AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 2nd Lesson భూమి – ఆవరణములు

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఖాళీలను పూరించండి. (AS1)
1. జలావరణం …………………………….. సంబంధించినది.
2. శిలావరణం ………………………… సంబంధించినది.
3. వాతావరణం ……………………….. సంబంధించినది.
4. జీవావరణం ……………………….. సంబంధించినది.
జవాబు:

  1. నీటికి
  2. శిలలకు
  3. వాయువులకు
  4. జీవులకు

ప్రశ్న 2.
శిలావరణం నేపథ్యంలో కింద ఇచ్చిన వాటిలో సరిపోనిది ఏమిటి? మీ ఎంపికకు కారణం పేర్కొనండి. (AS1)
‘బైసన్ గార్జ్, గ్రాండ్ కాన్యన్, థార్ ఎడారి
జవాబు:
థార్ ఎడారి శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

కారణాలు :
థార్ ఎడారి అంతా ఇసుకతో ఏర్పడినది.
ఇక్కడ ఏ విధమైన రాతి పొరలు భూ ఉపరితల భాగంలో లేవు.
అందువలన ఇది శిలావరణం నేపథ్యానికి సరిపోదు.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
శిలావరణం ఎలా ఏర్పడింది? (AS1)
జవాబు:

  1. శిలావరణం ఏర్పడిన విధానము : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
  2. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
  3. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో ,లితోస్పియిర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం.
  4. ‘స్పేయిరా’ గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు.
  5. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి ఉండటం మీరు మ్యాపుల్లో చూసే ఉంటారు.
  6. వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
  7. ఈ పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది.

ప్రశ్న 4.
ఖండ ఫలకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి అంతిమంగా ఎలా అంతరించిపోతాయి? (AS1)
జవాబు:

  1. ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా “ఫలకాలు” అనే అతి పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
  2. భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలు ఉన్నాయి.
    పెద్ద ఫలకాలకు ఉదా : ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్. చిన్న ఫలకాలకు ఉదా : నాజ్ కా, అరేబియా వంటివి.
  3. ఈ ఫలకాలు వాస్తవంగా మధ్య పొరమీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి.
  4. అందువల్ల అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  5. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  6. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  7. రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  8. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  9. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 5.
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు :

  1. ఎత్తైన కొండలలో నది పుట్టిన చోటు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది.
  2. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  3. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా పైగా వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా “V” ఆకారపు లోయ అంటారు.
  4. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది.
  5. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
  6. మరొక ముఖ్యమైన రూపాన్ని ‘అగాధదరి అంటారు. దీనిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
  7. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
  8. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందపడే చోట “దుముకు మడుగు” ఏర్పడుతుంది.
  9. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది. దీనిని “ఒండ్రు” అంటారు.
  10. మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ‘ఆక్స్ బౌ సరస్సు’ అంటారు.
  11. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న విధంగా పట్టిక తయారుచేసి సమాచారాన్ని నింపండి. భూమి బయటి మార్పుల నేపథ్యంలో మీకు కనిపించే తేడాలు, పోలికలను వివరించడానికి ఒక పేరా రాయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 1

ప్రశ్న 7.
మీ పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు కనిపించవు? (AS1)
జవాబు:

  1. హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది.
  2. అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.
  3. మంచు పోగుబడి గడ్డగా మారుతుంది.
  4. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది.
  5. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునే సరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది.
  6. హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదం నుంచి గంగానది ఈ విధంగానే ఏర్పడుతుంది.
  7. మా పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు లేవు అనగా ఇక్కడ హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు లేవు.
  8. అందువలన మా ప్రాంతాల్లో హిమానీనదాలు లేవు.

ప్రశ్న 8.
బీలు ఎలా ఏర్పడతాయి? కొన్ని బీచ్ పేర్లు రాయండి.
జవాబు:
సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి.
ఉదా: విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్

ప్రశ్న 9.
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ఏ విధంగా కారణమౌతున్నది?
జవాబు:
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం
కారణాలు :

  1. పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల స్థాపన సంఖ్య పెరిగింది.
  2. పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  3. అలాగే మానవుని రవాణా సాధనాల సంఖ్య, మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
  4. దీంతో ఈ రవాణా సాధనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
  5. అలాగే మానవుని విలాస జీవితానికి ఆలవాలమైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఎయిర్ కండిషన్స్ సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో అవి విడుదలచేసే వాయువుల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది.

ఈ విధంగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల భూ ఉపరితలం ఎడారిగా మారిపోతుంది. కావున ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 10.
ఇవి ఏ శ్రేణి భూస్వరూపాలలో తెలియజేయండి. (AS1)
జవాబు:

భూ స్వరూపం భూస్వరూప శ్రేణి
1. హిమాలయ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
2. పసిఫిక్ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
3. ఆసియా ఖండం మొదటి శ్రేణి భూస్వరూపం
4. బైసన్ గార్జ్ మూడవ శ్రేణి భూస్వరూపం
5. జోగ్ జలపాతం మూడవ శ్రేణి భూస్వరూపం
6. రాఖీ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం
7. హిందూ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపం
8. గొప్ప విధీర్ణధరి మూడవ శ్రేణి భూస్వరూపం

ప్రశ్న 11.
పటం – 2ను చూసి ప్రపంచ పలకలను గీయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 2

ప్రశ్న 12.
ఓ నెం. 20 లోని (ప్రవహిస్తున్న …….. క్రమక్షయం అని అంటారు) క్రమక్షయం పేరాను చదివి వాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించివేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీ నదులు వంటి అనేక రూపాలలో నీళ్ళు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుపాను గాలులు వంటి అనేకరూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అని అంటారు.

9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు InText Questions and Answers

9th Class Social Textbook Page No.14

ప్రశ్న 1.
బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
శిలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
శిలలను కూడా ధ్వంసం చేసి బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాలను వెలికి తీస్తున్నారు.

జలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు వలన జలావరణం కలుషితం అవుతుంది. జలావరణం వలన బెరైటీస్ గనులు దెబ్బతింటున్నాయి.

వాతావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు, బెరైటీస్ వలన వాతావరణం కలుషితం అవుతుంది.

ప్రశ్న 2.
రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటిబయాటిక్ మందులు తీసుకుంటున్నారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. మనుషులు అధిక సంఖ్యలో తీసుకునే యాంటిబయాటిక్ మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తాయి.
  2. ఈ రసాయనాల వలన శిలావరణం, జలావరణం, వాతావరణాల సమతుల్యత దెబ్బతింటుంది.
  3. మనుషులు వీటిని అధికంగా వాడటం వలన కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు నశించిపోతాయి. మరికొన్ని వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి. తద్వారా భూమ్యావరణములు కలుషితమవుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 3.
అనేక శాస్త్రీయ పదాల మూలాలు గ్రీకు భాషలో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు ఉంది? మీ టీచరుతో చర్చించండి.
జవాబు:
శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం గ్రీకు నాగరికత. గ్రీకు భాష కూడా ప్రాచీనమైనది. గ్రీకు తత్త్వవేత్తలు ఆయా ఆంశాలను గురించి వివరించి చెప్పడమే గాక ప్రయోగ పూర్వకంగా ఋజువు చేయడానికి ప్రయత్నించారు. అందువలన ప్రాచీన పదాలు ఎక్కువగా గ్రీకు భాష నుండి ఉద్భవించాయి.

9th Class Social Textbook Page No.15

ప్రశ్న 4.
వాన ఎలా పడుతుంది?
జవాబు:
భూమి ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరై మేఘంగా ఏర్పడి, ఆ మేఘాలు చల్లదనానికి నీటిని నిల్వ ఉంచుకోక వర్షం రూపంలో భూమిపైకి మరల నీటిని వదులుతాయి. ఆ విధంగా వర్షం కురుస్తుంది.

ప్రశ్న 5.
డెల్టాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (A) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 6.
భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి?
జవాబు:
భూకంపాలు సంభవించే విధానం :

  1. భూమికి సంబంధించి ఫలకాలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి.
  2. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
  3. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
  4. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
  5. రెండు ఫలకాలు కలిసేచోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి.
  6. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
  7. ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
  8. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 3
అగ్నిపర్వతాలు సంభవించే విధానం :
భూ గర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్ని పర్వతం అంటారు.

ప్రశ్న 7.
కొండలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
ఒక ఫలకను ఇంకొక ఫలక నెట్టడం వలన కొండలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 8.
నదుల వెంట లోయలు, అగాధాలు వంటివి ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. అందువల్ల నదుల వెంట లోయలు ఏర్పడతాయి.
  2. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. అగాధాలలో పైన ఎక్కువ వెడల్పుగాను, కింద భాగం సన్నగాను ఉంటాయి. అందువల్ల అగాధాలు వంటివి కూడా నదుల వెంట ఉంటాయి.

ప్రశ్న 9.
గాలులు ఎలా వీస్తాయి?
జవాబు:
గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

9th Class Social Textbook Page No.17

ప్రశ్న 10.
హిమాలయ, ఆండిస్, రాకీ పర్వత శ్రేణులను పటం మీద గుర్తించండి. అవి అక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? కారణాలు సూచించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 4
1. హిమాలయాలు ఏర్పడటానికి కారణం :
యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 5
2. అండీస్ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
దక్షిణ అమెరికా ఫలకాన్ని ఇండో- ఆస్ట్రేలియా ఫలకం నెట్టటం వల్లనే ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 6
3. రాకీ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
ఉత్తర అమెరికా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టటం వల్లనే రాకీ పర్వతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 11.
భూమి మీద శిలలు అన్నీ మహాసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయా?
జవాబు:
భూమి మీద గుట్టలన్నీ మహసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.

  1. సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహా సముద్రాలలోని, మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని కనుగొన్నారు.
  2. మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి.
  3. మిట్టప్రాంతంలో నేలపైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్ళతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది.
  4. ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది.

ప్రశ్న 12.
భూగర్భవేత్తలు హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను కనుగొన్నారు. వీటిల్లో చాలా వాటిని ‘సాలగ్రామాలు’ (శివలింగాకారంలో) గా ఇళ్లల్లో పూజిస్తారు. ఈ శిలాజాలు హిమాలయాల్లో ఎందుకు ఉన్నాయి?
జవాబు:

  1. ఖండఫలకాలు జరిగేటప్పుడు ఖండాల అంచులలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చి పర్వతాలు ఏర్పడతాయి.
  2. హిమాలయాలు ప్రపంచంలో నూతన ముడుత పర్వతాలు.
  3. యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
  4. కనుక సముద్ర జీవుల శిలాజాలు నూతనంగా ఏర్పడిన హిమాలయాల్లోనే ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 13.
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు మన అనుభవంలోకి ఎందుకు రావటం లేదు? అవి మనల్ని ప్రభావితం చేయకపోవడంవల్లనా? ఈ మార్పులు అసలు మనల్ని ఏరకంగానైనా ప్రభావితం చేస్తాయా?
జవాబు:
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు కొన్ని వందల, వేల సంవత్సరాలకు జరుగుతుంటాయి. అప్పటికి మానవుల జీవిత కాలం చాలదు. అందువల్ల అవి మన అనుభవంలోకి రావడం లేదు. అవి మనల్ని ప్రభావితం చేయటం లేదు. ఈ మార్పులు మనల్ని మన తరువాత తరాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జీవన విధానాన్ని మార్చివేస్తాయి.

9th Class Social Textbook Page No.19

ప్రశ్న 14.
అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలను ఊహించి రాయండి.
జవాబు:
అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలు :

  1. అగ్ని పర్వతాలు పేలడం వల్ల సమీప ప్రాంతాలలో కూడా ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
  2. పంటలు నాశనమౌతాయి, జలాలు కలుషితమౌతాయి.
  3. బూడిద, అనేక రకాల వాయువులు, ధూళితో వాతావరణం కలుషితమవుతుంది.

9th Class Social Textbook Page No.20

ప్రశ్న 15.
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది?
జవాబు:
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే కఠినంగా ఉండటానికి గల కారణాలు :

  1. రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడినప్పుడు సంకోచిస్తాయి.
  2. ఇది ప్రతి పగలూ, రాత్రి, వేసవి, శీతా కాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది.
  3. పైన ఉన్న రాళ్ళు సంకోచించి, వ్యాకోచించి తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి.
  4. నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
  5. అందువలన అంతర్భాగం గట్టిగా ఉంటుంది.

9th Class Social Textbook Page No.21

ప్రశ్న 16.
ఆనకట్టలు కట్టటానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకో చెప్పండి.
జవాబు:

  1. రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు.
  2. గార్జెస్ వద్ద ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కారణం
  3. నదులు సన్నగా ఉంటాయి.
  4. రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురికాకుండా ఆనకట్టలు ఉంటాయి.
  5. అందువల్ల ఇవి ఆనకట్టలు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి.

9th Class Social Textbook Page No.22

ప్రశ్న 17.
జలపాతాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:

  1. వినోద పర్యటనానికి ఉపయోగపడతాయి.
  2. జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి అనువుగా ఉంటాయి.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 18.
మన రాష్ట్రంలోని జలపాతాల వివరాలు సేకరించండి.
జవాబు:

  1. విశాఖపట్టణం జిల్లాలోని రణజిల్లెడ జలపాతం.
  2. గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఎత్తిపోతల జలపాతం.

ప్రశ్న 19.
కొన్ని జలపాతాల చిత్రాలు సేకరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 7
AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు 8

9th Class Social Textbook Page No.23

ప్రశ్న 20.
పర్వత, మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహంలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
పర్వత ప్రాంతాలు :

  1. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
  2. ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
  3. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. వీటిని గార్డెన్ అంటారు.
  4. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

మైదాన ప్రాంతాలు :

  1. మైదాన ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది.
  2. అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండదు.
  3. నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది.
  4. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది.
  5. మైదాన ప్రాంతాలలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది.
  6. మైదాన ప్రాంతాలలో నదులు డెల్టాలను ఏర్పరచుతాయి.

రెండింటి మధ్య సంబంధం :

  1. కొండలలో పడిన వర్షపు నీరు నదులలో ప్రవహించి మైదాన ప్రాంతాలలో డెల్టాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
  2. కొండల ప్రాంతంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వలన సారవంతమైన పై పొర కొట్టుకు వచ్చి మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అక్కడ మేట వేయగలదు.
  3. దాని వలన సారవంతమైన మైదానాలు ఏర్పడి తద్వారా పంటలు బాగా పండటానికి అవకాశం ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 21.
పర్వత ప్రాంతాలతో పోలిస్తే వరద మైదానాలు మానవ ఆవాసానికి ఎందుకు అనువుగా ఉంటాయి?
జవాబు:

  1. కొండ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. ఇవి మానవ నివాసానికి అనువైన ప్రాంతాలు కావు.
  2. ఇవి ఎగుడు దిగుడు స్థలాకృతులను కలిగి ఉంటాయి.
  3. అందువలన వ్యవసాయం చేయడానికి, పంటలు.పండించడానికి అనువైనవి కావు.
  4. శిలా నిర్మితమై ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటటానికి అనుకూలంగా ఉండవు.
  5. అదే వరద మైదానాలు అయితే బల్లపరుపుగా ఉంటాయి.
  6. విశాలంగా ఉంటాయి. నీటిని నిలువ చేసుకోడానికి అనుకూలంగా ఉంటాయి.
  7. సారవంతమైన నేలలు ఉంటాయి.
  8. పంటలు సమృద్ధిగా పండుతాయి.
  9. ఇళ్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి. నివాస యోగ్యాలుగా ఉంటాయి. కనుక ప్రజలు కొండ ప్రాంతాల్లో కన్నా మైదాన ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు.

ప్రశ్న 22.
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు ఏమిటి?
జవాబు:
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు :

  1. తరచుగా వరదలు వస్తాయి.
  2. పంటలు పాడైపోతాయి.
  3. ఒక్కొక్కసారి చెట్లు, ఇళ్లు కూలిపోతాయి.
  4. జంతువులు, వస్తువులు కొట్టుకుపోతాయి.
  5. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.
  6. కనుక వరద మైదానాలలో ఉండటం వలన పై ప్రమాదాలు ఎదురవుతాయి.

ప్రశ్న 23.
కొండ లేదా వరద మైదానాల్లో నివసిస్తున్న ప్రజల గురించి మీరు చదివిన దానిని గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:

  1. కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆదిమ వాసులు నివసిస్తారు.
  2. వారికి అంతగా నాగరికత తెలియదు.
  3. ఇప్పుడిప్పుడే పోడు వ్యవసాయం చేస్తున్నారు.
  4. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు.
  5. రవాణా సౌకర్యాలను కల్పించడం కష్టంతో కూడుకున్న పని.
  6. మైదాన ప్రాంతాలలో నాగరీకులు నివసిస్తారు.
  7. అధునాతన, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు.
  8. అధిక దిగుబడులను సాధిస్తారు.
  9. అధునాతన రవాణా సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
  10. పరిశ్రమలను స్థాపించవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు.

9th Class Social Textbook Page No.25

ప్రశ్న 24.
లోయస్ మైదానాలను డెల్టాతో పోల్చండి. వాటి మధ్య పోలికలు తేడాలు ఏమిటి?
జవాబు:
లోయస్ మైదానాలు:

  1. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి, కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను ”లోయస్” అంటారు.
  2. ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది.
  3. రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండి అదే సమయంలో దానికి నీళ్లు బాగా ఇంకిపోయే గుణముంటుంది.
  4. లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.

డెల్టాలు :
1. సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.

ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.

పోలికలు :

  1. రెండూ ఇసుక రేణువులతో ఏర్పడినవే.
  2. రెండింటిలోనూ నీరు త్వరగా ఇంకిపోతుంది.
  3. రెండింటిలోనూ ఒండ్రు ఉంటుంది.

తేడాలు :

లోయస్ మైదానాలు డెల్టా
1. లోయస్ దుమ్ముతో ఏర్పడినది. 1. డెల్టా నదులు తీసుకొచ్చిన ఒండ్రుతో ఏర్పడినది.
2. లోయలో సున్నం ఉంటుంది. 2. డెల్టాలలో గవ్వల రూపంలో సున్నం ఉంటుంది.
3. లోయలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. 3. డెల్టాలలో నీరు ఎక్కువగా ఇంకిపోదు. నదులు ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక క్రమంలో అమర్చండి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడతాయి అనగా :

  1. భూమి లోపలికి పోయేకొలది ప్రతి 32 మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  2. అందువల్ల భూమిలోపల కొన్ని ప్రదేశాలలో శిలలు కరిగిపోయి శిలాద్రవంగా (మాగ్మా) గా మారతాయి.
  3. ఈ మాగ్మా పైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అయి యుగ్మాను ఒత్తిడి చేసినందున మాగ్మా బలహీనంగా ఉన్న భూ పొరలను చీల్చుకుంటూ ఒక రంధ్రం చేస్తూ బయటపడి శంఖువు ఆకారంలో ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.

మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అనగా

  1. అగ్ని పర్వతాలు ఉద్భేదనము చెందిన ప్రాంతాలలోనూ సమీప పరిసర ప్రాంతాలలో కూడ ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని మనందరకూ తెలుసు.
  2. అయితే ఆ తరువాత ఎంతోకాలంపాటు ఈ అగ్నిపర్వతాలు ఉద్భేదనము ఫలితంగా మానవ జాతి అనేక విధాలుగా లాభం పొందుతుంది.
  3. ఈ ఉద్భేదనము ఫలితముగా భూమి లోతుల నుండే విలువైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకుని రాబడతాయి.
  4. ఈ ప్రదేశాలలో సారవంతమైన నేలలు ఏర్పడతాయి.
    ఉదా : భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు నూనెగింజలు, ప్రత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి – మనం

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 1st Lesson భూమి – మనం

9th Class Social Studies 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూసి కింది ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించండి. (AS5)
1. కన్యాకుమారి : ……………………., ………………………….
2. ఇంఫాల్ ……………………….., ……………………………
3. జైసల్మేర్ ……………………………, …………………………
4. పూనా ……………………………., …………………………
5. పాట్నా ……………………………, ………………………….
జవాబు:
1. 8°35′ ఉత్తర అక్షాంశం, 77°36′ తూర్పు రేఖాంశం.
2. 24°44′ ఉత్తర అక్షాంశం, 93°58′ తూర్పు రేఖాంశం.
3. 26° 55′ ఉత్తర అక్షాంశం, 70° 54′ తూర్పు రేఖాంశం.
4. 18°32′ ఉత్తర అక్షాంశం, 73°52′ తూర్పు రేఖాంశం.
5. 27°34′ ఉత్తర అక్షాంశం, 81°46′ తూర్పు రేఖాంశం.

ప్రశ్న 2.
అక్షాంశ, రేఖాంశాలతో సరిపోయే పదాలను గుర్తించండి. (AS1)
జవాబు:

అక్షాంశాలు రేఖాంశాలు
సమాంతర రేఖలు నిలువురేఖలు
వృత్తాలు అర్ధవృత్తాలు
ఉహాజనిత రేఖలు ఉహాజనిత రేఖలు
అడ్డంగా గీయబడినవి కాలాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 3.
క్రింద ఉన్న ప్రపంచ కాల మండలాల పటం చూడండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 1
(అ) మీరు విజయవాడ నుండి పారిస్ కి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
పశ్చిమానికి ప్రయాణించడం జరుగుతుంది.

(ఆ) హైదరాబాదు నుంచి టోక్యోకి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
తూర్పునకు ప్రయాణించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎందుకు కష్టమైనది? (AS1)
జవాబు:
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం కష్టం ఎందువల్లనంటే …

  1. భూమి పుట్టుక మీద భిన్నాభిప్రాయాలుండటం.
  2. ప్రారంభంలో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవి అన్నీ దానిచుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  3. 500 సం||రాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు.
  4. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  5. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని తెలుసుకున్నారు.
  6. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సం||రాల తరువాత అంతరించిపోతుందని అభిప్రాయపడ్డారు.
  7. భూమి పుట్టుక అధ్యయనం చేయడానికి సరైన శాస్త్ర విజ్ఞానం కూడా అంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు.
  8. శాస్త్రీయ పరికరాలు ఇంకా కనిపెట్టవలసిన అవసరం ఉంది.
  9. ఇంకా ఎన్నో అంశాలు ఋజువు కావలసి ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండల పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది.
ప్ర. భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని మీరు ఎలా చెప్పగలరు.? అయితే కారణాలు ఏమిటి?
జవాబు:
భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది.

కారణాలు :

  1. కేంద్రభాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది.
  2. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
  3. ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.
  4. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతునే ఉంది. అందువల్ల భూమి ఇంకా క్రియాశీలకంగా ఉంది.

ప్రశ్న 6.
గ్రిడ్ అనగా నేమి? అది మనకు ఎలా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్
అంటారు. గ్రిడ్ మనకు ఏ విధంగా సహాయపడుతుందనగా: – 1. ఈ గళ్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. 2. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ఉదా : అక్కడ ఎంత వేడిగా ఉన్నది, ఎంత చల్లగా ఉన్నది, అక్కడికి చేరుకోవటానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.
ఏ క్షణంలో అక్కడ సమయం ఎంత ఉంటుంది వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 7.
కింది వాని మధ్యగల తేడాలు వివరించండి. (AS1)
జవాబు:
ఆ) స్థానిక కాలం – ప్రామాణిక కాలం
ఆ) భూమధ్యరేఖ – ప్రామాణిక కాలం

అ) స్థానిక కాలం :

  1. భూభ్రమణం వల్ల భూమి మీద ఉన్న ఏ స్థలమైనా 24 గంటలలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  2. అంటే ప్రతి రేఖాంశం ఒక దినంలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
  3. అప్పుడు ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలకు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుంది.
  4. ఈ సమయాన్ని ఆ ప్రాంతం యొక్క స్థానిక కాలం అంటారు.

ప్రామాణిక కాలం :

  1. ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాన్ని నిర్ణయించారు.
  2. దీని వల్ల కాలాన్ని గుర్తించడం సులభమౌతుంది.
  3. సాధారణంగా ప్రామాణిక కాలాన్ని నిర్ధారించడానికి ఆ దేశం మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తిస్తారు.
  4. ఆ రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని ఆ దేశమంతటికి ప్రామాణిక కాలంగా వర్తింపజేస్తారు.

ఆ) భూమధ్యరేఖ :

  1. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ. అంటారు.
  2. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది.
  3. ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది. కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు.
  4. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రామాణిక రేఖాంశం :

  1. ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ (Greenwich – ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
  2. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించటం మొదలుపెట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 8.
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయం పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? (AS1)
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయాన్ని పాటిస్తే –

  1. సమయం విషయంలో గందరగోళం నెలకొంటుంది.
  2. సమయాన్ని నిర్ణయించటం మరింత క్లిష్టమవుతుంది.
  3. ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

ప్రశ్న 9.
మీ ఉపాధ్యాయుల సహాయంతో నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
నేపాల్ ప్రామాణిక రేఖాంశం – 82° 30′ తూర్పు రేఖాంశం (+ 5.45 యుటిసి)
పాకిస్థాన్ ప్రామాణిక రేఖాంశం – 74°22 తూర్పు రేఖాంశం (యుటిసి + 6 గం)
బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం – 90° 24 తూర్పురేఖాంశం (యుటిసి + 4 గం)
ఇంగ్లాండ్ ప్రామాణిక రేఖాంశం – 0°07 పశ్చిమరేఖాంశం (యుటిసి + 1 గం).
మలేషియా ప్రామాణిక రేఖాంశం – 105° తూర్పురేఖాంశం (యుటిసి + 8 గం)
జపాన్ ప్రామాణిక రేఖాంశం – 135° తూర్పురేఖాంశం (యుటిసి + 9 గం)

ప్రశ్న 10.
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 2
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే పోస్టర్

9th Class Social Studies 1st Lesson భూమి – మనం InText Questions and Answers

9th Class Social Textbook Page No.2

ప్రశ్న 1.
సుదూరంగా ఉన్న నక్షత్రాలు, పాలపుంతల రహస్యాల గురించీ, విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఎందుకు ఉంది?
జవాబు:

  1. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు.
  2. ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇతర నక్షత్రాలలో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి? వీటికీ మనకూ సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
  3. ఆకాశంలో గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోటానికి ప్రయత్నించారు. అందువల్ల విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 2.
విశ్వం మధ్యలో భూమి ఉందనీ, సృష్టిలో ముఖ్యమైనది మానవులనీ మొదట భావించేవాళ్లు. ఈ అనంత విశ్వంలో మనం అతి చిన్న నలుసు మాత్రమేనని తెలుసుకోవటం వల్ల అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:

  1. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందనీ, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
  2. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులూ లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.
  3. కానీ తరువాత భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
  4. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని కూడా గత వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది మనపై చూపే ప్రభావం ఏదీ శాశ్వతం కాదని, అనంత విశ్వంలో మనం చాలా చిన్న నలుసులం మాత్రమేనని అర్థమవుతుంది. కావున మనకు తెలిసినది తక్కువ అని, తెలియాల్సిందే ఎక్కువ అని కూడా అర్థమౌతుంది.

9th Class Social Textbook Page No.3

ప్రశ్న 3.
భూమి మీద కాలాలు ఏర్పడటానికి గల కారణాలను కింది వానిలో గుర్తించండి.
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం
3. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం
4. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
5. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
6. భూమి గోళాకారంలో ఉండటం
7. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుండి భూమి ఉండే దూరం
జవాబు:
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
3. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
4. భూమి గోళాకారంలో ఉండటం

9th Class Social Textbook Page No.4

ప్రశ్న 4.
భూమి అకస్మాత్తుగా ఏర్పడిందని అనుకుంటున్నారా లేక అది ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఏర్పడిందని అనుకుంటున్నారా?
జవాబు:
భూమి ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగానే ఏర్పడింది.

  1. ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలయ్యింది.
  2. భూమి అనేక దశలలో మార్పు చెంది, ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
  3. పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలై, ద్రవ దశ గుండా పరిణమించింది.
  4. ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది.
  5. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి.
  6. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది.
  7. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది.
  8. బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రభాగంగా మారితే, తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాల క్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన, చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 5.
అనేక యాదృచ్చిక ఘటనల ఫలితంగా భూమి మీద మానవులు రూపొందారని కొంతమంది నమ్ముతారు. లేకుంటే భూమి మీద ప్రాణం ఏర్పడి ఉండేదే కాదు. వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:
మా కారణాలు కూడా శాస్త్రవేత్తలు తెల్పినవే.

  1. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణీ లేకుండా నిర్జీవంగా గడిచింది.
  2. ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది.
  3. లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి.

9th Class Social Textbook Page No.5

ప్రశ్న 6.
భూప్రావారంను అధ్యయనం చేయటానికి మనం దాని వరకు ప్రయాణించలేం. అయితే భూప్రావారంలోని పదార్థాల ద్వారా దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చో చెప్పండి.
జవాబు:
భూప్రావారం:

  1. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
  2. భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది.
  3. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
  4. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వలన మరియు యంత్రాలను భూ అంతర్భాగంలోనికి పంపడం ద్వారా వీటిని పొందవచ్చు.

9th Class Social Textbook Page No.7

ప్రశ్న 7.
ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ‘జిగ్ సా పజిల్’ లోని రెండు ముక్కలుగా ఏవైనా రెండు ఖండాలు కనిపిస్తున్నాయా? ఆ ఖండాలు ఏవి?
జవాబు:
జిగ్ సా పజిల్ లోని రెండు ముక్కలుగా కనిపించే రెండు ఖండాలు:

  1. లారెన్షియా
  2. గోండ్వానా భూమి.

ప్రశ్న 8.
ఆస్ట్రేలియా ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
దక్షిణం వైపునకు కదిలింది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 9.
భారతదేశం ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
తూర్పు వైపునకు కదిలింది.

9th Class Social Textbook Page No.8

ప్రశ్న 10.
కింద ఇచ్చిన పటం ఆధారంగా దిగువ పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం 3

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం
పశ్చిమార్ధగోళం
దక్షిణార్ధగోళం
తూర్పు అర్ధగోళం

జవాబు:

అర్ధ గోళం ఖండాలు
ఉత్తరార్ధగోళం ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగం.
పశ్చిమార్ధగోళం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా.
దక్షిణార్ధగోళం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సగభాగం, అంటార్కిటికా.
తూర్పు అర్ధగోళం ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.

9th Class Social Textbook Page No.12

ప్రశ్న 11.
అట్లాస్ చూసి ఈ దేశాలలో ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Time Zones) ఉన్నాయో తెలుసుకోండి.
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ.
జవాబు:

  1. అమెరికా : ఐదు ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి -9, -3, -2, -6, -5 మండలాలు.
  2. ఆస్ట్రేలియా : మూడు ప్రామాణిక కాల మండలాలు ఉన్నవి. అవి +8, +9, +10 మండలాలు.
  3. రష్యా : పది ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి +3, +4, +5, +6, +7, +8, +9, +10, +11, +12 మండలాలు.
  4. జపాన్ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +9 మండలం.
  5. జింబాబ్వే : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +2 మండలం.
  6. చిలీ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది -5 మండలం.

ప్రశ్న 12.
హైదరాబాదులోని ఒక కాల్ సెంటరులో స్వాతి పనిచేస్తోంది. ఆమె క్లయింటులు అమెరికాలో ఉన్నారు. కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింటుల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడూ రాత్రివేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని ? భూగోళశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి.
జవాబు:

  1. భారతదేశము తూర్పు అర్ధగోళంలోనూ, అమెరికా పశ్చిమార్ధగోళంలోనూ ఉంది.
  2. రెండు దేశాల మధ్య దాదాపు 12 గంటల కాల వ్యత్యాసం ఉంది.
  3. అమెరికా వాళ్ల మధ్యాహ్న 12 గంటల సమయం, మనకు అర్ధరాత్రి 12 గంటల సమయమవుతుంది.
  4. అందువలన స్వాతి ఎప్పుడూ వాళ్లకు పగటివేళలయిన, మన రాత్రివేళల్లోనే, పనిచేయవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 1 భూమి - మనం

ప్రశ్న 13.
మెదడుకు మేత :
గ్రీన్ విచ్ (0) వద్ద మధ్యాహ్నం 12 : 00 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి :
(అ) ముంబయి (73° తూ.రే) ; (ఆ) షికాగో (87° 30 ప.రే) ; (ఇ) సిడ్నీ ‘(151° తూ.రే.).
జవాబు:
ఒక్కొక్క రేఖాంశానికి సమయ వ్యత్యాసం 4 ని||లు.
(అ) ముంబయి (73° తూ.రే) :

  1. 73 × 4 = 292 నిమిషాలు = 4 గం||ల 52 ని॥లు
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది. కనుక 4 గం|| 52 ని||లు కలుపవలసి ఉంటుంది.
  3. 12-00 + 4-52 = 16-52 అనగా స్థానిక సమయం సాయంత్రం 4 గం|| 52 ని||లు.

(ఆ) షికాగో (87° 30 ప.రే) :

  1. 87.30 × 4 = 87½ × 4 = 350 నిమిషాలు = 5 గం|| 50 ని||
  2. పశ్చిమ రేఖాంశము గ్రీన్ కు క్రింద ఉంటుంది. కనుక 5 గం|| 50 ని||లు తీసివేయవలసి ఉంటుంది.
  3. 12.00 – 5.50 = 6 గం|| 10 ని||
    అందువలన స్థానిక సమయం ఉదయం 6గం|| 10ని||

(ఇ) సిడ్నీ (151° తూ.రే.) :

  1. 151 × 4 = 604 ని||లు = 10 గం|| 4 ని||
  2. తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది.
  3. 12.00 + 10 – 04 = 22-04
    అనగా స్థానిక సమయం రాత్రి 10 గం|| 4 ని||

AP Board 9th Class Telugu Grammar

AP Board 9th Class Telugu Grammar

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు,

లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరములోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ = అ = (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

* అత్వ సంధి (అకార సంధి) సూత్రం :అత్తునకు సంధి బహుళము.

2. ఇత్వ సంధి
సూత్రం :ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) : (ఇకారసంధి రాని యడాగమరూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) – (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరుగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వ సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.
అభ్యాసము :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) = ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వ సంధి

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఉత్వ సంధి
ఉకారసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యం.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) = (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
నిత్యం : నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం

4. యడాగమం సంధి
సూత్రం : సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ)మా + య్ + అమ్మ = మా ‘య’ మ్మ
ఆ)మా + య్ + ఇల్లు = మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా రెండవమారు పలికిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము.
ఉదా :
1) ‘ఆహా + ఆహా ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె – అరె + అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణములలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో : ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు : ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె అరె . . అరెరె : (ఎ + అ = అ)
పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, సంధి తరుచుగా అవుతుంది.

గమనిక :
అమ్రేడిత సంధి, కింది ఉదాహరణములలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే, సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు, ఎట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రం :ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు : పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.

2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘మీ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొను
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల, మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాము.

సూత్రం :
ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

7. ద్రుతప్రకృతిక సంధి
సరళాదేశ సంధి : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చూచెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను, “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.
కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుత ప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ఓ’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా,
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చట తప’ లకు, ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు. ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు గదా = గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + 3)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ – గా మారుతుంది
2) త – ద – గా మారుతుంది
3) చ – స గా మారుతుంది
4) ప – వ గా మారుతుంది
5) ట – డ గా మారుతుంది.

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంబుగానగు

ద్వంద్వ సమాసంలో : గ స డ ద వా దేశ సంధి.

కింది పదాలను గమనించండి
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చ ట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి.
దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం :
ద్వంద్వ సమాసంలో మొదటి పదంమీద ఉన్న క చ ట త ప లకు, గ స డ ద వలు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క చెల్లి = అక్కాసెల్లెండ్లు
2) అన్న + తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమగునపుడు టుగాగమంబగు.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.
అలాగే కింది పదాలు కూడా గమనించండి.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం, సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

టుగాగమ సంధి సూత్రం :
కర్మధారయములందు, ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు.

2) టుగాగమ సంధి (వికల్పం) :
కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

10. లులన సంధి
సూత్రం : లులనలు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వృక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.
పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో లు, ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

లులన సంధి సూత్రం :
లు, ల, న లు పరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు మువర్ణానికి లోపము, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.

11. పడ్వాది సంధి
సూత్రం : పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణ బిందువూ (0) విభాషగా అవుతాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

పడ్వాది సంధి సూత్రం :
పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

గమనిక :
పడ్వాదులు = పడు , పట్టె, పాటు అనేవి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

12. త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఈ కింది ఉదాహరణ చూడండి
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుడు = అనే దానిలో ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏలు అనే త్రికములు కూడా, ఇ, ఎలుగా మారుతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు : ఎవ్వాడు

త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు.

సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది.
ఉదా :
1) ఇక్కాలము
2) ఎవ్వాడు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
ఉదా :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ” అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం” అంటే ‘5’ వస్తుంది.

ఆగమం :
రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

రుగాగమ సంధి సూత్రం (1) :
పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దంపరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) నామము
విశేషణం = నామం మనుమ + ఆలు = మనుమరాలు బాలింత + ఆలు = బాలింతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమం వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు, దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ఆ – లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ లు’ – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘ఋ, ౠ లు’ – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
5) వధూపేతుడు = వధూ + ఉపేతుడు : (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
7) మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు : నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (ఆ + ఉ + ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణ సంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణ సంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి విడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగా ఉన్నాయి.
గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం. = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (అత్ + ఇ + అ + య) = యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం = (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ . : (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋు + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = 6). = యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని, యణాదేశ సంధి, అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ఏ’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అష్టైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యాషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ” లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ఐకారమూ, ఓ, ఔ లు పరమైతే ఔ కారమూ వస్తాయి.
వృద్ధులు = ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. జశ్వ సంధి
సూత్రం : “పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శ ష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు
పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు) లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జశ్వ సంధి
4) వాగీశుడు = వాక్ + ఈశుడు = జశ్వ సంధి
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జ్వ సంధి
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని “ఉత్తరపదం” అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదము. ‘బాణము’ అనేది ఉత్తరపదము.

ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని, నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదముల అర్థానికి ప్రాధాన్యం కల సమాసము ద్వంద్వ సమాసము.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు.

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.

సమాస పదాలు విగ్రహవాక్యాలు
1) ఎండవానలు ఎండా, వానా
2) తల్లిదండ్రులు తల్లి, తండ్రి
3) గంగా యమునలు గంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.

విగ్రహవాక్యం సమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూ కుజన జనులు
2) మంచి, చెడూ మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ కష్టసుఖములు

2. ద్విగు సమాసం: సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు — దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడురోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.

సమాసం విగ్రహవాక్యం
1) రాజభటుడు రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు తిండి కొఱకు గింజలు
3) పాపభీతి పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే, ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు, రాజుకు చెందినవాడు అని చెప్పడానికి ష విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్థి తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన, (వల్ల) కంటె, పట్టి దొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి
8) నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం : కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషము
ఆ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషము
ఇ) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషము
ఈ) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషము
ఋ) అన్యాయం న్యాయం కానిది నఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగము)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగము)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము.

కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నః’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకము. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఞ్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు. అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధ రాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషము
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషము
ఇ) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషము
ఈ) అవినయం వినయం కానిది నఞ్ తత్పురుషము

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, “విశేషణం”. రెండో పదం ‘కలువ’ అనేది, “నామవాచకం”; ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని ‘విశ్లేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం) – రెండవ పదం

4. ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘మామిడి గున్న’ అనే సమాసంలో, మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ నామవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచి వాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు – ఉత్తముడైన పురుషుడు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

4.ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షములు, ప్రాంతాలు, మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
మఱ్ఱి చెట్టు – మట్టి అనే పేరుగల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరుగల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతము’ అనే పేరుగల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4.ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం
(పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

4.ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్జము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) గా ఉండడం వల్ల దీన్ని “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.

అభ్యాసము :
కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములు పేర్కొనండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
1) తేనెమాట తేనె వంటి మాట
తేనె – ఉపమానం; మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలత లత వంటి తనువు
తనువు – ఉపమేయం; లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలు చిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం; కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములు కమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.
ఉదా :
1) హృదయ సారసం – హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం – సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి – జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం – అజ్ఞానము అనెడి తిమిరం

6. బహుప్రీహి సమాసం : అన్య పదార్థ ప్రాధాన్యం కలది.

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రము పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థము. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫూరింప జేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లిహి సమాసం’.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) నీలవేణి – నల్లని వేణి కలది – బహుప్రీహి సమాసం
2) నీలాంబరి – నల్లని అంబరము కలది – బహుప్రీహి సమాసం
3) ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – బహుప్రీహి సమాసం
4) గరుడవాహనుడు – గరుత్మంతుడు వాహనంగా గలవాడు – బహుప్రీహి సమాసం
5) దయాంతరంగుడు – దయతో కూడిన అంతరంగము కలవాడు – బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు – నాలుగు ముఖములు గలవాడు – బహుబ్రీహి సమాసం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.
1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదములు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికివచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త్య. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్బవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు ? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, ‘క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.

ఉదాహరణలు :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్త్వార్థం (అసమాపక క్రియ).

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.
“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”
పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం . ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్థం’ అనే అసమాపక క్రియలు.

తధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ, ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా ఈ) క్వార్ధకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్ధకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే అ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా ఇ) ప్రశ్నార్థకం

వాక్య భేదములు

వాక్యాలు మూడు రకములు.
1) సామాన్య వాక్యం 2) సంక్లిష్ట వాక్యం 3) సంయుక్త వాక్యం
1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2) సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు
ఆ) గోపి పరీక్ష రాశాడు
ఇ) గీత బడికి వెళ్ళింది

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ లోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

3). రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

సంయుక్త వాక్యం :
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.

ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.
సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది
వనజ చురుకైనది, అందమైనది (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

2) మోహన కూచిపూడి నృత్యం. నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి, గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి, ‘కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది, కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

2) సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు, కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.
1) బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2) లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాబట్టి లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు. (సంయుక్త వాక్యం)

(అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని, సంక్లిష్ట వాక్యం అంటారని మీరు తెలుసుకున్నారు.

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. (సామాన్య వాక్యం)
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు. (సంక్లిష్ట వాక్యం)

2) నన్ను మీరు క్షమించవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగఁజేసి కొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి మటియెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి, దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది. (ఇ)
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
జవాబు:
1) తీసి
2) వేసి
3) ఎక్కి

2. ప్రశ్నార్థక వాక్యం : ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా :
దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
1) మీరెప్పుడైనా గమనించారా? (గమనించారు + ఆ)
2) మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
3) వీటిని మీరు చూపిస్తారా? (చూపిస్తారు + ఆ)
4) నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
5) శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
6) ఇంట్లకెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
7) అట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒకనెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి అక్కర్లేదు. (వ్యతిరేక వాక్యం )

2) నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను. (వ్యతిరేకార్థక వాక్యం)

II. కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. (వ్యతిరేకార్థక వాక్యం)

2) రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

3) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

4) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది. (వ్యతిరేకార్థక వాక్యం)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ, కర్తను సూచిస్తుంది. కర్మకు, ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం ‘ అంటారు.

2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో 1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది 3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి, లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

కర్తరి, కర్మణి వాక్యాలు

కర్తరి వాక్యం :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.

కర్మణి వాక్యం :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.

కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.
1) కర్తరి వాక్యమును ఇంగ్లీషులో (Active voice) అంటారు.
2) కర్మణి వాక్యమును. ఇంగ్లీషులో (Passive voice) అంటారు.

అభ్యాసం :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం )

2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )

ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

అభ్యాసం :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.
1) ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యం, పై సభను జరిపింది. (కర్తరి వాక్యం)

2) తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు. (కర్తరి వాక్యం)

3) విద్యా సంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
విద్యా సంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ప్రత్యక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”
2. “నేనిట్లు ఉపన్యసించితిని.”
3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
4. “నన్ను మీరు క్షమింపవలయును.”
పై వాక్యాలన్నీ జంఘాల శాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !

నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.

అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా)
“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు. పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?

మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టర్ కామాలు) ఉంచి చెప్పారు కదా ! ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.
ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)

అభ్యాసం – 2 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “మా అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు. (పరోక్ష కథనం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పరోక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.
2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాను.

పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం. కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.
1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2. తానొక్కడే అదృష్టవంతుడా అని జంఘాల శాస్త్రి అన్నాడు.

మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాసారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది. ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.

మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు. ఉత్తమ పురుషపదాలు అనగా నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాములాగా మారుతాయి.
1. పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
2. మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.

అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.
కింది గేయాన్ని గమనించండి. “అది గదిగో మేడ
మేడకున్నది గోడ
గోడ పక్కని నీడ
నీడలో కోడె దూడ
దూడ వేసింది పేడ

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం వినసొంపు, ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘కీ’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యాను ప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ, ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది. ‘తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యను ప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే, మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.
అభ్యాసము :
1) కా కి కో కి ల కాదు కదా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం.

ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
2) చిట పట చినుకులు ట ప ట ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి. ఈ ఉదాహరణలు కూడా చూడండి.

అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.
గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే,
దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఛేకాను ప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకాను ప్రాస (లక్షణం) :
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణములు :
1) పాప సంహరుడు హరుడు
అర్థాలంకారాలు :
1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం, చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి, అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు. గమనిక : ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

* ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం : ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, రూపకాలంకారం అంటారు.

ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
3) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
4) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. దృష్టాంతాలంకారం :
వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఒక భావం అర్థం గావటానికి మరో భావం అద్దంలో చూపించినట్లు ఉంటే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అంటారు.
ఉదా :
“ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతి మంతుడు”.

5. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

5. అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

6. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

“మునుమును బుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్ళపాటి గలఁడింతియ, పూరియు మేయనేరడేఁ
జని, కడుపారఁ జన్లుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న! దయాగుణ ముల్లసిల్లఁగన్”

గమనిక :
పై పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా కూడా గడ్డిని తినలేడని ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇక్కడ ‘స్వభావోక్తి’ అలంకారం ఉంది.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయము
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

గమనిక :
గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.

అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణములు మొత్తం ఎనిమిది (8).
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అ) మూడక్షరాల గణములను గుర్తించే సులభ మార్గం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
ఉదా :
మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణము = యమాతా = IUU = ఆది లఘువు
2) మ గణము మాతారా = UUU = సర్వ గురువు
3) త గణము తారాజ = UUI = అంత్య లఘువు
4) ర గణము = రాజభా = UIU = మధ్య లఘువు
5) జ గణము = జభాన = IUI = మధ్య గురువు
6) భ గణము = భానస = UII = ఆది గురువు
7) న గణము : నసల = III = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకములు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణములు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19
యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి :
పద్యపాదములోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

2. ప్రాస :
పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమము చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యములో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరము మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. ఛందస్సు – తేటగీతి
తేటగీతి పద్య లక్షణం :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యంలో 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం. ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

AP Board 9th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారు వాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేశాయి. వాటిని మనం విధిగా పాటించాలి.

2. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

3. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. వరుసగా కొన్నేండ్లు కరువు వస్తే క్షామం ఏర్పడుతంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగే నీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగే నీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కే వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది ? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని

కారణాలు:

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టీ.వీ ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థులపై “స్లోపాయిజన్” లా పనిచేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంభించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజన్ ను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టీ.వీ.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టీ.వీ.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టీ.వీ. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ ఛానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యా మోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పిల్లలపై టీ.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్న మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానలను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టీ.వీ. వల్ల సత్రయోజనాలుంటాయి. .

7. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి ఉన్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు.. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

8. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వ చేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్ వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే.. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

9. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారత జాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్కటైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యతవల్ల దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారతజాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

10. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

  1. హిందూమతం,
  2. ముస్లింమతం,
  3. క్రైస్తవమతం,
  4. బౌద్ధమతం,
  5. జైనమతం,
  6. సిక్కుమతం,
  7. పార్సీ, యూదుమతం.

భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

  1. ప్రజలలో స్వార్థబుద్ధి,
  2. మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన,
  3. ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప

సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధనకోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగి ఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

11. జనాభా సమస్య కుటుంబ నియంత్రణ

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.

“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం

  1. సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం.
  2. ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు.
  3. చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం.
  4. నిరక్షరాస్యత.
  5. మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది. జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

12. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు –

  1. లోకజ్ఞానం అలవడుతుంది.
  2. మానసిక విశ్రాంతి లభిస్తుంది.
  3. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు.
  4. పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది.
  5. స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది.
  6. జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి.
  7. కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-

  1. ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి.
  2. చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్ మినార్ మొదలగునవి.
  3. శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి.
  4. ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థమండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

13. విద్యార్థులు – సంఘసేవ

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనటంలో సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళూ సంఘజీవులే. సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండానే సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

“చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష” అని స్వార్థంగా జీవించటం సంఘజీవి లక్షణం కాదు. గురజాడ అన్నట్టు

“సొంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్”

అన్న భావనైనా కనీసం ఉండాలి. ఇతరులకి మనం తోడ్పడితే ఇతరులు మనకి తోడ్పడతారు. అదే సంఘీభావం అంటే. సంఘసేవ ఎలా చెయ్యాలి ? ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది ? విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి ? అంటే

  1. ప్రమాదాల బారినుండి కాపాడటం,
  2. వృద్ధులకి, అంగవికలురకి చేయూతనివ్వటం,
  3. ఆపదలో ఉన్నవారికి సహకారమందించటం,
  4. విద్యాదానం చేయటం,
  5. మురికివాడల్ని పరిశుభ్రం చెయ్యటం మొదలగునవి.

ఇవి ఏ విద్యార్థి అయినా చేయదగిన కనీస కార్యక్రమాలు. సంఘసేవకి పదవులు అక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. సేవాతత్పరత ఉంటే చాలు. మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తికోసం, ప్రచారం కోసం సేవచేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది. విద్యార్థులు అటువంటివారు కారు. నిజంగా తలచుకుంటే విద్యార్థులు చేయలేనిది ఏమీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం (National Service Scheme – NSF) విద్యాలయాలలో ప్రవేశపెట్టారు.

ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘసేవ చేస్తున్నారు. హైస్కూల్సులో ఎన్‌సిసి, స్కౌట్స్ లో కూడా చేరి సంఘసేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశ సేవకులనిపించుకొనే నాయకులు చేయని, చేయలేని పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం.

విద్యార్థులు ఈ విధంగా సంఘసేవ చెయ్యటంలో వారికొక ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకొనే సువర్ణావకాశం సంఘసేవ. కార్యదీక్షా దక్షతలు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘసేవా కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

14. నిరుద్యోగ సమస్య

ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ఉద్యోగాలు చేయగలవారందరికీ ఉద్యోగాలు చూపించలేకపోవడాన్నే నిరుద్యోగ సమస్య అంటారు. పూర్వకాలంలో అందరూ కులవృత్తులకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ నేడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాకుట వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది.

మనకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. వాటిలో చదివి ఉత్తీర్ణులైన అందరికీ ఉద్యోగాలు చూపించడం ఒక చిక్కు సమస్యగా తయారైంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు చదువులపై నిరాశానిస్పృహలు కలుగుతున్నాయి. అటు కులవృత్తి చేయలేక, ఇటు ఉద్యోగం లభింపక ఉభయభ్రష్టులవుతున్నారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. వృత్తి విద్యల కెక్కువ ప్రోత్సాహమివ్వాలి. ఇంటికొక ఉద్యోగమిచ్చే పథకం ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు విరివిగా స్థాపించాలి. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించాలి.

యువతీయువకులు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా, ధైర్యంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించడం అలవరచుకోవాలి.

15. నదులు – ఉపయోగాలు

నదులు పర్వతాలలో పుడతాయి. అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో ఇంచుమించు నదులు ఉంటాయి. అందులో కొన్ని జీవనదులు మరికొన్ని వర్షాధార నదులు.

మన దేశంలోని నదులను రెండు విధాలుగా విభజించవచ్చు. 1) హిమాలయాల గుంపు 2) దక్కను గుంపు. హిమాలయపు నదులు, దక్కను నదుల కంటే తక్కువ వయస్సు కలవి.

హిమాలయపు నదులు మంచు కరగడం వల్ల, వర్షాల వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుచేత వీటిని శాశ్వతనదులు అంటారు. హిమాలయపు గుంపులో సింధు, గంగ, బ్రహ్మపుత్ర ముఖ్యమైనవి.

దక్కను నదులు అనేక వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, మహానది, నర్మద, తపతి మొదలైనవి. ఈ నదులు పూర్తిగా వర్షంపై ఆధారపడినట్టివి. అందువల్లనే వేసవికాలం వచ్చేటప్పటికి నదులు సన్నబడిపోయి చిన్న ప్రవాహాలలాగా ఉంటాయి.

నదుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నదులకు వంతెనలు కట్టి రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాలను కలిగించి, పంటలు బాగా పండించుకోవచ్చు. నదిలోని నీటి ద్వారా విద్యుదుత్పాదక శక్తి కలిగించుకొనే థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నదులను రవాణా సౌకర్యాలకి ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేయవచ్చు.

16. వారాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS ఆంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

17. ‘స్వచ్చభారత్ కార్యక్రమం’ అంశంపై ఒక వ్యాసం మీ మాటల్లో రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా చెత్తచెదారము లేకుండా ఉంచడం. స్వచ్ఛమైన, మాలిన్యంలేని ప్రాంతంలో తిరిగే వారికి, మంచి ఆరోగ్యము ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. మనము అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీ గారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని, ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా మన విద్యార్థినీ, విద్యార్థులు, నిత్యమూ తమ బడినీ, ఇంటినీ, పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే ప్రతి కార్యాలయం వారు వారానికి ఒకసారైనా తమ కార్యాలయాలను శుభ్రంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలను నిర్మలంగా ఉంచాలి. అందుకు వైద్యులు, రోగులు సహకరించాలి. కాలువలు, నదులు, చెరువులు మొదలయిన చోట్ల నీటిని కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. రోడ్లపై తుక్కు పోయరాదు. చెత్తకుండీలలోనే తుక్కు వేయాలి.

మన ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి సదుపాయం సమకూరుస్తున్నారు. మలమూత్ర విసర్జనలు, బహిరంగ ప్రదేశాల్లో చేయరాదు. మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసికోవాలి. భారతదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి భారతీయుడు కృషి చేయాలి.

18. “మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

AP Board 9th Class Telugu వ్యాసాలు

19. ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది.

మనం ఎక్కువగా క్రిమి సంహారక మందులను పంటపొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లడం వల్ల, అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్ల బార్చే వానపాములు ఎన్నో ఇలా చస్తున్నాయి. అంతేకాక మామూలు పాములు, ఎలుకలు, పక్షులు, పురుగులు వగైరా ఎన్నో ప్రాణులు మన వల్లే మనుగడ సాగించలేకపోతున్నాయి. ఈ ప్రాణులు మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాము. జంతువులు, పక్షులే కాదు మనకూ ప్రమాదమే. ఎలా అంటే క్రిమిసంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి. బి, గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షించుకుందాం.

టెక్నాలజీ పేరుతో వృద్ధి సాధిస్తున్నామనే భ్రమలో బుద్ధిని కోల్పోతున్నాం మనం. టి.వి.లు, సెల్ ఫోన్లు మన ఆరోగ్యాన్ని ఎంతగా పాడుచేస్తున్నాయో కదా ! తెలిసికూడా వాటిని మనం విడిచి పెట్టలేకపోతున్నాం. సెల్ ఫోన్ టవర్లు వంటివి కొన్ని రకాల పక్షుల జాతి అంతరించిపోవడానికి కారణమౌతున్నాయి. కానీ ఇవేమి మనకు పట్టదు. “పచ్చని చెట్టు ప్రగతికి మెట్టన్న పెద్దల మాట పెడచెవిన పెట్టకూడదు. తోటి ప్రాణుల పట్ల కారుణ్య భావంతో మెలగాలి. అప్పుడే ప్రకృతి సమంగా నడవడానికి అవకాశం ఉంటుంది. మన విపరీత ధోరణుల వల్లే ప్రకృతి కూడా వికృతంగా నడుస్తోంది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు మనందరిది. చిన్న ప్రాణుల పట్ల నిర్లక్ష్యం వద్దు. అవే మనల్ని ఆపదల పాలు కాకుండా కాపాడతాయి. కనుక మనందరం నేటి నుంచి జీవకారుణ్య భావంతో మెలుగుదామని ప్రతిజ్ఞ చేద్దాం.

AP Board 9th Class Telugu లేఖలు

AP Board 9th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
పగ ప్రతీకారం మంచిది కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

మిత్రుడు రవికుమార్‌,

మిత్రమా ! నీకు స్నేహపూర్వక అభినందనలు. ఈ మధ్య నీకూ నీ ప్రక్క ఇంటి మోహనకూ తగవు వచ్చిందనీ, దానితో నీ మనస్సు బాగోలేదనీ రాశావు. నేను నీ ఉత్తరం అంతా చదివాను.

నాకు మీ తగవుకు, గట్టి కారణం ఉందని అనిపించలేదు. పగ, విరోధము, కలహము అన్న మాటలు అసలు మంచివి కావు. పగ పెంచుకొన్న కొద్దీ మన మనస్సులు పాడవుతాయి. అశాంతి పెరిగిపోతుంది. సుఖం ఉండదు.

మనం భారతం చదివితే, అన్నదమ్ముల మధ్య అకారణ విరోధం వల్ల, కౌరవ వంశం సమూలంగా నాశనమయ్యిందని తెలుస్తుంది. ఇక పాండవుల్లో కేవలం ఆ అయిదుగురూ, ద్రౌపదీ మిగిలారు. రాముడితో విరోధం పెట్టుకొన్న రావణుడు, బంధుమిత్ర పరివారంతో మరణించాడు.

ప్రస్తుత కాలంలో చూసినా, దేశాలు యుద్ధాలవల్ల సర్వనాశనం అవుతున్నాయి. గ్రామాల్లో తగవుల వల్ల కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి.

కాబట్టి నీవు నీ ప్రక్క ఇంటి మోహతో విరోధం మానివెయ్యి. స్నేహంగా ఉండు. నీ మనస్సు సుఖంగా ఉంటుంది. మనది, శాంతికాముకులయిన గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశం. మరువవద్దు. ప్రక్కవారితో స్నేహంవల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.వెంకటేశ్వరరావు,
9వ తరగతి,
రవి పబ్లిక్ స్కూలు,
విజయవాడ.

చిరునామా :
కె.రవికుమార్,
S/O కె.ప్రసన్నకుమార్,
తేరు వీధి, తిరుపతి, చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాంగారి గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్నం,
x x x x x

ప్రియమైన ప్రభాకర్ కు,

మిత్రమా ! మన రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ గారి గూర్చి ఈ లేఖలో తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాంగారు సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను, అధిరోహించిన మహనీయుడు. చిన్నతనం నుండి ఆయనలో పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాస ఎక్కువ. అవే ఆయన ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి.

అబ్దుల్ కలాంగారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి, ‘భారతరత్న’ పురస్కారం అందుకొన్న గొప్ప వ్యక్తి, ఆయన భారత రాష్ట్రపతిగా భారతజాతికి అందించిన సేవలు ఎనలేనివి. ఆయన మన విద్యార్థిలోకానికి స్ఫూర్తి ప్రధాతగా భావిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. సుధాకర్.

చిరునామా :
కె. ప్రభాకర్, 9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
శ్రీకాకుళం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో పదో తరగతి చదివి, 9.7 పాయింట్స్ సాధించి, కలెక్టరు గారి నుండి బహుమతిని అందుకున్న ‘రాణి’ని ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా ? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా థమికస్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువుమానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.

ధన్యవాదాలు

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగు మాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,

చిరునామా:
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన ప్రత్యేక ఋణసౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,

ఆర్యా,

విషయం :
రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక. – మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాతల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా :
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ|| గో|| జిల్లా.

ప్రశ్న 5.
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళా ఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికలో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,

ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ మహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి, మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను, మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ, హైదరాబాదు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కిరణకు,

ఉభయకుశలోపరి. ఇటీవల మా పాఠశాలలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు. మా ఊరి సర్పంచ్, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మేమంతా అంబేద్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ, మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య మొదలైన మహనీయుల గురించి మాట్లాడాము. మా సోషల్ టీచర్ భారతుల ఫణిగారు మాకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చారు. మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను తెలియజేయి. ఇంతే సంగతులు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
కె. కిరణ్ కుమార్,
9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
రేటూరు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో జరిగిన “అమ్మకు వందనం” కార్యక్రమం గూర్చి వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తున్నాను. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం బాగా జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని ఆహ్వానించారు. ఆ అమ్మలకు వారి పిల్లల చేత పాదపూజ చేయించారు. మేము అలా చేసి అమ్మ ఆశీస్సులు పొందాం. నేను, మరికొంతమంది పిల్లల అమ్మ గొప్పదనం, మా అమ్మ గొప్పతనాన్ని గొప్పగా చెప్పాము. ఆ సమయంలో మా అమ్మ కళ్ళలో నా మీద ప్రేమ తొణికిసలాడింది. ఆమె నా కోసం పడ్డ కష్టాన్ని వృధా పోనీయక బాగా చదివి మంచి స్థాయికి వెళ్ళి అమ్మను ఇంకా బాగా సంతోషించేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ స్కూలులో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాదు.

చిరునామా :
ఎస్. కార్తీక్,
S/o బాలు,
9వ తరగతి ఎ-సెక్షన్,
ప్రభుత్వ పాఠశాల, ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 8.
మీ గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ నీ మిత్రునకు లేఖ వ్రాయుము.
జవాబు:

మిత్రునికి లేఖ

అప్పాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు ఫణిరామ్ కు,
ఉభయకుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు ? నీకు నేను ఇటీవల రెండు ఉత్తరాలు రాశాను. జవాబులేదు. చదువు ధ్యాసలో పడి నన్ను మరచిపోవద్దు. మొన్నీ మధ్యన మా గ్రామంలో “స్వచ్ఛభారత్” కార్యక్రమాలు నిర్వహించారు. మనం అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా అన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా !

ఆ పిలుపునందుకొని ఎందరో పెద్దలు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీపడుతున్నారు. ఆ క్రమంలో మా గ్రామంలో కూడా స్వచ్ఛభారత్ నిర్వహించారు. చెరువులు శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మచెట్లు వగైరా తొలగించారు. మురుగునీరు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. త్రాగునీరు పరిశుభ్రంగా ఉండేట్లు చేశారు. మల, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశంలో చేయకూడదని చాటింపు వేశారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని నిర్ణయించారు. అలాగే ‘ప్పారాగ్, గుట్కా పొగాకు’ వంటి వాటి జోలికి పోకూడదని, ఎవరూ అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. అందరి సహకారం కావాలి. మరి మీ ఊరిలో స్వచ్ఛభారత్ నిర్వహించారా ? మరి ఆ విశేషాలు లేఖ ద్వారా తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. కిరణ్ కుమార్.

చిరునామా:
కె. ఫణిరామ్,
9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
చెరుకూరు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. మితునికి లేఖ
జవాబు:

పూళ్ళ,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం, నీవు క్షేమమని భావిస్తాను. బాగా చదువుతున్నావా? ఇటీవల మా పాఠశాలలో వ్యాసరచన పోటీలు పెట్టారు. మాకు ‘ప్రపంచశాంతి’ అంశం ఇచ్చారు. ఆ పోటీలో నేనే ప్రథమస్థానం పొందాను. నేను రాసిన పాయింట్స్ బాగున్నాయని మా మాస్టార్లు అన్నారు.

శాంతిని మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే మనం పరమత సహనం కల్గి ఉంటామో, ఎప్పుడైతే సోదర భావంతో అందరితో మెలుగుతామో అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. అని రాశాను. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను రాస్తావు కదూ !

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ

చిరునామా:
S. కార్తీక్,
S/o బాలసుబ్రహ్మణ్యం,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
ఒంగోలు.

9th Class Telugu కరపత్రాలు

ప్రశ్న 1.
“స్వచ్చభారత్” ఆవశ్యకతను తెలుపుచూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రియమైన పర్యావరణ పరిరక్షకులారా !

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మాట. మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీనిని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కోసం పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మన పిల్లలు ప్రతిరోజూ ఇంటిని, అలాగే బడిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తల్లిదండ్రులుగా మీరంతా వారికి సహకరించాలి.

ప్రభుత్వ వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందికి, రోగులు, ప్రజలు సహకరించాలి. రోడ్లపై తుక్కు పోయకుండా, చెత్తకుండీలలోనే వేయాలి. మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. చెరువులు, బావులు, కాలువలను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలి. మనదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం.

మనం శుభ్రంగా ఉందాం.

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ బృందం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
పగ, ప్రతీకారం మంచిదికాదనీ, శాంతియుత జీవనం గొప్పదని తెలియజేస్తూ ‘కరపత్రం’ రూపొందించండి.
జవాబు:

కరపత్రం

ప్రియమైన మిత్రులారా !
పగ, ప్రతీకారం మంచిదికాదు, శాంతియుత జీవనం గొప్పదన్న సంగతి తెలుసుకోండి. అలనాడు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలుకొని నేటి పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ పగతో రగిలినవారే. చివరకు ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. పగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టే. కాలుతున్న కట్టే ఇంకొక కట్టెను కాల్చగలదు. అంటే పగ, ప్రతీకారంతో రగులుతున్న వ్యక్తి ముందు తాను నశిస్తూ, ఇంకొకరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల వారు ఏం సాధిస్తారు. అందరూ ఉంటేనే కదా సమాజం. ఎవరూ లేకపోతే అది స్మశానమే.

పెద్దలు ఎప్పుడూ ఒకమాట చెబుతారు. ఏమిటంటే ‘నీ కష్టంలో నీ వెంట వచ్చే నలుగురిని సంపాదించుకో’ అని. అంటే నలుగురితో మంచిగా ఉండమని కదా ! గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి మహనీయుల వారసులుగా మనం సాధించేది ఇదేనా ? సరిహద్దుల్లో శత్రువులను పారద్రోలడానికి సైనికులున్నారు. సంఘంలోని చెడ్డవారిని ఆపడానికి పోలీసులున్నారు. మరి నీలోని శత్రువులను రూపుమాపడానికి ఎవరున్నారు ? ముందు మనం మారాలి. మన మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంతా సంతోషమే. మనమే బాగుండాలి అన్నది స్వార్థం. ‘అందరూ బాగుండాలి ఆ అందరిలో నేనుండాలి’ అనుకోవడం పరమార్థం. శాంతిని స్థాపిద్దాం. సుఖైక జీవనం సాగిద్దాం. “శాంతి నీ ఆయుధమైతే; పగ, ప్రతీకారం నీ బానిసలు అవుతాయి.” అశాంతీ, అగ్గిపుల్లా ఒకటే. అవి కాలుతూ ఇంకొకరిని కాల్చడానికి ప్రయత్నిస్తాయి.

లోకా సమస్తా సుజనోభవన్తు
సర్వేసుజనా సుఖినోభవన్తు

ప్రశ్న 3.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

ప్రభుత్వ పాఠశాల – సౌకర్యాలు

తల్లిదండ్రులందరికీ మా విన్నపము. నేడు మన ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కావలసినది, చక్కని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా పోటీ పరీక్షల్లో నెగ్గిన రత్నాల వంటివారు. వారికి మంచి విద్యార్హతలు, మెరిట్ ఉంది. వారికి మంచి జీతాలు సక్రమంగా వస్తాయి. వారు మంచిగా బోధిస్తారు.

ఇక ప్రభుత్వ పాఠశాలలకు చక్కని భవనములు, ఆటస్థలాలు, ప్రయోగశాలలు ఉన్నాయి. ఆటలు ఆడించే వ్యాయామ ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంచినీటి సదుపాయము, విద్యుచ్ఛక్తి, ఫోను, మరుగుదొడ్లు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలందరికి ఉచితంగా చదువు చెపుతారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. అర్హులయిన వారికి హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టల్ విద్యార్థులకు ప్రయివేటుగా శిక్షణ చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చండి. కాన్వెంట్ల కోసం అధిక ధన వ్యయం చేసుకోకండి. బాగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసికోండి. గొప్ప గొప్ప విద్యావేత్తలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని మరచిపోకండి.

నమస్కారములు.

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ సంఘం,
కాకినాడ.

దివి x x x x x

ప్రశ్న 4.
ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులూ, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

ప్రశ్న 5.
ధనవంతులు సమాజానికి ఉపయోగపడాలి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వృద్ధాశ్రమాలకు కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు

దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘవిద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా ? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవచేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మన కందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచి పెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు కాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్యవస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.

పేదలకు సాయం చేద్దాం
గుంటూరు జిల్లా,

పేదరికాన్ని రూపుమాపుదాం
బ్రాడీపేట 2/14, గుంటూరు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
దోమల నివారణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
దోమలపై దండయాత్ర దోమలపై దండయాత్ర యువతీ యువకులారా ! ఆలోచించండి ! ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అనారోగ్యానికి ప్రధాన కారణాలలో దోమకాటు ప్రధానమైనది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే దోమలను నివారించాలి. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిల్వ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్ళిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటివి దోమల వల్లే వ్యాపిస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. వాకిళ్ళు, కిటికీలకు దోమతెరలు బిగించాలి. జెట్ కాయిల్స్ వంటి వాటితో కూడా దోమలబాధ తగ్గుతుంది. కానీ మనకు శ్వాసకోశ ఇబ్బందులుంటాయి కాబట్టి సహజంగా దొరికే సాంబ్రాణి పొగ వేయడం, ఎండిన వేపాకు పొగవేయడం వంటివి దోమలను నివారిస్తాయి. పొడుగు దుస్తులు ధరించడం కూడా మేలే. దోమలను నివారిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుదాం.

ఇట్లు,
జిల్లా ఆరోగ్య పరిరక్షణ బృందం.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ‘ప్రపంచ శాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

వ్యాసరచన పోటీ

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి X X X X X వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.

దివి X XX XX.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

9th Class Telugu అభినందన పత్రాలు

ప్రశ్న 1.
మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగు పదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రమా ! రాఘవా ! నీవు తెలుగు భాషాభిమానివి. నీవు చక్కని తెలుగును పరభాషా పదాలు లేకుండా మాట్లాడగలవు. అందుకుగాను నిన్ను తప్పక అభినందించాలి. మన మిత్రబృందంలో నీలాగా తెలుగు ఉచ్చారణ, దోషాలు లేకుండా స్వచ్ఛంగా మాట్లాడగలిగినవారు లేరు. నీవు మొన్న “భౌతికశాస్త్రము – ఉపయోగాలు” అన్న అంశం మీద వక్తృత్వం పోటీలో మాట్లాడిన విధం నన్ను బాగా ఆకట్టుకుంది. శాస్త్రవిషయిక అన్యభాషా పదాలను చక్కని పారిభాషిక పదాలతో తెలుగులో బోధించడం, మాట్లాడడం, నేడు ఉపాధ్యాయులకు సైతం కష్టంగా ఉంది. అలాంటిది నీవు అనర్గళంగా తెలుగులో ఒక్క పరభాషా పదం కూడా లేకుండా మాట్లాడావంటే అభినందించాల్సిన విషయమే. నిన్ను చూసి మేమూ అలాగే మాట్లాడాలని ప్రేరణ పొందాం. ఇదే విధంగా నీవు నీ తెలుగు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మరింత ప్రతిభతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ … ఇవే నా హార్దిక అభినందనలు.

విజయవాడ,
x x x x x

ఇట్లు,
శ్రీరామ్.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పది వాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా, నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా, హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.

ఉంటా,

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,

 

ప్రశ్న 3.
రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయ శాఖ తరఫున ఆయన్ను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము. రైతురత్న రామయ్య గారూ!

నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.

అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 4.
మీ తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు – I పాఠ్యపుస్తకం గురించి పుస్తక పరిచయ నివేదికను; మీ అభిప్రాయాలను రాయండి.
జవాబు:
మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం పేరు, ‘తెలుగు దివ్వెలు’ – I అంటే తెలుగు దీపాలు అని అర్థం. ఈ పుస్తకంలో ఐదు పద్యభాగాలు, ఆఱు గద్యభాగాలు ఉన్నాయి. ఆరు ఉపవాచక వ్యాసాలు ఉన్నాయి.

పద్యభాగంలో కవి బ్రహ్మ తిక్కన గారి పద్యాలు, భారతం నుండి ఇవ్వబడ్డాయి. తిక్కన గారి తెలుగు పలుకుబడి, ఈ పద్యాల్లో కనబడుతుంది. ఇక వివిధ శతక కవుల పద్యాలు, ప్రాచీన కవిత్వానికీ, భక్తి, నీతి, ప్రబోధానికి ఉదాహరణలు. ఆడినమాట పద్యాలు, భోజరాజీయము అనే కథా కావ్యంలోనివి. దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాలు, ఆధునిక పద్యానికి ఉదాహరణలు. ఆ పద్యాలు, రైతుకు వారు అందించిన నీరాజనాలు.

ఇక వచన పాఠాలలో పానుగంటి వారి సాక్షివ్యాసం, గ్రాంధిక భాషకు ఉదాహరణం. వచన పాఠములలో వివిధ వచన ప్రక్రియలను పరిచయం చేశారు. ఒక కథను, ఆత్మ కథను, లేఖను, వ్యాసాన్ని, పుస్తక పరిచయాన్ని పరిచయం చేశారు. మొత్తం పై మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం, తెలుగు సాహిత్యానికి ప్రతిరూపంగా ఉంది.

ఇక ఉపవాచక వ్యాసాలు, ఆరుగురు మహాత్ముల జీవితచరిత్రలను పరిచయం చేస్తున్నాయి. అవి మా విద్యార్థినీ విద్యార్థులకు, మంచి స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాయి. మా తొమ్మిదో తరగతి పాఠ్య నిర్ణాయక సంఘం వారికి, నా కృతజ్ఞతలు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson ధృవతారలు

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వైద్యరంగంలో డా॥ నోరి దత్తాత్రేయుడు గారు చేసిన కృషిని గురించి రాయండి.
జవాబు:
ప్రపంచస్థాయి వైద్యునిగా గుర్తింపు పొందిన డా|| నోరి దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. సరైన వైద్యం లేకపోవడం వలనే తండ్రిని కోల్పోయామని తల్లి ద్వారా తెలుసుకొన్న నోరి ప్రభావితుడై వైద్యుడు అవ్వాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రేడియం ఇనిస్టిట్యూట్ అండ్ కాన్సర్ హాస్పటల్ లో రెసిడెంట్ వైద్యునిగా సేవలందించారు. వ్యాధి సరైన సమయంలో గుర్తించలేకపోవడం, వైద్యం చాలా భారమైనదిగా ఉండడం, మందులు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఎందరో వ్యాధిగ్రస్తులు మరణం తప్ప మరొక శరణ్యం లేదని కుమిలిపోవడం ఆయనను ఎంతగానో కలచివేసింది. క్యాన్సర్ పై పరిశోధనలకు కంకణం కట్టుకున్నారు. 1977వ సం||లో కాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు.

పరిశోధనల్లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడా నిరాశ చెందలేదు. తాననుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూ విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ముఖ్యంగా మహిళలకు వచ్చే కాన్సర్ వ్యాధుల్ని నివారించటం కొరకు విశేషమైన కృషి చేసాడు. 1979 నుండి బ్రాకి థెరపి అనే వైద్య ప్రక్రియలో పరిశోధనలు జరిపి అత్యంత నైపుణ్యం గల వైద్యుడిగా అనేక వేల మంది కాన్సర్ రోగులకు నయం చేశారు. వైద్యవృత్తిలో అడుగుపెట్టి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రపంచ ప్రసిద్ధ రేడియో అంకాలజిస్ట్ డా|| నోరి దత్తాత్రేయుడు గారు “వైద్యోనారాయణా హరిః” అన్న మాటకు నిలువుటద్దం. నిజమైన ధృవతార.

ప్రశ్న 2.
డా|| నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలందించడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
వైద్యవృత్తిలో కాలుమోపి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగులు నింపిన నోరి దత్తాత్రేయుడు నిజమైన ధృవతార. చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకొని అనతి కాలంలోనే మంచి విద్యార్థిగా పేరుపొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.డి.లో ఉత్తీర్ణత పొందాడు. కాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించి 1977లో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు. బ్రాక్ థెరపి వైద్య ప్రక్రియలో పరిశోధనలు చేసి వేలమంది క్యాన్సర్ రోగులకు నయం చేసాడు.

అమెరికాలోని మెమోరియల్ స్టోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేశారు. ఆ సందర్భంలో యన్.టి. రామారావుగారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించమని డా|| నోరికి ఒక విజ్ఞాపన చేశారు. అప్పుడు డా|| నోరి తనకూ సొంతగడ్డపై కాన్సర్ హాస్పిటల్ నిర్మించి సేవలందించాలనే తలంపు ఉన్నట్లు మనసులో మాట వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి ఏడెకరాల భూమిని క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం కేటాయించారు. ఈ విధంగా యన్.టి.రామారావుగారి కోరిక మేరకు, తన నేలతల్లిపై గల మమకారం వల్ల డా|| నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి తిరుమలరావు జీవితం సైన్స్ కూ, సాహిత్యానికీ మధ్య గల సంబంధాన్ని ఎలా తెలియజేస్తుందో రాయండి.
జవాబు:
సైను, సాహిత్యాన్ని సమపాళ్ళలో రంగరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అసలు సిసలు తెలుగు శాస్త్రవేత్త, భాషావేత్త సర్దేశాయి తిరుమలరావుగారు. సైన్స్ కూ, సాహిత్యానికి అగాథం పూడ్చాలని ఆయన పదేపదే చెప్పేవారు. ఆయన తన రచనలలో సైనూ, సాహిత్యానికి ఉండే తేడాను, అనుబంధాన్ని బాగా విశ్లేషించేవారు. ఇవి రెండూ కూడా సమాజ హితాన్ని కోరేవిగా ఉండాలని ఆయన భావించేవారు.

మనిషిని స్వావలంబునిగా, సమాజ శ్రేయస్సు కోరి పనిచేసే వ్యక్తిగా ప్రేరేపించగలిగే ఉదాత్త భావమే కవిత్వమని ఆయన ఉద్దేశ్యం. ఆసక్తులను శక్తులుగా మార్చగలిగేదే కవిత్వం అని ఆయన చెప్పేవారు. కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డు వంటిది. దానిమీద నిలబడి మనిషి ప్రగతి పథానికి ఎగురగల్గి ఉండాలి అని ఆయన చెప్పేవారు.

కవిత్వాన్ని రసాయన ప్రక్రియ లాగా ఎలా విశ్లేషించారో చూడండి – “పెద్దబండలో అనవసరమైన రాతి పదార్థాన్ని చెక్కి పారవేసి శిల్పి చక్కని విగ్రహాన్ని తయారుచేస్తాడు. రసాయన శాస్త్రవేత్త వంటి కవి వస్తు భావాలకు ప్రతిభా పాండిత్యాలని, రసాయన ప్రేరకాలని చేర్చి, మేధస్సు’ అనే క్రియా కలశంలో చర్య జరిపి, ఫలితాలను విచక్షణ అనే జల్లెడలో వడబోసి, వచ్చిన కవితా సారాన్ని మనకు అందిస్తాడు” అని చెప్పేవారు. ఋషితుల్యుడైన ఆయన ఆలోచనలు ఏక కాలంలో సంక్లిష్టములు, సరళములు.

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎస్సీ . చేశారు.
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు.
జవాబు:
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి. ఎస్సీ, చేశారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం. ఎస్సీ, రసాయన శాస్త్రం చదివారు.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 2.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఇ) 1991లో జే.జే కాణీ పురస్కారం అందుకున్నారు.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ఇ) 1991లో జే.జే కాణ్ పురస్కారం అందుకున్నారు.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.

ప్రశ్న 4.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్.బి.బి.యస్ లో చేరారు.
జవాబు:
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్. బి. బి.యస్ లో చేరారు.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా॥ నోరి చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని ఎందుకు నిర్ణయించుకొన్నారు?
జవాబు:
కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతుల పదవ సంతానం దత్తాత్రేయుడు. ఈయన ఐదవ యేటనే తండ్రి మరణించాడు. సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలన, వైద్యం ఖరీదైనది కావడం వల్లనే తండ్రి మరణించాడని ఇలాగ ఎందరో జీవితాలను కోల్పోతున్నారని తల్లి తరచుగా చెబుతుండేది. ఈ మాటలు దత్తాత్రేయ మీద ఎంతగానో ప్రభావితం చూపాయి. అందుచేత చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రశ్న 2.
డా॥ నోరి విద్యాభ్యాసం గూర్చి రాయండి.
జవాబు:
1947 అక్టోబరు 21న కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో దత్తాత్రేయుడు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ‘ తల్లి పెంపకంలో పెరిగాడు. బందరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశాడు. తర్వాత పి.యు.సి., బి.యస్సీ డిగ్రీని బందరు జాతీయ కళాశాలలో చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరి పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ అతడి చదువుకు కావలసిన సహాయసహకారాలందించింది. కర్నూలు వైద్యకళాశాలలో యం.బి.బి.యస్ చదివి ప్రథముడిగా (1971లో) ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి యమ్.డి.లో ఉత్తీర్ణత సాధించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
డా॥ నోరి అందుకున్న అవార్డులు, పొందిన గౌరవాలు తెల్పండి.
జవాబు:
విద్యార్థి దశలో ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా నిలిచి ఉపకార వేతనాలు, బహుమతులు అందుకున్న డా|| నోరి వైద్యునిగా చేస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొందారు. 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాక్టరీ అవార్డు ఇచ్చారు. 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. 1994లో అలుమిని సొసైటీ, మెమోరియల్ ప్లాన్, కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విఫ్ట్ అలుమినస్ అవార్డు అందుకున్నారు. 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నాడు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ “ట్రిబ్యూట్ టు లైఫ్” గౌరవాన్ని బహుకరించింది. భారత ప్రభుత్వం 2015 సం||లో డా|| నోరిని “పద్మశ్రీ ” బిరుదుతో సత్కరించింది.

ప్రశ్న 4.
డా॥ నోరి ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పదవులేవి?
జవాబు:
తల్లి మాటలతో ప్రభావితుడై వైద్యవృత్తిని ఎంచుకొని, దానిలో తనకంటూ ఒక స్థానం పొందారు డా|| నోరి దత్తాత్రేయుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని “బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్” నిర్వహణ బాధ్యతల్ని చేపట్టి వైద్య సేవలందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

సైనూ సాహిత్యానికి వారధి సర్దేశాయి తిరుమలరావు

ప్రశ్న 1.
……… నేను ఇప్పటికీ స్వచ్చమైన పరిశోధకుడినే !” అని సర్దేశాయి గారి మాటల్లో ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
1991 సెప్టెంబరులో జే.జే. కాణ్ పురస్కారం అందుకున్న సందర్భంలో చేసిన స్మారక ప్రసంగంలో అన్న మాటలివి. నేను ఇప్పటికీ స్వచ్ఛమైన పరిశోధకుడినే ! కలుషితం కాలేదు. పరిశోధన, పరిశోధకుడు అంటే గిరి గీసుకొని దానిలోనే తిరుగుతూ, వెతుకుతూ ఉండడం కాదు. సహజమైన ఆసక్తి, ఇష్టం చేసే ప్రతి పనీ ఒక పరిశోధనే. అలాంటివాడు పరిశోధకుడే అని వారి భావన అయి ఉండవచ్చు.

ప్రశ్న 2.
సర్దేశాయిగారి వ్యక్తిత్వం ఎటువంటిది?
జవాబు:
“ఎవరూ రాకపోయినా, ఒక్కడవే, ఒక్కడవే, పదవోయి” అనే ఠాగూర్ గీతం స్ఫూర్తితో చివరికంటా ఒంటరి పోరాటం చేసిన మహోన్నతుడు సర్దేశాయి. మొహమాటం, కపటం, ఆయనకు తెలియవు. ముక్కుసూటి మనిషి. అందువల్లనే ఆయన పరిశోధన తీక్షణంగా ఉంటుంది. విమర్శ తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి మొహమాటాలు లేవు కనుకనే ఆయన మాట కటువుగా ఉంటుంది. సంగీతం అంటే మక్కువ. వారి వద్ద అపురూపమైన గ్రంథాలయం ఉంది. వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు. సంస్థలో ఎంత చిన్నస్థానంలో పనిచేసే వ్యక్తినైనా ఉత్తేజితుని చేసేవారు. విద్యావేత్తలతో, వ్యవసాయదారులతో, పారిశ్రామిక వేత్తలతోను ఒకే విధమైన మాట తీరుతో మాట్లాడేవారు.

ప్రశ్న 3.
మామిడి టెంకలపై సర్దేశాయి పరిశోధనను గూర్చి రాయండి.
జవాబు:
ఒకసారి అనంతపురంలో రోడ్డు మీద నడచి వెళుతూ, తిని పడవేసిన మామిడి టెంకలు విపరీతంగా ఉండటం గమనించారు సర్దేశాయి. వీటిమీద ఆలోచన మొదలైంది. ప్రపంచంలో తొలిసారిగా వీటిమీద పరిశోధనలు చేసారు. గొప్ప ఫలితాలు సాధించారు. ఇపుడు మామిడిటెంక నుండి తీసిన పదార్థం నుండి తయారుచేసిన నూనెను పాశ్చాత్య దేశాల్లో మేలురకం చాక్ లెట్లలో వాడతారు. ఫలితంగా ఇపుడు మనకు విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. అదీ సర్దేశాయి పరిశోధనాంశాన్ని ఎంచుకునే విధానం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి విద్యాభ్యాసం, ఉద్యోగం గూర్చి రాయండి.
జవాబు:
1928 నవంబరు 28 కర్నూలు జిల్లా, ఆలూరు తాలుకా, జోరాపురంలో జన్మించారు సర్దేశాయి తిరుమలరావు. వీరి మాతృభాష కన్నడం. అయినా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి దిట్ట. అనంతపురంలో హైస్కూల్ చదువు, బి.ఎస్సీ. పూర్తి చేశారు. రాజస్థాన్ లోని బిట్స్ – పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు. తర్వాత అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1954లో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసెర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 5.
తిరుమలరావు పరిశోధనాంశాలు ఏవి?
జవాబు:
డా|| తిరుమలరావు గారి పరిశోధనాంశాలు పరిశీలిస్తే ‘కాదేది పరిశోధనకు అనర్హం’ అని వ్యాఖ్యానించాలనిపిస్తుంది. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టు పురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరప విత్తనాలు, సీతాఫలం గింజలు, సూర్యకాంతి విత్తనాలు, జీడిమామిడి, మిల్క్ డైరీ అవక్షేపం, అరటితొక్కలు, నారింజ తొక్కలు, టమోట విత్తనాలు, దవనం, పుదీనా, మరువం, రోసాగడ్డి – ఇలా ఆయన దృష్టి పడని అంశం లేదు అనిపిస్తుంది. ఇంకా నువ్వులు, మొక్కజొన్నలు, కుసుములు, ఇప్పపువ్వు ఇలా ఎన్నింటి నుండో నూనె తీయవచ్చునని పరిశోధించారు.

ప్రశ్న 6.
డా|| తిరుమలరావు గారిలోని సాహిత్య కోణాన్ని గమనించండి.
జవాబు:
కావ్యాలలో ‘శివభారతం’, నాటకాలలో ‘కన్యాశుల్కం’, ‘నవలల్లో’, ‘మాలపల్లి’ చాలా గొప్పవని డా|| తిరుమలరావు తరచు చెప్పేవారు. ‘సాహిత్య తత్వం – శివభారత – దర్శనం’, ‘కన్యాశుల్కం – నాటక కళ’ అనే పేరుతో విమర్శనాత్మక గ్రంథాలు రాసారు. మేఘసందేశంలోని మేఘుని మార్గము, భౌగోళిక వాతావరణ విశేషాలు, అలెగ్జాండర్ పోపు – వేమన, ప్రపంచాన్ని మార్చిన శాస్త్రీయ సంఘటనలు మొదలైన గ్రంథాలు రచించారు. అలాగే సాహిత్య విమర్శలు, పరిశోధనా పత్రాలు అనేకం వీరి అమృత లేఖిని నుండి జాలువారాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్వహించిన బాధ్యతలు పేర్కొనండి.
జవాబు:
భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను నిలిపి, తరగని కీర్తిని ఆర్జించినవారు శ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఎందరో కాకలు తీరిన భాషా యోధులకు సర్వ సైన్యాధ్యక్షుడి లాంటి గురువు ఈయన. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు ఈయన.

మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా పనిచేసిన కృష్ణమూర్తిగారు తర్వాత ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలందించి, చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా (వైస్ ఛాన్సలర్) పదవీ బాధ్యతలు నిర్వహించారు. సందర్శకాచార్యులు (విజిటింగ్ ప్రొఫెసర్) గా మిచిగాన్, కార్నెల్ టోక్యో, హవాలీ, టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా, కుంటు పడకుండా, మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని విజయవంతంగా నిర్వహించారు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు గొప్ప పరిశోధకులు; ఆచార్యులు; దీక్షాదక్షులు; పరిపాలకులు – అని సమర్థించండి.
జవాబు:
దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ, మనదేశంలో, మనరాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు కృష్ణమూర్తిగారు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గురించి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషిచేసిన మహనీయుడు భద్రిరాజు కృష్ణమూర్తి.

వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక భాషాధ్యయనశీలిగా; నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష గల్గిన సుప్రసిద్ధ పరిశోధకుడిగా, శిష్యుల పట్ల అపార వాత్సల్యాదులు కల్గిన ఉత్తమ ఆచార్యుడిగా; ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడిగా, నిరంతర శోధన, ఆదర్శవంతమైన బోధన, అగాధమైన విజ్ఞానం, సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన మన తెలుగు తేజం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తిగారు ఆధునిక భాషా, వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగువాళ్ళ అదృష్టం. అనేక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా భాషా శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించారు.

గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రవేశపెట్టిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొని, భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు.

కృష్ణమూర్తిగారి భాషా పరిశోధన ఫలాలు తెలుగువాళ్ళకు మాత్రమే పరిమితం కావు. వారి ఆంగ్ల రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి, ఒరవడి పెట్టేవి. కాలిఫోర్నియాలో ఎం.బి.ఎమినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచనతో సాహితీరంగంలో ప్రవేశించారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడె….’ శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచన చేసిన పెద్దల మన్ననలను పొందారు. ప్రౌఢత, ప్రసాదగుణం కలిగిన పద్యాలు అలవోకగా, రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు.

శ్రీగంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు ఈయన. ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసారు. ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శకాచార్యులుగా ఉన్నారు. తాను స్వయంగా రచించినవీ, సంపాదకత్వం వహించినవీ ఎన్నో గ్రంథాలు వెలుగులోనికి వచ్చాయి.

భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రొడత, ఆర్ధత కల్గిన కవిగా, అవధానిగా, సంప్రదాయ వ్యాకరణ అభ్యాసకునిగా, ట్యూటర్ గా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా, సంపాదకుడిగా ఇలా భిన్న పార్శ్వా లలో దర్శనమిస్తారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తి భాషాసేవను గురించి రాయండి.
జవాబు:
భాషాక్షేత్రంలో చెరగని మైలురాళ్ళను, తరగని కీర్తి శిఖరాలను నిలిపారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషా శాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వవేదిక మీద నిలబడి నినదించి, తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వారు కృష్ణమూర్తిగారు. అంతేకాదు తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్నందించిన వారు ఈయన. దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ప్రప్రథమంగా వృత్తి పదకోశాన్ని తయారుచేసినవారు భద్రిరాజు కృష్ణమూర్తి. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తలలో భారతదేశానికి చెందిన ఇద్దరిలో కృష్ణమూర్తిగారొకరు.

భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు. వీరి పరిశోధన తెలుగులోనే కాక “ద్రవిడియన్ లాంగ్వేజ్, కంపేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్ ……” వంటి రచనల ద్వారా ఇతర భాషలవాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణగా నిలిచాయి.

వయోజన విద్యావ్యాప్తి కోసం ‘జనవాచకం’, ‘తేలిక’ తెలుగువాచకం ఈయన రచించారు. శ్రీ పి. శివానందశర్మతో కలిసి ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకొనే వారికోసం ‘ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు’ రచించారు. ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత గ్రంథం “తెలుగు వెర్బల్ బేసెస్’, ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ గ్రంథాల ద్వారా విశేష ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భాష, భాషోత్పత్తి, లిపి, ప్రాచీనత, వైవిధ్యత, రూప పరిణామ క్రమం తదితర అనేకానేక అంశాలను విస్తృతంగా పరిశోధించి, ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల, పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు భద్రిరాజు కృష్ణమూర్తి.

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్‌గా పనిచేశారు.
జవాబు:
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్ గా పనిచేశారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 2.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు.
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
జవాబు:
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు. ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తెలుగుభాషకు వివిధ అంశాలలో సేవలు చేసిన మీకు తెలిసిన మహనీయుల పేర్లను రాయండి.
జవాబు:
భాషాశాస్త్రంలో దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవారు చేకూరి రామారావుగారు. పాఠ్యగ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత – ఆచార్య కె.కె. రంగనాధాచార్యులు. తెలుగు లిపి గురించి, పదప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించినవారు – డా|| బూదరాజు రాధాకృష్ణగారు. తెలుగు అక్షర నిర్మాణం గురించి, ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించినవారు – డా|| ఉమామహేశ్వరరావు. మన రాష్ట్ర మాండలికాల్లో మధ్యమండలం కాక, మిగతా మూడు మాండలికాల్లో నవలా రచన చేసినవారు డా|| పోరంకి దక్షిణామూర్తిగారు. వీరంతా కాకలు తీరిన భాషా యోధులు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు విశిష్ట వ్యక్తి అని తెలుసుకున్నాం కదా ! క్లుప్తంగా వారి గురించి రాయండి.
జవాబు:
సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. ఈయన గురించి – భాషాశాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వ వేదిక మీద నిలబడి నినదించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించారు. ద్రవిడ భాషల తీరు తెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి, భాషా పరిశోధకులకు కరదీపికగా నిలచారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు. ఇలా ఎన్నో అంశాలు స్పృశించి, తెలుగువారి గుండెలలో సుస్థిర స్థానం పొందారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి రచనల పేర్లు రాయండి.
జవాబు:
‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది. ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ కాల్వెల్డ్ రచనకు దీటైనది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గిడుగు వెంకట రామమూర్తి గారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
వ్యావహారిక భాష కోసం ఉద్యమం చేపట్టి సవరభాషకు ఎంతో సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను వివరించండి.
జవాబు:
గిడుగు వెంకట రామమూర్తిగారు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు 29-8-1863న జన్మించారు. విజయ నగరం జిల్లా పర్వతాలపేటలో వీరి పాఠశాల విద్య సాగింది. వారణాసి గున్నయ్యశాస్త్రిగారు ఈయనకు రాయడం, చదవడం నేర్పారు. తండ్రిగారు భారత, భాగవత పద్యాలు నేర్పారు.

ఈయన మెట్రిక్ లో పాసై, పర్లాకిమిడిరాజా వారి మిడిల్ స్కూలు టీచరుగా చేరారు. ఎఫ్.ఎ అయ్యాక హైస్కూలు టీచరు అయ్యారు. రామమూర్తి గారికి 16వ ఏట అన్నపూర్ణతో వివాహం అయ్యింది. రామమూర్తి గార్కి 1885లో పుత్రుడు సీతాపతిగారు పుట్టారు.

ఈయన ముఖ్య స్నేహితుడు గురజాడ వెంకట అప్పారావుగారు. ఈయన 1892లో సవర భాష నేర్చుకున్నారు. సవరలకు బడులు పెట్టించడానికి కృషి చేశారు.

తెలుగు – సవర నిఘంటువులు రచించారు. సొంత ధనంతో సవరల కోసం బడి పెట్టించి, 30 సంవత్సరాలు కృషి చేశారు. వీరిని 1913లో ‘రావుసాహెబ్’ బిరుదుతోను 1934లో కైజర్-ఇ-హిందీ అనే సువర్ణ పతాకంతోను బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది.

విద్యార్థులకు శిష్ట వ్యావహారికమే బోధనా భాషగా ఉండాలని ఈయన జయప్రదమైన ఉద్యమం చేశారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. 1940 జనవరి 22వ తేదీన మరణించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
రామమూర్తి పంతులు గారి రచనలను గురించి తెల్పండి.
జవాబు:
రామమూర్తి పంతులుగారు సవరభాషపై కృషి చేసి, “తెలుగు – సవర నిఘంటువు”ను రచించారు. సవరపాటలూ, సవర కథలూ కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఈ పనిలో ఈయనకు “మామిడల్లం కుమారస్వామి పంతులుగారు” సహకరించారు.

రామమూర్తిగారు పర్లాకిమిడిలో తెలుగు పత్రికను ఒక సంవత్సరం పాటు నిర్వహించారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని (ప్రొఫెసర్ డేవిడ్ సొంపే తెలిపారు. 1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా, నాటి భాషా స్థితి పైనా, విద్యా విధానం పైనా రామమూర్తి గారి దృష్టి మనకు స్పష్టమౌతుంది.

పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా వాడుక భాషే వాడాలని రామమూర్తి గారు సూచించారు. రామమూర్తిగారు గొప్ప గ్రంథ పరిష్కర్త. పత్రికా రచయిత. విద్యావేత్త.

ప్రశ్న 3.
రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనే వాక్యాన్ని మీరెలా సమర్థిస్తారు?
(లేదా)
‘గిడుగు రామ్మూర్తి పంతులుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ సమర్థించండి.
జవాబు:
గిడుగు రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరిది మహోన్నత వ్యక్తిత్వం. ఈయనకు సాటిలేని మానవతా దృష్టి ఉంది. ఈయన చరిత్ర భావితరాలకు మార్గదర్శనం చేస్తుంది. ఈయన. గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త. ఈయన డేనియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలూ, ఒట్టోజెన్ పర్సన్ వంటి వ్యాసకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపిన గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త.

ఈయన గొప్ప కావ్య భాషా పరిశోధకుడు. శాస్త్ర పరిశోధకుడు. ఈయన థర్స్టన్ రచించిన సంపుటాలలో సవర జాతికి చెందిన అంశాలపై పరిశోధక రచనలు చేసిన శాస్త్రవేత్త.

1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించాడు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని, ప్రొఫెసర్ డేవిడ్ స్టాంపే తెలిపాడు. సవర భాష నేర్చుకొని, వారికి తన సొంత ధనంతో బడిపెట్టి 30 సంవత్సరాల పాటు నిర్వహించారు.

1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా నాటి భాషా స్థితి పైన, విద్యా విధానంపైన వీరి దృక్పథం వెల్లడవుతుంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా, ప్రభుత్వం ప్రజలతో జరిపే • ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని ఈయన సూచించారు.

వ్యావహారిక భాషోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామమూర్తిగారు.

ప్రశ్న 4.
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుందని మీరనుకుంటున్నారా? కారణాలు రాయండి.
జవాబు:
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మంచి మేలు జరిగింది. వాళ్ళు తాము మాట్లాడే భాషలోనే జవాబులు రాయగలుగుతున్నారు. గ్రాంథిక భాష అయితే అరసున్నాలు, శకట రేఫములు రాయాలి. వ్యాకరణ యుక్తంగా రాయాలి. మాట్లాడే భాష ఒకటి. వాళ్ళు రాసే భాష ఒకటి కావడంతో వాళ్ళు చిక్కులు ఎదుర్కొనేవారు.

వ్యావహారిక భాష అయితే వాళ్ళు పేపర్లలో చదివే భాషలోనే జవాబులూ, వ్యాసాలు రాయవచ్చు. గ్రాంథిక భాష కృత్రిమ భాష. వ్యావహారిక భాష, వారు చిన్ననాటి నుండి, తల్లిదండ్రుల నుండి నేర్చుకొన్న భాష. ప్రక్కవారితో మాట్లాడే భాష. కాబట్టి విద్యార్థులకు సులభంగా ఉంటుంది.

ఈ వ్యావహారిక భాషావాదం వల్లనే 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో ప్రచురిస్తున్నారు. పి. హెచ్.డి విద్యార్థులు సైతం తమ పరిశోధనా వ్యాసాలను, వ్యావహారికంలో రాయడానికి, మొదట్లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయము అంగీకరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం 1973 నుండి వ్యావహారికంలో పరిశోధక వ్యాసాలు రాయడానికి అనుమతిస్తోంది.

నేడు క్రమంగా అన్నిచోట్లా వ్యావహారిక భాష చెలామణీ అవుతోంది. అందువల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 5.
గురజాడ అప్పారావు గారిని గురించి రాయండి.
జవాబు:
గురజాడ అప్పారావు గారు గిడుగు వెంకటరామమూర్తిగారూ మంచి మిత్రులు. వారిద్దరూ ఒకే ఏడాది ఒకే బడిలో చదువుకున్నారు.

శ్రీ గురజాడ అప్పారావు గారు మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన అప్పటికే కవిత్వం రాయడం ప్రారంభించారు. అప్పారావు గారి తొలికథ ‘దిద్దుబాటు’ సాటిలేని మేటి కథ. ఇది 1910లో “ఆంధ్రభారతి” మాసపత్రికలో తొలిసారిగా అచ్చయ్యింది. ఆ కథను చదివి రసికులు పరవశులయ్యారు.

గురజాడ రచనల్లో కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం, నాటకాలు, వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అప్పారావు గారి మార్గం నవీనము. ఆయన ప్రతిభ సాటిలేనిది. ఆయన భాష సజీవమైనది. ఈయన భావాలు సంచలనం.

అందుకే మహాకవి శ్రీశ్రీ “ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మహాకవులు” అని చెప్పారు. గురజాడ రాసిన గేయాలు సుమారు ఇరవై ఉంటాయి. ఆ గేయాలే గురజాడను మహాకవిని చేశాయి.

‘గురజాడ వారి “ముత్యాల సరాలు”, ప్రభావం, అన్గండర కవుల మీద బాగ్హా ప్రసరించింది.

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
జవాబు:
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 2.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
జవాబు:
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 3.
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి విద్యార్థులు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
జవాబు:
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి. హెచ్.డి విద్యార్థు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.

ప్రశ్న 4.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజుగారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
జవాబు:
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజు గారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 5.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08.1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ) 1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
జవాబు:
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08. 1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ)1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సవరల అభివృద్ధికై గిడుగువారి కృషిని తెల్పండి.
జవాబు:
ఆదివాసీల అక్షర శిల్పి గిడుగు రామమూర్తి. ఆదిమ సవర జాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొందించిన మహనీయుడు గిడుగు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేకమంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షర జ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. గతంలో ఎంతో ఉన్నతంగా విలువలతో జీవించిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతులను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథలు, పాటలు పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను తయారు చేసారు. 1930లో సవరభాషలో “ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్” అనే వర్ణనాత్మక వ్యాకరణాన్ని రాశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
వ్యావహారిక భాషోద్యమం – ‘గిడుగు’ అడుగు రాయండి.
జవాబు:
‘గిడుగు పిడుగు’. తెలుగు భాషాబోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో కథా కథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయాలని ప్రతిపాదించి, ప్రయోగించి, ఉద్యమించి వాడుక తెలుగుభాషకు మాన్యతను తెచ్చిన ధీరుడు, పండితుడు కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు. వాడుక భాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తి చూపుతూ 1911-12 మధ్య “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం” అనే గ్రంథం రాసారు.

1919లో గిడుగు ‘తెలుగు’ మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. వీరేశలింగం అధ్యక్షులుగా గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు. వ్యావహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసినా పత్రికలు మాత్రం గిడుగు వారి వాదానికి పూర్తి సహకారం ఇచ్చాయి. గిడుగు వారిచేత ఉత్తేజితులైన పలువురు రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి వాడుక భాష గొప్పదనాన్ని ఋజువు చేశారు. “గ్రాంథిక భాషను ఎవ్వరూ చదువకూడదా ? అని ప్రశ్న వేస్తే, “నేను గ్రాంథిక భాషకు వ్యతిరేకిని కాదు. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దంటాను” అని గిడుగువారు అంటారు. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన ఈ ఉద్యమం 1973 నాటికి గాని విజయవంతం కాలేదు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావుగారు అవసరం వచ్చినప్పుడు వామనమూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు ఎందుకు అన్నారు?
(లేదా)
అవసరమైతే విరాడ్రూపాన్ని ప్రదర్శించే వారని బూర్గుల వారి గురించి పి.వి. గారు ఎందుకు అన్నారో వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు అవసరం వచ్చినపుడు వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు అనడంలో నూటికి నూరుపాళ్ళు నిజముంది. రామకృష్ణారావు గారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని అప్పట్లో కొందరి భావన. నిజానికి ఒడ్డూ, పొడుగూ ఉన్న చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. చిన్నమూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది.

న్యాయవాద వృత్తిలో డా|| రామకృష్ణారావుగారు సునిశిత మేథా సంపత్తిని ప్రదర్శించేవారు. కాని వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రమభావం ఉండేది. న్యాయవాదిగా వారి శక్తి సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసమున్నప్పటికీ రాజకీయ వ్యగ్రత (తొందరపాటు, కంగారు) వలన కేసుపై ధ్యాస ఉంచలేరేమో అని క్లయింట్స్ మనస్సులో ఉండేది.

నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడు వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖా మాత్రంగా వ్రాసి పెట్టుకొనేవారు. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖా మాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్జ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనా ఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం పి.వి.గారు ప్రత్యక్షంగా చూసారు. అందుకే వారిని వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాట్ రూపాన్ని ప్రదర్శించారని అన్నారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
సామ్యవాద వ్యవస్థ కోసం డా. రామకృష్ణారావుగారు చేసిన కృషి ఏమిటి?
(లేదా)
చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం. డా|| రామకృష్ణారావుగారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులయ్యారు. దీని గురించి వివరించండి.
జవాబు:
రాజకీయాలలో డా. రామకృష్ణారావుగారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. ఆయన పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినప్పటికీ పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయింది వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు, సామ్యవాద వ్యవస్థకోసం అన్నింటిని వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు.

ప్రశ్న 3.
డా.రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
బహుభాషావేత్తగా, పేరు పొందిన డా.రామకృష్ణారావు గారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
స్థిత ప్రజ్ఞుడుగా పేరు పొందిన డా॥ రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులేవి?
జవాబు:
తెలుగుజాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులలో బూర్గుల రామకృష్ణారావుగారు అగ్రేసరులు. ఒక హైస్కూలులో పర్షియన్ బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశా ఈయన ఒక్కరేనేమో. 1923లో హైదరాబాదు నగరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1929లో ఏర్పడ్డ పౌరహక్కుల పరిరక్షణ సంఘానికి రామకృష్ణారావు అధ్యక్షులుగా పనిచేసారు. రెండవ ఆంధ్ర మహాసభకు (1931లో) ఈయన అధ్యక్షత వహించారు. 1950 జూన్ 12న మంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 6న హైదరాబాదు ముఖ్యమంత్రిగా బూర్గులవారు పదవీ స్వీకారం చేశారు. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజాప్రతినిధులచే ఎన్నోకోబడిన తొలి ముఖ్యమంత్రి, పర్షియన్ ట్యూటర్ గా, న్యాయవాదిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకులుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నరుగా, రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు చేపట్టి, స్థితప్రజ్ఞతను ప్రదర్శించారు.

ప్రశ్న 4.
జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి డా.రామకృష్ణారావుగారు అనుసరించిన పద్ధతి ఏమిటి?
(లేదా)
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న బూర్గుల రామకృష్ణారావుగారి స్వభావాన్ని వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, … ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే. శక్తిని. సమయాన్ని వ్యక్తపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది.

వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగులేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన సైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినపుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినపుడుకాని, ప్రత్యర్థులు దూషించినపుడు వారనేదల్లా ఒకటే – “సరే – అవన్నీ ఆటలో ఉండేవేగా” అని.

జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడటం, పారిపోవడం, ఇంకా ఏవేవో చేయడం మనలోని అసమర్థతను తెలుపుతాయి. బూర్గుల వారిలో స్థితప్రజ్ఞత అనుసరణీయం.

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను వారివద్ద అందరికంటే జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.
ఈ) నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
జవాబు:
అ) నేను వారివద్ద అందరికంటె జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఈ) నా ఈ చొరవ, వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
జవాబు:
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.

ప్రశ్న 3.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
ఆ) వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
జవాబు:
ఆ) వారు పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“డా.రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను” – అని పి.వి.గారు అనడంలోని ఆంతర్యాన్ని తెల్పండి.
జవాబు:
సీనియర్ న్యాయవాదిగా బూర్గుల వారిదొక ప్రత్యేక తరహా. వారివద్ద అనేకమంది జూనియర్లు ఉండేవారు. తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా.రామకృష్ణారావుగారికి పి.వి. గారి మీద ఉండేది. చొరవగా, నిరాఘాటంగా తిరగడం, కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదివే పి.విగారిని చూసి, అక్కడున్న సీనియర్ గుమాస్తాకు కోపకారణమైంది. దానిని గమనించిన బూర్గులవారు నా చేష్టపై ఆమోదముద్ర వేసి, వారిరువురి మధ్య దూరం తగ్గి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. పి.వి. లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. తనను తాను నిరూపించుకొనేందుకు డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి పి.వి. ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను అనడంలోని ఆంతర్యం ఇదే.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
“బూర్గుల వారు సౌజన్యానికి మారుపేరు” వివరించండి.
జవాబు:
మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న ఆనాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి బూర్గులవారు. కానీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. అతి నిరాడంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, మౌల్వీలు, ముల్లాలు, పండితులు, మహా మహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒక్క మాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్న తరాల చివరి వారిధిలా కన్పించేవారు. అవసరమైనపుడు ఆయన ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు పడటం కాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కాని జరిగేది కాదు.

ఇలా ఎన్నో విషయాలు ఆయన సౌజన్యానికి ప్రతీకలుగా నిలిచేవి.

ప్రశ్న 3.
‘బూర్గుల బహుభాషావేత్త’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
బూర్గుల వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి యందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేసారు. 1919 – 20 ప్రాంతంలో “కన్నె కన్నులు” అనే ఖండ కృతి రచించారు. మరియు కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీకృష్ణాష్టకం, ఉమర్‌య్యూం రుబాయీలను ఫారసీ భాష నుంచే 101 రుబాయీలను తెలుగు పద్యాలుగా అనువదించారు. శంకరాచార్యులవారి సౌందర్యలహరిని వీరు 1962లో తెనిగించారు. అలాగే కనకధారాస్తవాన్ని ఆంధ్రానువాదం (1964) చేసారు. “సారస్వత వ్యాసముక్తావళి” అనే పేరుతో పరిశీలనాత్మక సాహిత్య వ్యాసాలు (1926) వ్రాసారు. ఈ వ్యాసాలు మహాకవి శ్రీశ్రీనే ఆకట్టుకొన్నాయంటే వాటి విలువ ఏమని చెప్పాలి. దాశరథి గారి ‘గాలిబ్ గీతాలు’ వంటి అనేక పుస్తకాలకు పీఠికలు వ్రాసారు. ఈయన అన్ని భాషలలో రచనలు చేయకుండా, ఏ ఒక్క భాషలోనో కృషి చేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నం వలె ప్రకాశించేవారేమో!

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ఆ) కింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావు గారిని గూర్చి పి.వి. నరసింహారావుగారు ఏమి చెప్పారో రేఖామాత్రంగా రాయండి.
(లేదా)
“బూర్గుల వారిని పూర్ణ పురుషులు” అని పి.వి. అన్నారు కదా ! వివరించండి.
జవాబు:
సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకొన్నా స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకమైన వారిలో ఒకరు కీ.శే. బూర్గుల రామకృష్ణారావు గారు. వీరి గురించి మరొక మహోన్నత వ్యక్తి, బహుఖ ప్రజ్ఞాశాలి కీ.శే. పి.వి. నరసింహారావు గారు బూర్గులవారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఈ వ్యాసాన్ని రాసారు.

బూర్గుల వారి గురించి ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, విద్యాభ్యాసం, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా అనేక అంశాలను స్పృశించినంత మాత్రాన వారి వ్యక్తిత్వం తెలియదంటారు పి.వి. ప్రతి వ్యక్తిలోను సామాన్యంగా ఉన్నదానికంటే ఎక్కువ తన గురించి అనుకొనే స్వభావం ఉంటుంది. తాను ఇతరులకంటే గొప్పవాడనిపించుకోవాలనే కోరిక ఒకరినొకరు కించపరుచుకుంటూ, తమ శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటారు. కాని ఇందుకు భిన్నంగా ఉండే బూర్గుల వారిని గూర్చి ఎంత చెప్పినా తకు నే అవుతుంది. వారి బహుముఖ ప్రతి నియుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే “రిగి పూర్వ రూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉందని పి.వి. అంటారు.

క్లయింట్లు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆ కేసు తాలుకు ఫైలు వెనుక నోటులను రేఖామాత్రంగా రాసి, కోర్టులో తన ప్రతి విశేషతతో ఎదుటి న్యాయవాదులకు కొరకరాని కొయ్యగా మారేవారు. ఆయన వద్ద జూనియర్ గా చేరిన సి వి.గారిని తాను సీనియర్ ని అనిగాక, నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయిని ప్రదర్శించేవారు. తాను పుట్టింది జాగీర్ దార్ కుటుంబంలో అయినప్పటికీ పూర్వం నుంచి వస్తున్న జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు.

సౌజన్యానికి మారుపేరు రామకృష్ణారావుగారు. నిజాం నవాబుకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. ఆయనను గూర్చి ఒక్కమాట చెప్పాలంటే మూడు విభిన్న తరాల చివరి వారధిలా కన్పించేవారి పి.వి. తెలిపారు. ఆనాటి శాసనసభా నాయకులుగా ఉండి అవసరమైనపుడు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగిలేది కాదు. ముఖ్యమంత్రి అయిన రోజుల్లో బూర్గులవారు ప్రతిరోజూ అర్థరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని, ఆ కర్వాత నమ్మశక్యం గాని ఉత్సాహంతో తెలుగు, సంస్కృత, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ ఇలా అనేక గ్రంథాలను చదివేవారు.

బూర్గుల వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు విజయాలకు పొంగలేదు. కష్టాలకు కుంగనూలేదు. ప్రత్యర్థులు దూషించినా “సరే – ఇవన్నీ ఆటలో ఉండేవేగా” అని అనేవారు. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు” అని పి.వి. గుర్తు చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

ప్రశ్న 2.
సేజ్ అంటే ఎవరు? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
పేజీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. ఫూలే సేజ్, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేజీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేజ్ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేజ్. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్ పెన్ రాసిన “మానవుని హక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని పేర్జీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేజ్, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్ని, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేజ్ చెప్పేవాడు. సేజ్, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడి పెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేజ్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేజీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేర్ జీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు.” అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు.

సేజ్ అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికి కృషిచేసిన మహనీయుడు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
(లేదా)
మంచితనంతో మూర్ఖుల మనసుకూడా మార్చవచ్చు అని నిరూపించారు సేజ్. జ్యోతీరావ్ పూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటన గురించి రాయండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడి పెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు ఫూలేని చంపమని దోండిరామ్, కుంబార్ రోడే అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నిశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఫూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, ఫూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెతారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని ఫూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు.

అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.

వెంటనే దోండిరామ్, కుంబార్ రోడేలు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రి బడిలో చేరారు. కుంబార్ రోడే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ రోడే “వేదాచార్” అనే పుస్తకం రాసి, ఫూలే పనికి సాయం చేశాడు.

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం ; నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని ఫూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేజ్ అని పిలిచేదాన్ని. సే జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సేన్ జీ సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేజీకి చెప్పింది.

సేజ్ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేజీకి సలహా చెప్పారు. అయినా సేజ్ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, పేజీ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేజీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేజ్ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేనే మొదటి పంతులమ్మను. శిశుహత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేర్జీ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ… సావితీబాయిని Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
ఇ) అమ్మా ! నా సీమ చింతకాయలు నేను, పడిపోతున్నా, కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
జవాబు:
ఇ) అమ్మా ! నా సీమచింతకాయలు, నేను, పడిపోతున్నా. కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 2.
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?
ఈ) ఈ సేజ్ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా?
జవాబు:
ఈ) ఈ పేజీ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా ?
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?

ప్రశ్న 3.
అ) నువ్వు చెప్తారు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.
ఆ) ఒక రోజు సాయంత్రం సేణీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా ? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సే జ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
జవాబు:
ఆ) ఒక రోజు సాయంత్రం సే జీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సేజ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
అ) నువ్వు చెప్తావు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.

ప్రశ్న 4.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?” అని సేర్ జీ వారిని అడిగాడు.
జవాబు:
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?’ అని సేజ్ వారిని అడిగాడు.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.

ప్రశ్న 5.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.
ఆ) సేర్జీ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
జవాబు:
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
ఆ) సేజ్ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 6.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేత్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
జవాబు:
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేర్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సావిత్రీబాయి’ పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
ఆధునిక భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. అంటరాని వాడల్లోని బాలికలకు చదువు చెప్పడమే కాక భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి సామాజిక చైతన్యోద్యమానికి ఊపిరి పోసింది. అంటరాని పిల్లలకు చదువు చెప్పడానికి వెళుతున్నప్పుడు జనాల శాపనార్థాలకు, భర్తను చంపడానికి కిరాయి మనుష్యులు వచ్చిన సందర్భంలోను భయపడని ధీరురాలు సావిత్రీబాయి. ప్రాణాంతకమైన అంటువ్యాధి ‘ప్లేగు’తో బాధపడుతున్న పసిగుడ్డును రక్షించడానికి ప్రయత్నించిన కరుణామూర్తి సావిత్రీబాయి.

ప్రశ్న 2.
సావిత్రీబాయి వంటి స్త్రీలు సమాజానికి ఎంతవరకు అవసరం?
జవాబు:
ప్రతి వ్యక్తికి పుట్టింది మొదలు చచ్చేవరకు తోడు ఉండేది, బాధపడేది స్త్రీ మూర్తె. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఇలా అనేక రూపాలుగా ప్రతివ్యక్తి జీవితంలో తోడు ఉంటుంది. అటువంటి స్త్రీ ఎదుగుదలను కోరుకోవటం కృతజ్ఞత. ఎదగనీయకపోవటం కృతఘ్నత. నేటి సమాజంలో అక్షరాస్యత ఉంది. అంటరానితనం కూడా కొంత తొలగింది. అది సంపూర్ణత్వం సాధించడానికి సావిత్రీబాయి వంటి స్త్రీ మూర్తుల అవసరం ఎంతో ఉంది. నేటికాలంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా మహిళల సాధికారత ఎంతో అవసరం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
సావిత్రీబాయి చదువు, నేర్చుకునే విషయంలో మామగారి నుండి వచ్చిన విమర్శ ఏమిటి?
జవాబు:
జ్యోతిబాఫూలే ఫరార్ అనే ఆమె మాట ప్రకారం తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పుతున్నాడు. సావిత్రీబాయి మెల్లగా అచ్చులు, హల్లులు, మాటలు, వాక్యాలు నేర్చుకోసాగింది. ఆ సమయంలో జ్యోతిబాఫూలేను ఆయన తండ్రి, “సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు? అసలు మన కులం వాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నీవు నీ భార్యకు చదువు చెబుతున్నావు. ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది. బుద్ధి లేనిదవుతుంది” అని అన్నారు. “నాన్నా ! సావిత్రి చదువుకుని ఆ మాటలు అబద్దాలని నిరూపిస్తుంది” అన్న జ్యోతిబాఫూలే మాటలకు ఏమీ చెప్పలేక అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు.

ప్రశ్న 4.
సావిత్రీబాయి చేత మా ‘సేజ్ అని పిలిపించుకొన్న ‘సేజ్ వ్యక్తిత్వం వివరించండి.
జవాబు:
సావిత్రీబాయి భర్త పేరు మహాత్మ జ్యోతిరావ్ పూలే. సావిత్రి ఈయన్ని సేజ్ అని పిలిచేది. సావిత్రీబాయి దృష్టిలో భర్త అంటే “ఎప్పుడు బడి, పుస్తకాలు, చదువు ఇదే ప్రపంచం ఆయనకు” అంటుంది. సేజ్ కులాల గొడవలు విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలని చెప్పేవాడు.

సేర్ జీ విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు. ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్యకు చదువు చెప్పించాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంతధనంతో బడి పెట్టాడు. మానవులంతా సమానులనీ, బీదలకు సాయం చేయడమే తన జీవితాశయమనీ చెప్పాడు. శిశుహత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. ‘కులం కన్నా గుణం మిన్న’ అనే సిద్ధాంతంతో ‘సత్యశోధక సమాజాన్ని’ స్థాపించాడు. ఈయన స్త్రీ విద్యకూ, కుల రహిత సమాజానికి కృషి చేసిన మహనీయుడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
సావిత్రీబాయి గొప్ప సంఘసేవకురాలు. ఈమె మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారింట్లో పెద్దకూతురిగా పుట్టింది. వెర్రిగా చేలల్లో పడి, పరిగెత్తేది. ముళ్ళూ గిళ్ళూ లెక్కచేసేది కాదు. చింతకాయలు కొట్టుకు తినడం, రేగుపళ్ళు కోసుకు తినడంలో సావిత్రీబాయిని మించినవారు లేరు. ఈమెకు చిన్నప్పుడే జ్యోతీరావ్ తో పెండ్లి అయ్యింది. అక్కడ భర్తనూ, అత్తమామల్నీ సేవిస్తూ వంట వండి పెట్టేది.

సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఎన్నో విషయాలు చదివి చెప్పేవాడు. సావిత్రీబాయికి భర్త చదువు చెప్పాడు. భర్త నడిపే స్కూలులో పంతులుగారు మానివేస్తే, సావిత్రీబాయి అక్కడ పంతులమ్మగా పనిచేసింది. సావిత్రీబాయి పంతులమ్మ కావడం ఇష్టం లేని ప్రజలు సావిత్రీబాయిని తిట్టేవారు. శాపనార్ధాలు పెట్టారు. అయిన సావిత్రీబాయి బడి కిటికీ తలుపులు మూసి, పిల్లలకు పాఠాలు చెప్పింది. సావిత్రీబాయి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. భర్తతో పాటు సత్యశోధక సమాజాన్ని స్థాపించింది. సావిత్రీబాయి ఆదర్శ స్త్రీ. భర్త పోయాక, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేసింది. చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకడంతో సావిత్రీబాయి కన్ను మూసింది.

ప్రశ్న 2.
బీదవాళ్ళకు సహాయం చెయ్యటమే నా జీవితాశయం – వాళ్ళచేతుల్లో చావటంలో తప్పేముంది? ‘చంపండి – రండి చంపండి’ అన్న పేజీ మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
పేజీ తన జీవితాన్ని బీదవారికి సాయం చేయడానికే అంకితం చేశాడు. సే జీ తక్కువ కులాల ఆడపిల్లలకు బడులు పెట్టి చదువు చెప్పించాడు. భార్యకు తానే చదువు చెప్పి, ఆ బడిలో ఆమెను పంతులమ్మను చేశాడు.

అలాచేస్తే సంఘం పాడవుతుందని, కొందరు పెద్దలు సేజీని చంపమని ఇద్దరు హంతకులకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ వచ్చినవాళ్ళు తాము సేజీని చంపడానికి గల కారణాన్ని చెప్పారు.

బీదవాళ్ళ చేతుల్లో చావడం తనకు ఇష్టమే అని సేజ్ మెడవంచి నిలబడ్డాడు. దానితో ఆ హంతకులు మనసు మార్చుకొని, తమకు కాంట్రాక్టు ఇచ్చిన వారినే చంపడానికి సిద్ధపడ్డారు. దీనిని బట్టి సేజ్ త్యాగమూర్తి అని, భయం లేనివాడని, హంతకుల మనస్సును కూడా మార్చగల ఉత్తమ శీలం కలవాడని నేను అర్థం చేసుకున్నాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
‘అల్లరి చేయుట పిల్లల వంతు’ అన్నాడు ఒక కవి. సావిత్రీబాయి బాల్యం కూడా అల్లరి పనులతోనే గడిచింది. దానికి సంబంధించి ఒక సంఘటనను వివరించండి.
జవాబు:
అల్లరి చేయుట పిల్లలవంతు అన్న కవి మాటలు సావిత్రీబాయి బాల్యానికి సరితూగుతాయి. సావిత్రీబాయి మహారాష్ట్రలోని నైగావ్ లో పుట్టింది. చిన్నప్పటి నుండి అల్లరి పిల్లే. ఒకసారి సీమ చింతకాయలు చెట్టెక్కి కోస్తుంటే కొమ్మ విరిగి వ్రేలాడుతూ ఉంది. అప్పుడు ‘అమ్మా నా సీమచింతకాయలు, నేను పడిపోతున్నా, కొమ్మ విరిగింది, నేను పడిపోతున్నా’ అంటూ అరిచింది. వాళ్ళ నాన్న వచ్చి కిందికి దింపాడు. అమ్మ అరుస్తోంది. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారని. అమ్మతో ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ అంటూ తల్లికి సీమచింతకాయ ఇచ్చి అక్కణ్ణుంచి పరుగుతీసింది.

ప్రశ్న 4.
‘ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో’ అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసిన బాల సావిత్రీబాయి బాల్యం వివరించండి.
జవాబు:
పైగావ్ గ్రామంలో పాటిల్ గారి పెద్ద కూతురుగా పుట్టిన సావిత్రిబాయి బాల్యంలో చేలలోపడి పరిగెత్తుతూ, గులకరాళ్ళను, దుమ్మునూ తన్నుకుంటూ, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా లెక్కచేయక, విరబోసుకున్న జుట్టుతో వెర్రిగా పరుగులు తీసేది. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకుతినడం దినచర్య సావిత్రికి. ఒక రోజు సీమచింతకాయలు కోస్తూ కొమ్మ విరిగి కిందకు వేలాడుతూ దించమని అమ్మను పిలిస్తే ఆమె చివాట్లు పెట్టింది. తండ్రి వచ్చి కిందికి దించుతాడు. ఈ పిల్లకు తొందరగా పెళ్ళి చేయాలి. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారన్న తల్లి మాటలకు ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసింది గడుగ్గాయి సావిత్రి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.

ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్ కు ఆటలంటే ప్రాణం.

నరేనకు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేను క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలు తెల్పండి.
(లేదా)
నరేంద్రుని అమెరికా పర్యటన విశేషాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓ ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుడుని “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్’లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జే. హెచ్.రైట్ తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుడిని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుడిని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి?
జవాబు:
వివేకానందుని సందేశము :
“మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారత జాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి !”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాలు ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యా లపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్ర పాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి.

సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి!

ప్రశ్న 5.
‘శివా శివా’ అంటూ నెత్తిమీద చల్లనీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయే నరేంద్రుడి బాల్యం గురించి రాయండి.
జవాబు:
విశ్వవిఖ్యాతి నొంది సింహసదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద చిన్నప్పుడు బాగా అల్లరివాడు. ఈ గడుగ్గాయిని పట్టుకోవడం తల్లియైన భువనేశ్వరిదేవికి గగనమైపోయేది. అల్లరి బాగా మితిమీరిపోయినపుడు ‘శివశివా’ అంటూ నెత్తిమీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు (రామాయణ, భారత, భాగవతాలు) నేర్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామ నామ జపం చేసే ఆంజనేయుడు అరటితోటల్లో ఉంటాడని ఎవరో చెప్పగా, ఆ మహావీరుణ్ణి చూడడానికై అక్కడి తోటల్లో వెతికేవాడు.

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వాక్యాలను వరుసక్రమంలో అమర్చి రాయండి. 4 మార్కులు

ప్రశ్న 1.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
జవాబు:
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 2.
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
జవాబు:
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.

ప్రశ్న 3.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెఢవేగంతో లాక్కెళ్ళుతోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపరచి ఆగిపోయేటట్లు చేశాడు.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకుని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
జవాబు:
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెట్టి వేగంతో లాక్కెళ్ళుతోంది.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకొని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపఱచి ఆగిపోయేటట్లు చేశాడు.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.

ప్రశ్న 4.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
ఈ) “ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
జవాబు:
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఈ) ‘ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.

ప్రశ్న 5.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో అని గట్టిగా అరిచాడు”.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
జవాబు:
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నేదుర్కో అని గట్టిగా అరిచాడు”.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.

ప్రశ్న 6.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఇ) రైల్లో సాన్బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
జవాబు:
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
ఇ) రైల్లో సాన్‌బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.

ప్రశ్న 7.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో ” నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలు పెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
జవాబు:
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో “ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలుపెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 8.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
జవాబు:
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.

ప్రశ్న 9.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
జవాబు:
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

ప్రశ్న 10.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా …..’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
జవాబు:
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా ……’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? తల్లిదండ్రులెవరు?
జవాబు:
నరేన్ అని, నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన వివేకానంద స్వామి కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీ దేవి, విశ్వనాథ దత్తా దంపతులకు జన్మించారు. విశ్వనాథ దత్తా మంచి పేరున్న వకీలు. భువనేశ్వరీ దేవి రూపంలోను, ప్రవర్తనలోను ఒక రాణి వలె ఉండేది.

ప్రశ్న 2.
వివేకానందుడు తనకు తాను పెట్టుకొన్న నియమాలేవి?
జవాబు:
స్వామీజీ ఎన్నోసార్లు తనకోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియామాలెన్నో పాటించేవారు.

ప్రశ్న 3.
వివేకానంద స్వామి కల ఏమిటి?
జవాబు:
అమెరికా, భారతదేశాల మధ్య ప్రాక్పశ్చిమ సంబంధాలు పెరిగి, భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మికతను బోధించాలని, వాళ్ళు భారతీయులకు సైన్సు, సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కల.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 4.
వివేకానందుని గురువైన శ్రీరామకృష్ణుల స్వభావాన్ని గురించి రాయండి. . .
జవాబు:
వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకు ప్రతిరూపం. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారు, ఏం చెప్పేవారో అదే చేసేవారు. వీటన్నింటికీ మించి నరేంద్రుని అతని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారు.

ప్రశ్న 5.
‘ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది’ అని నరేంద్రుని గురించి ప్రొఫెసర్ జెహెచ్.రైట్ చెప్పిన విషయాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
బోస్టన్లోని సాన్ బోర్న్ ఇంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన జె. హెచ్. రైట్ తో వివేకానందకు పరిచయమైంది. శాస్త్రీయమైన, తాత్త్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు. వారిరువురు. షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానంద గూర్చి సిఫార్సు చేస్తూ “ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది” అని రాశారు. ఈ మాటలను బట్టి వివేకానందుని పాండిత్య ప్రతిభ ప్రకటితం అవుతోంది. వివేకానంద శాస్త్రీయ, తాత్త్విక విషయ పరిజ్ఞానం గొప్పదని తెలుస్తోంది. ఇంకా ప్రొఫెసర్ రైట్ గొప్ప వ్యక్తిత్వం కూడా తెలుస్తోంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు, రామకృష్ణుల మధ్య జరిగిన తొలి సంభాషణను రాయండి.
జవాబు:
నరేంద్రునికి ఆధ్యాత్మికత ఇష్టం. మతం బోధించే చాలా విషయాల్లో అతడికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు. స్నేహితుల సలహాతో శ్రీరామకృష్ణ పరమహంసను కలిశారు. తన సంశయాన్ని ప్రశ్నరూపంలో “అయ్యా! తమరు భగవంతుణ్ణి చూశారా?” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఓ చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ, నాయనా ! భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు ? భార్యాపిల్లలకోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం” – అని గుండె పై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఇలా వారి తొలి సంభాషణ జరిగింది.

ప్రశ్న 2.
షికాగో విశ్వమత మహాసభల్లో స్వామి వివేకానంద చేసిన తొలి ప్రసంగం గూర్చి రాయండి.
జవాబు:
1893 సెప్టెంబరు 11వ తేదీన విశ్వమత మహాసభలు మొదలైనాయి. కొలంబస్ హాల్ అనే పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. స్వామివారిని పిలిచేసరికి లేచారు. సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన ఆయన కంఠంతోను, అంతకంటే మధురమూ, పరమ పవిత్రమూ అయిన ఆయన హృదయాంతరాళాలలో నుండి వచ్చిన విశ్వమాన సౌభ్రాత్ర భావనతోను “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ……..” అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకీ, ఇంద్రియగ్రహణము కాకపోయినా తమముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకూ, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికీ తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
షికాగో నగరంలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో ఆయన మానసిక స్థితిని రాయండి.
జవాబు:
షికాగో నగరంలో వివేకానంద స్వామీజీకి ఇచ్చిన వసతులు ఆయనకు తృప్తినివ్వకపోగా గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది. “అయ్యో ! నా భారతదేశ ప్రజల్లో అధికభాగం తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలేక అలమటిస్తూంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే ! వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే! అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలికా తల్పాలు? ఎవరిక్కావాలి ఈ ధనం, కీర్తి ప్రతిష్ఠ? అమ్మా జగజ్జననీ, నేనివేవీ అడగలేదే ? వాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తినీ, జ్ఞానార్తినీ తీర్చు. వారిని మేల్కొలుపు. వారిని మనుష్యులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తామూ ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోదిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు.

ప్రశ్న 4.
స్వామి వివేకానంద పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
వివేకానందుడికి బాల్యంలో నరేంద్రుడు అని పేరు ఉండేది. వివేకానందుడు సాహసవంతుడైన బాలుడు. పరుగు పెడుతున్న బండిలోకి ఎక్కి ఒకసారి బండిలోని స్త్రీని రక్షించాడు. నరేంద్రుడు అల్లరి పిల్లవాడు. ‘శివశివా అంటూ నెత్తిపై నీళ్ళు పోస్తే శాంతించేవాడు.’

బాల్యంలో తల్లి నుండి భారత భాగవత రామాయణ కథలు విన్నాడు. రాముడన్నా, రామాయణమన్నా నరేంద్రుడికి ఎంతో ప్రేమ. ఆటలంటే బాగా ఇష్టం. మంచి జ్ఞాపకశక్తి కలవాడు. ‘రాజు – దర్బారు’ ఆట అంటే బాగా ఇష్టం. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి, సన్యాసం స్వీకరించాడు. భారతదేశమంతా పర్యటించాడు. వివేకానంద అనే పేరుతో అమెరికాలోని విశ్వమత మహాసభలో పాల్గొని, భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందన్నారు.

వివేకానందుడి ఖ్యాతి ప్రపంచం అంతా వ్యాపించింది. విదేశాల నుండి తిరిగి వచ్చిన స్వామికి భారతదేశం బ్రహ్మరథం పట్టింది. వివేకానంద స్వామి యువకులకు సందేశం ఇచ్చాడు. యువకులకు ప్రేమ, నిజాయితీ, సహనం ముఖ్యమన్నారు.

లేవండి! మేల్కొనండి! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండని వివేకానంద యువకులకు సందేశం ఇచ్చారు.

ప్రశ్న 5.
లేవండి ! మేల్కొనండి ! అంటూ జాతిని జాగృతం చేసిన వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటూ వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు. సాహసికులైన యువకులారా ! మీకు కావల్సినవి మూడే విషయాలు. అవి ప్రేమ, నిజాయితీ, సహనం. ప్రేమించలేని మానవుడు జీవన్మృతుని కింద పరిగణింపబడతాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారికొరకు వేదన చెందండి. పరితపించండి. పిరికితనాన్ని విడనాడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనుల కోసం శ్రమించండి. వారిని ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలననుసరించండి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 6.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
“భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది. అన్ని మతాలూ సత్యాలే, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలు” అని స్వామీజీ చెప్పిన మాటలు అమెరికా ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాయి. ఎవరూ మతం మార్చుకోనవసరం లేదనీ, నా మతం గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారనీ స్వామీజీ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. మతం తల్లి లాంటిది. తల్లి మనసే అర్థం కానప్పుడు మనం మనుగడ ఎలా సాగిస్తాం ? ఇదేమి స్వార్ధ రాజకీయం కాదుగా ? కప్పలాగా అటూ ఇటూ గెంతడానికి.

సభలోని మిగతా వక్తలు తమతమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరుఫునా మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది. ఎక్కడైనా నలుగురి గురించి ఆలోచించేవారే మన్నన పొందుతారు అనడానికి ఇదే నిదర్శనం.

జాతి, మత తారతమ్యం కూడదనీ, ధనిక, పేద వివాదం లేకుండా అందరూ నా సహోదరులేనని చాటాలి, ప్రతి ఒక్కరూ తనకోసం కాక, దేశం గూర్చి ఆలోచించాలన్నారు. స్త్రీ జనోద్ధరణ, విద్యావ్యాప్తి సక్రమంగా సాగాలన్నారు. పరిశోధనలు కూడా వాడుకభాషలో నిర్వహించాలన్నారు. యువతకు ‘ప్రేమ, నిజాయితీ, సహనం’ కావాలన్నారు. పిరికితనం విడిచి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీన జనులను ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి” అంటూ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్గించే వివేకానందుని స్ఫూర్తిదాయకమైన మాటలు అప్పటికే కాదు ఇప్పటికీ ప్రేరణ కల్గించేవని నేను గ్రహించాను.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 11 ధర్మదీక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడంకోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యులలో ఒకడు, జంతువుల దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోసేవాడు. జంతువులు వచ్చి ఆ నీటిని త్రాగుతూ ఉండేవి. ఆ విధంగా వాటి దాహ బాధ తీరింది.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
మనం తోటి ప్రాణులకు సహాయం చేస్తే, ఆ ప్రాణులు తిరిగి మనకు సహాయం చేస్తాయి. మనం తోటి మానవులకే కాక పరిసరాల్లో ఉన్న జంతువులకు సహితం సాయం చేయాలి. వాటిపై దయ చూపాలి. మనం సాయం చేస్తే జంతువులు సహితం మనకు సాయం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గ్రహించగలం. మన పని మనం చేస్తే, మంచి ఫలితాలు దానంతట అవే వస్తాయని ఈ కథ తెలుపుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘జీవకారుణ్యం’ అంటే ప్రాణులపై దయ అని అర్థం. తోటి మనుష్యుల పైననే కాకుండా, ప్రాణం గల జంతువులన్నింటి మీద కూడా దయ గలిగి ఉండాలి. దానినే ‘జీవకారుణ్యం’ అంటారు.

ప్రశ్న 5.
‘కర్తవ్య నిర్వహణ’ అంటే మీరేమని భావిస్తున్నారు?
జవాబు:
‘కర్తవ్యం’ అంటే ‘ప్రతి జీవి పాటించి తీరవలసిన నిష్ఠ’ అని అర్థం. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఉంటాయి. చేయవలసిన పనిని వదలకుండా ఆ పనిని చేయడాన్ని ‘కర్తవ్య నిర్వహణ’ అంటారని నేను భావిస్తున్నాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల గురించి తెలపండి.

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
“ధర్మదీక్ష”

ఆళవీ గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులు అన్నీ మేతమేసి, ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంటూ అరుస్తోంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమో అని భయం వేసింది.

మరునాడు తెల్లవారకుండానే అతడు ఆవును వెదకడానికి బయలుదేరాడు. నందగోపుడు అడవిలోని ఆవును వెదకడానికి వెడుతున్నాడు. పొరుగూరి జనం అంతా తీర్థ ప్రజలా ఆళవీ గ్రామానికి వస్తున్నారు. కారణం ఏమిటని నందగోపాలుడు అడిగితే ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆళవీ గ్రామానికి వస్తున్నాడనీ, మధ్యాహ్నభిక్ష తరువాత శ్రావస్తీ నగరానికి ఆయన వెడతాడనీ ఒక ముసలితాత నందగోపుడికి చెప్పాడు.

నందగోపుడు తాను తప్పిపోయిన ఆవును వెదకడానికి వెడుతున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే, బుద్ధుని దర్శనం తనకు కాదేమో అని నందుడికి భయం పట్టుకుంది. వెనకడుగు వేశాడు. కానీ అతనికి ఆవు దూడ అరచినట్లనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకూ అడవిలో ఆవుకోసం వెదికాడు. ఇంతలో మిట్టమధ్యాహ్నవేళలో ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవును పట్టుకొని నందగోపుడు అన్నపానాలకు అలమటిస్తూనే ఆళవీ గ్రామానికి బయలుదేరాడు.

ఆళవీ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్థుల విందును ఆరగించాడు. పొరుగూరి జనం ఎందరో బుద్ధుని ధర్మబోధలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతోంది. బుద్ధుడు ఇంకా బోధలు మొదలు పెట్టలేదు. ఎవరికోసమో ఆయన తలఎత్తి చూస్తున్నాడు. ఇంతలో ఆలస్యమయిపోతోందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరకు ఆవుతో వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధ దర్శనం అయ్యిందని నందుడు సంతోషించాడు.

బుద్దుడు లేచి, నందగోపాలుడికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. అతని ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతోందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దనీ నందుణ్ణి బుద్ధుడు ఊరడించాడు. నందుడి దగ్గర గోసాముద్రిక రహస్యాలను బుద్ధుడు తెలుసుకొన్నాడు.

తరువాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. ప్రజలంతా ఆనందంలో మునిగితేలారు. నందగోపుడికి బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చాడు. భిక్షువులంతా బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరానికి ఆశ్చర్యపడ్డారు. బుద్ధుడు వారికి తాను నందగోపాలుని కోసమే, ఆళవీ గ్రామానికి వచ్చానని తెలియ చెప్పాడు. అది విన్న భిక్షువులు, నందగోపాలుని గౌరవభావంతో చూశారు. నందగోపాలుడు మాత్రం ఆ లేగ దూడవల్లే తనకు బుద్ధుని దర్శనం లభించిందని, దూడను ముద్దు పెట్టుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘ధర్మదీక్ష’ అనే పేరు సరైందేనా? ఎందుకు?
జవాబు:
ఈ పాఠమునకు ధర్మదీక్ష అని పేరు పెట్టారు. ఈ పేరు కొంతవరకు సరిపోతుంది. గోవులను పోషిస్తూ జీవించే నందగోపాలుడికి గౌతమ బుద్ధుడు ధర్మదీక్షను అనుగ్రహించాడు. కాబట్టి ధర్మదీక్ష అనే పేరు సరయినదే. అయితే ఈ పాఠంలో నందగోపాలుడి గోవాత్సల్యం సంపూర్తిగా కనిపిస్తుంది. అతడు బుద్ధుడి ధర్మ బోధనను వినాలనుకున్నా, దానికంటే ముందుగా తనకు గల గోవాత్సల్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. నందగోపాలుడు ఆకలి దప్పులను లెక్కచేయక ఆకలితో నకనకలాడుతూనే గోవును వెదకి పట్టుకున్నాడు. బుద్ధ దర్శనం కాదేమో అనే భయంతో నేరుగా బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం వద్దకు వచ్చాడు. ఎందరో భక్తులు, బుద్ధుడు అనుగ్రహించే ధర్మదీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి ధర్మదీక్షను స్వయంగా బుద్ధుడే నందగోపుడికి అనుగ్రహించాడు.

కాబట్టి ధర్మదీక్ష అనే పేరు ఈ పాఠానికి సరిపోతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?

ప్రశ్న 1.
ఆళవికి పోతున్నాను బాబూ!
జవాబు:
ఆవును వెతకడానికి నందగోపాలుడు అడవికి పోతున్నాడు. ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి ఎందరో
వస్తున్నారు. అందులో ఒక ముసలివాడితో, “ఎక్కడికి తాత ! ఈ ప్రయాణం !” అని నందగోపుడడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ముసలి తాత నందగోపుడితో “ఆళవికి పోతున్నాను బాబూ” అన్నాడు.

ప్రశ్న 2.
నీకింకా తెలియదా?
జవాబు:
“ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!” అని నందగోపుడు ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి వస్తున్న తాతను అడిగాడు. ఆళవికి వెడుతున్నానని తాత చెప్పాడు. అప్పుడు ఆ తాత, నందగోపాలుణ్ణి బుద్ధుడు వస్తున్నాడని “నీకింకా తెలియదా?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?
జవాబు:
నందగోపుడు తప్పిపోయిన ఆవును పట్టుకొని ఎలాగో శ్రమపడి మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పుడు బుద్ధుడు లేచి నిలబడి అక్కడ ఉన్న తన శిష్యులతో “ఇంకా భోజన పదార్ధములు ఏమైనా మిగిలి ఉన్నాయా” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 4.
ఆనందగోపాలుని కోసమే !
జవాబు:
బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందగోపాలునికి భోజనం పెట్టించి, ఆదరంతో చూసి ధర్మబోధచేసి, ధర్మదీక్షను అనుగ్రహించాడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూచి మిగిలిన భిక్షువులు గుసగుసలు మాట్లాడుకున్నారు. బుద్ధదేవుడు నందగోపాలుని గోవాత్సల్యాన్ని మెచ్చుకొని, కేవలం నందగోపాలుణ్ణి చూడడం కోసమే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని శిష్యులతో అన్నాడు.

ప్రశ్న 5.
బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి.
జవాబు:
బుద్ధుడు నందగోపాలకుడి కోసమే, తాను ఆళవీ గ్రామానికి వచ్చానని చెప్పాడు. బౌద్ధ భిక్షువులు నందగోపాలుని గౌరవించి నిలబడ్డారు. అప్పుడు నందగోపాలుడు లేచి నిలబడి, “బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి అని, భిక్షువులతో అమాయకంగా మాట్లాడాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఇ) కింది పేరా చదవండి. ఖాళీలు వివరించండి.

‘కర్తవ్యం. ………… ప్రతి జీవీ పాటించి తీరవలసిన నిష్ఠ. ఒక వానపాము ఎంత అల్పజీవి! మట్టిలో పుడుతుంది. మట్టి తింటుంది. మట్టిల్ మరణిస్తుంది. మరెందుకు అది జన్మ తీసుకుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మట్టేదాని జీవనాధారమూ, జీవితమూ అయినా మట్టికీ దాని అవసరం ఉంది. అది మట్టిని తలకిందులు చేస్తుంది. గుల్లగుల్ల చేస్తుంది. గునపాలు చేయలేని ఆ సున్నితమైన వ్యవసాయాన్ని, సుకుమారమైన శరీరంతో శ్రద్ధగా అదే దాని జీవిత లక్ష్యం అన్నంత కర్తవ్యనిష్ఠతో చేస్తుంది. మనిషి మాత్రం అల్పజీవుల అవసరం ఏమిటన్న తేలికభావంతో ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడు.
1. కర్తవ్యం అంటే ప్రతి జీవీ పాటించవలసిన నిష్ఠ.
2. వానపాము జీవనాధారం మట్టి.
3. మనిషి ఉదాసీనత చూపించేది అల్పజీవులయందు.
4. పై పేరాకు శీర్షిక ‘కర్తవ్య నిష్ఠ’.
5. పై పేరాలోని ముఖ్యమైన ఐదు పదాలు : 1) కర్తవ్యం 2) అల్పజీవి 3) జీవనాధారము 4) ఉదాసీనత 5) కర్తవ్య నిష్ఠ

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపుడు ఆరాటపడడానికి కారణం ఏమిటి?
జవాబు:
నందగోపుడి గోవులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు మాత్రం రాలేదు. ఆ ఆవు దూడ ‘అంబా’ ‘అంబా’ అంటూ అరుస్తోంది. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుని ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడింది. అందుకే ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుడికి ఎంతో ఇష్టం. దూడ తల్లి కోసం అదే పనిగా అరుస్తూ ఉండటంతో నందగోపుడికి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ, నందగోపుడు ఆవు ఏమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.

ప్రశ్న 2.
నందగోపునికి ఆ ఆవంటే ఎందుకంత ఇష్టం?
జవాబు:
ఆ ఆవు నందగోపాలుడి ఇంట్లోనే పుట్టి అతని పాపలతో పాటు పెరిగి పెద్దదయ్యింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. నందుడు కూడా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడయ్యాడు.

ఈ మధ్యనే దానికి ఒక కోడె దూడ పుట్టింది. కోడె పుట్టిన వేళ మంచిది. ఆనాటి నుండీ, నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అందుకే ఆ ఆవు అంటే నందగోపాలునికి బాగా ఇష్టం.

ప్రశ్న 3.
గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఏయే ఏర్పాట్లు చేశారు?
జవాబు:
ఆళవీ గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఎదురేగి, అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాలమైన మఱ్ఱిచెట్టు నీడలో వారికి విడుదులు ఏర్పాటు చేశారు.

తరువాత తాము ప్రత్యేకంగా భిక్షువులకు విందు చేస్తామనీ, విందు ఆరగించవలసిందనీ వారిని బ్రతిమాలారు. ఈ విధంగా బౌద్ధ భిక్షువులకూ, బుద్ధునికీ గ్రామస్థులు విందు ఏర్పాట్లు చేశారు.

ప్రశ్న 4.
గౌతమ బుద్ధుడు నందగోపుణ్ణి ఏమేం అడిగాడు?
జవాబు:
గౌతమ బుద్ధుడు నందుణ్ణి గోవును గురించీ, కోడె దూడను గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు, తను కోడె దూడ నుదుటిపై నల్లని మచ్చలను గురించి, ఒంటిమీద సుడులను గురించి, ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలను చెప్పాడు. తాను వంశపారంపర్యముగా గ్రహించిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను నందగోపుడు బుద్ధునికి తెలిపాడు. గౌతమబుద్ధుడు అడిగిన కొన్ని కొన్ని చిన్న సందేహాలను నందగోపుడు గౌతమునకు తెలిపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 5.
నందగోపుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
నందగోపుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడు. అతన్ని ఎంతగా ఆకలిమంట బాధించినా, అతడు తన గోపాలక ధర్మాన్ని మరువలేదు. అతనికి గోవులపై గల వాత్సల్యం అపారము. ముప్ఫై క్రోశాల దూరం నడిచి, ఎంతో శ్రమపడి అందుకే బుద్ధుడు నందగోపుణ్ణి చూడటానికి ఆళవీ గ్రామానికి వచ్చాడు.

ఆవు తప్పిపోయిందని తెలియగానే నందగోపుడు ఎంతో ఆరాటపడ్డాడు. అతనికి అన్నం సహించలేదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాటిపోయే వరకు తనను ఆకలి దహించి వేస్తున్నా, తనకు దాహం వేస్తున్నా ఆవును అతడు వెతికి పట్టుకున్నాడు. ఈ సంఘటన నందగోపునికి గల గోవాత్సల్యాన్నీ, అతని ధర్మ నిర్వహణనూ తెలియపరుస్తుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘గోధూళివేళ అంటే ఏ సమయం? ఆ సమయంలో గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం, అది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. ఆవులు మెడలో కట్టిన గంటలు చప్పుడు చేస్తూ, ఇంటి ముఖం పడతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎఱ్ఱగా కుంకుమ ఆరపోసినట్లుగా ఉంటుంది. కొందరు ఆవులను త్రాళ్ళకు కట్టివేస్తూ ఉంటారు. కొందరు చుంద్ చుంయ్ అంటూ పాలు పితుకుతూ ఉంటారు. సాయంత్రం పైరుగాలి వీస్తూ ఉంటుంది. ఆవుల కాపరులు ఆవులను వేగంగా ఇళ్ళకు తోలుకు వస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు ఆనందంగా గంతులు వేస్తూ ఇళ్ళకు వస్తూ ఉంటాయి.

ప్రశ్న 2.
“ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయకాంతులతో, నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి”. ఈ వాక్యాన్ని మీ సొంతమాటలలో వివరించండి.
జవాబు:
ప్రజల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. వారందరిలో ఆనందం పొంగుకు వచ్చింది. ముఖాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వారు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించినట్లుగా, వారి ముఖాలు ఎర్రగా కళకళలాడుతున్నాయి. బుద్ధునికీ, భిక్షువులకూ ఎదురేగి, వారు జయజయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా బుద్ధుణ్ణి గ్రామంలోకి తీసుకువచ్చారు.

ప్రశ్న 3.
జిజ్ఞాస రేకెత్తడమంటే ఏమిటి? ఏ అంశాల పట్ల మీకు జిజ్ఞాస ఉంటుంది?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస రేకెత్తించడం అంటే, తెలుసుకోవాలనే కోరిక కలిగించడం. పిల్లలకు కొత్త కథలు, వింతలు, ఇంద్రజాల విద్యలు వగైరా చిత్రాలను గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమా కథలను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రక్క విద్యార్థులు ఏవైనా ప్రయోగాలు చేసి నూతన విషయాలను కనుక్కొంటే తాను కూడా వాటిని తెలుసుకోవాలని పిల్లలకు కుతూహలం ఉంటుంది. ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో, తూనీగలు ఎలా ఎగురుతున్నాయో, రైలు ఎలా నడుస్తోందో, యంత్రాలు ఎలా తిరుగుతున్నాయో వగైరా విషయాలను తెలుసుకోవాలనే కోరిక పిల్లలకు ఉంటుంది.

ప్రశ్న 4.
ఎదురేగి అతిథి సత్కారాలతో ఎవరెవరిని ఆప్యాయంగా పలకరిస్తారు?
జవాబు:
సన్యాసులను, మఠాధిపతులను ఎదురేగి, అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. గురువులను, పూజ్యులను, అతిథులను ఎదురేగి సత్కరిస్తారు. లోనికి రండని, స్వాగతం చెప్పి వారిని లోపలకు తీసుకువస్తారు. మంత్రులనూ, గౌరవనీయులనూ ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఆహ్వానిస్తారు.

దేవాలయాలకు ట్రస్టీలనూ, చైర్మన్లనూ నియమించినపుడు వారిని ప్రజలు గౌరవంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను, తాత ముతాతలను, పెద్దలను వారు మన ఇంటికి వచ్చినపుడు గౌరవంగా ఎదురేగి సత్కరించి ఆహ్వానించాలి. మగ పెళ్ళివారికి ఆడపెళ్ళివారు ఎదురేగి అతిథి సత్కారాలతో ఆహ్వానించాలి.

ప్రశ్న 5.
బుద్ధుని ఆప్యాయతను చూసేసరికి నందగోపాలుడి హృదయం ద్రవించి నీరైపోయింది. “హృదయం ద్రవించి నీరైపోవడం ” అంటే ఏమిటి? దీన్ని ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు?
జవాబు:
హృదయం ద్రవించి నీరైపోవడం అంటే, మనస్సు ప్రేమతో తడిసి ముద్దవడం అని అర్థం. జాలి, కరుణ, ఆర్ధత అనే గుణాలు మనస్సులో నిండడం. మనస్సు జాలితో, కరుణతో నిండిపోవడం అని అర్థం.

ఎవరైనా ఆపదలో ఉంటే, ఆ సంఘటనను చూసి జాలితో మనస్సు కరిగిపోతుంది. ఏదైనా బస్సు, ఆటో వంటి వాటికి ప్రమాదం సంభవించినపుడు, అందులోని ప్రయాణికుల కాళ్ళూచేతులు తెగితే, లేక గాయాలయితే, వారి రక్తం రోడ్డుపై ప్రవహిస్తే, అవయవాలు దెబ్బ తింటే ఆ సంఘటనను చూస్తే మనస్సు కరిగి ప్రవహిస్తుంది. మనశక్తి కొద్దీ, వారికి సాయం చేద్దామనుకుంటాం.

అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు బాధలు పడ్డ ప్రజలను చూస్తే మనస్సులు అలాగే ద్రవిస్తాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 6.
ఏ సమయాన్ని గోధూళివేళ యంటారు? అలా అనడానికి కారణమేమిటి?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం. ఇది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. పొద్దుగుంకే సమయం. అని నిఘంటువు అర్థం. ఉదయం మేతకై వెళ్ళిన ఆవులమంద, కడుపునిండినవై, బిడ్డల కడుపు నింపడానికి సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు గోవుల కాళ్ళతో రేగిన దుమ్ము ఇక్కడ గోధూళిగా చెప్పవచ్చు. గోవులు ఇంటికి వచ్చే సమయం గోధూళి వేళగా ‘రూఢి’ అయింది. (ఉదయం బిడ్డలను విడిచి వెళ్ళే గోవులు మందగమనంతో ఉంటాయి. సాయంత్రం బిడ్డలను చూడాలనే ఆతురతతో గోమాతలు నడుస్తాయి. అందువల్ల దుమ్ము రేగుతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపాలుడి గుణగణాలను వర్ణించండి.
జవాబు:
నందగోపాలుడు ఆవులను మేపుతాడు. తనకిష్టమైన ఆవు రాత్రి ఇంటికి రాకపోతే నందగోపాలుడికి అన్నం సయించలేదు. రాత్రంతా ఆవుకు ఏమవుతుందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆవుపై ప్రేమతో మరునాడుదయమే నందుడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడు. ఆకలి దహించి వేస్తున్నా, నాలుక పిడచగట్టుకు పోతూ ఉన్నా, నందుడు పట్టువిడవకుండా, ఆవును వెతికి పట్టుకున్నాడు.

బుద్ధుడు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసి, ఆయన ధర్మబోధ వినలేకపోయినా, ఆయన దర్శనం చేసుకుందామని నందుడు ఆవును తీసుకొని సరాసరి బుద్ధుడు ఉన్న మజ్జి చెట్టు దగ్గరకు వచ్చి బుద్ధునకు నమస్కరించాడు.

నందగోపాలుడి ధర్మకార్యనిర్వహణకు తృప్తిపడిన గౌతమ బుద్ధుడు నందగోపాలునికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. నందగోపాలుడికి, గోసాముద్రిక రహస్యాలు, కోడె దూడల లక్షణాలు, వంశపారంపర్యంగా తెలుసు. బుద్ధుడికి, నందుడు ఆ రహస్యాలను చెప్పాడు. నందుడు వచ్చిన తర్వాత కాని ఆనాడు బుద్ధుడు ధర్మబోధ ప్రారంభించలేదు. బుద్ధుడు స్వయంగా నందగోపాలునికి ధర్మదీక్షను ఇచ్చాడు.

నందగోపాలుడు బుద్దుని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. నందగోపాలుడిని చూడడానికే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని బుద్ధుడు శిష్యులకు చెప్పిన మాట గుర్తు పెట్టుకోదగినది.

గౌతమ బుదుడు చెప్పినట్లు నందగోపాలుని సరళవర్తనం, సాధు స్వభావం ప్రసిద్ధమైనవి. ఎంత ఆకలి మంట అతణ్ణి వేధిస్తున్నా, అతడు తన గోపాలక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. బౌద్ధభిక్షువులందరూ నందుని గౌరవభావంతో నిలబడి చూశారు. తాను వట్టి అమాయకుణ్ణని, నందగోపాలుడు అమాయకంగా వినయంతో వారికి చెప్పాడు. నందగోపాలుడు, సజ్జనుడైన ఆలకాపరి.

ప్రశ్న 2.
గౌతమబుద్ధుడు నందగోపాలుడిపై వాత్సల్యాన్ని ఎలా చూపించాడు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నందగోపాలుడి ధర్మ నిర్వహణ పట్ల, కర్తవ్యం పట్ల, అతనికి గల గోవాత్సల్యం పట్ల కరుణామూర్తియైన బుద్ధుడు ఆనందించాడు. నందగోపాలుడిని చూడాలని శిష్యులతో 30 క్రోశాల దూరం నడచి, నందగోపాలుడి ఆళవీ గ్రామానికి వచ్చాడు. నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.

నందగోపాలుడు మధ్యాహ్నము 3 గంటలకు తన ఆవుతో సహా బుద్దుడి వద్దకు వచ్చాడు. ఇంతలో ఆవు దూడ అరుపు గుర్తుకు వచ్చి అతడు ఇంటికి బయలుదేరబోయాడు. దూడ తాడు ట్రెంపుకొని తల్లి వద్ద పాలు తాగుతోందని, స్వయంగా బుద్దుడు నందుడికి చెప్పి, నందుడికి దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టించాడు.

నందగోపాలుడి భోజనం పూర్తి అయ్యాక బుద్దుడు నందుణ్ణి తనతో తీసుకొని వెళ్ళి ధర్మబోధ ప్రారంభించాడు. బుద్ధుని ధర్మబోధ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నా బుద్ధుడు నందుడు వచ్చేవరకూ బోధ ప్రారంభించలేదు.

మధ్యాహ్నమే శ్రావస్తీ నగరానికి వెళ్ళవలసియున్నా నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నందగోపాలుడికి తాను ప్రక్కన కూర్చుండి కడుపునిండా భోజనం పెట్టించాడు. నందుడికి ధర్మదీక్షను ఇచ్చాడు. నందుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడనీ, గోపాలక ధర్మాన్ని నిర్వర్తించిన సజ్జనుడనీ శిష్యులకు బుద్దుడు చెప్పి నందగోపాలకుని మెచ్చుకున్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 3.
మానవులుగా పుట్టినందుకు మనం ఎవరిపట్ల, వేటిపట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించాలి? ఎందుకని?
జవాబు:
మానవులుగా పుట్టినందుకు తోడి ప్రాణులపట్ల జాలి, దయ, సానుభూతి, అనుకంపలను మనం చూపించాలి. మానవులం కాబట్టి మనలో దానవత్వం ఉండరాదు. తోడి మానవుల యందు, ప్రకృతిలోని పశుపక్ష్యాదులయందు, కరుణ చూపించాలి. జీవహింస చేయరాదు.

మనకు ముల్లు గుచ్చుకుంటే మనం బాధపడతాము. అలాగే జంతువులు కూడా తమకు బాధ కలిగితే అవి సహించలేవు. ఏడుస్తాయి. మనము దయతో ఆ జంతువులకు కావలసిన ఆహారము, నీరు అందించాలి. కొందరు సత్పురుషులు పశు అశ పక్ష్యాదుల తిండికి, నీరు త్రాగడానికి ఏర్పాట్లు చేస్తారు. తాను అన్నం తినే ముందు, ఒకటి రెండు ముద్దలు కాకులకో, కుక్కలకో, జంతువులకో పెడతారు. అదే జీవకారుణ్యము. కొన్ని ప్రాంతాల్లో జీవకారుణ్య సంఘాలు ఉంటాయి.

తోటి ప్రాణులను, నీ ప్రాణం లాగే చూడాలి. సర్వప్రాణి సమానత్వం ఉండాలి. అల్ప ప్రాణులయిన సీతాకోక చిలుక, మిడత, దోమ, నల్లి వంటి వాటిని కూడా చంపరాదు. సర్వజీవ సమానత్వం మనందరం అలవరచుకోవలసిన మంచిగుణం. అది ముఖ్య కర్తవ్యం.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

* ఇది ఎందుకూ పనికిరాదు. దీన్ని కబేళాకు తీసుకొనిపోండి – అన్న యజమాని మాటలకు ఆ ఎద్దు గుండె గుభేలుమంది. తన గంతులేసే బాల్యం, అప్పటి నుండి తన యజమానికి చేసిన సేవ గుర్తుకు వచ్చాయి. బాధగా మూలిగింది – ఇలాంటి ఎద్దు ఆత్మకథను ఊహించి రాయండి.
జవాబు:
అవును. నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నన్ను కర్కశంగా చంపి తినేయడానికి కబేళాకు అమ్మేస్తారా ? ఎంత దారుణం!

నేను ఎంత బాగా పెరిగాను | మా అమ్మ, రోజూ నాకు తన పొదుగులో దాచి, అర్థశేరు పాలు ఇచ్చేది. అవి తాగి, లేత పచ్చి గడ్డి తిని ఎంతో బాగా గంతులు వేసేదాన్ని. నా మెడలో గంటలు కట్టి నన్ను పరుగు పెట్టించి, పిల్లలు నా వెనుక పరుగుపెట్టేవారు. ఆ రోజులే రోజులు !

నేను పెద్దయ్యాక, మా యజమాని నాగలిని ఎన్నోసార్లు లాగాను. పొలాలు దున్నాను. నా తోడి ఎదు రాముడుతోపాటు మా యజమాని బండి లాగాను. ఎంత బరువు వేసినా కాదనలేదు. ఇంతే కాదు. అందాల ఎద్దుల పోటీలో నేను నాలుసార్లు మొదటి బహుమతులు తెచ్చి మా యజమానికి ఇచ్చాను. ఎడ్ల పందేలలో మా యజమానికి మూడుసార్లు గెలుపు సాధించి పెట్టాను. బండ చాకిరీ చేశాను. ఇప్పుడు నేను పనికిరాని దాననయ్యాను.

ఈ మానవులకు జాలి లేదు. నాకు పెట్టే తిండి తగ్గించేశారు. చివరకు నన్ను కబేళాకు అమ్మేస్తున్నారు. ఇంత కృతఘ్నతా? ఈ విషయంలో మనుషుల కంటె, మా జంతువులే నయమేమో ! సరే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాము ? మా యజమాని బహుశః వాళ్ళ అమ్మా నాన్నలనూ రేపో మాపో కబేళాకు తోలేస్తాడేమో ! భగవాన్ ! మా యజమానికి కొంచెం కరుణా బుద్ధి ప్రసాదించు.

(లేదా )

* ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు, కనుమరుగయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కింది వాటిలో ఒకదాన్ని తయారుచేయండి.
i) పోస్టర్ ii) కరపత్రం iii) ప్రసంగ పాఠం
జవాబు:
ii) జంతు రక్షణ చర్యలు (కరపత్రం) :
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులు, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులు, జంతువులు. “అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

* సామ్య తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెకు పిచ్చుకలంటే మహా ప్రేమ. వాటికోసం అపార్టుమెంటు బాల్కనీలోనే కుండీల్లో చెట్లు పెంచింది. కొన్నాళ్ళకు ఆ పూలచెట్ల మధ్యే పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి. పొదిగాయి. సౌమ్య గింజలు చల్లి, నీళ్లు పెట్టి వాటి ఆలనాపాలనా చూస్తుండేది.
ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
స్నేహశీలి సౌమ్యకు శుభాభినందనలు.

ఈ రోజుల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. నీకు పిచ్చుకలంటే ఇష్టమనీ, నీకు పెద్దగా సావకాశం లేకపోయినా, మీ బాల్కనీ కుండీల్లో పెరిగిన మొక్కల మధ్య పిచ్చుకలను పెంచుతున్నావని తెలిసింది. చాలా సంతోషం.

నిజానికి పిచ్చుకలు చాలా అందంగా, ముద్దు వస్తుంటాయి. నీవు వాటిని రోజూ ఏమి వేసి పెంచుతున్నావు? మనతోటి జంతువులను ప్రేమించి, రక్షించడం మంచి అలవాటు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో నాలుగు రకాల జాతుల కుక్కల్ని పెంచుతున్నాను. సోనియాగాంధీ తోడి కోడలికి కూడా జంతువులంటే గొప్ప ఇష్టం. నీ పక్షి ప్రేమకు, నా మనఃపూర్వక అభినందనచందనం. నాకు కూడా చిలుకల్ని పెంచాలని ఉంది. పక్షుల పెంపకంలో నీ సలహాలు నాకు చాలా అవసరం. – ఉంటా. బై.బై.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠ్యాంశంలోని జాతీయాలను సేకరించండి. వాటితోపాటు మరికొన్ని జాతీయాలను సేకరించండి. వివరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) పేరా చదివి గీత గీసిన పదాలను ఏ అర్థంలో వాడారో రాయండి.
నందగోపునికి అన్నం కంటపడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గతరాత్రినించి ఆ క్షణం వరకూ అతడాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి.

1. పంచప్రాణాలూ లేచి రావడం
జవాబు:
శరీరంలో తిరిగి సత్తువ రావడం

2. ఆకలితో నకనకలాడటం
జవాబు:
ఆకలితో నీరసపడడం

3. నవనాడులు కుంగిపోవడం
జవాబు:
బాగా దిగాలు పడడం

ఆ) కింది పదాలకు సమానార్థకాలు రాయండి.
1) గోధూళి వేళ = సాయం సమయం (ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం)
2) ఆలమంద = ఆవుల గుంపు
3) తీర్థప్రజ = తీర్థమునకు వచ్చిన జనం
4) గాలించు = వెదుకు
5) విడిది = అతిథుల వసతి గృహం
6) ఉవ్విళ్లూరు = బాగా కోరుకొను
7) అనతిదూరం = కొద్ది దూరం

ఇ) వాక్యాన్ని చదివి, జాతీయాల అర్థాన్ని ఊహించి రాయండి.

1) మీ ఆప్యాయతకు నా హృదయం కరిగిపోయింది.
జవాబు:
హృదయం కరిగిపోయింది = ద్రవించింది

2) మేధావులందరూ చర్చలలో తలమునకలయ్యారు.
జవాబు:
తలమునకలయ్యారు = మునిగిపోవు

3) ఆవు అరుపు విన్నాక నందగోపాలుడికి బుద్ధుడి దగ్గరకు వెళ్ళడానికి కాలుసాగలేదు.
జవాబు:
కాలుసాగలేదు = ముందడుగు పడలేదు.

వ్యాకరణం

అ) కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. .
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.

2. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు.

3. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు.

4. ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.

1. బుద్ధదేవుడు, వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2. లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దుపెట్టుకొన్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాన లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకొన్నాడు. (సంయుక్త వాక్యం)

ఇ) విరామ చిహ్నాలు గుర్తించండి.
నాయనా నందగోపాలకుని సరళ వర్తనం సాధుస్వభావం మీరెరుగరు ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు అతని గోవాత్సల్యం అపారం ముప్పయి క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా
జవాబు:
“నాయనా! నందగోపాలుని సరళవర్తనం, సాధుస్వభావం మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా, అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు ! అతని గోవాత్సల్యం అపారం ! ముప్పయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”

ఈ) పాఠంలోని పది సమాస పదాలను రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో తెలపండి.
1) భాను బింబం = భానుని యొక్క బింబం – షష్ఠీ తత్పురుష సమాసం
2) ధర్మబోధ = ధర్మము యొక్క బోధ షష్ఠీ తత్పురుష సమాసం
3) విశాలనేత్రాలు = విశాలమైన నేత్రాలు విశేషణ పూర్వపద కర్మధారయం
4) వృక్షచ్ఛాయ = వృక్షము యొక్క ఛాయ షష్ఠీ తత్పురుష సమాసం
5) పంచప్రాణాలు = పంచ సంఖ్య గల ప్రాణాలు ద్విగు సమాసం
6) నవనాడులు = నవ సంఖ్య గల నాడులు – ద్విగు సమాసం
7) అన్నపానాలు = అన్నమును, పానమును ద్వంద్వ సమాసం
8) ముప్పయి క్రోశాలు = ముప్పది సంఖ్యగల క్రోశాలు – ద్విగు సమాసం
9) ఆనంద తరంగాలు = ఆనందము అనెడి తరంగాలు – రూపక సమాసం
10) ప్రశాంత స్వరం = ప్రశాంతమైన స్వరం – విశేషణ పూర్వపద కర్మధారయం
11) క్షుధార్తుడు = క్షుధతో ఆర్తుడు – తృతీయా తత్పురుషం

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఉ) మీరు తెలుసుకున్న అలంకారాలు ఏవి? ఈ పాతంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా? వాటిని రాయండి. లేని వాటికి మీరే సొంతంగా రాయండి.

1) ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం.
పాఠంలోని ఉదాహరణ :
1) గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసింది.
2) వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. అతంతు

2) రూపకాలంకారం :
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం.
పాఠంలో ఉదాహరణ:
1) ముఖజ్యోతి (ముఖం అనెడి జ్యోతి) (రూపకాలంకారము)
2) ఆనంద తరంగాలలో తలమునకలైనారు (రూపకాలంకారము)

3) దృష్టాంతాలంకారం :
ఉపమానోపమేయాలు వేరైనా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించడం,
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

4) స్వభావోక్తి అలంకారం :
ఉన్నది ఉన్నట్లు రమణీయంగా వర్ణించడం.
ఉదాహరణ :
లేళ్ళు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు రిక్కించి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాయి.

5) ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని చూసి ఉపమానంగా ఊహించడం.
ఉదాహరణ :
మా ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి, సింహమేమో అని భయపడ్డాను.

6) వృత్త్యనుప్రాస అలంకారం :
ఒకే అక్షరం, అనేకసార్లు రావడాన్ని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణ :
నాయనా ! నేను నిన్నేమన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

7) అంత్యాను ప్రాసాలంకారం :
ఒక అక్షరం, లేదా రెండుమూడు అక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథలో రక్తి – ఓ కూనలమ్మా !

8) లాటాను ప్రాసాలంకారం :
అర్థభేదము లేకపోయినా, తాత్పర్యభేదం కల పదాలు ఒకదానివెంట మరొకటి రావడం.
ఉదాహరణ :
కమలాక్షునర్చించు కరములు కరములు.

9) ఛేకానుప్రాసాలంకారం :
అర్థభేదం గల జంటపదాలు వెంటవెంటనే రావడం ఛేకానుప్రాసాలంకారం,
ఉదాహరణ :
వందవందనాలు.

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష కవి పరిచయం

పిలకా గణపతిశాస్త్రి 1911 ఫిబ్రవరి 24న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కట్టుంగ వీరి స్వస్థలం. విజయనగరంలో విద్యనభ్యసించారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయభాషా ప్రవీణ పూర్తిచేశారు. రత్నాపహారం వీరి తొలిరచన. మణిదీపిక, ప్రాచీన గాథాలహరి, విశాలనేత్రాలు, కాశ్మీర పట్టమహిషి, నాగమల్లిక, అందని చందమామ వీరి ఇతర రచనలు. సంస్కృతం, బెంగాలీ భాషల నుంచి అనేక అనువాదాలు చేశారు. సరళమైన అలంకారిక శైలిలో వీరి రచన సాగింది.

కలిన పదాలకు అర్థాలు

గోధూళి వేళ = సాయం సమయం ; ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం
ఆలమంద = ఆవుల గుంపు
గోవత్సాలు = ఆవు దూడలు
కుడుచుకుంటున్నాయి = చప్పరించుచున్నాయి (త్రాగుచున్నాయి)
కలకలలాడింది = ఆనందంగా ఉంది
సయించలేదు = ఇష్టం కాలేదు
ఆరాటపడు = ఆత్రపడు
= సంతాపము నొందు
అరుణోదయ కాంతులు (అరుణ +ఉదయ కాంతులు) = సూర్యోదయ కాంతులు
నూతనానందావేశాలు (నూతన+ఆనంద+ఆవేశాలు) = కొత్త ఆనందము యొక్క ఉద్రేకాలు
హృదయాంతరాళం (హృదయ+అంతరాళం) = హృదయం మధ్య చోటు
సందర్శనభాగ్యం = చూచే అదృష్టం
నిట్టూర్పు = దీర్ఘ నిశ్వాసము
వాలకం = రూపు
పులివాత = పులినోట్లో
ఆరాటం = ఆవుల పాక
తథాగతుడు = బుద్ధుడు
పాపలు = చిన్న పిల్లలు
కోడెదూడ = మగ ఆవుదూడ
పెయ్యదూడ = ఆడ దూడ

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

గౌతమదేవుడు = బుద్ధుడు
అధమ పక్షం = (మిక్కిలి చెడ్డ పక్షం) కనీసం
అంగలు = చాచివేసిన రెండు అడుగులు చోటులు
మిట్ట మధ్యాహ్నం = మధ్యాహ్న కాలము
దహించి వేయు = కాల్చు
పిడచగట్టుకుపోవు = నోరు ఎండిపోవు
స్పురించింది = తోచింది
ఆర్తనాదం = బాధతో అరిచే అరుపు
పెన్నిధి = పెద్ద నిధి
తికమకలు = బాధలు (తొట్రుపాటులు)
పొలిమేర = సరిహద్దు
సంకల్పం = ఉద్దేశ్యం
అధమం = కనీసం
మహామహుడు = గొప్పవాడు
ఉవ్విళ్ళూరిపోవు = బాగా కోరుకొను
శిష్యగణం = శిష్యుల సమూహం
విశ్రమించిన = ఆయాసం తీర్చుకొనిన
వటవృక్షం = మజ్జిచెట్టు
కాషాయాంబరధారులు = కాషాయ వస్త్రాన్ని ధరించినవారు.
భిక్షుకులు = సన్యాసులు
ముఖజ్యోతి = ముఖ ప్రకాశము
భాను బింబము = సూర్య బింబము
విడుదులు = అతిథుల వసతి గృహాలు
ఆసన్నము+అగు = సమీపించడం ; దగ్గరికి రావడం
వంశపారంపర్యత: = వంశములో ఒకరి తరువాత ఒకరుగా
అనుమతించలేదు = అంగీకరించలేదు
ప్రాధేయపడ్డారు = వేడుకున్నారు
విసర్జించు = విడుచు
అనుజ్ఞ = అంగీకారము
శ్రమణకులు = బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడి శిష్యులుగా ఉండేవారు.
వట తరుచ్ఛాయ = మట్టిచెట్టు నీడ
సమాసీనులు = చక్కగా కూర్చున్నవారు
యామాలకాలం = జాముల కాలం ; యామము అంటే 3 గంటలు
సుఖాసనం (సుఖ +ఆసనం) = సుఖమైన ఆసనం
అవలోకిస్తున్నాడు = చూస్తున్నాడు
ఆలకించు = విను
ఉత్కంఠ = ఇష్టవస్తు ప్రాప్తికై వేగిరపాటు
తహతహలాడిపోవు = వేగిరపడు
పలుకు = మాట
నేత్రాలు = కన్నులు
నిరీక్షించు = ఎదురుచూచు
స్ఫురిస్తున్నాయి = తోస్తున్నాయి
నిరీక్షణ = ఎదురుచూపు
అవగాహన = తెలిసికొనడం
అనతిదూరం = కొద్ది దూరం
పరికిస్తున్నాయి = పరీక్షిస్తున్నాయి
ఆత్రంగా = తొందరగా
ఆగమనము = రాక
సాగిలపడ్డాడు = సాష్టాంగ నమస్కారం చేశాడు
దోసిలి ఒగ్గి = చేతులు జోడించి
ఆత్రం = తొందర
పంచప్రాణాలు = ఐదు ప్రాణాలు 1) ప్రాణము 2) అపానము 3) వ్యానము 4) ఉదానము 5) సమానము
నవనాడులు = తొమ్మిది నాడులు (నాడులు అన్నీ)
నకనకలాడు = ఆకలిచే బాధపడు
పలుపు = పశువుల మెడకు కట్టు త్రాడు
ఆప్యాయత = ప్రేమ ప్రత్యక్షము = ఎదుట ఉన్నది
ద్రవించి = కరగి
కుశల ప్రశ్నలు = క్షేమ సమాచారాలను గూర్చి ప్రశ్నలు
సాముద్రిక విషయాలు = హస్తరేఖాది లక్షణాలను బట్టి శుభా శుభాలు తెలిపే శాస్త్ర విషయాలు
ఆచార్యదేవుడు = గురువు
సందేహాలు = అనుమానాలు
అభ్యర్థించారు = కోరారు
చనువు = ప్రేమ
ఉపదేశించు = బోధించు
ప్రసంగాలు = ఉపన్యాసాలు
విడ్డూరము = ఆశ్చర్యము
అష్టాంగ ధర్మ ప్రవచనం = ఎనిమిది అంగములైన ధర్మాలు చెప్పడం: 1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ వాక్కు 3) సమ్యక్ కర్మ 4) సమ్యక్ సంకల్పం లక్ష్యం 5) సమ్యక్ చేతన, మనస్తత్వం 6) సమ్యక్ జీవనం 7) సమ్యక్ వ్యాయామం 8) సమ్యక్ భావన

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆనందతరంగాలు = సంతోషపు కెరటాలు
తలమునకలగు = ఎక్కువగు
అలవోకగా = అప్రయత్నముగా ; (లీలగా)
ప్రవచనం = చక్కగా మాట్లాడడం
నిగ్రహం = సంయమనం
శ్రమణకులు = బౌద్ధ భిక్షువులు
గుసగుసలు = రహస్యం మాటలు
ఉపేక్షించి = అశ్రద్ధ చేసి
పక్షపాతం = ఒకదానియందభిమానం
సమ్యక్ సంబుద్ధుడు = బుద్ధుడు
స్వరం = ధ్వని
క్షుధార్తుడు = ఆకలితో బాధపడేవాడు
క్షుధ = ఆకలి
దుస్సహము = సహింపరానిది
యాతన = తీవ్రవేదన
సమ్యగుృద్ధి (సమ్యక్ + బుద్ధి) = సరియైన బుద్ధి
నిర్వాణం = మోక్షం
కరతలామలకం (కరతల+ ఆమలకం) – బాగా తెలిసినది (అరచేతిలో ఉసిరిక)
పశ్చాత్తప్తులు = తాముచేసింది తప్పని తెలిసి, అలా చేశామే అని బాధపడేవారు
ఆకటిచిచ్చు = ఆకలి మంట
గోవాత్సల్యం = ఆవుపై ప్రేమ
అపారం = అంతులేనిది
గో, గోవత్సాలు = ఆవు, ఆవు దూడలు
మంద = ఆవులు మొదలైన పశువుల గుంపు
అన్నపానాలు = అన్నము, పానము (తిండి, నీరు)
తాండవించాయి. = కదలియాడాయి
మురిసిపోయాడు = సంతోషించాడు
కుడుచుకొని = చప్పరించి, త్రాగి