరత్వానికి సరియైన ఉదాహరణ.
  3. ఏజెంట్ ఆరంజ్ అనేది మొక్కలను చంపే ఒక విషరసాయనం.
  4. దాదాపు 11 మిలియన్ గాలన్ల ఈ రసాయనాన్ని అమెరికా విమానాలు వియత్నాంపై చల్లాయి.
  5. అడవులను, పొలాలను నాశనం చేయడం ద్వారా వియత్నామీయులను తేలికగా చంపవచ్చని భావించారు.
  6. ఈనాటికి కూడా వియత్నాంలో ప్రజలపై ఈ రసాయన ప్రభావం ఉంది.
  7. పిల్లలలో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాధికి ఇది కారణమవుతున్నది.
  8. రెండవ ప్రపంచయుద్ధంలో వాడిన మొత్తం బాంబుల బరువు కంటే వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన బాంబుల బరువే ఎక్కువ.

ప్రశ్న 10.
ప్రస్తుత ప్రపంచంలో గ్రీన్ పీస్ వంటి పర్యావరణ ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.
  2. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు ‘గ్రీన్‌పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.
  3. ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టడాం (హాలండ్)లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి.
  4. సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బ తింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
  5. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
  6. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేసియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమౌతారు.
  7. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమౌతారు.
  8. ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమౌతాయి.
  9. వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది.
  10. మానవుని కారణంగా పెరిగిపోతున్న భూగోళం వేడక్కడంను నివారించాలంటే ఇలాంటి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 11.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమం ఆవిర్భవించడానికి కారణాలేమిటి?
జవాబు:
ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ లోనూ, దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరపు దేశాలలోనూ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యమూ భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నియంత్రణ, నిఘా ఉంచేవి. ఇటువంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావప్రకటన, కదలికలకు స్వేచ్ఛ, స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్ లోని పలు ప్రాంతాల్లోనూ, తూర్పు యూరపులోనూ పలు ఉద్యమాలు చేపట్టారు.

ప్రశ్న 12.
వియత్నాం యుద్ధం మూలంగా అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా స్ఫూర్తిని ఇచ్చింది?
జవాబు:
అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కాని అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లలని పంపించటానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. దీని వల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 13.
భూగోళం వేడెక్కడం మూలంగా జరిగే అనర్థాలేమిటి?
జవాబు:
సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వఠదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి.

ప్రశ్న 14.
అభివృద్ధి స్వభావం గురించి ఆలోచింపచేయటంలో “నర్మదా బచావో” ఉద్యమం ఏ విధంగా విజయం సాధించింది?
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చెయ్యటంలో అది విజయం సాధించింది – అది పేదవాళ్ల ప్రయోజనాల కోసమా, లేక ధనికులు, శక్తిమంతులకోసమా అని .ఆలోచింపచేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన’ ప్రజలకు ” తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.

AP 10th Class Social Important Questions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

ప్రశ్న 15.
మైరా పైబీ ఉద్యమంలోని మహిళల విధులేమిటి?
జవాబు:
రాత్రుళ్లు బజారులలో మైరా పైబీ పహరా తిరగటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డులోని మహిళలు రోజూ ఈ పహారాలో పాల్గొనేవాళ్లు. అయితే వీళ్ల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డచుట్టి, కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలుగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వార్డులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం పహరా ఉంటారు. కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

These AP 10th Class Social Studies Important Questions 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం will help students prepare well for the exams.

AP Board 10th Class Social 20th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social 20th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రెండవ ప్రపంచ యుద్ధం వలన ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిన దేశమేది?
జవాబు:
అమెరికా.

2. ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు సభ్యదేశాల సంఖ్య ఎంత?
జవాబు:
54.

3. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు?
జవాబు:
న్యూయార్క్

4. UNESCO ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
పారిస్.

5. UNICEF ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
న్యూయార్క్

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

6. WHO ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
జెనీవా.

7. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
హేగ్.

8. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు UNO లోని ఏ అంగం తీసుకుంటుంది?
జవాబు:
భద్రతా మండలి.

9. కాంగోలో హత్యకు గురైన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు?
జవాబు:
పాట్రిక్ లుమాంబా.

10. అంగోలా ఎవరి వలస రాజ్యం?
జవాబు:
పోర్చుగల్.

11. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ దేశస్థుడు?
జవాబు:
యూరి గగారిన్, రష్యా.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

12. తొలిసారిగా చంద్రమండలంపై కాలుమోపినది ఎవరు? ఏ దేశస్థుడు?
జవాబు:
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అమెరికా.

13. సూయజ్ కెనాల్ ను జాతీయం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
గమల్. అబెల్ నాసర్

14. 1965లో భారత్ – పాకిస్తాన్ల మధ్య యుద్ధ విరమణకు కృషిచేసిన UNO కార్యదర్శి ఎవరు?
జవాబు:
యుథాంట్.

15. 1948లో యూదుల కోసం ఏర్పడిన దేశ మేది?
జవాబు:
ఇజ్రాయిల్.

16. తూర్పు పాకిస్తాన్ నుంచి ముజిబుర్ రెహ్మాన్ మద్దతు దారులు ఏ పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు?
జవాబు:
ముక్తి బాహిని

17. అలీనోద్యమ మొదటి సమావేశం 1961లో ఎక్కడ జరిగింది?
జవాబు:
బెల్ గ్రేడ్.

18. లాటిన్ అమెరికా దేశాలలో సామ్యవాద వ్యవస్థను నిర్మించటానికి కృషిచేసిన ప్రముఖ నాయకుడు ఎవరు?
జవాబు:
ఫిడెల్ కాస్ట్రో.

19. శాశ్వత సభ్య దేశాలకు గల ప్రత్యేక (తిరస్కరించే) అధికారాన్ని ఏమంటారు?
జవాబు:
వీటో అధికారం.

20. యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో మొదలైన ఉద్యమం ఏది?
జవాబు:
జియానిస్ట్ ఉద్యమం.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

21. నాటో (NATO)కు వ్యతిరేకంగా రష్యా ఏర్పాటు చేసిన కూటమి ఏది?
జవాబు:
వార్సా (WARSAW) కూటమి.

22. మూడవ ప్రపంచ దేశాలు అని ఏ దేశాలను పిలుస్తారు?
జవాబు:
అలీన దేశాలను.

23. భారత్ లో ఆశ్రయం పొందిన టిబెట్ బౌద్ధ మత నాయకుడు ఎవరు?
జవాబు:
దలైలామా

24. USSR రద్దును ప్రకటించిన రష్యా అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
బొరిస్ ఎల్సిన్.

25. కాంగో ఏ దేశపు వలస రాజ్యం?
జవాబు:
బెల్జియం

26. ఇజ్రాయిల్‌కు చెందిన క్రీడాకారులను చంపిన ఘటన జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1972

27. NATOని విస్తరింపుము.
జవాబు:
ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

28. SEATOని విస్తరింపుము.
జవాబు:
సౌత్ ఈస్ట్ ఏషియన్ టీ ఆర్గనైజేషన్.

29. CENTOని విస్తరింపుము.
జవాబు:
సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్.

30. PLOని విస్తరింపుము.
జవాబు:
పాలస్తీనా విముక్తి సంఘం.

31. తాలిబన్లు అనే తీవ్రవాదులు ఏ దేశానికి చెందినవారు?
జవాబు:
ఆఫ్ఘనిస్తాన్

32. UNOలో ప్రస్తుతం (2014 నాటికి) ఎన్ని సభ్య దేశాలు కలవు?
జవాబు:
193.

33. యూరప్, ఆసియా మధ్య ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
పశ్చిమ ఆసియా.

34. ఏ సంవత్సరంలో ఇరాన్లో విప్లవం సంభవించింది?
జవాబు:
1979.

35. USSR ను ఏ సంవత్సరంలో రద్దు పరుస్తున్నట్లు ప్రకటించారు?
జవాబు:
1991.

36. PLO నాయకుడు ఎవరు?
జవాబు:
యాసర్ అరాఫత్.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

37. 1968లో ఇరాక్ లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సైనిక నియంత ఎవరు?
జవాబు:
సద్దాం హుస్సేన్.

38. పంచశీల సిద్ధాంత రూపకర్త ఎవరు?
జవాబు:
J.L. నెహ్రు

39. భారత, చైనాల మధ్య సరిహద్దు రేఖ ఏది?
జవాబు:
మెక్ మోహన్ రేఖ.

40. POK అనగా?
జవాబు:
పాక్ ఆక్రమిత కాశ్మీర్.

41. తూర్పు పాకిస్తాన్‌ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం?
జవాబు:
బంగ్లాదేశ్.

42. శ్రీలంక ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది?
జవాబు:
1948.

43. తాష్కెంట్ ఒప్పందం భారత్ మరియు ఏ దేశానికి మధ్య జరిగింది?
జవాబు:
పాకిస్తాన్.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

44. శ్రీలంక ఏ మహాసముద్రంలోని ద్వీప దేశం?
జవాబు:
హిందూ

45. భద్రతా మండలిలో ఎన్ని దేశాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉంటాయి?
జవాబు:
అయిదు (5).

46. మత ప్రమేయం లేని రాజ్యంను ఏమంటారు?
జవాబు:
లౌకిక దేశం.

47. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
F.D. రూజ్వెల్ట్.

48. క్రింది ఏ సందర్భాలలో మాత్రమే UNO దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంది?
i) తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన
ii) ప్రపంచ శాంతికి ముప్పు.
iii) రాజకీయ ఆందోళనలు
జవాబు:
(i) & (ii)

49. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని ప్రధాన సంస్థలు (అంగాలు) ఉన్నాయి?
జవాబు:
ఆరు.

50. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి ఎవరు?
జవాబు:
సెక్రటరీ జనరల్.

51. ప్రచ్ఛన్న యుద్ధ దశ ఏది?
జవాబు:
1945 – 1991

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

52. కాంగో స్వాతంత్రం పొందిన సంవత్సరం ఏది?
జవాబు:
1960.

53. రష్యా, ఆఫ్ఘనిస్తాన్ పై ఏ సంవత్సరంలో దాడి చేసింది?
జవాబు:
1971.

54. NATO ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1949.

55. నాటో, సీటో, సెంటో, వార్సాకూటమి లలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి.
జవాబు:
వార్సా కూటమి.

56. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్ట్ కూటమి యొక్క సైనిక సంధి ఏది?
జవాబు:
వార్సా సంధి.

57. మానవులచే అంతరిక్షంలోకి పంపబడిన తొలి కృత్రిమ ఉపగ్రహం పేరేమి?
జవాబు:
స్పుట్నిక్.

58. U2 అనగా
జవాబు:
అమెరికా గూఢచర్య విమానం.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

59. NAM అనగా?
జవాబు:
అలీనోద్యమం (నాన్ అలైన్ మెంట్ మూవ్ మెంట్)

60. బాండుంగ్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1955.

61. మొదటి ఆసియా – ఆఫ్రికా సమావేశం ఎక్కడ జరిగింది?
జవాబు:
బాండుంగ్.

62. పశ్చిమాసియా సంక్షోభం ప్రధానంగా ఎవరెవరికి చెందినది?
జవాబు:
అరబ్బులు, యూదులు.

63. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పాలస్తీనా ఎవరి ఆధీనంలో ఉండేది?
జవాబు:
బ్రిటన్.

64. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమైన ప్రాంతం ఏది?
జవాబు:
జెరూసలెం.

65. యూదుల వాగ్దాత్తా భూమి ఏది?
జవాబు:
పాలస్తీనా.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

66. ఇజ్రాయిల్ పై దాడి చేయటానికి అరబ్బులను ఏకం చేయటానికి ప్రయత్నించినది ఎవరు?
జవాబు:
నాసర్.

67. ఆశ్వాన్ డామ్ ఏ నదిపై నిర్మించబడింది?
జవాబు:
నైలునది.

68. ప్రపంచ వాణిజ్య కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు:
న్యూయార్క్

69. USSR లో (రష్యాలో) గ్లాస్ నోస్తే, పెరిస్తోయికా వంటి సంస్కరణలను ప్రారంభించింది ఎవరు?
జవాబు:
మిహయిల్ గోర్బచెవ్

70. సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినవారు ఎవరు?
జవాబు:
జుల్ఫికర్ ఆలి భుట్టో – ఇందిరాగాంధీ.

71. పంచశీల ఒప్పొందాన్ని చేసుకున్న దేశాలు ఏవి?
జవాబు:
భారత్ – చైనా

72. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సద్దాం హుస్సేన్ ( ) a) టిబెట్
ii) నాసర్ ( ) b) ఈజిప్టు
iii)దలైలామా ( ) c) ఇరాక్
iv) గోర్బచెవ్ ( ) d) రష్యా
జవాబు:
i – c, ii – b, iii – a, iv – d

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

73. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఎస్ అల్లెండి ( ) a) చిలీ
ii) చేగువేరా ( ) b) లాటిన్ అమెరికా
iii)లుమంబా ( ) c) కాంగో
జవాబు:
i – a, ii – b, iii – c

74. టిబెటను 1950లో ఆక్రమించిన దేశం ఏది?
జవాబు:
చైనా.

75. కార్గిల్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1999.

76. చైనా భారతదేశంపై ఏ సంవత్సరంలో దాడి చేసింది?
జవాబు:
1962.

77. ఏ దేశం స్వాతంత్ర్యానంతరం భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి సంధి చేసుకుంది?
జవాబు:
బంగ్లాదేశ్.

78. “యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటిలేదు”. ఈ వ్యాఖ్య చేసింది ఎవరు?
జవాబు:
హారీ ట్రుమన్ (అమెరికా అధ్యక్షుడు)

79. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు?
జవాబు:
ఆంటోనియా గెటరస్.

80. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలలో భిన్నమైనది ఏది?
జవాబు:
జర్మనీ.

81. మొదటి జతలోని సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి.
బెల్జియం : కాంగో : : పోర్చుగల్ : ?
జవాబు:
అంగోలా.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

82. మొదటి ప్రపంచ యుద్ధం : నానాజాతి సమితి : : రెండవ ప్రపంచ యుద్ధం 😕
జవాబు:
ఐక్యరాజ్య సమితి.

83. NATO : అమెరికా : : వార్సా కూటమి 😕
జవాబు:
రష్యా

84. లిబియా : గఢాఫి : : ఇరాక్ : ?
జవాబు:
సద్దాం హుస్సేన్

85. CIA ఏ దేశపు గుడచారి సంస్థ?
జవాబు:
అమెరికా.

86. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా తన సైన్యాలను ఎప్పుడు విరమించుకుంది?
జవాబు:
1985 లో

87. అలీనోద్యమంకి సంబంధించిన సమాచారం పూరించండి.
మొదటి సమావేశం – 1961
1961లో సభ్యదేశాలు – 25
2012 నాటికి సభ్య దేశాలు -?
జవాబు:
120.

88. క్రింది వానిని సరియైన కాలక్రమంలో ఉంచండి.
i) ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి
ii) పాలస్తీనా విముక్తి సంఘం ఏర్పాటు
iii) మ్యూనిచ్ ఒలంపిక్స్.
iv) యాసర్ అరాఫత్ మరణం.
జవాబు:
i, ii, iii & iv

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

89. 2001 సెప్టెంబర్ 11 న ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఏది?
జవాబు:
ఆల్‌ఖైదా.

90. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ పాలస్తీనా విముక్తి సంఘ అధ్యక్షుడు – అరాఫత్
→ USSR చివరి అధ్యక్షుడు – గోర్బచెవ్.
→ చైనా గణతంత్రం – చియాంగ్ కై షేక్
→ గోర్బచెవ్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు- బోరిస్ ఎల్సిన్
జవాబు:
గోర్బచెవ్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు – బోరిస్ ఎల్సిన్.

91. తాష్కెంట్ ఎక్కడ ఉంది?
జవాబు:
ఉజ్బెకిస్తాన్లో

92. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కమ్యూనిస్ట్ శిబిరం ( ) a) USSR
ii) పెట్టుబడిదారీ శిబిరం ( ) b) USA
iii)తటస్థ శిబిరం ( ) c) NAM
iv) తీవ్రవాద శిబిరం ( ) d) PLO
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

93. బ్రహ్మపుత్ర – గంగా నదుల విషయంలో ఏ దేశంతో మనం వివాదం కల్గి ఉన్నాం?
జవాబు:
బంగ్లాదేశ్ తో

94. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది (తేది)?
జవాబు:
1945, అక్టోబర్ 24న

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

95. 1947లో టర్కీ గ్రీకు దేశాలలో కమ్యూనిస్ట్ వ్యతిరేక శక్తులకు మద్దతు నిచ్చింది ఎవరు?
జవాబు:
హరీట్రుమన్ (అమెరికా)

96. అస్వాన్ ఆనకట్ట కట్టినందుకు ఈజిప్టుకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన దేశం ఏది?
జవాబు:
అమెరికా.

97. 1948, 1962, 1965, 1971 సంవత్సరాలలో ఏ సంవత్సరం భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరగలేదు?
జవాబు:
1962 లో

98. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) తూర్పు పాకిస్తాన్లో ముజిబుర్ రెహ్మన్ మద్దతు దారులు “ముక్తి బాహిని” పేరుతో ఉద్యమాన్ని చేపట్టారు.
ii) భారత ప్రధాని ఇందిరా గాంధీ దీనికి మద్దతుగా నిలిచింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C) (i) మరియు (ii)

99. శ్రీలంకకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 1948లో స్వాతంత్ర్యం పొందింది.
ii) శ్రీలంకలో తమిళభాష మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

100. 1965లో భారతదేశ ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
లాల్ బహాదుర్ శాస్త్రి.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

101. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ క్వాచక్రూమా – కెన్యా
→ మార్షల్ టీటో – యుగోస్లావియా
→ సుకర్నో – ఇండోనేషియా
→ నాజర్ – ఇజ్రాయిల్
జవాబు:
నాజర్ – ఇజ్రాయిల్

102. USSRలో తీవ్ర మార్పులు తెచ్చి, మరింత పారదర్శకంగా చేసి దాని రాజకీయాలను మార్చటానికి ప్రయత్నించినది
జవాబు:
గోర్బచెవ్

103. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసినది ఎవరు?
జవాబు:
చౌ-ఎన్-లై-నెహ్రూ

104. లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయి-చిన్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదేనంటున్న దేశం ఏది?
జవాబు:
చైనా

105. 1965లో పాకిస్తాన్ నియంత ఎవరు?
జవాబు:
బెనజీర్ భుట్టో

106. ‘క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా, ఇతర ఐరోపాదేశాలు ఆర్థికంగా నష్టపోయాయి.
II. అమెరికాకు జరిగిన నష్టం తక్కువ, వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది.
A) I & II సరియైనవి
B) I & II సరియైనవి కావు
C) I మాత్రమే సరియైనది
D) II మాత్రమే సరియైనది
జవాబు:
A) I & II సరియైనవి

107. “యుద్ధం వలన మనం ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం – చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తిమంతదేశం మరొకటి లేదు” – అమెరికా అధ్యక్షుడు హారీ ట్రుమన్ ఈ వ్యాఖ్యలను ఎందుకు చేసాడు?
జవాబు:
యుద్ధకాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించటం వల్ల

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

108. “రెండవ ప్రపంచ యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునఃనిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం కొత్త ప్రక్రియలను చూసింది.” ఈ ప్రక్రియలలో ముఖ్యమైనది కానిది.
A) ఐక్యరాజ్యసమితి ఏర్పాటు
B) పెట్టుబడిదారీ విధానము
C) ప్రచ్ఛన్న యుద్ధం
D) వలసపాలన నుంచి విముక్తి
జవాబు:
(B) పెట్టుబడిదారీ విధానము

109. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన ఉద్దేశం.
జవాబు:
శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి

110. క్రిందివానిలో సరియైన జత కానిది.
A) అంతర్జాతీయ న్యాయస్థానం – ది హేగ్
B) ప్రపంచ ఆరోగ్య సంస్థ – జెనీవా
C) UNESCO – పారిస్
D) UNICEF – వాషింగ్టన్
జవాబు:
D) UNICEF – వాషింగ్టన్

111. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు.
II. దీనిలో 5 శాశ్వత సభ్య దేశాలకు ప్రత్యేకహోదా ఉంది.
III. భద్రతా సమితి నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒకటైనా జోక్యం చేసుకుని తిరస్కరించవచ్చు.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) II, III మాత్రమే సరియైనవి
D) I, III మాత్రమే సరియైనవి
జవాబు:
A) I, II & III సరియైనవి

112. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి; ఈ సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ల అణచివేత వంటి వాటిని అమెరికా అవలంభించింది.
II. పలుపార్టీల ప్రజాస్వామ్యం ప్రైవేటు పెట్టుబడు దారుల నియంత్రణలో అభివృద్ధి అన్న భావాలను రష్యా ప్రోత్సహించింది.
A) I & II సరియైనవి
B) I & II సరియైనవి కావు
C) Iమాత్రమే సరియైనది
D) II మాత్రమే సరియైనది
జవాబు:
B) I & II సరియైనవి కావు

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

113. ఈ క్రింది వానిలో సరియైన వ్యాఖ్య కానిది
A) బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వాతంత్రం వచ్చింది.
B) పోర్చుగల్ వలస పాలన కింద ఉన్న అంగోలాకి 1975లో స్వాతంత్రం వచ్చింది.
C) లాటిన్ అమెరికాలో ఫిడేల్ క్యాస్ట్రో సామ్యవాద వ్యవస్థని నిర్మించటానికి కృషి చేశాడు.
D) చిలీలో ఎస్. అల్లెండీ ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ శక్తులు పడదోసాయి.
జవాబు:
D) చిలీలో ఎస్. అల్లెండీ ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ శక్తులు పడదోసాయి.

114. సైనిక ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల ప్రభావ పరిధి పెరిగి వాటికి అందుబాటులోకి రాని అంశం.
A) చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
B) సైనిక స్థావరాల ఏర్పాటు
C) వివిధ సంస్కృతుల సమ్మేళనం గావించబడటం
D) అగ్రదేశాల వజాల వ్యాప్తి
జవాబు:
C) వివిధ సంస్కృతుల సమ్మేళనం గావించబడటం

115. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. మొదటి ఉపగ్రహం అయిన స్పుట్నిక్ ని రష్యా ప్రయోగించింది.
II. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరిగగారిన్ని రష్యా పంపించింది.
III. నీల్ ఆర్న్ స్ట్రాంగ్ ను చంద్రమండలం మీదకి 1969లో రష్యా పంపింది.
A) I, II & III సరియైనవి
B) I, II సరియైనవి
C) II, III సరియైన
D) I, III సరియైనవి
జవాబు:
B) I, II సరియైనవి

116. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి, ఈ ఉద్దేశంతో నిర్వహించిన సమావేశం.
జవాబు:
బాండుంగ్ సమావేశం

117. అలీనోద్యమం (NAM)కు సంబంధించి సరియైన వాక్యం ఎంచుకోండి.
A) NAM మొదటి సమావేశం 1961లో బెల్ గ్రేడ్ లో జరిగింది.
B) మొదటి సమావేశానికి 25 సభ్యదేశాలు హాజరయ్యాయి.
C) 2012 నాటికి NAM లో సభ్యదేశాలు 193.
D) NAM లో 17 పరిశీలన దేశాలు ఉన్నాయి.
జవాబు:
C) 2012 నాటికి NAM లో సభ్యదేశాలు 193.

118. అలీనోద్యమ ముఖ్య ఉద్దేశం కానిది.
A) సభ్యదేశాల మద్య సహకారం
B) వలస పాలన నుంచి విముక్తి
C) ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావానికి దూరం
D) యుద్ధ సమయంలో సైనిక సాయం
జవాబు:
D) యుద్ధ సమయంలో సైనిక సాయం

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

119. క్రింది సేట్మెంటను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. అరబ్బులు, యూదులు మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమాసియా సంక్షోభం అంటారు.
II. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఫ్రాన్స్ నియంత్రణలో ఉండేది.
III. ఇక్కడ ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్ర స్థలం.
A) I, II & III సరియైనవి
B) I, II సరియైనవి
C) II, III సరియైనవి
D) I, III సరియైనవి
జవాబు:
D) I, III సరియైనవి

120. జియోనిస్ట్ ఉద్యమం మొదలవ్వడానికి ప్రధాన ఉద్దేశం కానిది.
A) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేయటం
B) మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొందటం
C) ప్రపంచంలో యూదులను శక్తివంతంగా చేయటం
D) యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటం
జవాబు:
C) ప్రపంచంలో యూదులను శక్తివంతంగా చేయటం

121. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపటం, జైలుపాలు చెయ్యటం అలాగే యూరలో ఉన్న క్రైస్తవులు, యూదులను వేధింపులకు గురి చెయ్యటానికి ప్రధాన కారణం.
జవాబు:
యేసుక్రీస్తుని శిలువ వెయ్యటానికి యూదులను బాధ్యులను చేయటం

122. ఈజిప్టుకి అమెరికా తన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయ టానికి కారణం.
జవాబు:
ఆస్వాస్ ఆనకట్ట కట్టినందుకు సంవత్సరం

123. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము కానిది.
I. గోర్బచెవ్ ఉదారవాద సిద్ధాంతాలు, కలవాడు, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి కొన్ని సంస్కరణలు చేపట్టాడు, వాటిని గ్లాస్ నోస్తే, పెరిస్తోయికాగా వ్యవహరిస్తారు.
II. బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది, 1991లో USSR నీ రద్దు చేసాడు.
III. దీనితో ఏక ధృవ ప్రపంచంగా మారి, ప్రపంచీకరణ
మొదలయ్యింది.
A) I, II & III సరియైనవి ,
B) I&TI సరియైనవి ,
C) II & III సరియైనవి
D) I & III సరియైనవి
జవాబు:
A) I, II & III సరియైనవి

124. 1968లో ఇరాక్ లో తిరుగుబాటు చేసి, ఈ నినాదంతో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు.
జవాబు:
జాతీయతావాదం, సోషలిజం

125. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. చైనా, భారత్ కు మధ్య’ పంచశీల ఒప్పందం జరిగింది.
II. 1954, ఏప్రిల్ 29న రెండు దేశాలు పంచశీలపై సంతకాలు చేశాయి.
III. చైనా, భారత్ కు మధ్య సరిహద్దుగా రాడ్ క్లిఫ్ రేఖ గీశారు.
A) I, II & III సరియైనవి
B) I & II సరియైనవి.
C) II & III సరియైనవి
D) 1& III సరియైనవి
జవాబు:
B) I & II సరియైనవి

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

126. కారణం : భారతదేశం దలైలామాకు ఆశ్రయం ఇచ్చింది.
ఫలితం : భారత్, చైనాల మధ్య వైరుధ్యం మొదలయ్యింది.
జవాబు:
కారణం, ఫలితం సరియైనవే.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2

పై గ్రాను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎంచుకోండి.
127. 1945 తర్వాత USA మరియు USSR మధ్య ఆయుధ పోటీకి కారణం ఏది?
A) తర్వాత జరిగే ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమవ్వడం.
B) దురాక్రమణ పూరక జాతీయతావాదం.
C) ప్రచ్ఛన్న యుద్ధంలో భాగం
D) పైవన్నీ
జవాబు:
C) ప్రచ్ఛన్న యుద్ధంలో భాగం

128. 2005 నాటికి ఏ దేశం వద్ద ఆయుధాలు తక్కువగా ఉన్నాయి?
జవాబు:
అమెరికా.

10th Class Social 20th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
NATO ను విస్తరించండి.
(లేదా)
నాటో (NATO) ఎప్పుడు ఏర్పడింది. ఎవరు ఏర్పాటు చేశారు?
జవాబు:
1949లో నాటో ఏర్పడింది (ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ). దీనిని అమెరికా ఏర్పాటు చేసింది.

ప్రశ్న 2.
భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికి ఎందుకు ముఖ్యమైనదో వివరించండి.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 1
జవాబు:

  1. రెండు దేశాలు అనేక రంగాలలో ప్రత్యేకించి ఆర్థిక రంగంలోనూ, నదీ జలాల విషయంలోనూ సహకరించుకుంటున్నాయి. మరియు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలోనూ రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉంది.
  2. దక్షిణ ఆసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం చెయ్యాలన్న భారతదేశ విధానంలో బంగ్లాదేశ్ ఒక భాగమైంది.

ప్రశ్న 3.
భారత, చైనాల మధ్య గల సరిహద్దు రేఖ ఏది?
జవాబు:
మెక్మ హన్ రేఖ

ప్రశ్న 4.
‘పంచశీల’ అనగానేమి?
జవాబు:
శాంతి, అహింస, సహజీవనం అనేవి మన విదేశాంగ నీతి సూత్రాలు. 1954లో టిబెట్టు విషయంపై భారతదేశం, చైనాలు చేసుకున్న ఒడంబడికలో శాంతియుత సహజీవన సూత్రం వివరించబడింది. దీనిలో 5 సూత్రాలు ఉంటాయి. అందుకే దీనిని ‘పంచశీల’ అంటారు.

ప్రశ్న 5.
రెందు ధృవాల, ఏక ధృవ ప్రపంచం అన్న పదాలను వివరింపుము.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, రష్యా దేశాల నాయకత్వంలో ప్రపంచం విభిన్న సిద్దాంతాలు గల రెండు బృందాలుగా విడిపోయింది. ఈ పరిస్తితిని రెండు ధృవాల ప్రపంచం అంటారు….

USSR పతనంతో అమెరికా ఒక్కటే ప్రపంచంలో బలమైన శక్తిగా మిగిలింది. ఈ పరిస్థితిని ఏకధృవ ప్రపంచం అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 6.
అలీనోద్యమం అనగానేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా అంతర్జాతీయ రాజకీయాలలో తటస్థ విధానాన్ని అనుసరించడాన్ని అలీన ఉద్యమం అంటారు.

ప్రశ్న 7.
క్రింది ఫోను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2
గ్రాఫ్ : అమెరికా, రష్యాల వద్ద అణ్వాయుధ నిల్వలు
1) 1955-2005 మధ్య కాలంలో ఏ దేశం యొక్క అణ్వాయుధాల సంఖ్య ఎక్కువగా ఉన్నది?
జవాబు:
1955-2005 మధ్యకాలంలో రష్యా యొక్క అణ్వాయుధాల సంఖ్య ఎక్కువగా ఉన్నది.

2) 1985 సం|| తరువాత నుండి అణ్వాయుధాల నిల్వలలో తగ్గుదల ఎందుకు వచ్చింది?
జవాబు:
ప్రజల ఒత్తిడి మేరకు మరియు యుద్ధాలను నిరోధించే పనిలో భాగంగా శాంతిని పెంపొందించే దిశగా చర్చలు ప్రారంభించి ప్రపంచ శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో అణ్వాయుధాల తయారీ తగ్గి నిల్వలు తగ్గాయి.

ప్రశ్న 8.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయంది.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 3
A) “నాటో” స్థాపన నాటి రెండు దేశాలు ఏవి?
జవాబు:
నార్వే, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం, డెన్మార్క్ ఐల్యాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్.

B) “వార్సా” క్రింద ఉన్న రెండు దేశాలు ఏవి?
జవాబు:
సోవియట్ యూనియన్, అల్బేనియా, పోలాండ్, రుమేనియా, హంగరీ, చెకొస్లోవేకియా, బల్గేరియా.

C) పై పటం దేనిని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పై పటం ప్రచ్ఛన్న యుద్ధంలో సైనిక ఒప్పందాల గురించి తెలియజేస్తుంది.

D) యునైటెడ్ కింగ్డమ్ ను ‘ద్వీపం’ అని ఎందుకు అంటారు?
జవాబు:
యునైటెడ్ కింగ్డమ్ చుట్టూ నీటిచే ఆవరించబడి ఉండడం వలన ‘ద్వీపం’ అని అంటారు.

ప్రశ్న 9.
పంచశీల సూత్రాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
గాంధేయవాద సిద్ధాంతాలైన శాంతి, అహింస ఆధారంగా విదేశాంగ నీతిని మలచుకోవడం.

ప్రశ్న 10.
ప్రచ్ఛన్న యుద్ధం అనగా నేమి?
జవాబు:
ప్రపంచంలో ఏ రెండు చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినా అగ్రరాజ్యాలు రెండూ చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సంప్రదాయ యుద్ధాలలో మాదిరి పోరు లేదు కనుక దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 11.
‘జియానిస్ట్ ఉద్యమం’ ఎందుకు మొదలయ్యింది?
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికిగాను యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది.

ప్రశ్న 12.
పంచశీల సూత్రాలలో రెండింటిని పేర్కొనండి..
జవాబు:
పంచశీల సూత్రాలు:

  1. ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం.
  2. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం.
  3. దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం.
  4. అంతర్జాతీయ సంబంధాలతో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం.
  5. శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం.

ప్రశ్న 13.
ఐక్యరాజ్యసమితి యొక్క ఏవైనా రెండు ఉద్దేశ్యములను తెలపండి.
జవాబు:

  1. ప్రపంచ శాంతి
  2. అభివృద్ధి
  3. మానవ హక్కులను కాపాడటం
  4. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం

ప్రశ్న 14.
ప్రస్తుత ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు?
జవాబు:
ఆంటోనియో గెటరస్

ప్రశ్న 15.
“యుద్ధం వల్ల గెలిచిన దేశాలకు కూడా నష్టం వాటిల్లుతుంది.” – వ్యాఖ్యానించంది.
జవాబు:
యుద్ధాల్లో గెలిచిన దేశాలకు కూడా ధన, ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధంలో పాల్గొన్న ఏ దేశానికైనా ఈ నష్టం తప్పదు.

ప్రశ్న 16.
బాక్స్ ‘ఏ’ లో ఉన్న లోగో బాక్స్ ‘బి’ లో ఉన్న ఏ అంతర్జాతీయ సంస్థకు చెందినది?
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 5
UNO.

ప్రశ్న 17.
చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తి ఎవరు?
జవాబు:
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.

ప్రశ్న 18.
అమెరికా అభివృద్ధి చెందడానికి కారణమేమి?
జవాబు:
యుధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి.

ప్రశ్న 19.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఏ విధంగా విభజింపబడింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిజం మధ్య (అమెరికా – రష్యాల మధ్య) విభజింపబడింది.

ప్రశ్న 20.
ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1945 అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది.

ప్రశ్న 21.
ఐక్యరాజ్య సమితి ఏ విధంగా పనిచేస్తుంది?
జవాబు:
ఇది ఆరు వేరువేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది.

ప్రశ్న 22.
భద్రతా సమితిలోని శాశ్వత సభ్యదేశాలేవి?
జవాబు:
భద్రతా సమితిలో చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ (ఇప్పుడు రష్యా), అమెరికాలు శాశ్వత సభ్య దేశాలు.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 23.
అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు దేని మీద ఖర్చు చేశాయి?
జవాబు:
అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఆయుధ సేకరణ మీద ఖర్చుచేశాయి.

ప్రశ్న 24.
మొదటి ఉపగ్రహం ఏది? ఎవరు ప్రయోగించారు?
జవాబు:
మొదటి ఉపగ్రహం స్పుత్నిక్, దీనిని రష్యా ప్రయోగించింది.

ప్రశ్న 25.
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు?
జవాబు:
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి “యూరిగగారిన్”. ఇతనిని రష్యా పంపింది.

ప్రశ్న 26.
అమెరికా చంద్రమండలం మీదకి ఎవరిని, ఎప్పుడు పంపించింది?
జవాబు:
అమెరికా “నీల్ ఆస్ట్రాంగ్”ని 1969లో చంద్రమండలం మీదకి పంపించింది.

ప్రశ్న 27.
అలీనోద్యమ మొదటి సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
జవాబు:
అలీనోద్యమ మొదటి సమావేశం 1961 సెప్టెంబరులో యుగోస్లావియాలోని బెల్ గ్రేడ్ లో జరిగింది.

ప్రశ్న 28.
పశ్చిమ ఆసియా అని దేనినంటారు?
జవాబు:
యూరప్, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు.

ప్రశ్న 29.
పశ్చిమ ఆసియా సంక్షోభమని దేనిని అంటాము?
జవాబు:
‘అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను’ పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు.

ప్రశ్న 30.
పశ్చిమ ఆసియా సంక్షోభం మరింత క్లిష్టరూపం దాల్చడానికి కారణమేమి?
జవాబు:
మధ్యప్రాచ్యంలో ప్రత్యేకించి అరబ్బు ద్వీప ఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్టరూపం దాల్చింది.

ప్రశ్న 31.
మిహాయిల్ గోర్బచెవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను ఏమంటారు?
జవాబు:
గోర్బచెవ్ ప్రవేశ పెట్టిన సంస్కరణలను “గ్లాసెస్”, ‘పెరిస్తోయికా’గా పిలుస్తారు.

ప్రశ్న 32.
చైనా గణతంత్ర రాజ్యం ఎప్పుడు అయింది?
జవాబు:
సుదీర్ఘపోరాటం, హింసాత్మక విప్లవం తరువాత 1949లో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం అయింది.

ప్రశ్న 33.
తాష్కెంట్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
భారత ప్రధానమంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి, పాకిస్తాన్ సైనిక నియంత ‘జనరల్ ఆయుబ్ ఖాన్’ల మధ్య 1966లో తాష్కెంట్ ఒప్పందం జరిగింది.

ప్రశ్న 34.
బంగ్లాదేశ్ కు, భారతదేశానికి మధ్య విభేదాంశాలు ఏమిటి?
జవాబు:
బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపిణీ, బంగ్లాదేశ్ ప్రజలు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి రావడమనే అంశాలమీద విభేదాలున్నాయి.

ప్రశ్న 35.
సిమ్లా ఒప్పందం ఎవరెవరి మధ్యన జరిగింది?
జవాబు:
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం ముగిసిన తరువాత జుల్ఫికర్ అలీ భుట్టో, మన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మధ్యన ఈ సిమ్లా ఒప్పందం జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 36.
ఐక్యరాజ్య సమితి స్థాపనకు కారణమేమిటి?
జవాబు:
అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి జగడానికి ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయటమనేది ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు దారితీసింది.

ప్రశ్న 37.
యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు రద్దు అయ్యింది?
జవాబు:
1991లో గోర్బచెవ్ యుఎస్ఎస్ఆర్ ని రద్దుపరిచారు. అలా రద్దయిన యుఎస్ఎస్ఆర్ లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యా యి.

10th Class Social 20th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది విషయాన్ని చదివి, అర్థం చేసుకొని ప్రశ్నకు సమాధానం రాయండి.

ఐక్యరాజ్యసమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న రెండు ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో అది దేశాల స్వయంప్రతిపత్తిని గుర్తించి ప్రపంచశాంతికి ముప్పు లేదా తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన వంటి సందర్భాల్లో తప్పించి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది.
ప్రశ్న. ఐక్యరాజ్యసమితి ఉద్దేశాలపై వ్యాఖ్యానించండి.
జవాబు:
ఐక్యరాజ్యసమితి అక్టోబరు 24, 1945 వ సంవత్సరం ఏర్పడింది.

  1. ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతిని నెలకొల్పడం కోసం ఏర్పాటు చేయబడింది.
  2. ప్రపంచ శాంతిని నెలకొల్పడం కోసం 6 ప్రధాన అంగాలతో పాటు, 8 ప్రత్యేక ఏజన్సీలతో పనిచేస్తుంది.
  3. ఐక్యరాజ్యసమితి 2 ప్రధానమైన ఉద్దేశాలతో ఏర్పడింది. అవి
    1) శాశ్వతశాంతి,
    2) మానవ అభివృద్ధి.
  4. ఇవే కాకుండా మానవ హక్కులను కాపాడటం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం అనే అంశాలతో ఇది పనిచేస్తుంది. అంతేకాక ఐక్యరాజ్యసమితి ఏ దేశం యొక్క అంతరంగిక వ్యవహారాలలో తలదూర్చనని, కాని ఏ దేశం అయిన మానవ హక్కులను ఉల్లంఘించిన లేదా ప్రపంచ శాంతికి ముప్పు కలిగించినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది.

ప్రశ్న 2.
ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకుంటావు?
జవాబు:

  • ప్రపంచంలో ఏ రెండు చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినా అగ్రరాజ్యాలు రెండూ చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. వాస్తవానికి యుద్ధం జరుగదు. కనుక దీనిని ‘ప్రచ్ఛన్న యుద్ధం’ అంటారు.
  • రెండు కూటముల మధ్య పరస్పర ద్వేషం, అపనమ్మకం, శత్రుత్వ భావనలు ఏర్పడినాయి.
  • ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినాయి.
  • వివిధ దేశాలు అభద్రతా భావంతో రహస్య కూటములుగా ఏర్పడటం, ఒప్పందాలు కుదుర్చుకోవటం జరిగింది.
  • యుద్ధం జరగకపోయినప్పటికి యుద్ధ నీడలో బితుకు బితుకుమంటూ రెండు దేశాల శిబిరాలు గడిపాయి.
  • పలుమార్లు ప్రపంచం యుద్ధం అంచున నిలిచింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
  • సామ్యవాదం, పెట్టుబడిదారీవిధానం మొదలైన సైద్ధాంతికపరమైన విభేదాలు కూడా పొడ చూపినాయి.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 3.
శాంతి పట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్‌లాల్ నెహ్రూ ప్రఖ్యాతిగాంచిన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు.
1) ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించుట.
2) ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం.
3) దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం.
4) అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయటం.
5) శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం.
ప్రశ్నలు:
1) పంచశీల ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది?
2) ఏవైనా రెండు పంచశీల ఒప్పందాలను వ్రాయండి.
జవాబు:
1) పంచశీల ఒప్పందం భారత్-చైనా దేశాల మధ్య జరిగింది.

2) a) ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించుట
b) ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం
c) దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం
d) అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం
e) శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం.

ప్రశ్న 4.
ఒక దేశం తన పొరుగు దేశాలతో స్నేహపూరిత సంబంధాలను కలిగి ఉండటానికి నీవు యిచ్చే సూచనలు ఏవి?
జవాబు:
ఏ దేశము ప్రస్తుత కాలంలో ఒంటరిగా మనుగడ సాగించలేదు, అలాగే తమ ప్రజల అవసరాలకు కావలసిన వనరులు తమ దేశంలో లభ్యం కావు, కావున ప్రతి దేశానికి పొరుగు దేశం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. అందువలన ప్రతిదేశం పొరుగుదేశంతో సత్సంబంధాలను కొనసాగించాలి.
a) పొరుగు దేశాలతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.
b) మనదేశం యొక్క శాంతి, సౌభాగ్యాలను పొరుగు దేశాలతో పంచుకోవాలి.
c) ఒకరికి ఒకరు పోటీతత్త్వం మానివేసి పరస్పరం ఆర్థిక సహాయ సహకారాలు అందించుకుంటూ ఎదగాలి.
d) సైనికవాదాన్ని వీడి సోదరభావాన్ని నెలకొల్పుకోవాలి.
e) ఇతరదేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకుండా శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించుకోవాలి.

ప్రశ్న 5.
క్రింది పటాన్ని పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 6
ప్రశ్నలు:
A) భారతదేశ ఈశాన్య సరిహద్దు దేశాలు రెండింటిని పేర్కొనండి..
B) భారతదేశంతో సముద్రతీర సరిహద్దు గల దేశాలు రెండింటిని పేర్కొనండి.
జవాబు:
A) భూటాన్, చైనా, నేపాలు భారతదేశానికి ఈశాన్య సరిహద్దులో ఉన్న దేశాలు.
B) శ్రీలంక మరియు మాల్దీవులు భారతదేశంతో సముద్రతీర సరిహద్దులో గల దేశాలు.

ప్రశ్న 6.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 7
ప్రశ్నలు:
1) నాటో సైనిక ఒప్పందాన్ని ప్రతిపాదించిన దేశమేది?
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు / అమెరికా

2) ఆఫ్రికా, ఐరోపా ఖండాల మధ్య ఉన్న సముద్రమేది?
జవాబు:
మధ్యధరా సముద్రము

ప్రశ్న 7.
క్రింది విషయాన్ని చదివి, అర్థం చేసుకొని సమాధానం రాయంది.
“వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడటానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది. యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి. ఎక్కువ ఉత్పత్తి, ఉపాధి సాధించారు. హారీ ట్రూమన్ “యుద్ధం వలన మనం ప్రపంచంలో కెల్లా శక్తిమంత మైన దేశంగా ఆవిర్భవించాం” అన్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం అమెరికాను ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడేటట్లు చేసిందని భావించవచ్చు?
జవాబు:

  1. రెండో ప్రపంచ యుద్ధ ప్రారంభంలో అమెరికా యుద్ధరంగాలకు దూరంగా ఉంది.
  2. యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి.
  3. యుద్ధరంగానికి కావలసిన ఆయుధాలను అమెరికా యూరోపియన్ దేశాలకు సరఫరా చేసి లాభాలను గడించింది.
  4. అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు. కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ.
  5. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. అందువల్ల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడింది.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 8.
ఈ క్రింది పాఠ్యాంశాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

అమెరికా, రష్యా రెండింటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే అణు యుద్ధమే జరిగితే ఏ దేశము గెలవదని ఆ రెండింటికీ తెలుసు అయినప్పటికీ అవి సైనిక, కీలక ఒప్పందాలు కుదుర్చుకోసాగాయి. 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటికా సంధి వ్యవస్థ (నాటో) అన్న దాని ద్వారా బలపరుచుకుంది. దీనికి ప్రతి చర్యగా కమ్యూనిస్టు దేశాలు వార్సా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా వివిధ ప్రాంతాలలో మిలటరీ మిత్రత్వ ఒప్పందాలైన – సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీటో), సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెటో)లను కుదుర్చుకుంది.
a) నాటోకి ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ఏది?
జవాబు:
వార్సా ఒప్పందం

b) అమెరికా ఏర్పాటు చేసుకున్న మిలటరీ, మిత్రత్వ ఒప్పందాలు ఏవి?
జవాబు:
సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీటో), సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెట్స్)

ప్రశ్న 9.
ప్రస్తుత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలను సమీక్షించండి.
జవాబు:
1) కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.
2) శాంతి స్థాపనకై ప్రయత్నాలు కొనసాగించడంతో పాటు వర్తక వాణిజ్యం, క్రీడలు, పర్యాటకం మొదలైన అంశాలలో మంచి సంబంధాలు నెలకొల్పే ప్రయత్నం భారతదేశం వైపు నుండి జరుగుతున్నది.

ప్రశ్న 10.
భారత్-పాకిస్తాన్ యొక్క ప్రస్తుత సంబంధాలను గురించి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
భారత్-పాకిస్తాన్ల మధ్య సంబంధాలు :

  • కాశ్మీర్ సమస్య
  • నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన
  • సరిహద్దు గ్రామాలపై దాడులు
  • అక్రమ చొరబాట్లు
  • తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం.

ప్రశ్న 11.
క్రింద యివ్వబడిన గ్రాఫ్ ను విశ్లేషించి మీ పరిశీలనను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2
జవాబు:

  1. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచం రెండు ప్రధాన రాజకీయ శిబిరాలుగా విడిపోయింది.
  2. ఒక శిబిరానికి రష్యా (USSR) నాయకత్వం వహించింది.
  3. రెండవ శిబిరానికి అమెరికా (USA) నాయకత్వం వహించింది.
  4. అమెరికా, రష్యాలు అణ్వాయుధ నిల్వలకై పోటీపడ్డాయి.
  5. 1965 నాటికి అమెరికా వద్ద అత్యధిక అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి.
  6. 1985 నాటికి రష్యా వద్ద అత్యధిక అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి.
  7. 2005 నాటికి రెండు దేశాలు అణ్వాయుధ నిల్వలు తగ్గించుకున్నాయి.

ప్రశ్న 12.
భారత దేశం అలీన విధానాన్ని ఎందుకు స్వీకరించింది?
జవాబు:

  1. అమెరికా, రష్యా మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీ కారణంగా ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది.
  2. ఈ రెండు పక్షాలలో దేనివైపునా లేకుండా ఉండటాన్ని అలీనోద్యమం అంటారు.
  3. (వలస పాలన నుంచి విముక్తి పొంది) కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశం కనుక ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా ఉండాలని.
  4. మిగతా దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకుగాను భారతదేశం అలీనోద్యమంను స్వీకరించింది.

ప్రశ్న 13.
ఐక్యరాజ్య సమితి అంగాలేవి?
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఆరు అంగాలతో విధులు నిర్వహిస్తుంది.

  1. సాధారణ సభ
  2. భద్రతాసమితి
  3. ఆర్థిక, సామాజిక మండలి.
  4. ధర్మకర్తృత్వ మండలి
  5. అంతర్జాతీయ న్యాయస్థానం
  6. కార్యదర్శి వర్గం

ప్రశ్న 14.
ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్యదేశాలేవి? వాటికున్న ప్రత్యేక హోదా ఏమిటి?
జవాబు:
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ (ఇప్పుడు రష్యా), అమెరికాలకు ప్రత్యేక హెూదా ఉంది. భద్రతాసమితి తీసుకున్న నిర్ణయాలను ఈ అయిదు దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకుని వీటో చెయ్యవచ్చు అంటే తిరస్కరించవచ్చు.

ప్రశ్న 15.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆయుధ పోటీ ఏవిధంగా జరిగింది?
జవాబు:
ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వల పైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి.

ప్రశ్న 16.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అంతరిక్ష పోటీ ఏ విధంగా జరిగింది?
జవాబు:
మొదటి ఉపగ్రహం అయిన స్పుత్నికిని రష్యా ప్రయోగించింది. అలాగే అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరి గగారిన్ని రష్యా పంపించింది. దీంతో రెండు అగ్ర రాజ్యాల మధ్య ఉపగ్రహాలను ప్రయోగించటంలో పోటీ మొదలయ్యింది. నీల్ ఆ స్ట్రాంగ్ ని, ఇతరులను చంద్రమండలం మీదకి పంపటంలో 1969లో అమెరికా సఫలమయ్యింది.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 5.
అలీనోద్యమం యొక్క ఆశయాలేమిటి?
జవాబు:
ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది.

ప్రశ్న 17.
అలీనోద్యమం మొదటి సమావేశ ఉద్దేశాలేమిటి?
జవాబు:

  1. అలీనోద్యమ సభ్యదేశాల మధ్య సహకారం’, వీటిల్లో ‘అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి.
  2. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం.
  3. వలస పాలననుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడటం.
    ఇవి అలీనోద్యమ మొదటి సమావేశ ఉద్దేశాలు.

10th Class Social 20th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అలీన ఉద్యమం (NAM) అనగానేమి? దాని ప్రధాన లక్ష్యాలు ఏవి?
జవాబు:

  • అమెరికా, రష్యా మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీ కారణంగా ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది.
  • ఈ రెండు పక్షాలలో దేనివైపునా లేకుండా ఉండటాన్ని అలీనోద్యమం అంటారు.
  • అలీనోద్యమ (NAM) ప్రధాన లక్ష్యాలు :
    1) అలీనోద్యమ సభ్యదేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడం.
    2) పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ద తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావంను అంచనా వేయటం.
    3) వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడటం.
    4) ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటం.

ప్రశ్న 2.
ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్యసమితి (UNO) పాత్ర ఏమిటి?
జవాబు:
ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్యసమితి (UNO) పాత్ర : ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబరు 24న ఏర్పడింది.
ప్రపంచ శాంతి పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది ఎలాగంటే,

  • ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ప్రశంసనీయ కృషి చేసింది.
  • అణ్వాయుధాల తగ్గింపుకై రష్యా, అమెరికాలపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రయత్నంలో సఫలీకృతమైంది.
  • మూడో ప్రపంచ యుద్ధం సంభవించకుండా శాంతి స్థాపనకు కృషి చేస్తూ ఉంది.
  • కాంగో స్వాతంత్ర్య సాధనలో సహాయ సహకారాలు అందించింది.
  • పోర్చుగల్ నుండి అంగోలా స్వాతంత్ర్యం పొందడంలో తోడ్పడింది.
  • ఆఫ్ఘనిస్థాన్ నుండి రష్యా సైన్యం తొలగించేలా కృషి సల్పింది.
  • పాలస్తీనా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపడం జరిగింది.
  • భారత్, పాక్ మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తుంది.
  • ఇరాన్, ఇరాక మధ్య యుద్ధ నివారణా చర్యలు చేపట్టింది.
  • ఈజిప్ట్ నుండి ఇజ్రాయేల్ సైన్యాల ఉపసంహరణకు ప్రయత్నం చేసింది. ఈ విధంగా ఎన్నో సమస్యలలో యుద్ధం సంభవిస్తుందనుకున్న సమయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించటం జరిగింది.

ప్రశ్న 3.
భారత, పాకిస్తాన్‌ అభివృద్ధికి శాంతియుత పరిస్థితులు ఎంత మేరకు దోహదపడతాయి? చర్చించండి.
(లేదా)
భారతదేశము, పాకిస్తాన్ మధ్య శాంతి ఇరుదేశాల అభివృద్ధికి అవసరం. ఎందువలన? ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వివరించండి.
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్‌ అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరమే. ఎందుకనగా …….
1) యుద్ధ ఖర్చు :
ఈ రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతుండడంతో ఇరు దేశాలు ఆయుధాలను, సైనికసంపత్తిని సమీకరించుకొనుటకు అధిక ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే యుద్ధ ఖర్చు తగ్గుతుంది.

2) ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది :
ఇరు దేశాల మధ్య యుద్ధ భయం లేకపోతే ఇరు దేశాల ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

3) సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధభీతి తగ్గుతుంది :
సరిహద్దు రాష్ట్రాల వాళ్లు యుద్ధ భయం లేకుండా ప్రశాంత జీవనం సాగించవచ్చు.

4) సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరుదేశాలకూ ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం, శాంతి నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 4.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరాను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 8
జవాబు:

  1. పై పట్టిక మనకు బ్రిటన్, జర్మనీ దేశాలు 1933వ సంవత్సరము నుండి 1939వ సంవత్సరము వరకు రక్షణకు ఎంతఖర్చు పెట్టినారో తెలియజేస్తుంది.
  2. మొదటి ప్రపంచ యుద్ధము తరువాత ప్రపంచ దేశాలు వాటి స్వీయరక్షణకు మరియు శత్రువుల నుంచి కాపాడటానికి ఆయుధాల తయారీకి మరియు సైన్యమును పెంచుకోవటానికి ఎక్కువ ఖర్చు చేశాయి.
  3. బ్రిటన్ ని తీసుకున్నట్లయితే 1933 నుండి 1939 వరకు తాను 455 మిలియన్ డాలర్ల నుండి 1817 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టినది.
  4. జర్మనీని పరిశీలించినట్లయితే జర్మనీ దేశ రక్షణకోసం 253 మిలియన్ డాలర్ల నుండి 4400 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టినది. బ్రిటన్ కన్న జర్మనీ దేశరక్షణకు ఎక్కువగా ఖర్చు పెట్టినది. అంతేగాక మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ని ఓడించాలని మిలటరీ మీద బాగా ఖర్చు చేసినది.
  5. రెండు ప్రపంచ యుద్దాల మధ్య కాలంలో దేశ రక్షణకు ఖర్చు పెడుతూ ప్రతిదేశం ఇంకొక దేశమును శత్రువుగా చూడటం వలన వైరుధ్యం పెరిగి రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది.
  6. ప్రతిదేశము రక్షణ కోసం చేసే ఖర్చుకన్న శాంతి కోసం చేసినట్లయితే ఈ యుద్ధాలు వచ్చే వికాదు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లేవారు.

ప్రశ్న 5.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించి దిగువన యివ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2
i) 1955-1975 మధ్య కాలంలో ఏ దేశం ఎక్కువ ఆయుధ నిల్వలు కలిగి ఉంది?
జవాబు:
1955-1975 మధ్య కాలంలో అమెరికా దేశం ఎక్కువ ఆయుధ నిల్వలను కలిగి ఉంది.

ii) 1965లో అమెరికా కలిగి ఉన్న అణ్వాయుధాల సంఖ్య ఎంత?
జవాబు:
1965లో అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య – 30,000

iii) రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాలు రెండు శిబిరాలుగా విడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సమానత్వం అన్న భావన ప్రభుత్వ నియంత్రణతో అభివృద్ధి అనే భావాలతోను మరియు బహుపార్టీ ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులతో నియంత్రణ ద్వారా అభివృద్ధి సాధించాలనే భావాలతో రెండు సైద్ధాంతిక పరమైన రాజకీయ శిభిరాలుగా ప్రపంచం విడిపోయింది.

iv) 1990 తరువాత దేశాల అణ్వాయుధ నిల్వలు తగ్గిపోవటానికి గల కారణమేమిటి?
జవాబు:
రష్యా అధ్యక్షుడు ఆయుధ పోటీకి స్వస్తిపలకాలని “గ్లాస్ నోస్త్”, “పెరిస్తోయికా” అనే సంస్కరణలను చేపట్టాడు. ఈ సిద్ధాంతాలను అనుసరించి దేశాలు అణ్వాయుధాల సేకరణను తగ్గించాయి. అంతేకాక యుద్ధాల వలన ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించటం జరిగింది.

ప్రశ్న 6.
ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలకు వీటో అధికారం ఉండడం శాంతికి దోహదమా? విఘాతమా? చర్చించండి.
జవాబు:
1) వీటో అధికారం – వీటో దేశాలు (అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా)

2) శాంతికి దోహదం.

  • వీటో అధికారం ఉపయోగించడం ద్వారా ప్రపంచ శాంతి పరిరక్షణ.
  • ఐక్యరాజ్యసమితిని నియంత్రించటం.
  • ఐక్యరాజ్యసమితిని మధ్యస్థంగా నడిచేలా చూడడం.

3) శాంతికి విఘాతం.

  • యుద్దాలను నివారించలేకపోవడం.
  • వీటో అధికారం గల దేశాల పోరులో తరచూ బందీగా మారడం.
  • అనుకూలమైన దేశాలను రక్షించుకోవడం.

ప్రశ్న 7.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 9
OX = సంవత్సరాలు, OY = ఖర్చు రూపాయలలో
జవాబు:
రేఖాచిత్రం ఇరుగు పొరుగు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ సైనిక ఖర్చును తెలియచేస్తుంది.

వారీ సైనిక ఖర్చును, వారి ఖర్చు జిడిపిలో ఎంత శాతమో తెలియచేస్తుంది.

రూపాయలలో చూసినట్లయితే పాకిస్థాన్ సైనిక ఖర్చు కన్నా భారతదేశ సైనిక ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. జిడిపిలో శాతాలను పోల్చినట్లయితే కొంచెం దగ్గరగానే ఉన్నాయి.

భారత్ చాలా పెద్ద దేశం. కాబట్టి దేశ రక్షణ కోసం తన సైనిక ఖర్చును యింకా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 8.
పశ్చిమాసియా ఘర్షణల గురించి వివరించండి.
జవాబు:
పశ్చిమాసియా ఘర్షణలు :
1) యూరపు, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న ఫాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్రస్థలం.

2) యూదులు పాలస్తీనాని తమ ‘వాగ్దత్త భూమి’గా పరిగణిస్తారు. ప్రాచీనకాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు.

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (వీళ్లల్లో ఎక్కువమంది అరబ్బు ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

4) మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్టరూపం దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతర దేశాలు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి.

ప్రశ్న 9.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, న్యూక్లియర్ ఆయుధాల నిల్వ యొక్క ధోరణిని విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 10
జవాబు:
ఈ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుందంటే 1990 నుండి 2014 వరకు అమెరికా, రష్యాలు నిల్వ ఉంచిన ఆయుధాల సంఖ్యను ఇవ్వడం జరిగింది. 1990లో USA 10,904 ఆయుధాల నిల్వలను కలిగి ఉంటే రష్యా 37,000లకు కలిగి ఉంది. అంటే ఇది అమెరికా కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని అర్థం. కాని 2014తో పోలిస్తే అమెరికా, రష్యాలు చాలా వరకు ఆయుధాల నిల్వలలో సమానంగా ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే 1995 నుంచి 2014 వరకు మనం గమనించినట్లయితే ఆయుధాల నిల్వల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దానికి కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన తీవ్ర పరిణామాలు విధ్వంసాలు, మానవ నష్టం ఇవి అన్ని కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాక ఐక్యరాజ్యసమితి USA, USSR లకు ఆయుధాల సంఖ్యను తగ్గించమని శాంతికి దోహదం చేయమని కోరటం జరిగింది. అంతే కాకుండా మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచ వినాశనం తప్ప ఏమీ లేదని గమనించడం జరిగింది. దానికి తోడు NPT మీద మరియు CTBT ల మీద రెండు దశలు సంతకాలు చేయడం జరిగింది. ఈ రెండు దేశాలు ఆయుధ నిల్వల వలన జరిగే అనర్ధాలను కూడా గ్రహించి ఆయుధాల సంఖ్యను తగ్గించి శాంతికి కృషి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 10.
భారత్, చైనాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి ఆ దేశాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. ఇరుదేశాలు సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలి.
  2. సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.
  3. దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి.
  4. ఒక దేశాన్ని మరోదేశం పోటీదారుగా పరిగణించకూడదు.
  5. పంచశీల ఒప్పందం స్ఫూర్తిని ఇరుదేశాలే అనుసరించాలి.
  6. ఇరుదేశాలు సాంస్కృతిక అనుసంధానం ద్వారా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి.

ప్రశ్న 11.
ప్రస్తుత పరిస్థితులలో భారతదేశం, పొరుగు దేశాలతో మంచి స్నేహ సంబంధాలు నెలకొల్పుటకు తగు సలహాలు రాయండి.
జవాబు:

  1. సామరస్య ధోరణితో సమస్యల పరిష్కరించుకోవాలి.
  2. పరస్పర గౌరవంతో మెలగాలి.
  3. ప్రాంతీయ సహకార సంస్థలను బలోపేతం చేయాలి.
  4. దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలి.
  5. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహకారాన్ని అందించాలి
  6. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటిత పోరు సాగించాలి.
  7. ఆయుధాలు తగ్గించుకోవాలి.
  8. నూతన సాంకేతిక ఆవిష్కరణల పరస్పర బదిలీ జరగాలి.
  9. సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించాలి.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 12.
ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ప్రస్తుత పరిస్థితులను వివరించండి.
జవాబు:

  1. టెర్రరిజం
  2. యుద్ధాలు
  3. ఆయుధ పోటీ
  4. ఆక్రమణలు
  5. మతతత్వం
  6. వనరుల దోపిడి
  7. అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవహారాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు జోక్యం చేసుకోవటం
  8. దురహంకారపూరిత జాతీయవాదం

ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
అమెరికా, రష్యా అణ్వాయుధ నిల్వలు

 

సంవత్సరం అమెరికా రష్యా
1965 33,000 10,000
1975 25,000 32,000
1985 24,000 45,000
1995 12,000 25,000
2005 11,000 16,000

జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో పెట్టుబడిదారీ శిబిరం. ఈ రెండు శిబిరాల మధ్య, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 45 సంవత్సరాలపాటు ఒక వింత యుద్ధం జరిగింది. ప్రపంచంలో ఏ రెండు చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినా ఈ అగ్రరాజ్యాలు చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సంప్రదాయ యుద్ధాలలో మాదిరి నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అన్నారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా, రష్యాల మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో అవి అణ్వాయుధ నిల్వలను సమకూర్చుకున్నాయి.

పై పట్టికలో ఈ రెండు అగ్రరాజ్యా ల అణ్వాయుధ నిల్వల గురించిన సమాచారం ఇవ్వబడింది. దీనిని పరిశీలిస్తే, 1965 నుండి 2005 వరకు అమెరికా అణ్వాయుధ నిల్వలు క్రమేపి తగ్గుతూ వచ్చాయి. రష్యా విషయానికి వస్తే, 1965 నుండి 1985 అణ్వాయుధ నిల్వలు భారీగా పెరుగుతూపోయి, 1995 నుండి 2005 వరకు తగ్గుతూ వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోరుగా భాగంగా తొలుత అణ్వాయుధ నిల్వలను పెంచుకున్నాయి. తర్వాతి కాలంలో యుద్ధకాంక్ష, ఆయుధ పోటీ ప్రపంచ వినాశనానికి హేతువులు కాగలవన్న వాస్తవాన్ని గ్రహించాయి. అణు యుద్ధమే చెలరేగితే ఏ దేశమూ గెలవదని, మొత్తం నాగరికతలకే ముప్పు తెచ్చే స్థాయిలో మానవ నష్టం జరుగుతుందని ఈ శిబిరాలకు తెలుసు. అదీ కాక, అంతర్జాతీయ ఒత్తిడుల మూలంగా, ఇవి తమ ఆయుధ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చాయి.

ప్రశ్న 14.
నేడు అలీనోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి తగు సలహాలను రాయండి.
జవాబు:
అలీనోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి తగు సలహాలు :

  1. ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించుకోవాలి.
  2. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
  3. దాడులకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతోను, సామరస్య ధోరణితోనూ పరిష్కరించుకోవాలి.
  4. పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయాలి.
  5. శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలి.
  6. అలీనోద్యము దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలి.
  7. ఈ దేశాల మధ్య ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహకారాన్ని అందించుకోవాలి.

ప్రశ్న 15.
భారత్ – పాకిస్తాన్ సంబంధాల గురించి వివరించండి.
జవాబు:
పాకిస్తాన్‌తో భారతదేశ సంబంధాలు :

  1. విభజన తరువాత రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాశ్మీరు రెండింటి మధ్య ముఖ్యమైనవివాదాంశంలుగా పరిణమించింది.
  2. రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీరు కోసం 1947-48 మధ్య జరిగింది. అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు. యుద్ధం వల్ల కాశ్మీరు రెండుగా విభజింపబడింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె), భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. ఈ రెండింటిని వాస్తవాధీన రేఖ విడదీస్తోంది.
  3. 1965లో భారతదేశానికి ప్రధాన మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ ఆయుబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. కాశ్మీరుని విముక్తి చెయ్యటం అన్న పేరుతో భారతదేశంపై దాడి చేస్తే కాశ్మీరులో తిరుగుబాటు సంభవిస్తుందని ఆయుబ్ ఖాన్ ఆశించాడు, అయితే కాశ్మీరు ప్రజలు ఇందుకు స్పందించలేదు.
  4. భారతదేశ యుద్ధం చేయడంతో కాశ్మీరు నుంచి పాకిస్తాన్ వెనక్కి తగ్గక తప్పలేదు. కాల్పుల విరమణకు అంగీకరించేట్లు రెండు దేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యుథాంట్ ఒప్పించాడు.
  5. కాల్పుల విమరణ తరువాత 1966లో తాష్కెంట్ లో రెండు దేశాల ప్రధాన మంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు.
  6. 1971 డిసెంబరులో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగింది. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్ గా ఏర్పడింది. దీనితో భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించటంతో యుద్ధం ముగిసింది. తరువాత జుల్ఫికర్ ఆలి భుట్టో, ప్రధానమంత్రి ఇందిరాగాంధి నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది.
  7. 1971 యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధమేదీ జరగలేదు. కాని సరిహద్దు వెంట అనేకసార్లు కాల్పులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మీరు ‘కార్గిల్ యుద్ధం’ గురించి విని ఉంటారు. 1999లో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూ భాగాలను ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్లను తిప్పికొట్టాల్సి వచ్చింది.
  8. భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబు, జమ్ము-కాశ్మీరులలో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలను బలపరుస్తూ వస్తోంది. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతతత్వ తీవ్రవాదులకు శిక్షణనిచ్చి భారతదేశంలో సమస్యలు సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తుంది.
  9. అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో అస్థిరత సృష్టిస్తోందని అణ్యాయుధాలు, ఇతర ఆయుధాల నిల్వల ద్వారా, సైనిక చర్య ద్వారా తనను నిత్యం బెదిరిస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది.
  10. అదే సమయంలో సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరు దేశాలకు ఉండటంతో స్వార్ధపరశక్తులు ద్వేషాన్ని పెంపొందించినప్పటికీ వాటిని అధిగమించటానికి పాకిస్తాన్, భారతదేశ ప్రజలు ప్రయత్నిస్తున్నారు.
  11. వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహవారధులు నిర్మించటానికి ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాలలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటే ఇది ఇరు దేశ ప్రజల మధ్య మరింత అవగాహన, సహకారం ఏర్పడటానికి దోహదం చేస్తుందని భారతీయులు, పాకిస్తానీ ప్రజలు భావిస్తున్నారు.
  12. ఇలాంటి తరుణంలో కాశ్మీరుకు ప్రతిపత్తి పోదా కల్పించే 370 ఆర్టికల్ ను ప్రస్తుత ప్రభుత్వం (2019) రద్దు చేయటంతో పాకిస్తాన్ మన దేశంపై అనేక అర్థం లేని ఆరోపణలు చేస్తూ, ఇరు దేశాల సంబంధాలను మరింత క్షిణించేలా చేస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 16.
ప్రపంచం మీద ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావమెటువంటిది?
జవాబు:
ప్రత్యర్థి శిబిరాలు విధ్వంసకర ఆయుధాల నిల్వలను పెంచుకుంటూ పోవటంతో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకుబితుకుమంటూ ఉంది. అన్ని దేశాల ప్రజలు యుద్ధ భయంతో గడపసాగారు. రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం అనివార్యమనిపించిన సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ దౌత్యంతో వీటిని ఎలాగో నివారించగలిగారు. రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచర్య విమానాన్ని కూల్చివెయ్యటం, క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించటం, కొరియా, గల్ఫ్ యుద్దాల వంటి సందర్భాలలో పలుమార్లు ప్రపంచం యుద్ధం అంచున నిలిచింది.

ప్రశ్న 17.
అలీనోద్యమ స్థాపనకు దారి తీసిన అంశాలేవి?
జవాబు:
1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనయ్యింది. రెండు అగ్రరాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీలు కారణంగా ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది. ఈ రెండు పక్షాలలో దేనివైపునా లేకుండా ఉండటానికి అంతగా అవకాశాలు లేకపోయినా అటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అగ్ర రాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలసపాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలైన పేదరికం, అనారోగ్యం, అసమానత్వం, వలసవాదం వంటివి ఏవీ పరిష్కారం కాలేదు. ఇటువంటి అంశాలు అలీనోద్యమ స్థాపనకు దారితీశాయి.

ప్రశ్న 18.
భారత్-పాకు తమ ఆదాయంలో అధిక మొత్తాన్ని ఆయుధాల సేకరణ కోసం ఖర్చు చేయుటలో కారణాలేమిటో చెప్పగలవా?
జవాబు:
భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబు, జమ్ము-కాశ్మీరులలో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలను బలపరుస్తూ వస్తోంది. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతతత్వ తీవ్రవాదులకు శిక్షణనిచ్చి భారతదేశంలో సమస్యలు సృష్టించటానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తుంది. అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో అస్థిరత సృష్టిస్తోందని అణ్వాయుధాలు, ఇతర ఆయుధాల నిల్వల ద్వారా, సైనిక చర్య ద్వారా తనను నిత్యం బెదిరిస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది. దీని ఫలితంగా రెండు దేశాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ఆయుధాలను సమకూర్చుకోటానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నాయి. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. రెండవదేశం తమపై దాడికి దిగకుండా ఈ అణ్వాయుధాలు నిరోధిస్తాయని రెండు దేశాలూ నమ్ముతున్నాయి.

ప్రశ్న 19.
1965లో ఇండియా – పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసిన తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి వెలువరించిన అభిప్రాయాలేమిటి?
జవాబు:
“మన దేశ ప్రత్యేకత ఏమంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, ఇంకా ఎన్నో మతాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ గుడులు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. అయితే వీటిని మనం రాజకీయాల్లో జోక్యం చేసుకోనివ్వం…. భారతదేశానికి, పాకిస్తాన్ కి మధ్య ఉన్న తేడా ఇదే. పాకిస్తాన్ తనని తాను ఇస్లామిక్ దేశంగా పేర్కొంటూ మతాన్ని రాజకీయ అంశంగా ఉపయోగించుకుంటోంది. భారతదేశ ప్రజలు ఏ మతాన్ని అయినా ఆచరించవచ్చు, ఏ విధంగానైనా దేవుడిని ఆరాధించవచ్చు. రాజకీయాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ భారతీయులే.”

ప్రశ్న 20.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2
రేఖాచిత్రంను పరిశీలించి, 1945 నుండి అమెరికా, రష్యాలు ఆయుధ నిల్వలు ఏ విధంగా పెంచుకుంటూ వచ్చాయో వ్యాఖ్యానించుము.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవే యు.ఎస్.ఎస్.ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రణతో అభివృద్ధి అనే భావనలను రష్యా అవలంబించింది. బహుపార్టీ ప్రజాస్వామ్యం, ప్రైవేటు – పెట్టుబడిదారులతో నియంత్రణ ద్వారా అభివృద్ధి సాధించాలని అమెరికా భావించింది. తూర్పు యూరప్ అనగా పోలాండ్, హంగరీ, తూర్పు జర్మనీ మరియు చైనా, వియత్నాంలు కూడా రష్యాకు సన్నిహితంగా ఉండేవి. పశ్చిమ యూరప్ దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్లు అమెరికాకు మద్దతుగా ఉండేవి. ప్రపంచంలోని దేశాలను తమ తమ శిబిరాలలో చేర్చుకోవటానికి ఈ రెండు అగ్రరాజ్యాలు పోటీపడుతూ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగించాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఈ రెండు దేశాలు ఆయుధ సమీకరణలో కూడా పోటీ పడుతున్నాయని పై రేఖాచిత్రం ద్వారా తెలియుచున్నది.

పై రేఖాచిత్రం గమనించినట్లయితే 1945లో ఆయుధాల సంఖ్య చాలా తక్కువగా 5000 కంటే తక్కువగా కనిపిస్తుంది. 1955 నుండి అమెరికా, రష్యాల అయుధ సమీకరణ పెరుగుతూనే ఉంది. అమెరికా 1955 నుండి 1965 మధ్యలో ఆయుధాలను అత్యధికంగా 30,000కు పైగా సేకరించింది. ఆ తరువాత కాలంలో అమెరికా యొక్క ఆయుధ సేకరణ తగ్గుముఖం పట్టిందని తెలుస్తుంది. రష్యా యొక్క ఆయుధ సేకరణ క్రమంగా పెరుగుతూ, 1985 నాటికి అత్యధికంగా 45,000 అణ్వాయుధాలను సేకరించింది. ఆ తరువాత కాలంలో అమెరికా, రష్యాల ఆయుధ సేకరణ తగ్గుతూ వచ్చింది.

1985 తరువాత రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ ఆయుధ పోటీకి స్వస్తి పలకాలని “గ్లాస్ నోస్”, “పెరిస్తాయికా” అనే సంస్కరణలను చేపట్టినాడు. గోర్బచేవ్ ఉదారవాద సిద్ధాంతాల మూలంగా అమెరికా, రష్యాల ఆయుధ సేకరణ తగ్గుతూ వచ్చి, 1991 నాటికి ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది.

ప్రశ్న 21.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 3
పై యూరప్ పటంను గమనించి నాటో స్థాపన దేశాలు ఏమిటి? ప్రవేశించిన దేశాలేమిటి? వార్సా ఒప్పంద దేశాలేమిటి? వార్సాలోకి ప్రవేశించిన దేశాలేమిటి? విరమించుకున్న దేశాలేమిటో వివరించుము.
జవాబు:
ప్రచన్నయుద్ధంలో సైనిక ఒప్పందాలతో కూడిన పై పటంను పరిశీలించగా ఈ క్రింది విషయాలు తెలియుచున్నవి.
1) నాటో (NATO) ను 1942లో ఏర్పాటు చేశారు. నాటో స్థాపనలో సభ్యులుగా ఉన్న దేశాలు :
ఎ) స్వీడన్ బి) ఇంగ్లాండు సి) పోర్చుగల్ డి) ఐలాండ్ ఇ) డెన్మార్క్ ఎఫ్) నెదర్లాండ్ జి) బెల్జియం హెచ్) లర్జెంబర్గ్ ఐ) ఫ్రాన్స్ జె) మొనాకో 3) ఇటలీ.

2) ఆ తరువాత నాటోలో సభ్యులుగా చేరిన దేశాలు :
ఎ) గ్రీస్, 1952 బి) టర్కీ, 1952 సి) పశ్చిమ జర్మనీ, 1955 డి) స్పెయిన్, 1982

3) వార్సా స్థాపన 1966లో జరిగింది. వార్సా స్థాపనలోనే సభ్యులుగా ఉన్న దేశాలు :
ఎ) సోవియట్ యూనియన్ (రష్యా) బి) పోలాండ్ సి) చెకోస్లోవేకియా డి) హంగరీ ఇ) రుమేనియా ఎఫ్) బల్గేరియా.

4) ఆ తరువాత వార్సాలో చేరిన దేశం : తూర్పు జర్మనీ 1956
5) వార్సా నుండి సభ్యత్వాన్ని విరమించుకున్న దేశం : అల్బేనియా 1968

AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 22.
వలస పాలనా కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుగా మెక్ మోహన్ రేఖ గీశారు. నెహ్రూ దానిని అంగీకరించాడు. చైనా, భారతదేశాల మధ్యనున్న టిబెట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది. అయితే ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబెట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ 1950లో టిబెట్ ని చైనా తనలో కలిపేసుకుంది. దీంతో భారత – చైనా దేశాల మధ్య బఫర్ ప్రాంతం లేకుండాపోయింది. టిబెట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణిచివేసింది. దలైలామాతో సహా వేలాది టిబెటన్లు తప్పించుకుని భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. భారతదేశం దలైలామాకి ఆశ్రయం ఇచ్చింది. దీంతో భారత్ – చైనాల మధ్య వైరుధ్యం మొదలయ్యింది. భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావించటం మొదలు పెట్టింది. అంతకుముందే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది. లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయి – చిన్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది. అనేక ప్రయత్నాలు, సుదీర్ఘ చర్చలు తరువాత కూడా ఈ వివాదాలు ఈనాటికీ పరిష్కృతం కాలేదు.
ప్రశ్న : భారత్ – చైనా సంబంధాల స్థితి గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. మె మోహన్ రేఖ భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖ.
  2. చైనా, భారత్ మధ్య ఉన్న టిబెటను చైనా కలిపేసుకుంది.
  3. టిబెట్ నుండి వచ్చిన దలైలామాకు భారతదేశం ఆశ్రయం ఇచ్చింది.
  4. భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావిస్తున్నది.
  5. లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయి, చిన్ ప్రాంతం ; అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది.
  6. దానికి భారతదేశం అంగీకరించలేదు
  7. ఆ సమస్యలు పరిష్కృతం కాలేదు.
  8. అయితే శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రశ్న 23.
ఇచ్చిన రేఖాచిత్రాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 2
ప్ర: 1. పై గ్రాఫ్ దేనిని సూచిస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ అమెరికా, రష్యాల వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలు సూచిస్తోంది.

2. 1985లో ఏ దేశం అత్యధిక సంఖ్యలో ఆయుధాలను కలిగి ఉంది?
జవాబు:
1985 నాటికి రష్యా అత్యధిక అణ్వాయుధాలు కల్గి ఉంది.

3. 1945 తర్వాత USA, USSR మధ్య ఆయుధపోటీ ఎందుకు సంభవించింది?
జవాబు:
1945 తర్వాత ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఆయుధపోటీ సంభవించింది.

4. 2005లో ఏ దేశం వద్ద ఆయుధాలు తక్కువగా ఉన్నాయి?
జవాబు:
2005 లో అమెరికా వద్ద తక్కువ అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి.

ప్రశ్న24.
ఇచ్చిన రేఖాచిత్రాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం 9
1) ఈ సమాచారాన్ని ప్రచురించిన సంస్థ పేరేమి?
జవాబు:
సమాచారాన్ని ప్రచురించిన సంస్థ – ‘స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ’.

2) 2000 సంవత్సరం నాటికి ఏ దేశం తన జి.డి.పి.లో ఎక్కువ శాతం సైన్యంపై ఖర్చు చేస్తున్నది?జవాబు:
పాకిస్తాన్.

3) GDP పరంగా చూస్తే ఏ దేశం అత్యధికంగా సైనిక ఖర్చు చేసింది?
జవాబు:
GDP లో శాతంగా చూస్తే పాకిస్తాన్ అత్యధికంగా సైనిక ఖర్చు చేసింది.

4) పై గ్రాఫ్ దేనిని సూచిస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ భారత్, పాకిస్తాన్ దేశాల సైనిక ఖర్చును సూచిస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

These AP 10th Class Social Studies Important Questions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 will help students prepare well for the exams.

AP Board 10th Class Social 19th Lesson Important Questions and Answers రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social 19th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. 1977లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి అయిన వారు ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

2. మొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు?
జవాబు:
మొరార్జీ దేశాయ్.

3. భారతదేశంలో అత్యవసర పరిస్థితి నిలుపుదల చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1977.

4. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

5. L.K. అద్వానీచే రామజన్మభూమి రథయాత్ర ప్రారంభించ బడిన సంవత్సరం?
జవాబు:
1990.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

6. భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై భారత ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

7. పంజాబ్ కి పరిమితమై నిక్కులకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
శిరోమణి అకాలీదళ్ (SAD)

8. 1970లలో అసోంలో వచ్చిన సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

9. పంజాబులో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
బింద్రేన్ వాలా.

10. శ్రీలంకతో శాంతి ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మనదేశ ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

11. 1989లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి పదవిని చేపట్టినదెవరు?
(లేదా)
మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
జవాబు:
వి.పి. సింగ్

12. 1991 మే 21న రాజీవ్ గాంధీని పెరంబూర్‌లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది?
జవాబు:
LTTE

13. ‘ఆపరేషన్ బర్గా’ను చేపట్టిన రాష్ట్రం ఏది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.

14. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటకు దోహదం చేసే రాజ్యాంగ అధికరణ ఏది?
జవాబు:
356వ అధికరణ.

15. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
V.P. సింగ్ ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

16. తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో ప్రధాన సిద్ధాంతం ఏది?
జవాబు:
ఆంధ్రుల ఆత్మగౌరవం.

17. స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నోవంతు సీట్లను కేటాయించారు?
జవాబు:
1/3 వంతు.

18. రెండూ లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు?
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వం

19. ‘బర్మా’ ప్రస్తుత నామం ఏమిటి?
జవాబు:
మయన్మార్.

20. చండిఘర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికి చెందాలని కోరిన రాష్ట్రం ఏది?
జవాబు:
పంజాబు.

21. 1986 ఏప్రిల్ లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు?
జవాబు:
అకల్ తఖ్త్

22. 1977 సాధారణ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
CPI(M)

23. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
73వ

24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన పెట్టబడింది?
జవాబు:
74 వ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

25. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది?
జవాబు:
P.V. నరసింహారావు ప్రభుత్వం

26. ‘గోల్డెన్ టెంపుల్’ ఏ మతస్థులకు పవిత్ర స్థలం?
జవాబు:
సిక్కులకు

27. AGPని విస్తరింపుము.
జవాబు:
అస్సోం గణ పరిషత్.

28. SADని విస్తరింపుము.
జవాబు:
శిరోమణి అకాలీ దళ.

29. AASUని విస్తరింపుము.
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

30. DMK ని విస్తరింపుము.
జవాబు:
ద్రవిడ మున్నేట్ర ఖజగం.

31. BLDని విస్తరింపుము.
జవాబు:
భారతీయ లోక్ దళ్

32. NDA ని విస్తరింపుము.
జవాబు:
నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్.

33. UPA ని విస్తరింపుము.
జవాబు:
యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్

34. ఇందిరా గాంధీని ఏ సంవత్సరంలో హత్య గావించారు?
జవాబు:
1984లో

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

35. సిక్కులు కోరిన ప్రత్యేక దేశంను ఏమంటారు?
జవాబు:
ఖలిస్తాన్.

36. వెనకబడిన తరగతులకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది?
జవాబు:
27%

37. ‘బోఫోర్సు’ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

38. NDAకు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
బి.జె.పి. (BJP)

39. UPA కు నాయకత్వం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.

40. బెంగాలీ భాషలో ‘బర్గాదార్లు’ అనగా?
జవాబు:
కౌలుదార్లు.

41. ఆరవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1977 మార్చిలో

42. ఆరవ లోకసభకు స్పీకర్‌గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

49. ఇంతవరకు లోకసభ స్పీకర్ గా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

44. మొట్ట మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు?
జవాబు:
నీలం సంజీవరెడ్డి.

45. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నకాలంలో మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీలలో ఎవరు ప్రధాన మంత్రిగా పనిచేయలేదు?
జవాబు:
వి.పి.సింగ్.

46. 1977లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
DMK

47. BLD ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉండేది?
జవాబు:
ఉత్తర ప్రదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

48. SAD ఏ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ?
జవాబు:
పంజాబు.

49. మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
చరణ్ సింగ్.

50. ఏదైన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే (356 ప్రకారం) ఎవరి సిఫారసు అవసరం?
జవాబు:
ఆ రాష్ట్ర గవర్నర్.

51. కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణాన్ని ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను ఏ తీర్పులో పేర్కొన్నారు?
జవాబు:
1994 సుప్రీంకోర్టు తీర్పులో

52. TDP ని ఎవరు స్థాపించారు?
జవాబు:
N.T. రామారావు

53. TDP ని ఎప్పుడు స్థాపించారు?
జవాబు:
1982లో

54. N.T. రామారావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన గవర్నర్ ఎవరు?
జవాబు:
రామ్ లాల్.

55. కేంద్ర ప్రభుత్వం, AASU మధ్య ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1984

56. AASU కు అనుబంధంగా ఏర్పడిన పార్టీ ఏది?
జవాబు:
AGP.

57. పంజాబు రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1 నవంబరు, 1966 న

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

58. భాక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై, ఏ రాష్ట్రంలో నిర్మించారు?
జవాబు:
సట్లెజ్ నదిపై, హిమాచల్ ప్రదేశ్ లో.

59. గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకున్న సిక్కు తీవ్రవాదులను ఖాళీ చేయించడానికి చేసిన ఆపరేషన్ పేరేమిటి?
జవాబు:
ఆపరేషన్ బ్లూస్టార్ (1984).

60. ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని అయినది ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

61. మిజో నేషనల్ ఫ్రంట్ కి, కేంద్ర ప్రభుత్వంకి మధ్య ఎప్పుడు ఒప్పందం కుదిరింది?
జవాబు:
1986 జూన్ 30 న.

62. “పేదలకోసం ఖర్చు పెడుతున్న ప్రతిరూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరటం లేదని” అన్న ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

63. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో ఏ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పారు? ఎప్పుడు?
జవాబు:
మన్మోహన్ సింగ్, రాజ్యసభలో 2005 ఆగస్టు 11న.

64. బాబ్రీ మసీదు ఎక్కడ ఉంది?
జవాబు:
అయోధ్యలో (ఉత్తరప్రదేశ్)

65. బోఫోర్స్ శతఘ్నులను ఏ దేశం నుంచి కొన్నారు?
జవాబు:
స్వీడన్.

66. భారత రాజకీయ చరిత్రలో ఏర్పడిన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వమేది?
జవాబు:
నేషనల్ ఫ్రంట్.

67. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారతీయ జనతాపార్టీలలో భిన్నమైనది ఏది?
జవాబు:
భారతీయ జనతా పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

68. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచి, వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు:
జ్యోతిబసు.

69. ఆపరేషన్ బర్గాను పశ్చిమబెంగాల్ ఎప్పుడు చేపట్టింది?
జవాబు:
1978లో

70. BSP ని విస్తరించండి.
జవాబు:
బహుజన్ సమాజ్ పార్టీ,

71. రథయాత్ర చేస్తున్న L.K. అద్వానీని ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు?
జవాబు:
బీహార్‌లో

72. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) రామజన్మభూమి రథయాత్ర – 1990
బి) రాజీవ్ గాంధీ హత్య – 1991
సి) ఆపరేషన్ బ్లూస్టార్ – 1984
డి) ఆపరేషన్ బర్గా – 1987
జవాబు:
డి) ఆపరేషన్ బర్గా – 1987.

73. క్రింది వానిలో సరిఅయిన జతను గుర్తించి, రాయండి.
→ కాంగ్రెసు (0) – ఇందిరాగాంధీ
→ SAD – హర్యానా రాష్ట్రం
→ BLD – ఉత్తర ప్రదేశ్
→ జనసంఘ్ – జమ్ము & కాశ్మీర్
జవాబు:
BLD – ఉత్తరప్రదేశ్

74. క్రింద ఇచ్చిన వానిలో అస్సోం రాష్ట్రం యొక్క ప్రధాన వనరులు ఏవి?
టీ, కాఫీ, ముడిచమురు, ఇనుప ఖనిజము.
జవాబు:
టీ, ముడిచమురు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

75. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
i) తీవ్రవాద సిక్కు బృంద నాయకుడు, – బింద్రేన్‌వాలా
ii) SAD అధ్యక్షుడు – సంత్ లాంగో వాల్
iii) AGP అధ్యక్షుడు – జ్యోతిబసు
iv) భారతదేశ ఆరవ రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి
జవాబు:
(iii)

76. క్రింది వాటిని సరిగా జతపరచండి.
i) DMK ( ) a) తమిళనాడు
ii) SAD ( ) b) పంజాబు
iii)AGP ( ) c) అస్సోం
iv) BLD ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

77. ఇవ్వబడిన ప్రధాన మంత్రులను సరియైన కాలక్రమంలో
i) రాజీవ్ గాంధీ
ii) V.P. సింగ్
iii) ఇందిరాగాంధీ
iv) పి.వి. నరసింహారావు
జవాబు:
iii, i, ii & iv

78. క్రింద ఇవ్వబడిన సంఘటనలను సరియైన కాల క్రమంలో అమర్చండి.
i) TDP ఆవిర్భావం
ii) శ్రీలంకతో ఒప్పందం
iii) రామ జన్మభూమి రథయాత్ర.
iv) సరళీకృత ఆర్థిక విధానాలు
జవాబు:
i, ii, iii & iv

79. ‘విధాన పక్షపాతం’ అనగా నేమి?
జవాబు:
భాగస్వామ్య మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను అమలు చేయకపోవటం.

80. భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ప్రారంభించిన ప్రధాని ఎవరు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

81. క్రింది వారిలో ప్రధానమంత్రి పదవిలో అతి తక్కువ కాలం కొనసాగిన వారు ఎవరు?
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, P.V. నరసింహారావు, V.P. సింగ్
జవాబు:
రాజీవ్ గాంధీ

82. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు?
జవాబు:
P.V. నరసింహారావు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

83. సరికాని జతను ఎంచుకుని, రాయండి.
→ రామజన్మభూమి రథయాత్ర – L.K. అద్వానీ
→ రాజీవ్ గాంధీ హత్య – LTTE
→ మండల కమీషన్ – OBC లకు రిజర్వేషన్లు
→ మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు
జవాబు:
మొదటి సంకీర్ణ ప్రభుత్వం – P.V. నరసింహారావు

84. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో అమర్చండి.
i) ఆపరేషన్ బ్లూస్టార్
ii) మిజోనేషనల్ ఫ్రంట్ తో ఒప్పందం
iii) జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటు
iv) బాబ్రీ మసీదు కూల్చివేత.
జవాబు:
i, ii, iii & in

85. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సరళీకృత ఆర్థిక విధానాలు ( ) a) ఇందిరాగాంధీ
ii) టెలికం విప్లవం ( ) b) V.P. సింగ్ ఉంచండి.
iii)మండల కమీషన్ ( ) c) రాజీవ్ గాంధీ
iv) బ్యాంకుల జాతీయికరణ ( ) d) P.V. నరసింహారావు
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

86. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంలో తమిళ ఈలం అనగా?
జవాబు:
తమిళ రాజ్యం

87. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కాంగ్రెస్ పార్టీ ( ) a) ప్రాంతీయ పార్టీ
ii) భారతీయ జనతాపార్టీ ( ) b) వామపక్షం
iii) భారత కమ్యూనిస్ట్ పార్టీ ( ) c) NDA
iv) ద్రవిడ మున్నేట్ర కజగం ( ) d) UPA
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

88. సరళీకృత ఆర్థిక విధానాలలో భాగం కానిదాన్ని గుర్తించి, రాయండి.
→ రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత మరియు సంక్షేమ పథకాల ఖర్చు తగ్గింపు
→ ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడి.
→ విదేశీ సరుకుల దిగుమతులమీద పరిమితులను తగ్గించటం.
→ భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.
జవాబు:
భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు (పరిమితులు) విధించటం.

89. ‘ఓటు (హక్కు) విలువను తెలియజేయు ఒక నినాదంను రాయండి.
జవాబు:
ఓటరు చేతికి బ్రహ్మాస్త్రం – ఓటుహక్కు,
అవినీతిపరులకు ఓటు – దేశానికి చేటు.

90. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు?
జవాబు:
సునీల్ అరోరా.

91. అత్యవసర పరిస్థితి తర్వాత, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది?
జవాబు:
జనతా పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

92. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెసులోని సంప్రదాయవాద వర్గంతో ఏర్పాటు చేయబడిన పార్టీ ఏది?
జవాబు:
కాంగ్రెసు (ఓ)

93. ఏ సంవత్సరం చివరి నాటికి అంతిమంగా పంజాబులో శాంతి నెలకొన్నది?
జవాబు:
1990.

94. శ్రీలంక నుండి భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న సంవత్సరం?
జవాబు:
1989.

95. ఏ సంవత్సరంలో షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది?
జవాబు:
1985.

96. మహారాష్ట్రలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
శరద్ జోషి

97. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు ఎవరి నాయకత్వంలో పోరాడుతున్నారు?
జవాబు:
మహేంద్రసింగ్ తికాయత్

98. అయోధ్యలోని వివాదాస్పద మసీదును కూల్చివేసిన సంవత్సరం?
జవాబు:
1992.

99. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రకమైన ఎన్నికలుగా ఏ ఎన్నికలను చెప్పవచ్చు?
జవాబు:
1977 ఎన్నికలు.

100. జాతీయస్థాయిలో కాంగ్రెసు పార్టీ ఓటమి చవిచూసిన ఎన్నికలు ఏవి ?
జవాబు:
1977 ఎన్నికలు.

101. హిందూ జాతీయవాద పార్టీగా పేరొందిన పార్టీ ఏది?
జవాబు:
జనసంఘ్.

102. పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలకంగా మలచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వామ్యులు అయ్యేలా ఉద్యమించారు?
జవాబు:
రాజీవ్ గాంధీ.

103. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
BSP (బహుజన సమాజ్ పార్టీ)

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

104. పంజాబుపై H.S. లాంగోవాలోనూ, అస్సోంపై AASU తోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఏ సంవత్సరంలో చేసుకున్నారు?
జవాబు:
1985

105. అధికారంలో ఉండగా హత్యకు గురికాబడిన భారత ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

106. ఏ సంవత్సరం నుండి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే?
జవాబు:
1989 నుంచి.

107. L.K. అద్వాని రథయాత్ర 1990లో ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
జవాబు:
సోమనాథ్ (గుజరాత్).

108. 1992లో ఏర్పడిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించటానికి చేపట్టిన అంశం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్ధిక విధానం.

109. క్రింది వానిని పరిగణించండి.
i) కేంద్రంలో గెలుపొందిన జనతాపార్టీ తన స్థానాన్ని సుస్థిర పరచుకోటానికి తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసు ప్రభుత్వాలను తొలగించింది.
ii) కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఓడిపోయింది, కాబట్టి రాష్ట్రాలలో సైతం పాలించే హక్కును కోల్పోయింది.
పై వానిలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే

110. పంజాబు ఆందోళన వేర్పాటు వాదం వైపునకు మరళటానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
మతపరమైన రంగు సంతరించుకోవటం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

111. పంజాబు ఆందోళనకు కారణమైన సిక్కులు కోరిన అంశం కానిది.
→ రాజధాని చండీఘర్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలి.
→ భాక్రానంగల్ ఆనకట్ట నుంచి నీళ్ళు ఎక్కువ కావాలి.
→ సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలి.
→ సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.
జవాబు:
సిక్కు మతస్థులందరికి ప్రత్యేక దేశం కావాలి.

112. ఏ రాష్ట్రంలో “తమని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని”, దీనిని ఆపివేయాలని ప్రజలు చేయటం మంచి పద్ధతని భావించిన ప్రధాని ఎవరు?
జవాబు:
అస్సోం.

113. 1977 ఎన్నికలలో అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక వర్గంలో చేరటానికి కారణం.
జవాబు:
అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా.

114. నీలం సంజీవరెడ్డిగారి గురించిన సరియైన వాక్యం కానిది.
→ ఈయన ఆరవ లోకసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ ఈయన భారత ఆరవ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
→ కాంగ్రెసు పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.
జవాబు:
→ 1977 జులై 25న స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేశారు.

115. “ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.” అయితే దీని కారణంగా ఆ పార్టీ పాలన ప్రభావితం అయ్యింది?
జవాబు:
అంతర్గత కీచులాటలు, ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు

116. కాంగ్రెసేతర ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడ్డానికి కారణం కానటువంటి అంశం.
జవాబు:
కేంద్ర విషయాల్లో జోక్యం చేసుకోవటం.

117. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వాక్యాలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. రాజ్యాంగంలోని 356వ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది.
II. గవర్నరు సిఫారసు మేరకు, ప్రధానమంత్రి సలహాతో, రాష్ట్రపతి పాలన బాధ్యతను గవర్నరుకు అప్పగించవచ్చు.
III. దీనికి సంబంధించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో పొందుపరిచినారు.
A) I, II & III సత్యాలు
B) II, III సత్యాలు
C) I, II & III అసత్యాలు
D) I, II సత్యాలు
జవాబు:
D) I, 11 సత్యాలు

118. ఎన్.టి.రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కానిది.
A) రెండు రూపాయలకు కిలో బియ్యం
B) మధ్యాహ్న భోజన పథకం
C) వృద్ధాప్య పింఛన్లు
D) మద్యపాన నిషేధం
C) వృద్ధాప్య పింఛన్లు

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

119. ఎన్.టి. రామారావు (రాజకీయాలలో) తెలుగుదేశం పార్టీ స్థాపనలో, ఎన్నికల్లో విజయం సాధించటానికి దోహదం చేసిన అంశం కానిది.
→ సినీహీరోగా ఉన్న నేపథ్యం.
→ రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం.
→ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం.
→ పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
జవాబు:
రాజకీయ అనుభవం కలిగిన నాయకత్వం

120. అసోం ఉద్యమానికి కారణం.
జవాబు:
బెంగాలీ అధికారుల వివక్షత
బంగ్లాదేశ్ కాందిశీకుల రాక
సాంస్కృతిక మూలాలు కోల్పోతామన్న భయం

121. సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా అసోం ఉద్యమానికి సంబంధించిన ఆర్థిక కోణం / కారణం
→ ఉపాధిలో బయట ప్రజలకు ప్రాధాన్యత
→ టీ పరిశ్రమ అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండటం,
→ చమురు పరిశ్రమలో స్థానికులకు ప్రాధాన్యత తక్కువగా ఇవ్వటం
→ పైవన్నీ
జవాబు:
పైవన్నీ

122. ‘అసోం’ ఉద్యమంలోని ప్రజల ప్రధాన డిమాండ్ కానిది
→ అంతర్గత వలసగా పరిగణించటం
→ ఉపాధిలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వటం
→ వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించటం
→ బయటివాళ్లను తొలగించటం
జవాబు:
అంతర్గత వలసగా పరిగణించటం.

123. “ఈశాన్య ప్రాంతంలో ఘర్షణలు తగ్గించి, శాంతిని నెలకొల్పటానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నియమించింది.” ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించటానికి కారణం కాని అంశం.
→ పొరుగు దేశాలతో సరిహద్దు ప్రాంతంగా ఉండటం
→ ఘర్షణల మతపర రంగు సంతరించుకోవడం
→ తిరుగుబాటు బృందాలు తరచు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవటం.
→ అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు హింసాత్మక దాడులకు పాల్పడటం.
జవాబు:
ఘరణలు మతపర రంగు సంతరించుకోవడం

124. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. సిక్కు వేర్పాటు బృందాలు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
II. దీనికి ప్రతిచర్యగా 1984లో ప్రధాని ఇందిరా
గాంధీని హత్య గావించారు.
A) I, II అసత్యాలు
B) I, II సత్యాలు
C) I మాత్రమే సత్యం
D) II మాత్రమే సత్యం
జవాబు:
B) I, II సత్యా లు

125. “పంజాబులో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పదతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.” అయితే ఈ చర్యను సమర్థించే వ్యాఖ్య.
→ హింసను హింసతోటే అణచివెయ్యాలి. కావున ఈ చర్య సమర్థనీయమే.
→ రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.
→ శాంతి, భద్రతల రక్షణలో ఏ విధంగాను పౌరహక్కుల ఉల్లంఘన జరగకూడదు.
→ ఇటువంటి చర్యలు అప్రజాస్వామిక ధోరణులు బలపడటానికి దోహదం చేస్తాయి.
జవాబు:
రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవహక్కుల ఉల్లంఘన సమర్థనీయమే.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

126. రాజీవ్ గాంధీ పాలనలో చేపట్టిన సంస్కరణ కానిది
→ శాంతి, భద్రతలు నెలకొల్పటం
→ టెలికాం విప్లవం
→ పంచాయితీరాజ్ సంస్థలను క్రియాశీలంగా మార్చటం.
→ ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.
జవాబు:
ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం.

127. ఈ క్రింది కేసును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము ఎంచుకోండి.
I. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
II. ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందని దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
III. 1986లో కొత్త చట్టం ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు మూడు నెలలపాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది.
పై కేసును పరిశీలించిన మీదట మీకు అవగత మవుతున్న అంశం.
జవాబు:
ముస్లిం మహిళల ప్రయోజనాలు కాదని మత ఛాందసవాదులకు తలఒగ్గడం జరిగింది.

128. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోవడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలసి ఇలాంటి ప్రభుత్వాలని ఏర్పరచాయి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలు

129. వామపక్ష రాజకీయ పార్టీ కానిది.
A) CPI
B) CPM
C) ఫార్వర్డ్ బ్లాక్
D) SAD
జవాబు:
D) SAD

130. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుదన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలుచేయ్యటానికి భయపడటాన్ని ఇలా అనవచ్చు.
జవాబు:
విధాన పక్షపాతం.

131. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బర్గా’ చేపట్టింది.
II. భూస్వాముల పేర్లను నమోదుచేసి, వాళ్ల హక్కులను కాపాడటానికి దీనిని చేపట్టారు.
III. ఆపరేషన్ బర్గాలో చేపట్టిన చర్యల ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) I, III మాత్రమే సరియైనవి
D) II, III మాత్రమే సరియైనవి
జవాబు:
C) I, III మాత్రమే సరియైనవి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

132. క్రింది స్టేట్ మెంట్లను పరిశీలించి, సరియైన సమాధానము జ. ఆర్థిక విధానాలు కట్టుదిట్టం చేయటం ఎంచుకోండి.
I. ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాల లోను ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషను ఉండాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది.
II. ఈ నివేదికను నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెలికి తీసింది.
III. వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలలో 29% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.
IV. ఈ ప్రకటనకు భారతదేశం అంతట హర్షం వ్యక్తపరచి ఆదరించాయి.
A) I, II, III & IV సరియైనవి.
B) I, II మాత్రమే సరియైనవి
C) I, II, III మాత్రమే సరియైనవి
D) I, II, IV మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

133. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి, సరియైన సమాధానము ఎంచుకోండి.
I. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాల్లో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించింది.
II. మొత్తం స్థానాల్లో 2/3 వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
A) I, II & III సరియైనవి
B) I, II మాత్రమే సరియైనవి
C) II, III మాత్రమే సరియైనవి
D) I, III మాత్రమే సరియైనవి
జవాబు:
B) I, II మాత్రమే సరియైనవి

134. 1991లో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించటానికి కారణం కానిది.
→ అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులు
→ విదేశీ మారక నిల్వలు అడుగంటడం
→ తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి
→ పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి సాధించటానికి

135. ఈ క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో ఉంచండి.
i) తెలుగుదేశం పార్టీ స్థాపన
ii) ఆపరేషన్ బ్లూస్టార్
iii) అద్వా నీ రథయాత్ర
iv) సరళీకృత ఆర్థిక విధానం
A) i, ii, iii, iv
B) i, ii, iv, iii
C) i, iii, ii, iv a
D) iv, i, ii, iii
జవాబు:
A) i, ii, iii, iv

136. క్రింది వానిలో సరియైన జత కానిది
A) మొరార్జీదేశాయ్ – మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి
B) వి.పి.సింగ్-మొదటి సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రి
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి
D) పి.వి.నరసింహారావు-సరళీకృత ఆర్ధిక విధానాలు
జవాబు:
C) రాజీవ్ గాంధీ – UPA మొదటి ప్రధానమంత్రి

క్రింది సమాచారమును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎంచుకోండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1

137. మూడు సంకీర్ణ ప్రభుత్వాల్లో అధికారం పంచుకున్న పార్టీ.
జవాబు:
JKNC

138. AIADMK ఈ పార్టీ ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ?
జవాబు:
తమిళనాడు

139. NDA సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చిన పార్టీ
జవాబు:
TDP

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

140. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయిన సంవత్సరం
జవాబు:
1990

141. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

142. NDA (అలయన్స్) ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ పార్టీ మద్దతును ఇచ్చింది?
జవాబు:
TDP

143. నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఏవైనా రెండు ప్రాంతీయ పార్టీలను పేర్కొనండి?
జవాబు:
DMK, TDP, AGP,

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

144. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు నిచ్చిన పార్టీ ఏది?
జవాబు:
సి.పి.యం.

10th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంనందు ఏవేని రెండు ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో గల రాష్ట్రాలను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 2

ప్రశ్న 2.
‘టెలీకం విప్లవం’ దేనికి దోహదపడింది?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా విస్తరించటానికి ఇది దోహదపడింది. భారతదేశంలో టెలిఫోన్ విప్లవాన్ని ప్రారంభించింది రాజీవ్ గాంధీ.

ప్రశ్న 3.
సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.
ఉదా : ఎన్.డి.ఏ, యు.పి.ఏ.
(లేదా)
సంకీర్ణ ప్రభుత్వము :
ఏ ఒక్క రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రానప్పుడు కొన్ని పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు.

ప్రశ్న 4.
ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రెండు ఉదాహరణలీయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ : Y.S.R.C.P
తమిళనాడు : D.M.K, AIADMK
అసోం : AGP
జమ్మూ & కాశ్మీర్ : National Conference
పంజాబ్ : శిరోమణి అకాలీదళ్ళ

ప్రశ్న 5.
ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు కొన్ని మార్పులతో నేటికీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి?
(లేదా)
యన్.టి.రామారావు ప్రవేశపెట్టిన ఏవేని రెండు అంశాలను పేర్కొనండి.
జవాబు:

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  2. పేదలకు సబ్సిడీ ధరకు బియ్యం అందించడం.

ప్రశ్న 6.
73వ రాజ్యాంగ సవరణ గురించి రాయండి.
జవాబు:
గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 7.
ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 7
యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో గల జాతీయ పార్టీ పేరు రాయండి.
జవాబు:
సి.పి.ఐ.

ప్రశ్న 8.
రాజ్యాంగంలోని మౌలిక విలువలు ఏవి?
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక విలువలు :

  1. ప్రజాస్వామ్యం
  2. దేశ ఐక్యత
  3. సమగ్రత
  4. సామాజిక, ఆర్థిక మార్పులు.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరమేది?
జవాబు:
అత్యవసర పరిస్థితిని ముగించిన సంవత్సరం – 1977.

ప్రశ్న 10.
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన సంవత్సరం-1980.

ప్రశ్న 11.
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ చేపట్టిన సంవత్సరం-1984.

ప్రశ్న 12.
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం-1984.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 13.
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది 1976-85.

ప్రశ్న 14.
1975-85 మధ్యకాలంలో భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశం ఏక పార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించబడింది.

ప్రశ్న 15.
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు ఏవి?
జవాబు:
1975-85 మధ్యకాలంలో భారతదేశంలో ఉద్భవించిన ఉద్యమాలు పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం.

ప్రశ్న 16.
జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు ఏవి?
జవాబు:
‘జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు :

  1. కాంగ్రెస్ (ఓ)
  2. స్వతంత్ర పార్టీ
  3. భారతీయ జనసంఘ్
  4. భారతీయ లోక్ దళ్
  5. సోషలిస్టు పార్టీ.

ప్రశ్న 17.
కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో ముఖ్యపాత్ర పోషించినవారెవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి వారు కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు తేవడంలో ప్రధానపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఏది?
జవాబు:
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక 1977 సాధారణ ఎన్నికలు.

ప్రశ్న 19.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ ఏది?
జవాబు:
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన పార్టీ జనతా పార్టీ.

ప్రశ్న 20.
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికలలో గెలుపొందిన జనతా పార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 21.
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో విజయం సాధించింది?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో విజయం సాధించింది.

ప్రశ్న 22.
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది?
జవాబు:
పంజాబ్ కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్.

ప్రశ్న 23.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం ఏది?
జవాబు:
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే అధికరణం 356.

ప్రశ్న 24.
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ఏది?
జవాబు:
జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానం ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్చని పునరుద్ధరిస్తామనడం.

ప్రశ్న 25.
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు ఏవి?
జవాబు:
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన మూడు ఉద్యమాలు

  1. ఆంధ్రప్రదేశ్
  2. అసోం
  3. పంజాబ్ ఉద్యమాలు.

ప్రశ్న 26.
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎప్పుడు?
జవాబు:
ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో తన 60వ పుట్టినరోజున స్థాపించారు.

ప్రశ్న 27.
ఎ.ఎ.ఎస్.యు అనగానేమి?
జవాబు:
అఖిల అసోం విద్యార్థి సంఘం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 28.
టీ పరిశ్రమ ప్రధానంగా ఏ నగరంలో ఉంది?
జవాబు:
టీ పరిశ్రమ ప్రధానంగా కోల్‌కతాలో ఉంది.

ప్రశ్న 29.
అంతర్గత వలస ప్రాంతంగా దేనిని పరిగణించారు?
జవాబు:
అంతర్గత వలస ప్రాంతంగా ‘అసోం’ ను పరిగణించారు.

ప్రశ్న 30.
అసోంలోని ఆదిమ వాసులెవరు?
జవాబు:
అసోంలోని ఆదిమవాసులు బోడోలు, ఖాసీలు, మిజోల, కర్జీలు.

ప్రశ్న 31.
బర్మా ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతోంది?
జవాబు:
బర్మా ప్రస్తుతం మయన్మార్ పేరుతో పిలువబడుతోంది.

ప్రశ్న 32.
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది?
జవాబు:
చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరినది-పంజాబ్.

ప్రశ్న 33.
తీవ్రవాద సిక్కుల, బృందానికి నాయకుడిగా వ్యవహరించిన వారెవరు?
జవాబు:
తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా వ్యవహరించింది ‘భింద్రేన్ వాలా.

ప్రశ్న 34.
సిక్కుల పవిత్రస్థలమేది?
జవాబు:
సిక్కుల పవిత్రస్థలం గోల్డెన్ టెంపుల్.

ప్రశ్న 35.
ఖలిస్తాను స్వతంత్రదేశంగా ప్రకటించినదెప్పుడు?
జవాబు:
1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద జరిగిన సమావేశంలో ఖలిస్తానను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

ప్రశ్న 36.
రాజీవ్ గాంధీ ఏ ఏ ప్రాంతాలలో శాంతి ప్రక్రియలు మొదలుపెట్టారు?
జవాబు:
రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.

ప్రశ్న 37.
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరమేది?
జవాబు:
శ్రీలంక నుంచి అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్న సంవత్సరం-1989.

ప్రశ్న 38.
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారెవరు?
జవాబు:
పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా అతడికి చేరటం లేదని అన్నవారు రాజీవ్ గాంధీ.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 39.
సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టింది ఎవరు?
జవాబు:
1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలుపెట్టారు.

ప్రశ్న 40.
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించినదెవరు?
జవాబు:
భారతదేశంలో టెలికం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించింది-రాజీవ్ గాంధీ.

ప్రశ్న 41.
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం ఏది?
జవాబు:
భర్త నుంచి విడాకులు పొందిన షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం – 1985.

ప్రశ్న 42.
ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు దేనికోసం మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నారు?
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలకోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాటం చేస్తున్నారు.

ప్రశ్న 43.
ఎప్పటి నుండి జాతీయస్థాయిలో సంకీర్ణ/ మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి?
జవాబు:
1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.

ప్రశ్న 44.
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
జవాబు:
బెంగాలులో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జ్యోతిబసు.

ప్రశ్న 45.
బర్గాదార్లు అంటే ఎవరు?
జవాబు:
కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.

ప్రశ్న 46.
ఒబిసిలు అంటే ఎవరు?
జవాబు:
ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు.

ప్రశ్న 47.
ఒబిసిలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు?
జవాబు:
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించారు.

ప్రశ్న 48.
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్నది ఏ రాజకీయ పార్టీ ధోరణి?
జవాబు:
హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతాపార్టీ నేతృత్వం వహిస్తోంది.

ప్రశ్న 49.
ఎల్.కె. అద్వానీ రథయాత్ర ఎప్పుడు చేపట్టారు?
జవాబు:
ఎల్.కె. అద్వానీ రథయాత్ర 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టారు.

ప్రశ్న 50.
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరమేది?
జవాబు:
వివాదాస్పద మసీదు ధ్వంసం చేయబడిన సంవత్సరం-1992.

ప్రశ్న 51.
సరళీకృత ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏది?
జవాబు:
సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 1992లో ఏర్పడిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 52.
రాజ్యాంగంలో 356 అధికరణం యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 356 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించుకోలేకపోతోందని గవర్నరు అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసన సభను రద్దు చెయ్యమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
  2. అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నరును కోరవచ్చు.

ప్రశ్న 53.
సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సంకీర్ణ ప్రభుత్వాలకు ఉదాహరణలు :

  1. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA – యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్స్.
  2. BJP నేతృత్వంలోని NDA – నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్.

ప్రశ్న 54.
AIADMK ని విస్తరింపుము.
జవాబు:
All India Anna Dravida Munnetra Kazagam
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

10th Class Social 19th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.

1. అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్
కింద జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు
1977
2. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటు 1980
3. T.D.P ఏర్పాటు 1982
4. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య 1984
5. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోంలలో శాంతి ప్రక్రియ 1985

ప్రశ్నలు:
1) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెసేతర పార్టీ ఏది?
2) తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:

  1. జనతా పార్టీ
  2. నందమూరి తారక రామారావు (NTR)

ప్రశ్న 2.
2014 సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, గెలిచిన సీట్ల సంఖ్యను సూచించే క్రింది ‘పై’ రేఖాచిత్రాన్ని పరిశీలించి రాజకీయ పార్టీల బలాబలాలను విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 3
జవాబు:

  1. 2014 సాధారణ ఎన్నికలలో బి.జె.పి.కి 282 ఎం.పి. స్థానాలు లభించాయి.
  2. గతంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే సాధించింది.
  3. ప్రాంతీయ పార్టీలైన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., తెలుగుదేశంలకు వరుసగా 37, 16 స్థానాలు లభించాయి.
  4. ఇతరులకు 140 స్థానాలు లభించాయి.

ప్రశ్న 3.
క్రింది సమాచారం చదవండి. సమాధానం రాయండి.

“పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతులను ఉపయోగించింది. వీటిల్లో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు.”
పై సమాచారంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.
జవాబు:
1. రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉన్నప్పుడు మానవ హక్కుల, రాజ్యాంగ ఉల్లంఘన సమర్ధనీయమే అని నా అభిప్రాయం.
(లేదా)
2. కొంతమంది తీవ్రవాదుల వలన ఏర్పడే సంక్షోభం నుండి దేశాన్ని రక్షించడానికి సాధారణ పౌరులను బాధించకూడదు.

ప్రశ్న 4.
ఇచ్చిన దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 1
A) నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో అధికారాలు ఉండడానికి బయట నుండి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి?
B) మూడు ప్రభుత్వాలలోను అధికారంలో కొనసాగిన పార్టీ ఏది?
జవాబు:
A) నేషనల్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలు :
1) సి.పి.ఎం.
2) సి.పి.ఐ.
3) బి.జె.పి.
యునైటెడ్ ఫ్రంట్ కు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ సి.పి.యం.

B) జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)

ప్రశ్న 5.
ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:

  1. జాతీయ నాయకత్వం సరిగా లేకపోవడమే ప్రధాన కారణం.
  2. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం.
  3. వివిధ ప్రజలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం.
  4. తమ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటం కోసం కృషి చేయడం వలన.
  5. తమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక.
  6. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించుకొని వారి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం కృషి చేయడం వలన ప్రాంతీయ పార్టీలు బలోపేతము అయినాయి.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ పథకాలు :

  1. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
  2. ఉపాధి హామీ పథకం
  3. వృద్ధాప్య పింఛను
  4. గృహ వసతి
  5. ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదలకు రూపాయికే కిలో బియ్యం
  6. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు

ప్రశ్న 7.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వెంటనే తొమ్మిది రాష్ట్రాలలోని కాంగ్రెసేతర, జనతా ప్రభుత్వాలను రద్దుచేసి జనతా పార్టీ రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ప్రశ్నలు :
A) 1980 కు ముందు ఏ పార్టీ అధికారంలో ఉంది?
జవాబు:
1980కి ముందు జనతాపార్టీ అధికారంలో ఉంది.

B) ఏ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది?
జవాబు:
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ లలో కాంగ్రెస్ ఓడిపోయింది.

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏవిధంగా వెనక్కు తీసుకుపోయింది?
జవాబు:

  1. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన సాధారణ ఎన్నికలను వాయిదా వేశారు.
  2. ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి.
  3. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది.
  4. రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు.

పైన తెలిపిన అప్రజాస్వామిక చర్యల కారణంగా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్ళిందని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

1. రాజీవ్ గాంధీ హత్య, పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991
2. ఆర్థిక సరళీకరణ విధానాలు 1990
3. బాబ్రీ మస్జిద్ కూల్చివేత 1992
4. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1996
5. ఎ.బి. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం 1998

a) 1996 ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
b) పై పట్టికలోని సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
a) నేషనల్ ఫ్రంట్
b) నేషనల్ ఫ్రంట్ మరియు NDA ప్రభుత్వాలు

ప్రశ్న 10.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
పట్టిక : 2014 ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిచిన లోకసభ స్థానాలు

రాజకీయ పార్టీ సాధించిన స్థానాలు
1. భారతీయ జనతా పార్టీ (BJP) 282
2. భారత జాతీయ కాంగ్రెస్ (INC) 45
3. తెలుగుదేశం పార్టీ (TDP) 16
4. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) 11
5. వామ పక్షాలు (CPI + CPI(M)] 10

జవాబు:
పట్టిక 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది. భారతీయ జనతా పార్టీకు అత్యధిక మెజార్టీ రాగా వామపక్షాలు, మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోయాయి.

ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగలదు. దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెసు ద్వితీయ స్థానానికి, రెండంకెల స్థానానికి పడిపోయింది.

ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయిన వామపక్షాల కంటే అధిక స్థానాలు గెలుచుకున్నాయి. గెలిచిన వారు వారిపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓడినవారు ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ ఎన్నికలలో వారి ఉనికిని కాపాడుకోవాలి.

ప్రశ్న 11.
క్రింది సమాచారం ఆధారంగా దిగువ ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

విపి సింగ్, చంద్రశేఖర్‌తో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు 1989
మండల కమిషన్ సిఫారసుల అమలుకు నిర్ణయం 1989
రామజన్మభూమి రథయాత్ర 1990
రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991
ఆర్థిక సరళీకరణ విధానాలు 1990
బాబ్రీ మసీదు కూల్చివేత 1992
దేవెగౌడ, ఐకె గుజ్రాలు ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1996
ఎబి వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998

i) బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గల ప్రధానమంత్రి పేరు తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావు

ii) సంకీర్ణ ప్రభుత్వాలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. జనతాదళ్ ప్రభుత్వం
  2. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
  3. NDA ప్రభుత్వం

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 12.
క్రింది రాజకీయ పార్టీలను “జాతీయ, ప్రాంతీయ” పార్టీలుగా వర్గీకరించండి.
బి.జె.పి., వై.యస్.ఆర్.సి.పి., టి.డి.పి., సి.పి.యమ్., సి.పి.ఐ., డి.యమ్.కె., కాంగ్రెస్-ఐ, ఎ.జి.పి.
జవాబు:

జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు
భారతీయ జనతా పార్టీ D.M.K
కాంగ్రెస్ – (I) T.D.P
CPI A.G.P
CPM Y.S.R.C.P

ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి విశ్లేషిస్తూ ఒక పేరాగ్రాఫ్ రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 4
జవాబు:
పై పట్టిక ఏమి తెలియచేస్తుందంటే 2014 ఎన్నికలలో ముఖ్యమైన రెండు ప్రధాన పార్టీలు అయిన UPA కూటమి మరియు NDA కూటములు సాధించిన సీట్లను ఓట్ల శాతాన్ని ఇచ్చారు. 2014 ఎన్నికలలో UPA Congress కూటమి 19.31% ఓట్లు మరియు 44 లోకసభ స్థానాలను పొందింది. BJP 31% ఓట్లతో 282 స్థానాలను పొంది అతిపెద్ద పార్టీగా అవతరించినది. అది ఏమి తెలియచేస్తుందంటే స్వాతంత్ర్యానంతరం-1952 నుండి పరిపాలించిన పార్టీని కాదని BJP కి అధికారం ప్రజలు ఇచ్చారు.

దీనికి కారణం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కోర్టులలో అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అవినీతి రహిత సమాజం, నూతన సంస్కరణలతో అభివృద్ధి చెందుతున్న సమాజం కావాలి. అందుకోసం వారు కొత్త పార్టీలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇకముందు రాబోయే ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూద్దాం.

ప్రశ్న 14.
“సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయ అస్థిరతకు కారణమవుతున్నాయి.” – దీనిపై వ్యాఖ్యానింపుము.
జవాబు:

  1. కొన్నిసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ ఏ ఒక్క పార్టీకి రాదు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి.
  2. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఈ పార్టీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందం కుదరాల్సి వస్తుంది. కానీ ఇది అంత తేలికైన పని కాదు.
  3. వేర్వేరు పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి.
  4. ఏ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందో అన్న భయంతో ప్రభుత్వాలు ఏ విధానాన్ని అమలు చేయలేని స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు అస్థిరాలు అవుతాయి.

ప్రశ్న 15.
‘కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ‘విధాన పక్షవాతం’ సంభవిస్తుంది. దీనితో ఏకీభవిస్తారా ? మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
అవును. నేను దీనితో ఏకీభవిస్తాను. ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర
మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వాలు భయపడతాయి.

ప్రశ్న 16.
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించడం వలన కలిగిన ఫలితాలేమిటి?
జవాబు:
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు – ఫలితాలు :

  1. విదేశీ సరుకులు భారత మార్కెట్లో ప్రవేశించాయి.
  2. చౌకగా లభించే విదేశీ ఉత్పత్తులతో పోటీపడలేక చాలా భారతీయ కర్మాగారాలు మూతపడ్డాయి.
  3. భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచస్థాయి తయారీదారులతో పోటీపడవలసి వచ్చింది.
  4. విదేశీ కంపెనీలు వచ్చి భారతదేశంలో సంస్థలు నెలకొల్పాయి.
  5. అనేక సబ్సిడీలకు కోతలు విధించారు.
  6. ప్రైవేటీకరణ పెరిగింది.

ప్రశ్న 17.
పంజాబ్ ఆందోళన గురించి రాయండి.
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి మరొక ఉద్యమం రూపుదిద్దుకొంది.
  2. ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. ఇక్కడ కూడా దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  4. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు.
  5. రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలని కోరసాగారు.
  6. భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కూడా కోరసాగారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 18.
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు ఏవి?
జవాబు:
రాజీవ్ గాంధీ చేపట్టిన శాంతి చర్యలు :

  1. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరంలలో, పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలు పెట్టాడు.
  2. శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది.
  3. అయితే దీనికి అటు తమిళులు, ఇటు శ్రీలంక ప్రభుత్వమూ అంగీకరించకపోవటం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిణమించింది.
  4. అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసేసుకుంది.

ప్రశ్న 19.
సంకీర్ణ రాజకీయాల శకం గురించి రాయుము.
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ /మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది.
  5. దీని అర్థం అనేక పార్టీల రాజకీయ సిద్ధాంతాలను, కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు రావలసివచ్చేది.

ప్రశ్న 20.
పశ్చిమ బెంగాలులో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం గురించి రాయుము.
జవాబు:

  1. వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం) వంటివి 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
  2. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూసంస్కరణలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగా చేపట్టినది.

ప్రశ్న 21.
ఆపరేషన్ బర్గాను గురించి వ్రాయుము.
జవాబు:

  1. 1978 జూన్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదార్ల పేర్లను నమోదుచేసి వాళ్ల హక్కును కాపాడటానికి ఆపరేషన్ బర్గాను చేపట్టింది.
  2. కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.
  3. వీళ్ళు భూస్వాముల భూములను సాగుచేస్తూ పంటలో అధికభాగం వాళ్ళకి కౌలుగా చెల్లిస్తూ ఉండేవాళ్లు.
  4. పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదార్లు అధికసంఖ్యలో ఉండేవాళ్ళు.

ప్రశ్న 22.
సరళీకృత ఆర్థిక విధానంలోని ప్రధాన అంశాలు ఏవి?
జవాబు:

  1. ప్రభుత్వ ఖర్చును బాగా తగ్గించుకోవటం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో కూడా ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం.
  2. విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించుకోవటం.
  3. భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
  4. ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం.

ప్రశ్న 23.
అత్యవసర పరిస్థితిని తొలగించి ఇందిరాగాంధీ చేపట్టిన చర్యలు ఏవి?
జవాబు:

  1. 1977 జనవరిలో ఎన్నికలను ప్రకటించారు.
  2. రాజకీయ ఖైదీలందరినీ ఇందిరాగాంధీ విడుదల చేసి స్వేచ్ఛ, కదలికలు, ప్రచార ఉద్యమాలు, సమావేశాలను అనుమతించని అన్ని నియంత్రణలను, సెన్సారును తొలగించారు.

ప్రశ్న 24.
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏ ఏ రాష్ట్రాలలో, ఏ ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
జవాబు:
1977 సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు:

  1. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లో జనతాపార్టీ
  2. పశ్చిమబెంగాల్ లో సి.పి.ఐ (ఎం)
  3. తమిళనాడులో డి.ఎం.కె గెలిచాయి.

ప్రశ్న 25.
1977 సాధారణ ఎన్నికల నాటి నుండి 1980 ఎన్నికల వరకు జాతీయస్థాయిలో జరిగిన రాజకీయ పరిస్థితిని వివరింపుము.
జవాబు:

  1. 1977 సాధారణ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న ‘వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
  2. అంతర్గత విభేదాల కారణంగా దాని పాలన ప్రభావితం అయ్యింది.
  3. అంతర్గత కీచులాటలకు, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయింది.
  4. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 3 సం||రాల లోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది.
  5. 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

ప్రశ్న 26.
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
1970 లో ఏర్పడ్డ కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు :

  1. బి.ఎల్.డి – భారతీయ లోకదళ్ – ఉత్తరప్రదేశ్
  2. కాంగ్రెస్ (ఓ) – ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం
  3. సి.పి.ఐ (ఎం) – భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)
  4. డి.ఎం.కె – ద్రవిడ మున్నేట్ర కజగం – తమిళనాడు
  5. జనసంఘ్ – ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైంది.
  6. ఎస్.ఎ.డి – శిరోమణి అకాలీ దళ్ – పంజాబ్.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 27.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్
2) అసోం
3) పంజాబ్
4) తమిళనాడు
5) పశ్చిమబెంగాల్
6) ఉత్తరప్రదేశ్
7) నాగాలాండ్
8) మిజోరం
9) బీహార్
10) గుజరాత్
11) మహారాష్ట్ర
12) అయోధ్య
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 8

ప్రశ్న 28.
భారత రాజ్యాంగంలోని 73వ సవరణకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి?
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో P.V. నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.
  2. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ ” పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు.
  3. మొత్తం స్థానాలలో 1/3 వంతు స్త్రీలు, SC, ST లకు కూడా కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
  4. స్థానిక స్వపరిపాలనకు కొన్ని విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు.

ప్రశ్న 29.
73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు ఉపయోగముంటుందని మీరు భావిస్తున్నారా? కారణాలు తెల్పండి.
జవాబు:

  1. 73వ రాజ్యాంగ సవరణ వల్ల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది.
  2. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు.
  3. కొన్ని అంశాలలో కొంతమేర స్వయంప్రతిపత్తి స్థానిక ప్రభుత్వాలకు లభించింది.

ప్రశ్న 30.
నిరక్షరాస్యత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:

  1. నిరక్షరాస్యత ప్రజాస్వామ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది.
  2. నిరక్షరాస్యులు ఓటు ప్రాధాన్యతను అర్థం చేసుకోలేరు.
  3. ఎన్నికలలోని అనుచిత ప్రవర్తనలు నిరక్షరాస్యులను కేంద్రంగా చేసుకొని జరుపబడతాయి.
  4. ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోవడానికి నిరక్షరాస్యత కారణమయ్యే ప్రమాదముంది.

ప్రశ్న 31.
రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానం దేశాభివృద్ధికి దోహదపడిందని భావిస్తున్నారా? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేశాయని నేను భావిస్తున్నాను,
  2. ఆర్థిక రంగంలో రాజీవ్ గాంధీ భిన్నమైన పంథాను అనుసరించడానికి ప్రయత్నించాడు.
  3. 1986లో అతడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానంవైపు పయనం మొదలు పెట్టాడు.
  4. ఆ తర్వాత అవే ప్రపంచీకరణకు, ‘టెలికం విప్లవానికి బాటలు వేయడం జరిగింది.

ప్రశ్న 32.
పేజి 268లోని ఆంధ్రప్రదేశ్ శీర్షిక కింద గల “ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను …….. అతడు వాదించాడు.” వరకు, చదివి, దానిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
ఆ కాలంలో ఎన్.టి. రామారావుగారు ఆంధ్రప్రదేశ్, భారతదేశ రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన నినాదం ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ నాటికీ, నేటికీ అద్భుతమైనది. అప్పటి వరకు జాతీయ రాజకీయాలలో ఉత్తరాది వారే అధిక పాత్ర పోషిస్తున్నారు. కాని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. ముఖ్యంగా టి.డి.పి.ది.

ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం పథకం, మద్యపాన నిషేధం మొదలైనవి ఆయన ప్రభుత్వ పనితనానికి ఉదాహరణలు – గర్వకారణాలు. ఆయన పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దానిని సమర్థవంతంగా అణిచివేశారు.

10th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అసోం ఉద్యమం గురించి రాయండి. అసోం ఉద్యమానికి గల ప్రధాన కారణాలు రాయండి.
జవాబు:

  1. అసోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు.
  2. బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  3. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  4. స్వాతంత్ర్యం తరువాత కూడా బెంగాలీలు అసోంలో ఎంతోమంది స్తిరపడ్డారు. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వలసవచ్చి స్థానికులను అనేక ఇబ్బందులకు గురి చేయసాగారు.
  5. దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని అసంతృప్తి చెంది 1970లో సామాజిక ఉద్యమాన్ని తెచ్చారు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 2.
దేశ విభజన నాటి నుండి రాజకీయాలను మతము ప్రభావితం చేస్తుంది అనడానికి నిదర్శనాలు రాయండి. .
జవాబు:

  1. 1947లో జరిగిన మత మారణహోమం నుండి భారతదేశం విభజింపబడి భారతదేశం, పాకిస్థాన్ అను రెండు దేశాలుగా అవతరించాయి.
  2. దేశ విభజన తరువాత మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించినప్పటికి దేశ రాజకీయాలను మతము అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
  3. పంజాబ్ లో సిక్కు మతస్థులు ప్రత్యేక ఖలిస్థాన్ కావాలని మారణ హోమం సృష్టించారు. ఇది దేశ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు దారి తీసింది.
  4. షాబానో కేసులో ముస్లిం మత ఛాందసవాద వర్గాల ఒత్తిడికి తలొగ్గి కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది భావించారు.
  5. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానములో రాముడికి గుడి కట్టాలని హిందువులు ఉద్యమం మొదలు పెట్టి బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ప్రశ్న 3.
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో నేడు అనేక మార్పులు తెచ్చింది. వాటిని వివరించండి.
జవాబు:
టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో తెచ్చిన మార్పులు :

  1. సమయం ఆదా అవుతుంది.
  2. వేగంగా సమాచారం అందించడం జరుగుతుంది.
  3. ఆన్లైన్ సర్వీసుల విస్తరణ జరిగింది.
  4. సుఖవంతమైన / విలాసవంతమైన జీవనానికి దారులు ఏర్పడ్డాయి.
  5. ప్రజలు ఫోనులకు, ఇంటర్నెట్లకు బానిసలు (అడిక్షన్) కావడం.
  6. కూర్చొనే సమయం పెరగడం వలన ఊబకాయం రావడం జరిగింది. (ఒబేసిటి)
  7. జీవన వ్యయం పెరిగింది.
  8. ఫోనులకు అతుక్కుపోవడం వలన మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రశ్న 4.
దిగువ అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

పంచాయితీ రాజ్ & 73 వ సవరణ

స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకొన్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు (1/3 వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలి పెట్టారు. అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాల అధికారాలలో తేడాలుంటాయి.

ప్రశ్నలు :
1) స్థానిక స్వపరిపాలన అంటే ఏమిటి?
2) స్థానిక సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు నిచ్చిన ప్రభుత్వమేది?
3) 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
4) స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించడం సమర్ధనీయమా? చర్చించండి.
జవాబు:

  1. గ్రామ, పట్టణ మరియు నగర ప్రాంతాలలో ప్రజలు స్థానికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తద్వారా వారికి గల ఉమ్మడి అవసరాలను తీర్చుకొనుటనే స్థానిక స్వపరిపాలన అంటారు.
  2. పి.వి. నరసింహారావు ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం
  3. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించినది.
  4. సమర్థనీయమే. రాజకీయ సమానత్వాన్ని సాధించడంకోసం మరియు వారిని స్థానిక పాలనలో భాగస్వాములను చేయుట కొరకు స్థానిక సంస్థలలో 1/3 వంతు సీట్లు కేటాయించడం సమర్ధనీయం.

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పార్లమెంట్ లో వివిధ రాజకీయ పార్టీల బలబలాలు

రాజకీయ పార్టీ పేరు సంవత్సరం 1952 సంవత్సరం 1962
1. భారత జాతీయ కాంగ్రెస్ 364 361
2. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 16 29
3. సోషలిస్టు పార్టీ 12 12
4. కిసాన్ మజ్జూర్ పార్టీ 09
5. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 07
6. గణతంత్ర పరిషత్ 06
7. ఇతరులు 38 27
8. స్వతంత్ర అభ్యర్థులు 37 20
9. జనసంఘ్ 18
10. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12
11. DMK 07

a) ఏ ఏ రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో తమ బలాలు 1952 కంటే 1962 లో ఎక్కువ పొందినాయి?
b) 1962 నాటికి కనుమరుగైన రాజకీయ పార్టీలు ఏవి?
c) 1952 మరియు 1962లో తమ బలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
d) 1952 కంటే 1962 నాటికి తమ సంఖ్యాబలాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
a) కమ్యూనిస్టు పార్టీ
b) 1) జనసంఘ్
2) ప్రజా సోషలిస్టు పార్టీ
3) DMK

c) 1962 – 1) కిసాన్ మజ్జూర్ పార్టీ
2) పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (1952లో ఏ పార్టీ సీట్లను కోల్పోలేదు)
3) గణతంత్ర పరిషత్

d) ఇతరులు, స్వతంత్రులు, కాంగ్రెస్

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

భారతదేశంలోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ అకాంక్షలను సాధించుకోటానికి ప్రయత్నించసాగాయి. అంతేగాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయవాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నిటి కారణంగా భారతీయ సమాజం తీవ్ర కల్లోలానికి లోనయ్యింది. ఈ మార్పులను అర్థం చేసుకొని వాటిని అనుగుణంగా మారే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉన్నాం.
జవాబు:
భారతదేశాన్ని సుస్థిరంగా, సమర్థవంతంగా, వేగవంతంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికలను అమలుపరచడం జరిగినది. దానివలన ప్రభుత్వ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానిని అధిగమించడానికి, భారతదేశంలోకి స్వేచ్చగా విదేశీ పెటుబడులు, వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది.

దానికోసం ప్రజాసేవకు అయ్యే ఖర్చు మరియు రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం జరిగింది. అప్పుడే అభివృద్ధి చెందుచున్న మధ్య తరగతి కులాలవారు రాజకీయ పార్టీలను ప్రారంభించడం వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా, మతం పేరుతో రాజకీయ, సమీకరణలు చేయడం జరిగింది. వీటన్నింటి కారణంగా సమాజంలో చాలా సమస్యలు ఎదురైనాయి. రిజర్వేషన్ కూడా ఒక సమస్యే. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటంటే ప్రస్తుత సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మారడమే.

ప్రశ్న 7.
సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావటంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ ఉత్పత్తిదారులలో పోటీ పడక తప్పలేదు. దీని వల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాలు మొదలు పెట్టాయి. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడడం వల్ల సాధారణ ప్రజలు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రవేటీకరణకు కూడా ఇది, దారితీయటంతో ఈ సేవలు అందించే ప్రవేటు వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు/రుసుం చెల్లించాల్సి వస్తోంది.
ప్రశ్న : సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలపై మీ అభిప్రాయాన్ని వ్రాయుము.
జవాబు:

  1. భారతదేశము ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది.
  2. సరళీకరణ సమాచార విప్లవానికి దారితీసింది.
  3. ప్రపంచ ఉత్పత్తిదారులతో భారతీయ వ్యాపారులు పోటీపడవలసి వచ్చింది.
  4. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించవలసి వచ్చినందున ప్రజలకు, స్థానిక పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
  5. విద్య, ఆరోగ్యము, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రైవేటీకరణకు దారితీసింది.
  6. ప్రపంచీకరణకు మార్గం సుగమమైంది.
  7. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల సంపన్న వర్గాల వారికి మాత్రమే ఎక్కువ మేలు జరిగిందని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
క్రింది సమాచారాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 5
i) ఏ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
బీహార్

ii) ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఒక ప్రత్యేకతను తెల్పండి.
జవాబు:
సంస్కృతం ఒక అధికార భాషగా ఉండటం.

iii) నవంబర్ 1, 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం ఏది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

iv) మధ్యప్రదేశ్ నుండి వేరుబడిన రాష్ట్రమేది?
జవాబు:
ఛత్తీస్ గఢ్

ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించి, సంకీర్ణ ప్రభుత్వాల ధోరణిని విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 6
జవాబు:

  1. పై పట్టికలో 1989వ సం||ము నుండి 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాల ధోరణి ఏ విధంగా ఉందో తెలియచేయడం జరిగినది.
  2. మూడు సంకీర్ణ ప్రభుత్వాలు మరియు వాటి పాలనా కాలం గురించి ఇవ్వబడింది.
  3. 1989 మరియు 1990 లలో జనతాదళ్, నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది. దానిలో JD, DMK, AGP, TDP, JINC లు అధికార పార్టీలుగా మరియు CPM, CPI, BJP లు మద్దతు పార్టీలుగా ఉన్నాయి.
  4. 1996 – 1998 సం||ల మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానిలో JKNC. TDP. TMC, CPI, AGP, DMK, MGP లు అధికార పార్టీలుగా, CPM మద్దతుదారుగా ఉంది.
  5. 1998 – 2004 ల మధ్యకాలంలో నేషనల్ డెమోటిక్ అలయెన్స్ అనే ఇంకొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. , దానిలో JDU, SAD, TMC, AIADMK, JKNC, BJD, శివసేన లు అధికార పార్టీలుగా, TDP మద్దతుదారుగా ఉంది.
  6. స్వాతంత్ర్యానంతరం, 1990 సంవత్సరం నుండి మన రాజకీయాలలో చాలా గమనించదగ్గ మార్పులు వచ్చాయి.
  7. బహుళ రాజకీయ పార్టీలు వాటి మధ్య పోటీ చివరకు ఏ పార్టీకి ఎన్నికలలో ఆధిక్యం రాని పరిస్థితి ఏర్పడినది.
  8. 1989 నుండి 2004 వరకు ఎక్కువగా మనం సంకీర్ణ రాజకీయ పార్టీలు మరియు సంకీర్ణ ప్రభుత్వాలనే చూడటం జరుగుతుంది.
  9. ఇది ప్రజల యొక్క ఆలోచనను తెలియచేస్తుంది. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని తెలియచేస్తుంది.

ప్రశ్న 10.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. ఈ భారతదేశంలో ఒక వైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతులు వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకో వైపున ప్రజలను విభజించే, మతపర రాజకీయ సమీకరణల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. యాభై ఏళ్ళకు పైగా అది కాలపరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితిని సాధించింది. ప్రజాస్వామిక రాజకీయాలు బలంగా వేళ్లూనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ-పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని ఇది ఇంకా పరిష్కరించలేదు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రజలను విభజించే మరియు మతపరమైన రాజకీయాలను గురించి వర్ణించడం జరిగినది. ఇవి సామాజిక శాంతికి ముప్పును కలిగిస్తాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 30 మరియు 40 సంవత్సరాల వరకు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినది. ఆ తరువాతే అస్థిర ప్రభుత్వాల కాలం మొదలైనది. ప్రధాన సమస్యలైన పేదరికం, ఆర్థిక అసమానతలు మొ|| వాటిని ఇంకా పరిష్కరించలేదు.

నా అభిప్రాయములో రాజకీయాలు అనేవి ఓటు, బ్యాంకు మీద ఆధారపడి ఉన్నవి. మన దేశంలో కొన్ని సందర్భాలలో మతపరమైన గొడవలు జరిగిన సందర్భములో వాటి వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర కలదు. ముఖ్యమంత్రులను పదవి నుండి దింపడానికి, ఆ పార్టీకి చెందిన నాయకులే మత విద్వేషాలను రెచ్చగొట్టిన సందర్భాలు మనదేశంలో కలవు.

మన దేశంలో కుల ఆధారిత రాజకీయాలు నడుస్తాయి. ఆ ప్రాంతంలో ఏ కులంవారు ఎక్కువగా ఉంటే వారికి అక్కడ సీట్లు కేటాయించడం మరియు ఆ కులాలు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికలలో అనుచిత చర్యలకు పాల్పడటం జరుగుతుంది. కొన్ని నియోజక వర్గాలలో ప్రత్యేకంగా కొన్ని మతాల వారు ప్రాతినిధ్యం వహించడం, వారి పెత్తనం చలాయించడం జరుగుచున్నది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నాయి.

కావున ప్రజలు, పార్టీలు రాజకీయాలలో కులం, మతం ప్రస్తావనలకు దూరంగా ఉంటే దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 11.
ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.
  2. సమాఖ్య రాజ్యస్ఫూర్తిని ప్రాంతీయ పార్టీలు ప్రతిబింబిస్తాయి.
  3. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల సమస్యలు, అవసరాలపట్ల మంచి అవగాహన కలిగి ఉంటాయి.
  4. అవి తమ స్వీయ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి.

ప్రశ్న 12.
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలతో పాటు దాని ప్రభావాన్ని వివరించండి.
జవాబు:
సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కావడానికి గల కారణాలు :

  1. బహుళపార్టీ వ్యవస్థ
  2. ఏ పార్టీకి కావలసినంత మెజారిటీ రాకపోవడం
  3. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం.
  4. 1960ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును క్రమంగా కోల్పోవడం.

ప్రభావం :

  1. రాజకీయ స్థిరత్వం లేకపోవడం
  2. రాజకీయ సిద్ధాంతాలను వదులుకోవడం
  3. జాతి ప్రయోజనాలకన్న పార్టీ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం.
  4. అత్యధిక ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ అధికారంలోకి రావడం.

ప్రశ్న 13.
షాబానో కేసులో 1985లో సుప్రీం కోర్సు ఇచ్చిన తీర్పు, “అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందనే” మహిళా ఉద్యమ నాయకుల వాదనను మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
జవాబు:

  1. భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
  2. ప్రగతిశీల ముస్లిములు ఈ తీర్పును స్వాగతించారు.
  3. అయితే ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందనీ, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
  4. మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందని వాదించసాగారు.

ప్రశ్న 14.
రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై నీ అభిప్రాయమేమిటి?
జవాబు:

  1. అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదు ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు.
  2. అది రాముని జన్మస్థలం అని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని వాళ్ల వాదన.
  3. బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనాస్థలమని పేర్కొన్నారు.
  4. ఈ వివాదం కొంతకాలంగా సాగుతోంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక రోజు తప్పించి మసీదును మూసి ఉంచాలని ఆదేశించింది.
  5. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరచి ఉంచవచ్చని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది.

ప్రశ్న 15.
రాజకీయాలలో మత వినియోగం గురించి బి.జె.పి అభిప్రాయాన్ని రాయుము.
జవాబు:

  1. జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది.
  2. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది.
  3. అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యా నికి బి.జె.పి వ్యతిరేకం.
  4. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదు.
  5. దేశ ప్రజలందరిని సమదృష్టితో చూడాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

ప్రశ్న 16.
భారత ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యిందని ఎలా చెప్పగలవు?
జవాబు:
భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చెప్పవచ్చును.
కారణాలు:

  1. క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు
  2. ఎన్నికలలో ఓటు వేసేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం
  3. ప్రభుత్వాల మార్పు.
  4. కొత్త గ్రూపుల సాధికారీకరణ
  5. పౌర హక్కులను కాపాడటం వంటి అంశాలు.

AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 17.
కాంగ్రెస్ ఏకైక పార్టీ కాదనే వాదనను సమర్ధిస్తూ, ప్రత్యామ్నాయాలను చర్చించండి.
జవాబు:
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయాలు :

  1. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించాయి.
  2. కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోకదళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
  3. జగజ్జీవన్‌రాం వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికతో చేరారు.
  4. ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.ఎం.కె, ఎస్.ఎ.డి., సి.పి.ఐ (ఎం) వంటివి తమ ఉనికిని కొనసాగించాలనీ, అయితే ‘కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో, జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
  5. కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయడం జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.

ప్రశ్న 18.
జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే మతగురువులు నడిపే మతపరమైన రాజ్యానికి బి.జె.పి వ్యతిరేకం. లౌకికరాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా, దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బి.జె.పి లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది.

1980ల వరకు భారత రాజకీయాలలో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకు 1984 లోకసభ ఎన్నికలలో వీళ్లు రెండు సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని – రాముడు పుట్టిన ప్రదేశమంటూ మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో బి.జె.పికి ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతుగా బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ‘రథయాత్ర’ చేపట్టాడు. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజలు పలుపాంత్రాలలో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్ లో అద్వానీని అరెస్టు చెయ్యటంతో ఈ యాత్ర ముగిసింది. దీనికి ప్రతిగా వి.పి.సింగ్ ప్రభుత్వానికి బి.జె.పి తన మద్దతును ఉపసంహరించుకుని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది.

శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపించటంలో అతని పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్‌టిటిఇ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఆ తరువాత కురిసిన సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోకసభలో బి.జె.పి బలం 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరింపబడిన పెద్దగుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేసింది. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం జరిగింది.
“రాజకీయాలలో మత వినియోగంపై” నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
దేశ విభజన సమయంలో రాజకీయ రంగం నుంచి మతాన్ని వేరుచేయటానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ , తరువాత రాజకీయాలలో మత ప్రమేయం కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం మొదలయ్యింది.

జనాభా సంఖ్యలో అత్యధికంగా ఉన్న హిందువుల మత ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే 1980 వరకు నామమాత్రంగా ఉన్న ఈ ధోరణి “అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశమంతటా మసీదు ఉన్నచోట గుడి కట్టటానికి ఉద్యమాన్ని చేపట్టటంతో ఒక్కసారిగా బి.జె.పి.కి ఆదరణ పెరిగింది. దీనికి మద్దతుగా బి.జె.పి. నాయకుడు ఎల్.కె. అద్వాని 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు “రథయాత్ర” చేశాడు. అంతేకాక లౌకికవాద రాజకీయాలు, అల్పసంఖ్యాక వర్గాలను, ప్రత్యేకించి ముస్లిములను సంతృప్తి, పరచటానికి ప్రయత్నించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నామని వీరు వాదించారు.

ఈ అయోధ్య అంశంలో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా ప్రాంతాలలో మతపరంగా చీలిపోయారు. చివరికి 1992లో అయోధ్యలోని మసీదును ధ్వంసం చేసారు. ఈ ఘటన తరువాత తీవ్ర నిరసనలు, మతకల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణనష్టం కూడా జరిగింది..

ఈ విధంగా రాజకీయాలలో మతాన్ని వినియోగించి, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

ప్రశ్న 19.
స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. మొత్తం స్థానాలలో మూడింట ఒకవంతు (1/3వ వంతు) స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు జాతులకు కూడా కొన్ని స్థానాలను రిజర్వు చేసారు.
ఇచ్చిన పేరాను అధ్యయనం చేసి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
ఎ. రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపునిచ్చింది?
జవాబు:
73వ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇచ్చింది.

బి. పట్టణాలు, నగరాలలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి?
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణాలు, నగరాలలో మొదటిసారిగా సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి.

సి. స్థానిక సంస్థలలో మొత్తం స్థానాలలో స్త్రీలకు ఎన్నవ వంతు కేటాయించారు?
జవాబు:
స్థానిక సంస్థలలో స్త్రీలకు 1/3వ వంతు కేటాయించారు.

ప్రశ్న 20.
ఈ కింది పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 9
ఎ) టి.డి.పి. ఏ సంవత్సరంలో ఏర్పాటైనది?
జవాబు:
టి.డి.పి. 1982లో ప్రారంభమైంది.

బి) ఇందిరాగాంధీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
ఇందిరాగాంధీ హత్య 1984లో జరిగింది.

సి) ఆర్థిక సరళీకరణ విధానాలు ఎప్పుడు జరిగినవి?
జవాబు:
ఆర్థిక సరళీకరణ విధానాలు 1984లో జరిగినవి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

These AP 10th Class Social Studies Important Questions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) will help students prepare well for the exams.

AP Board 10th Class Social 18th Lesson Important Questions and Answers స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social 18th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
ఎన్నికల సంఘానికి.

2. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

3. అలీన విధాన రూపశిల్పి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

5. మహారాష్ట్రలో, బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని ఆందోళన చేసిన పార్టీ ఏది?
జవాబు:
శివసేన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

6. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రానికి చెందినది?
జవాబు:
జమ్ము & కాశ్మీర్

7. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏది?
జవాబు:
370.

8. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? 4. దక్షిణాదిన ఏ రాజకీయ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది ? జ. DMK
జవాబు:
వ్యవసాయరంగం.

9. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

10. ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవి చూసింది?
జవాబు:
1967 ఎన్నికలు.

11. అస్సోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాల తో 1969లో ఏర్పడిన కొత్త రాష్ట్రమేది?
జవాబు:
మేఘాలయ.

12. 1971లో భారత్ ఎవరికోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

13. 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు:
14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు.

14. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటానికి చేపట్టిన విప్లవం ఏది?
జవాబు:
హరిత విప్లవం.

15. అఖిల భారత జమ్ము & కాశ్మీర్ కాన్ఫరెన్స్ కు నాయకుడు ఎవరు?
జవాబు:
షేక్ మొహ్మద్ అబ్దుల్లా.

16. ప్రజల, హక్కులకు ఏ సందర్భంలో పరిమితులు విధించబడతాయి?
జవాబు:
అత్యవసర పరిస్థితులలో

17. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం నాయకుడు ఎవరు?
జవాబు:
ముజిబుర్ రెహ్మన్.

18. బ్రిటిషు పాలనలో కూడా క్రియాశీలకంగా ఉండి, తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేసిందెవరు?
జవాబు:
ఆంధ్ర మహాసభ.

19. ఎన్నికల సంఘం ఏ సమస్యను అధిగమించటానికి పార్టీలకూ గుర్తులు కేటాయిస్తుంది?
జవాబు:
నిరక్షరాస్యత.

20. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
జవాబు:
కాంగ్రెసు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

21. పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది?
జవాబు:
1956

22. ఏ తమిళ హీరోను తనకు మద్దతుగా DMK ఉపయోగించుకుంది?
జవాబు:
M. G. రామచంద్రన్ (MGR)

23. S.V.Dని విస్తరింపుము.
జవాబు:
సంయుక్త విధాయక దళ్

24. బ్యాంకుల జాతీయికరణ చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ

25. రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

26. 1973లో అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంతో వేటి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి?
జవాబు:
ముడిచమురు ధరలు.

27. JP ఉద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

28. లోక్ సభకు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు రద్దు చేసింది?
జవాబు:
అలహాబాద్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

29. జమ్ము కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరు?
జవాబు:
రాజా హరిసింగ్

30. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు?
జవాబు:
పారిశ్రామిక రంగంకు

31. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1971.

32. భారత్, పాకిస్తాన్ ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1947.

33. మొట్టమొదటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
జవాబు:
1953.

34. స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరములలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్.

35. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడిన దేశం ఏది?
జవాబు:
బంగ్లాదేశ్.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

36. 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు నినాదం ఏమిటి?
జవాబు:
గరీబీ హఠావో.

37. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ఏది?
జవాబు:
ఇంగ్లీషు.

38. హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
తమిళనాడు.

39. ‘గరీబీ హరావో’ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.

40. భారత దేశ అధికార భాష ఏది?
జవాబు:
హిందీ.

41. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
జవాబు:
1952.

42. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.

43. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసినది ఎవరు?
జవాబు:
పొట్టి శ్రీరాములు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

44. ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరిచారు?
జవాబు:
1950లో

45. భారతదేశం, చైనాతో యుద్ధం చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1962.

46. నెహ్రు చనిపోయిన సంవత్సరం?
జవాబు:
1964.

47. నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

48. విదేశాలలో మరణించిన భారత ప్రధాని ఎవరు?\
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.

49. లాల్ బహాదుర్ శాస్త్రి ఏ సంవత్సరంలో మరణించారు?
జవాబు:
1966.

50. హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం?
జవాబు:
1963.

51. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953, అక్టోబర్ 1న

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

52. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1956, నవంబర్ 1న

53. పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1966.

54. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని నగరం ఏది?
జవాబు:
చంఢీఘర్.

55. భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1976.

56. ఫజల్ అలి, కె.ఎం. ఫణిక్కర్. హృదయనాథ్ కుంజు, జయప్రకాష్ నారాయళ్లలో మొదటి SRCలో సభ్యులు కాని వారు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

57. నెహ్రు మొగ్గుచూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి యున్న అంశం కానిది.
→ భూ సంస్కరణలు
→ వ్యవసాయ సహకార సంఘాలు
→ ్థానిక స్వపరిపాలన
→ భూమిని దానంగా ఇవ్వటం.
జవాబు:
భూమిని దానంగా ఇవ్వటం.

58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) బీహార్ ( ) a) కుర్ని, కొయిరి
ii) మధ్యప్రదేశ్ ( ) b) లోథ్
iii) కర్ణాటక ( ) c) ఒక్కళి
iv) తమిళనాడు ( ) d) వెల్లాల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
I. మత కల్లోలాలు జరిగిన ప్రాంతం – II.రాష్ట్రం
i) రాంచి ( ) a) బీహార్
ii) అహ్మదాబాద్ ( ) b) గుజరాత్
iii) జలగావ్ ( ) c) మహారాష్ట్ర
iv) అలీఘర్ ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

60. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటిని సమైక్య పరిచింది ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.

61. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం 1956కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
i) 1953 ఆగస్ట్” SRC వేసారు.
ii) భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.
iii) ఈ సంఘం నివేదిక ఆధారంగా 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం చేసారు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (i) & (iii)
D) (i), (ii) & (iii).
జవాబు:
D (i), (ii) & (iii)

62. 1968 – 69లో పంజాబు ప్రజల ఆందోళనకు కారణం ఏమిటి?
జవాబు:
ఉమ్మడి రాజధాని చండీఘర్ ని తమకు ఇవ్వాలని.

63. బ్యాంకుల జాతీయికరణ, గరీబీ హఠావో, ధరల నియంత్రణ, రాజభరణాల రద్దులలో ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణ కానిది.
జవాబు:
ధరల నియంత్రణ.

64. ఈ క్రింది సంఘటనలను కాలక్రమంలో ఉంచండి.
i) బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం
ii) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు
iii)మొదటి సార్వత్రిక ఎన్నికలు
iv) హిందీ అధికార భాషా చట్టం.
జవాబు:
iii, ii, iv, i

65. ప్రస్తుతం మైసూర్ రాష్ట్రాన్ని ఎలా పిలుస్తున్నారు?
జవాబు:
కర్ణాటక.

66. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలను అసంతృప్తికి గురిచేసిన చర్య కానిది.
→ పౌరహక్కుల ఉల్లంఘన
→ మురికివాడల తొలగింపు
→ వెట్టి చాకిరీ నిర్మూలన
→ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
జవాబు:
వెట్టిచాకిరీ నిర్మూలన.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

67. భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరాలలో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాల్.
ఎ) దేశ ఐక్యతను కాపాడటం
బి) దేశ సమగ్రతను కాపాడటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడం.
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

68. “ఒక వ్యక్తి – ఒక ఓటు మరియు ఒక ఓటు – ఒకే విలువ” అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు:
అంబేద్కర్

69. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు:
జనవరి 25 న.

70. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య మొదలయ్యింది?
జవాబు:
USA – USSR

71. ‘పంచశీల సూత్రాలు’ ఏయే దేశాల మధ్య ఒప్పందం అంటార?
జవాబు:
భారత్ – చైనా.

72. భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1975.

73. క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
→ భారత్ × సాకిస్తాన్ యుద్ధం – 1965
→ భారత్ ×చైనా యుద్ధం – 1962
→ భారత్ ×చైనా యుద్ధం – 1968
→ భారత్ × పాకిస్తాన్ యుద్ధం – 1971
జవాబు:
భారత్ × చైనా యుద్ధం – 1968

74. 1947లో దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా.

75. చక్కని సంస్థాగత చట్టాన్ని ఏర్పరచడంలో భాగంగా మనదేశం ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర వ్యవస్థ కానిది ఏది?
→ ఎన్నికల సంఘం
→ కంట్రోలర్ & ఆడిటర్ జనరల్
→ ప్రణాళిక సంఘం
→ న్యాయ వ్యవస్థ
జవాబు:
ప్రణాళిక సంఘం.

76. 1952లో లోకసభలోని (మొదటి లోకసభలోని) స్థానాలు ఎన్ని?
జవాబు:
489.

77. 1952 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల శాతం ఎంత?
జవాబు:
74%.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

78. ఆంధ్ర మహాసభ (AMS) ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1930 లో.

79. పొట్టి శ్రీరాములు ఎప్పటి నుండి, ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేసారు?
జవాబు:
19 అక్టోబరు 1952 నుండి 15 డిసెంబరు 1952 వరకు.

80. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది?
జవాబు:
మద్రాసు రాష్ట్రంలో.

81. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
జవాబు:
1951 – 56.

82. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
జవాబు:
31 అక్టోబరు 2019 నుండి.

83. జమ్ము & కాశ్మీర్ కి సంబంధించిన ‘ఢిల్లీ’ ఒప్పందాన్ని అంగీకరించిన నాయకుడెవరు?
జవాబు:
షేక్ మొహమ్మద్ అబ్దుల్లా.

84. అవామీలీగ్ నాయకుడెవరు?
జవాబు:
షేక్ ముజిబుర్ రెహ్మాన్.

85. ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1969.

86. రాజభరణాల రద్దు చేసిన సంవత్సరం.
జవాబు:
1971.

87. మిని రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణని పేర్కొంటారు?
జవాబు:
42వ సవరణని (1976)

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

88. ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్లో చేపట్టిన ఉద్యమం ఏది ?
జవాబు:
ముక్తిబాహిని.

10th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు ?
జవాబు:
గిరిజనులు దేశంలో చెల్లాచెదురుగా అక్కడక్కడ ఉన్నారు. కనుక వారికి ఒక ప్రాంతంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. అందువలన గిరిజన భాషలను పట్టించుకోలేదు.

ప్రశ్న 2.
నెహ్రూ ప్రవేశపెట్టిన ఏవైనా రెండు గ్రామీణ అభివృద్ధి పథకాలను రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

3 రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.

  1. జమిందారీ వ్యవస్థ రద్దు
  2. కౌలు విధానాల సంస్కరణ
  3. భూ పరిమితి విధానాలు

ప్రశ్న 3.
ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సూచించేలా గుర్తులు కేటాయించుటకు గల ముఖ్య ఉద్దేశ్యమేమిటి ?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించటానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 4.
భారతదేశంలో హరిత విప్లవం ఎందుకు తప్పనిసరి?
జవాబు:

  1. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం.
  2. సక్రమ నీటి నిర్వహణ పద్ధతుల కోసం భారతదేశంలో హరిత విప్లవం తప్పనిసరి.

ప్రశ్న 5.
ఏక పార్టీ విధానానికి, బహుళ పార్టీ విధానానికి గల తేడా ఏమి?
జవాబు:

  1. ఏకపార్టీ విధానం – ఒక పార్టీ ఉండడం.
  2. బహుళపార్టీ విధానం – ఎక్కువ పార్టీలు ఉండడం.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:

  1. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించే కొన్ని గుర్తులను రోజువారీ జీవితం నుంచి కేటాయించింది.
  2. ప్రతి ఒక్క అభ్యర్థికి బయటవైపు వారికి కేటాయించిన గుర్తును అంటించబడిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 7.
స్వాతంత్ర భారత తొలి సంవత్సరములలో నాయకుల ముందున్న ప్రధాన సవాళ్ళు ఏవి?
జవాబు:

  1. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడటం.
  2. సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకొనిరావడం.
  3. పేదరికం
  4. నిరుద్యోగం
  5. నిరక్షరాస్యత

ప్రశ్న 8.
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు ఎప్పుడు వచ్చింది?
జవాబు:
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు 1971లో వచ్చింది.

ప్రశ్న 9.
మొదటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించే బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించారు.

ప్రశ్న 10.
భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
భారతదేశంలో 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 11.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
బ్రిటిష్ కాలంలో దేశం ఏ విధంగా విభజింపబడి ఉంది?
జవాబు:
బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే) గాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది.

ప్రశ్న 13.
మద్రాసులో ఏ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవాళ్లు?
జవాబు:
తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్లు ఉండేవాళ్లు.

ప్రశ్న 14.
దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా దేశ విభజన జరిగింది.

ప్రశ్న 15.
ఆంధ్ర మహాసభ దేని కొరకు ప్రయత్నించింది?
జవాబు:
మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్కతాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.

ప్రశ్న 16.
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో ఏ పద్ధతులను ఉపయోగించింది?
జవాబు:
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులను ఉపయోగించింది.

ప్రశ్న 17.
పొట్టి శ్రీరాములు ఎవరు?
జవాబు:
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసి 1952 అక్టోబరులో చనిపోయారు.

ప్రశ్న 18.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) ఎప్పుడు వేశారు? ఇందులోని సభ్యులెవరు?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. దీనిలో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.

ప్రశ్న 19.
1956 రాష్ట్రాల పున్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి?
జవాబు:
1956లో పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 20.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో పరిగణనలోకి తీసుకోని భాషలేవి?
జవాబు:
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 21.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అంశం మీద కేంద్రీకరించబడింది?
జవాబు:
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచటానికి, రవాణా, ప్రసారాల రంగాల మెరుగుదలకు, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.

ప్రశ్న 22.
1962లో ఏ దేశంతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది?
జవాబు:
1962లో మనం చైనాతో యుద్ధం చేయవలసి వచ్చింది.

ప్రశ్న 23.
1967 ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందిన రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, కేరళలో కాంగ్రెస్ పరాజయం పొందింది.

ప్రశ్న 24.
ప్రత్యేక తెలంగాణా వాదుల ఆరోపణ ఏమిటి?
జవాబు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నాయకత్వం వహించారు. “అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని కొన్ని వర్గాలకే చెందుతున్నాయన్నది వీళ్ల ప్రధాన ఆరోపణ.

ప్రశ్న 25.
ఏ ఏ ప్రాంతాలతో ‘మేఘాలయ’ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.

ప్రశ్న 26.
‘గరీబీ హటావో’ అని ఎవరు, ఎప్పుడు అన్నారు?
జవాబు:
1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఈ ‘గరీబీ హటావో’ అన్న నినాదాన్ని ఉపయోగించి ఘనవిజయం సాధించారు.

ప్రశ్న 27.
రాజ్యాంగసభ ప్రాముఖ్యతనిచ్చిన అంశాలేమిటి?
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో సామాజిక, ఆర్థిక మార్పునకు అది ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది.

ప్రశ్న 28.
ప్రణాళికల మూలంగా నెహ్రూ ఏమి ఆశించాడు?
జవాబు:
ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని అతడు ఆశించాడు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 29.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు చేశారు?
జవాబు:
1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.

ప్రశ్న 30.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1970 దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతితల్లి ప్రేమ కనపరచటంపై నిరసనలు చెలరేగాయి, తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోటానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్ కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్లో సైనిక అణచివేత కాలం మొదలయ్యింది. అక్కడ నుంచి తరలి వచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈలోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలయ్యింది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది.
1) తూర్పు పాకిస్తాన్లో ఎప్పుడు ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
జవాబు:
1970 దశాబ్దం ప్రమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

2) సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ గెలుపొందింది?
జవాబు:
సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది.

3) భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 31.
రాజ్యాంగంలోని 370వ అధికరణ యొక్క ప్రత్యేకత ఏమి?
జవాబు:

  1. రాజ్యాంగంలోని 370వ అధికరణంలో కాశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారని తెలుపబడింది.
  2. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు కలిగి ఉంటుంది.
  3. రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడటానికి ఉద్దేశించిన అనేక అంశాలు ఈ ఆర్టికల్ 370లో కలవు.

ప్రశ్న 32.
“ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యత నివ్వడం అతిపెద్ద లోపమని నిస్సందేహంగా చెప్పవచ్చు. పై వ్యాఖ్యపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. స్వాతంత్ర్యానంతరం మనదేశం ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది.
  2. అయితే దేశ అభివృద్ధికి విద్య, ప్రజారోగ్యం పెద్ద అవసరాలు
  3. కావున వాటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పవచ్చు.

10th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో భూసంస్కరణలు ఎలా అమలు చేశారు ? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి?
జవాబు:

  1. భారతదేశమంతటా భూసంస్కరణలను మనఃస్పూర్తిగా అమలు చేయలేదు.
  2. జమిందారీ వ్యవస్థను రద్దు చేశారు కానీ, భూమి లేని వాళ్ళకి భూపంపిణీ జరగలేదు.
  3. గ్రామీణ ప్రాంతాలలో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై నియంత్రణ కొనసాగిస్తూనే ఉన్నారు.
  4. దళితులు ఇంకా భూమిహీనులుగానే ఉన్నారు.
  5. కానీ వెట్టిచాకిరీ నిర్మూలన, అంటరానితనం నిషేధం వల్ల ప్రయోజనం పొందారు.

ప్రశ్న 2.
హరితవిప్లవ ఫలాలు ఏవి?
జవాబు:
హరితవిప్లవం వలన కలిగిన ఫలితాలు:

  1. వ్యవసాయం క్రింద సాగుచేసే భూమి పెరిగింది.
  2. రెండు పంటల విధానం అమలులోనికి వచ్చింది.
  3. నీటిపారుదల వ్యవస్థ బాగా పురోభివృద్ధి చెందింది.
  4. హెక్టారుకి వచ్చే పంట దిగుబడి పెరిగింది.
  5. క్రిమిసంహారక మందులు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల వాడకం బాగా పెరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 3.
భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగి ఉన్నాయా? ప్రతిస్పందించండి.
జవాబు:

  • భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగిలేవు; కల్పించాలి.
  • అనేక గిరిజన (గోండు, సంథలి, ఒరావన్ మొదలైనవి), అట్టడుగు సమాజంలోని ప్రజల భాషలను … పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
  • రాజ్యాంగం ప్రకారం పౌరులకు తమ భాష, సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉంది. భాషాపరమైన అల్ప సంఖ్యాకుల రక్షణకు చర్యలు (ప్రకరణలు) తీసుకోబడ్డాయి.
  • సమాజంలో శక్తిమంత (ఎక్కువ మంది) ప్రజానీకం మాట్లాడే భాషలను (హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ మొ||నవి) మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అభిలషనీయం కాదు.
  • అన్ని భాషలకు సమాన హోదా ఉండాలి. దీనివల్ల భాషా ఉద్యమాలు తలెత్తవు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడబడతాయి.

ప్రశ్న 4.
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణలోని అంశాలేమిటి?
(లేదా)
42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణ ఉద్దేశాలు :

  1. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
  2. రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
  3. సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం. న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.
  4. ‘లౌకిక, సామ్యవాదం’ అనే పదాలను రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
దేశ అభివృద్ధికి, స్వాతంత్రానికి, స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:

  1. అవును. నేను ఈ దృక్పథంతో ఏకీభవిస్తాను.
  2. కారణమేమనగా, అన్ని రంగాలలోను స్త్రీలు సగభాగం పాలు పంచుకుంటున్నారు.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సూచించేలా రోజువారీ , జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించటం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సృజనాత్మక, వినూత్న ప్రయోగం కారణంగా సుదీర్ఘ వివరణల అవసరం లేకుండా బొమ్మను గుర్తిస్తే సరిపోయింది. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి మొదటి ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి బయటవైపు వాళ్ల గుర్తు అంటించిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలు కేటాయించారు. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటును వేస్తే సరిపోతుంది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 7.
క్రింది పేరాను చదివి, మీ సొంత మాటలలో వ్యాఖ్యానించండి.
ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపం అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నూతన శకాన్ని ఆరంభించిన చైనా, కొరియా భారతదేశంతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో ఎంతో ప్రగతిని సాధించాయి.
జవాబు:

  1. ప్రాథమిక విద్య మరియు ప్రజారోగ్యం అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలు
  2. ఈ అంశాలకు ఏ దేశంలోనైనా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
  3. దురదృష్టవశాత్తూ భారతదేశంలో ఈ రెండు రంగాలు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయాయి.
  4. ఈ రంగాలలో ఆశించిన లక్ష్యాలను సాధించేటందుకు ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి.

ప్రశ్న 8.
లాల్ బహదూర్ శాస్త్రిలోని ఏ గుణాలు నీకు నచ్చాయి? ఎందుకు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రిలో నాకు నచ్చిన గుణాలు :

  • సమస్య పరిష్కారం
  • ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం.
  • హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని, ఆహార కొరతను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడం

ప్రశ్న 9.
ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి గల తేడాలు రాయండి.
జవాబు:

ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ
• రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసన సభ స్థానాలు పొందిన పార్టీ • సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు

ప్రశ్న 10.
భారతదేశ అవుట్ లైన్ పటం గీయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1

ప్రశ్న 11.
రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం – 1956 గూర్చి రాయండి.
జవాబు:

  1. ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు అయింది.
  2. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం జరిగింది.
  3. 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది.
  4. ఈ చట్టంలో గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
  5. ఆధిపత్యం లేదా శక్తిమంత ప్రజానీకం మాట్లాడే భాషలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీంట్లో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 13.
భారతదేశమంతటా భూసంస్కరణలు ఏ విధంగా అమలు జరిగాయి?
జవాబు:
అయితే భారతదేశమంతటా భూసంస్కరణలు మనస్పూర్తిగా అమలు చేయలేదు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. కానీ, భూమి లేనివాళ్లకి భూ పంపిణీ జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. దళితులు ఇంకా భూమి హీనులుగానే ఉన్నారు.

ప్రశ్న 14.
భారతదేశ విదేశీ విధానం ఏమిటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోతోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. అదే సమయంలో స్వాతంత్ర్యం పొంది అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా వంటి దేశాలతో అతడు చేతులు కలిపాడు. వీళ్లంతా కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు.

ప్రశ్న 15.
పంచశీల సూత్రాలనగానేమి? వీటిని ఎవరు రూపొందించారు?
జవాబు:
పంచశీల అంటే ఐదు సూత్రాలు. ఇవేమంటే :

  1. ప్రతి రాజ్యంలోని ప్రాంతీయ సమగ్రత (Territorial integrity) నూ, సార్వభౌమత్వాన్ని, పరస్పరం గౌరవించాలి.
  2. ఒక రాజ్యంపై మరొక రాజ్యం దురాక్రమణ చేయరాదు.
  3. ఒక రాజ్యం ఆంతరంగిక వ్యవహారాల్లో మరొక రాజ్యం జోక్యం చేసుకోరాదు.
  4. రాజ్యాల పరస్పర శ్రేయస్సు, సమానత్వం ఆధారంగా స్నేహ సంబంధాలను నెలకొల్పాలి.
  5. రాజ్యాలు శాంతియుత సహజీవనాన్ని పాటించాలి.

పై సూత్రాలతో కూడిన ఒక ఒప్పందాన్ని, 28 జూన్ 1954న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ) చైనా ప్రధాని (చౌ-ఎన్-లై) (Chou-En-Lai) సంయుక్తంగా ప్రకటించి ఆమోదించారు.

ప్రశ్న 16.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ విధంగా పరిష్కరించారు?
జవాబు:
అప్పటి ప్రధాని శాస్త్రి హిందీ అనుకూలవాదనని సమర్థించినప్పటికీ, హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంత పరచటానికి అనేక మినహాయింపులను ప్రకటించాడు. వీటిల్లో కొన్ని : ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది, అది ప్రాంతీయ భాష కావచ్చు లేక ఇంగ్లీషు కావచ్చు. ప్రతి వ్యవహారమూ ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది. సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా నిర్వహిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 17.
1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి సహాయం చేసే సామర్థ్యం భారతదేశానికి ఏ విధంగా వచ్చింది?
జవాబు:
1971లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా సహాయపడింది. భారతదేశం తన సైనిక బలాన్ని పెంచుకోవటం వల్లనే కాకుండా అలీన దేశంగా తన స్థితిని నైపుణ్యంతో ఉపయోగించుకుని రెండు అగ్రరాజ్యాలు యుద్ధంలో జోక్యం చేసుకోకుండా చెయ్యటం వల్ల ఇది సాధ్యమయ్యింది.

ప్రశ్న 18.
అత్యవసర పరిస్థితి కాలంలో జరిగే మార్పులు ఏమిటి?
జవాబు:

  1. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు.
  2. పార్లమెంట్ ఏ అంశంపైనైనా శాసనము చేయవచ్చు.
  3. కేంద్ర కార్యనిర్వాహక వర్గ సలహాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది.
  4. ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి ప్రవేశపెట్టవచ్చు.

ప్రశ్న 19.
ప్రచ్ఛన్న యుద్దమనగానేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అధ్వర్యంలోని పాశ్చాత్య రాజ్యాలకు అనగా కమ్యూనిస్టేతర రాజ్యాలకు, రష్యా ఆధిపత్యంలోనున్న కమ్యూనిస్టు రాజ్యాలకు మధ్యగల పరస్పర ద్వేషం, అనుమానాలు, ఉద్రిక్తతలు ప్రచ్ఛన్న యుద్ధంగా పిలువబడ్డాయి.

ప్రశ్న 20.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
1) కలకత్తా
2) మద్రాస్
3) బాంబే
4) మహారాష్ట్ర
5) పంజాబు
6) గుజరాత్
7) కర్ణాటక
8) మైసూరు
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 3

ప్రశ్న 21.
అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి?
జవాబు:

  1. వివిధ స్థాయిలలో అధికారాలను పంపిణీ చేయడాన్ని అధికార వికేంద్రీకరణ అంటాం.
  2. దీనివలన ఏ స్థాయికి ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది.
  3. అధికారాలు కేంద్రీకృతమై ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టడము మరియు వివిధ స్థాయిలలో ఫైల్స్ ఉండిపోయి తుది నిర్ణయాలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  4. అధికార వికేంద్రీకరణ వలన కొంతమేరకు వ్యవస్థాగత అవినీతిని అరికట్టవచ్చు.

ప్రశ్న 22.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునఃవ్యవస్థీకరణ చేయడానికి అప్పటి నాయకులకు ఉన్న అపోహలు ఏవి?
జవాబు:

  1. మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత, సుస్థిరత పట్ల అనుమానాలు, భయాలు కలుగసాగాయి.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల్ని పునఃవ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావడానికి ఇది దారితీస్తుందని భయపడసాగారు.
  3. కాంగ్రెస్ పార్టీ భాషాప్రాతిపదికపై సంఘటితమై ఉన్నప్పటికీ, ఆ ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ వెంటనే పూనుకోలేదు.

ప్రశ్న 23.
“ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించడం వల్ల అభివృద్ధిలో దూసుకుపోగలదని చెప్పవచ్చు.” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక , విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు.
  2. ప్రస్తుతం భారతదేశంలో ‘టెలికాం విప్లవం’ అనబడుతున్న దానిని అతడే ఆరంభించాడు.
  3. ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా, విస్తరించడానికి దోహదపడుతుంది.
  4. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, E-mail, Voicemail, Facebook, Twitter తదితరాలు అందుబాటులోకి వచ్చాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 24.
జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి కల్పించడం సమర్థనీయమేనని మీరు భావిస్తున్నారా?
జవాబు:

  1. భారత సమాఖ్యలో ఇతర సంస్థానాలలాగా కాకుండా జమ్మూ & కాశ్మీరు చేరిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
  2. 1947 చివరినాటికి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడుల నేపథ్యంలో భారతదేశంలో విలీనం అయితేనే సైన్యం అందుబాటులోకి వస్తుంది.
  3. ఆ సమయంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది స్వయంప్రతిపత్తితో కొనసాగడం గురించి విస్తృత చర్చలు జరిగాయి.
  4. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370తో అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు పొందడం సమర్థనీయమని అనుకుంటున్నాను.

ప్రశ్న 25.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి భారత్ సహకరించడం సమంజసమేనని భావిస్తున్నారా? వివరణ ఇవ్వండి.
జవాబు:

  1. పాకిస్తాన్ లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ పై అది సవతితల్లి ప్రేమ కనపరచడంపై నిరసనలు చెలరేగాయి.
  2. సార్వత్రిక ఎన్నికలలో గెల్చిన ముజిబుర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్ళడంతోపాటు తూర్పు పాకిస్తాన్ లో సైనిక అణచివేతకాలం మొదలైంది.
  3. తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు, లక్షలాది కాందిశీకులకు భారత్ వసతి, ఆహారం అందించింది.
  4. “ముక్తి బాహిని” ఉద్యమం చేస్తూ తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారత సహాయాన్ని కోరితే నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడే సహాయం చేశాం.
  5. ఆ పరిస్థితులలో భారత్, తూర్పు పాకిస్తాన్ కి సహకరించడం సమంజసమేనని భావిస్తున్నాను.

ప్రశ్న 26.
స్థానిక స్వపరిపాలన వల్ల గ్రామాలు, పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తున్నారా.? అభిప్రాయం తెల్పండి.
జవాబు:

  1. స్థానిక స్వపరిపాలన వలన గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి.
  2. దీనికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం.
  3. స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు అందజేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
  4. 1992లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామాలకు, 74వ సవరణ పట్టణాలు, నగరాలకు స్థానిక స్వపరిపాలన కట్టబెట్టింది.
  5. అవినీతిలేని, ఆశ్రిత బంధుప్రీతి రహిత, ప్రజాహిత స్థానిక ప్రభుత్వాల పనితీరుతో వృద్ధిని చూడగలం.

10th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.

ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతమైంది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్ఛిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు. అలా కాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
జవాబు:
భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇది గమనించిన వాళ్ళు అందరూ భారతదేశం విచ్చిన్నం అవుతుందని భావించారు. కాని వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశం ఈ క్రింది విధానాల ద్వారా ఐక్యతను దేశ సమగ్రతను కాపాడటంలో విజయవంతం అయినది.

  1. భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు వారి మధ్య భేదాలు రాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.
  2. దేశంలో వివిధ మతాలవారు ఉన్నారు. ఎటువంటి మతపరమైన అల్లర్లు జరుగకుండా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ లౌకికవాదాన్ని అనుసరిస్తున్నది.
  3. పాలకులను ఎన్నుకోవడంలో ధనిక, పేదా తేడాలు చూపించకుండా వయోజనులందరికీ ఓటుహక్కును కల్పించింది.
  4. దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పాం.
  5. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరచడం జరిగింది.
  6. పండుగలను అందరూ కలసిమెలసి జరుపుకోవడం దేశ ఐక్యతకు ప్రధాన నిదర్శనం.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
క్రింది పాఠ్యభాగాన్ని చదివి, ప్రశ్నకు జవాబు వ్రాయండి.

దీనితో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దేశంలో శాంతి భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పండింది. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. ఏకారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌరహక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలో ధరల నియంత్రణ, నల్ల బజారు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు. అయితే ఇదే కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.
అత్యవసర పరిస్థితిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. శాంతి భద్రతల అవసరమంటూ ప్రభుత్వం అనేక అణచివేత చర్యలకు పాల్పడింది.
  3. ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి.
  4. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించబడ్డాయి.
  5. పౌర హక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి.

ప్రశ్న 3.
క్రింది పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

విషయం సంబంధిత వ్యక్తి సంవత్సరాలు
1. అలీనోద్యమము నెహ్రూ 1955 – 1961
2. హరిత విప్లవం M.S. స్వామినాథన్ 1964 – 1967
3. అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ 1975 – 1977
4. ప్రణాళికలు నెహ్రూ 1951
5. పంచశీల నెహ్రూ 1954

i) పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?
ii) భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
iii) అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి ఎవరు?
iv) హరిత విప్లవం అనగానేమి?
జవాబు:
i) చైనా, భారతదేశము.
ii) 1951
iii) ఇందిరా గాంధీ.
iv) అధిక దిగుబడి రకాలు, క్రిమి సంహారకాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి ఆహార ధాన్యాల దిగుబడులను బాగా పెంచడం.

ప్రశ్న 4.
అత్యవసర పరిస్థితి కాలంలో భారతదేశం యొక్క పరిస్థితిని వర్ణించండి.
జవాబు:

  1. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. పౌరహక్కులకు భంగం వాటిల్లింది.
  4. ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు సైతం లేకుండా పోయాయి.
  5. మురికివాడలు తొలగించబడ్డాయి.
  6. జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయబడ్డాయి.

ప్రశ్న 5.
క్రింద ఇవ్వబడ్డ పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

అంశము వివరాలు
ఓటు హక్కు స్విట్జర్లాండ్ మహిళలు 1971లో పొందారు.
ఎన్నికల చిహ్నాలు నిరక్షరాస్యుల కొరకు.
కాంగ్రెస్ విజయం 1952, 1957, 1962 ఎన్నికలు
ఆంధ్ర మహాసభ మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారి ఐక్యత కోసం
రాష్ట్ర పునర్విభజన చట్టం 1956
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం
D.M.K. తమిళనాడు

1) తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953

2) తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎదుర్కొన్న ఒక సవాలును పేర్కొనండి.
జవాబు:
నిరక్షరాస్యత

3) ఏ పంచవర్ష ప్రణాళికయందు వ్యవసాయానికి ప్రాధాన్యత యివ్వబడింది?
జవాబు:
మొదటి పంచవర్చ ప్రణాళిక

4) స్వాతంత్ర్యానంతరం మూడు తొలి దశాబ్దాలలో భారత రాజకీయాలపై ఆధిపత్యం వహించిన పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 6.
కింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు

రాజకీయ పార్టీ 1952 1962
1. భారత జాతీయ కాంగ్రెస్ 364 361
2. భారత కమ్యూనిస్ట్ పార్టీ 16 29
3. స్వతంత్రులు 37 20
4. సోషలిస్ట్ పార్టీ 12 06
5. ఇతరులు 38 27

జవాబు:
పట్టికలో 1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాల గురించిన సమాచారం పొందుపరచబడింది.

  1. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1952 ఎన్నికలలో 364 స్థానాలు సాధించగా, 1962 ఎన్నికలలో 361 స్థానాలు గెలుచుకుంది.
  2. భారత కమ్యూనిస్టు పార్టీ 1952 ఎన్నికలలో 16 స్థానాలను గెలుచుకొంది. ఈ పార్టీ 1962 ఎన్నికలలో కొంచెం పుంజుకొని 29 స్థానాలను సాధించింది.
  3. 1952 ఎన్నికలలో 37 స్థానాలను సాధించిన స్వతంత్రులు 1962 ఎన్నికలలో బలం కోల్పోయి 20 స్థానాలకే పరిమితమయ్యారు.
  4. 1952 ఎన్నికలలో 12 స్థానాలను గెలుచుకొన్న సోషలిస్టు పార్టీ 1962 ఎన్నికలలో 6 స్థానాలు మాత్రమే గెలవగలిగింది.
  5. ఇక ఇతరుల విషయానికి వస్తే వీరు 1952 ఎన్నికలలో 38 స్థానాలు పొందారు. 1962 ఎన్నికలలో వీరు సాధించిన స్థానాల సంఖ్య 27కే పరిమితమైంది.

పై పట్టిక రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యాన్ని వెల్లడి చేస్తోంది. 1952, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఇతర పార్టీలు కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి. ఇతర ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కి సమీపంలో లేదు. ఈ విధంగా పై పట్టిక అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది.

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితులలో మెరుగైన ప్రజాస్వామ్యానికి, నీతివంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు తగు సూచనలు చేయండి.
జవాబు:

  1. ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనాలి.
  2. నిజాయితీపరులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యతకు ఇవ్వాలి.
  3. ఎన్నుకోబడిన నాయకులు ప్రభుత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలి.
  4. ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి.
  5. సామాజిక తనిఖీ జరగాలి.
  6. రీకాల్ పద్ధతిని అమలు చేయాలి.
  7. పార్టీ ఫిరాయింపుల చట్టంను సమర్థవంతంగా అమలు చేయాలి.
  8. అక్షరాస్యత రేటు పెంచడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
  9. ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ప్రశ్న 8.
“స్వాతంత్ర్యానంతరం మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారుచేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.” — వ్యాఖ్యానించండి.
జవాబు:
మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారు చేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.

  1. స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం ఈ కాలంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విషయంగా పేర్కొనవచ్చు.
  2. అదే సమయంలో స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే భిన్న ప్రయోజనాలు కలిగిన పార్టీలతో పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థ క్రమేపీ రూపొందటం అన్నది నిజమైన విజయంగా పేర్కొనాలి.
  3. ఇతర దేశాలలో లాగా కాకుండా భారతదేశంలో క్రమం తప్పకుండా, భయంలేని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటమే కుకుండా ప్రభుత్వాలు, నాయకులు కూడా మార్పుకి లోనయ్యారు.
  4. భారత రాజ్యాంగం పౌరహక్కులను ఇవ్వటమే కాకుండా వాటిని కాపాడటానికి వ్యవస్థాగత నిర్మాణం కూడా రూపొందించింది.
  5. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వంటి స్వతంత్ర వ్యవస్థాగత ఏర్పాట్లతో భారతదేశం చక్కని సంస్థాగత చట్రాన్ని ఏర్పరిచింది. పాలనాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం కూడా గొప్ప విజయమనే చెప్పుకోవాలి.
  6. సైనిక దళాలపై పౌర నియంత్రణను ఏర్పరచటం మరొక ముఖ్యమైన విషయం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో పోలిస్తే ప్రజాస్వామిక సంస్థలలో భారతదేశం ఎంతో ముందుంది.
  7. ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతం అయ్యింది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్చిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు, అలాకాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
  8. ఆర్థిక లక్ష్యాల విషయంలో ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పటం, సమతుల ప్రాంతీయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవటం అన్న అంశాలు చెప్పుకోదగినవి.
  9. సమాజంలోని ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరిచారు.
  10. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడిన స్థితి నుంచి కాలక్రమంలో ఆహార స్వయం సమృద్ధిని సాధించిన స్థితికి దేశం చేరుకుంది. ఇది పరిశ్రమలకు చక్కని పునాదిగా నిలచింది.
  11. అయితే ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి జరుగక కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే ఎక్కువ అభివృద్ధి చెందాయి.
  12. అదేవిధంగా, ఉపాధి అవకాశాలు పెరగవలసినంతగా పెరగలేదు.
  13. ప్రాథమిక విద్యకి, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపమని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది.
  14. కుల వ్యవస్థలోని గర్షించదగ్గ అంటరానితనం వంటి వాటిని తొలగించినప్పటికీ వివక్షత ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. లింగ వివక్షత కూడా కొనసాగుతోంది.

ప్రశ్న 9.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 2
1) పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం ఏది?
జవాబు:
పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం పాండిచ్చేరి.

2) మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం ఏది?
జవాబు:
మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం కూర్గ్.

3) పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ట్రావన్ కోర్-కొచ్చిన్.

4) పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం.

5) ఆంధ్రరాష్ట్ర సరిహద్దులను పేర్కొనండి.
జవాబు:
బంగాళాఖాతం, హైదరాబాద్, మైసూరు, తమిళనాడు.

ప్రశ్న 10.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు
AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 4
పై రెండు గ్రామ్లు 1952, 1962లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలు తెలుపుతున్నాయి. వీటిని అధ్యయనం చేసి వ్యాఖ్యానించుము.
జవాబు:
1952 మరియు 1962 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలను పరిశీలించగా భారత రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ (భారత జాతీయ కాంగ్రెస్) ఆధిపత్యం స్పష్టంగా తెలియచేస్తుంది.

ఈ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేకపోయింది. దీనికంతటికి కారణం ఏమనగా భారతదేశంలో ద్విపార్టీ వ్యవస్థ లేకుండా బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉండడమే. 1952లో ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు 489, అందులో కాంగ్రెస్ పార్టీకి 364 స్థానాలు వచ్చాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నింటికి కలిపి 125 స్థానాలు వచ్చాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 73 శాతం సీట్లు రాగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటికి కలిపి 27 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి.

1962 ఎన్నికలలో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 361 స్థానాలను గెలుచుకున్నది. మిగతా ప్రతిపక్ష పార్టీలు మరియు స్వతంత్రులు కలిపి 133 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 70 శాతం స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు 30 శాతం స్థానాలు వచ్చాయి. పై స్లు పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

ప్రశ్న 11.
నెహ్రూ చేపట్టిన చర్యలతో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావచ్చుననే వాదనతో ఏకీభవిస్తారా? కారణాలు తెలియచేయండి.
జవాబు:
ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి : భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన, మూడు రకాల భూ సంస్కరణలను ప్రతిపాదించారు : జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి : విధానాలు. వీటన్నిటి ప్రధాన ఉద్దేశం దున్నేవానికి భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయటానికి ప్రోత్సహించటం. సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి. స్థానిక ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 12.
1967 తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వాలు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు – ఇవి భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొంది ఆర్థికంగా లాభపడ్డాయి – మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. ఈ కులాలు-హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మీ, కొయిరి, మధ్యప్రదేశ్ లో లోథ్, ఈ అన్ని రాష్ట్రాలలో యాదవ్, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో ఒక్కళిగా, తమిళనాడులో వెల్లల. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉండి జనాభా రీత్యా కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇతర ఆధిపత్య (వెనకబడ్డ) కులాలు అధికారంలోకి రావటానికి డి.ఎం.కే పార్టీయే మంచి ఉదాహరణ.