AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

SCERT AP Board 8th Class Social Solutions 17th Lesson Understanding Poverty Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Studies Solutions 17th Lesson Understanding Poverty

8th Class Social Studies 17th Lesson Understanding Poverty Textbook Questions and Answers

Question 1.
Which of the following statement/statements in the context of poverty as chronic hunger is true?
a. Having food only once a day
b. Having food below the required calorie
c. The person driving the harvester and person ploughing the field require the same calorie of food
d. Person ploughing the field requires more calories than shop owner
e. Hunger also affects the person’s immune system
Answer:
a) True
b) True
c) False
d) True
e) True

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 2.
Identify the major reasons for poverty described in the chapter.
Answer:
Big families, lack of chances according to capacity or eligibility, less wages/salaries, change in agricultural operations, crop failure and usage of machines etc., are the major reasons for poverty described in the chapter. The most important contributor to poverty is the lack of regular employment.

Question 3.
A) What have been the major features in programmes like MNREGA and PDS?
B) Which aspects of poverty do they try to address?
C) Why are ration shops necessary?
Answer:
A) Major features:
(i) MNREGA
MNREGA lays down that any adult member willing to do unskilled manual work and who is looking for work must be given work by the government. A rural household can demand at least one hundred days of employment in a year for which they would be paid not below the minimum wages. The following are some sample activities taken up under MNREGA.

  • water conservation and water harvesting
  • drought-proofing (including afforestation and tree plantation)
  • provisions of irrigation facility to land owned by households belonging to the SCs and STs
  • renovation of traditional water bodies including desilting of tanks.

(ii) The system of ration shops distributing foodgrains and other essential items is known as the Public Distribution System (or PDS in short). PDS has existed in India right from the time of independence and has played a crucial role in reaching food to everyone both in the rural and urban areas. There were of course problems of functioning. At places, the ration shops would not open regularly or on time. The foodgrain stocks would be adulterated with the intention that no one buys. Ration shop owners would be found selling foodgrains to other shops rather than to the public. Many people including the poor would not receive ration. Performance of ration shops was not so good as expected in the poorest states and the poorest regions of India.

B) Alongside employment, the government ensured that everyone has access to affordable food. They tried to address these aspects of poverty.

C) Employment and income cannot do much, if the prices of essential items are very high. So the government supplies the basic needs at fair price. So the ration shops are needed.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 4.
Why are people without employment also often without assets, such as land, cattle, shops, etc.?
Answer:
The people those who have no employment cannot save their earnings. Without savings they cannot purchase assets. So they do not have assets.

Question 5.
Read the first two paragraphs under the title “The Struggle towards ‘the Right to Life” on page 201 and 202 and comment on them.

The Struggle towards “The Right to Life”: The new policy on PDS has been in the center of much debate. We know that about 4 out of 5 people in the rural areas consume less than the minimum required calories. And yet, not even 3 out of 10 families in the rural areas in India possessed BPL and Antyodaya cards, as per the National Sample Survey of 2004. Thus, a large number of people who earlier benefited from the PDS were no longer convered by it. Many families of landless labourers did not have BPL cards. Whereas, there were some reports of well-off families with BPL cards.

There are other contradictions too in the new PDS (Public Distribution System) Policy. The government of India often has huge piles of food stocks (i.e. foodgrains that it bought from farmers). There have been times when foodgrains rot in godowns and are eaten by rats. Since the ration shops sell foodgrains at a fair price only to BPL, Antyodaya and Annapurna card holders, there are unsold stocks at the ration shop too. And yet, there is a feeling that we are not able to provide food to all.

Answer:

  1. Today in India 4 out of 5 people in the rural areas consume less than the minimum required calories.
  2. But our government especially for rural areas they introduced Antyodaya cards for BPL people.
  3. According to national sample survey many families of landless labourers did not have BPL cards. Whereas there were some reports of well of families with BPL cards.
  4. There are so many problems with new PDS systems.
  5. Even though the government has more food grains stock, but ration shops provide food grains to only card holders and not for other people.
  6. That’s why in our country majority of landless poor people did not get even one meal for a day. Still so many families fight for “Right to life”.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 6.
Write a letter to your District Collector on the functioning of P.D.S programme in your village.
Answer:
To
The District Collector,
Machilipatnam,
Krishna District.

From
A. Suneeta, Class : VIII,
M.P. Ele. School, Nunna.
Sir,

We are residing in Nunna in Vijayawada Rural. We have a white card for our family. We are receiving 20 kgs of rice from the ration shop. For the last two months, we are receiving spoiled rice from the dealer. I came to know that all the villagers are receiving rice in less quantity also. So I request you to look into the matter and to enquire the issue. This is for kind information and necessary favourable action.

Thanking you sir,
Yours faithfully
xx xxx

Address:
A. Suneeta
D/o. A. Narasayya
Nunna; Vijayawada Rural,
Krishna District.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 7.
Visit the ration shop in your neighborhood and look for the following:
1. When does the ration shop open?
Answer:
The ration shop is open from 8 am to 12 am and from 4 pm to 8 pm.

2. What are the items sold at the ration shop?
Answer:
Rice, wheat, sugar, tamarind, red gram, and Palmolive oil are sold in ration shops.

3. Do you find the system of different card-holders?
Answer:
Yes, I find white and pink cards.

4. Can you compare the prices of rice and sugar from the ration shop (for families below the poverty line) with the prices at any other grocery store? [Important: Ask for the ordinary variety rates at the grocery shop.]
Answer:

Prices in Ration Shops Prices in Kirana Shops
1) Rice 1 kg Re. 1/- 1) Same quality Rs. 25/-
2) Red gram 1 kg Rs. 130/- 2) Same quality Rs. 160/-
3) Sugar 1 kg Rs. 14/- 3) Same quality Rs. 40/-
4) Tamarind 1 kg Rs. 65/- 4) Same quality Rs. 90/-
5) Palmolive oil 1 Itr Rs. 55/- 5) Same quality Rs. 68/-

8th Class Social Studies 17th Lesson Understanding Poverty InText Questions and Answers

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 1.
Discuss what is common about Chandraiah’s and Ramachari’s lives. (Textbook Page No. 193)
Answer:

  1. Both are economically poor.
  2. Both are sufferers of hunger.
  3. Both persons’ wives are staying in other places due to their works.
  4. Both have ill health.
  5. Both look like elders.

Question 2.
What is the average calorie intake of persons in the top quarter of the country? (Textbook Page No. 194)
Answer:
The average calorie intake of persons in the top quarter in the country is 2521.

Question 3.
By what percentage does the calorie intake of persons in the bottom quarter fall short of the daily calorie standard? (Textbook Page No. 194)
Answer:
23% of the calorie intake of persons in the bottom quarter falls short of the daily calorie standard.

Question 4.
Do you find any relationship between the economic background of the person and his/her nutritional status? (Textbook Page No. 196)
Answer:
Yes, I find the relationship between the economic background of the person and his/her nutritional status. If the economic standard is less, the nutritional status is also low and vice versa.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 5.
Do you think that the cash transfer scheme is an alternative to the PDS? (Textbook Page No. 201)
Answer:
I do not think so.
Reason:
e.g.: Through PDS the government is supplying 1 kg of rice for Re. 1/-. For this, the government is bearing the subsidy of Rs, 19/-.
In the cash transfer scheme, the government transfers these Rs. 20/- directly to the beneficiary’s account. If the price of rice in the market is high, this would not be successful.

Question 6.
In what way, was Ramachari’s livelihood related to agriculture in the village? (Textbook Page No. 293)
Answer:
Till a few years back, Ramachari would get around 40 clients, most of them farmers. They paid for his services with paddy. Each gave him 70 kilograms a year. Of the 2800 kg he got this way, he kept what his family needed and sold the rest in the market. He could get around Rs.375 for 70 kg of paddy. This was some years ago. After retaining what his family required, he could make Rs. 8000 in a year this way. With that, he looked for the family. Thus the livelihood of Ramachari was related to agriculture.
Then the poor may lose their food security. So I think this is not the right scheme.

Question 7.
Do you think the hardships that the family faces were because of:
(a) Ramachari’s lack of awareness and effort (OR)
(b) the livelihood situation in the village. (Textbook Page No. 193)
Answer:
(b) the livelihood situation in the village.

Question 8.
What do you think can be done so that Ramachari and his family get two square meals a day? (Textbook Page No. 193)
Answer:
Ramachari should also go to the nearest town with his wife for daily works. Then only he and his family can get two square meals a day.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 9.
How would you describe the exchange between Ramachari and the farmers in the village? (Textbook Page No. 193)
Answer:
I describe the exchange between Ramachari and the farmers in the village as follows:
“One for all and all for one”.

Question 10.
How many kilograms of paddy would Ramachari retain for the family in normal years? (Textbook Page No. 193)
Answer:
1300 kgs of rice approximately.

Question 11.
Can we consider Rs. 8000 a year sufficient to cover the family’s expenses (other than foodgrains)? (Textbook Page No. 193)
Answer:
Rs. 8000 per year means Rs. 667 per month. We cannot consider it sufficient to cover the family’s expenses.

Question 12.
Discuss the different living standards in the following urban picture. (Textbook Page No. 193)
AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty 1
Answer:

People in building People in tents
1) They spend luxurious life. 1) They spend miserable life.
2) They are rich. 2) They are poor.
3) They have better facilities. 3) They have no common facilities.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 13.
Here are a few steps that the government must undertake to support agricultural growth and those dependent on agriculture. Can you write a few lines on each? Why is it important? You could give examples from your own context.
i) Timely provision of seed, fertilizer, pesticides by the government such that the farmer does not have to depend on middlemen/ traders. The government must ensure that these products are of standard quality and reasonably priced.
ii) Small irrigation projects
iii) Timely availability of bank loans at reasonable interest rate
iv) Outlets or marketing the crops at a fair price for producers
v) Development of roads, transport systems in the countryside
vi) Assistance to farmers in case of crop failure . (Textbook Page No. 197)
Answer:
i) The farmers earn least income on agriculture. They cannot purchase seeds etc., from dealers for more rates.
e.g.: In recent period, the low quality cotton seeds were supplied to the farmers in some districts. They met heavy losses due to this.

ii) In India agriculture depends on monsoons which are indefinite. So the small irrigation projects should be encouraged.
e.g.: Ten years back there were no rains. So the farmers did not sow the seeds. But suddenly there were heavy rains in the months of July and August. They bought the sprouts for heavy rates and sowed them. The crops grew well. At the end of November there was a heavy cyclone. All the fields were drowned. So there should be small irrigation projects.

iii) If the loans are not available in time, the farmers would approach the money lenders or other landlords. They collect heavy interests on the loans. The farmers will become .permanent debtors.

(v) e.g.: In recent past the lorry owners announced and conducted a strike for many days. At that time some farmers failed to carry the sugarcane to the factory. They incurred heavy losses as it got dried.

vi) In case of crop failure, the banks should lend additional loans and should write off the interests. Otherwise the farmers cannot cultivate in the next crop season. They cannot repay the loan. Today many farmers are committing suicides due to these reasons.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 14.
Read the following and answer the following questions.
MNREGA lays down that any adult member willing to do unskilled manual work and who is looking for work must be given work by the government. A rural household can demand at least one hundred days of employment in a year for which they would be paid not below the minimum wages. The following are some sample activities taken up under MNREGA.

  • water conservation and water harvesting
  • drought proofing (including afforestation and tree plantation)
  • provisions of irrigation facility to land owned by households belonging to the SCs and STs
  • renovation of traditional water bodies including desilting of tanks.

(i) With the help of your teacher, find out what the above works (given in Italics) mean.
Answer:
The above mentioned works fulfil the needs of agriculture. This enables the villages to arrange their resources. This indicates the development of villages.

(ii) Plan a visit to one of the sites in your village/ town where you can see public works in progress. Record your conversations.
In our village ‘Nunna’, the canal banks are repaired under this scheme. The roads are cleaned and the tanks are desilted.
Due to this scheme, the people are getting works in summer season also. This controls their migrations.

(iii) Why do you think the MNREGA places priority on provision of irrigation facility to land owned by households belonging to the SCs and STs?
Answer:
The government sanctioned some funds for the development of SCs and STs from many years. These funds were remained unused. So these are used for irrigation and drinking water facilities to them only. With this they feel self-reliance.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

Question 15.
Why do you think is the calorie intakes of the people so low? (Textbook Page No. 194)
Answer:
As they have low earnings, they cannot purchase costly foods which have high calories. They cannot eat and cannot work. So they are habituated to eat stomachful of food, e.g.: Rice & chutney / rice & curry or rice & sambar.
So they are taking so low calories.

Question 14.
Do you think the poor will be served better now with new policy? Provide reasons in favour of your answer. (Textbook Page No. 201)
Answer:
I think that the poor will be served better now with new policy.
Reasons:

  1. The government takes back the white cards from ineligibles.
  2. So the provisions are supplied only to the poor and the poorest.

Question 15.
Ration shops are also called fair price shops. Can you guess why? (Textbook Page No. 202)
Answer:
The provisions in ration shops are available at low prices when compared to open market. So they are called fair price shops.

Question 16.
Could you suggest some more ways of improving the PDS? (Textbook Page No. 201)
Answer:
Some suggestions:

  1. The beneficiaries should be selected confidentially.
  2. Middle class also should be taken into consideration with BPL families.
  3. Standard weights should be measured in these ration shops.
  4. Dealers should be selected on a particular basis.

AP Board 8th Class Social Studies Solutions Chapter 17 Understanding Poverty

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

SCERT AP Board 8th Class Social Solutions 16th Lesson Abolition of Zamindari System Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Studies Solutions 16th Lesson Abolition of Zamindari System

8th Class Social Studies 16th Lesson Abolition of Zamindari System Textbook Questions and Answers

Improve your learning

Question 1.
When laws are passed in the Assembly, there is much discussion on it from different points of view. What would have been the different points of view regarding the Land Reform Act in the 1950s? Which point of view would have been stronger?
Answer:
Different points of view:

  1. Zamindari system should be abolished.
  2. Zamindars should be compensated.
  3. Land should be given to the poor for cultivation.
  4. Tenants should be the owners of their land.
  5. Vetti/Begar should be abolished.
  6. Large tracts of wasteland should be redistributed to the poor.
  7. Tax collection authority should be in the hands of the government.
  8. Peasantry should be protected from landlords.
    Stronger point of view: Put an end to rural poverty.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 2.
What would have been the points of view in the 1970s when the Land Ceiling Acts were passed?
Answer:
Points of view:

  1. All the wealth in the nation is centralised in some hands only.
  2. Many small farmers are the owners of small land holdings.
  3. Many Daliths are landless.
  4. Big buildings, cattle sheds and agriculture implements were left in the possession of the erstwhile landlords.
  5. Zamindars were changed as landlords and landlords as industrialists.

Question 3.
Do you think the peasant women gained from these reforms in any way? Give your reasons.
Answer:
We can say that they gained something.
Reasons:

  1. Some landlords and big farmers transferred the surplus lands to their family women.
  2. There were also instances where fictitious divorces were taken in law courts to show husband and wife as separate families. Thus they owned lands.
  3. Women also worked in fields with their husbands for coolie. But now they started working in their own fields.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 4.
Why was the end to vetti important for all kinds of peasants? What would the landlords have done to cultivate their lands now?
Answer:
‘Vetti’ is a black spot for humanity. Many struggles were led against this. So the end of it was important for all kinds of peasants. In olden days, there were no landlords as they are now. They appointed ‘Palers’ and ‘Coolies’ in their lands to work during cultivation.

Question 5.
Imagine that you are a tenant who got ownership over land when the Land Reform Act was implemented. Write down your feelings.
Answer:
“I got 4 acres of land according to this Act. I paid some amount for this. Till now I and my family members worked hard in our Dora’s fields. But from now onwards I am the owner of this land. We, the family members, work hard in our own field. We are so happy. We breathe- in the air of independence”.

Question 6.
Imagine that you are a landlord at the time of Land Reform Act. Describe your feelings and actions at that time.
Answer:
“Alas! Today is a bad day for us. I lost my 4000 acres of land. Till now my house is filled with bags of grains, wealth, servants and vetti people. But now I lost everything. By playing many tricks, I saved only 150 acres of land.
I feel very happy to see independent India but I lost all my wealth. How can we lead our life without wealth and power?”

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 7.
Many people feel that the land reform actually harmed a large number of tenants – at- will. Do you agree with this view? Give reasons.
Answer:
I do agree with this to some extent.
Reasons:

  1. Some tenants paid the price fixed by the government and owned their land.
  2. Thousands of poor peasants could not pay the price or did not have legal recognition as tenants.
  3. Zamindars retained control over their Khudkasht lands and declared their tenants to be labourers.
  4. They also evicted a large number of tenants to take over their lands for self-cultivation.

Question 8.
Why was the Land Ceiling Act not implemented effectively even though the govern¬ment tried to make effective laws?
Answer:
The Act could not be implemented properly due to machinations of the landlords and also lack of sufficient political determination on the part of the government.

Question 9.
Why do you think the spirit of Bhoodan did not help to end landlordism and get land to the tiller?
Answer:
In this movement, the landlords should donate their land with their own interest. This kind of humanity was not in them. Some of them donated only ‘Banjar’ and ‘Porambok’ lands only instead of cultivated land. 90% of the fertile lands remained with the landlords. So the movement did not help to end landlordism and get land to the tiller.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 10.
Locate Pochampally village in Nalgonda district in combined Andhra Pradesh map.
Answer:
AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System 1

Question 11.
Read the first paragraph under heading ‘Rural Poverty at the time of Independence’ and answer the following: Are the conditions improved now? In what way?
Answer:
We can say that the conditions are improved now.
They are working as industrial labours also. They are leading their lives by working in laying roads, making of handicrafts etc. They are going to schools also. The agricultural labourers have a better demand now. Thus their conditions are improved.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 12.
Form a group of five students each. Discuss the experiences of elders of your area about the land ceiling. Know out whether the issue happen in that village as mentioned in the chapter. Prepare a report and submit in the class.
Answer:

Report

We met 15 elders in this project. With this Act many were turned as beggars, some were escaped.
Some transferred the ownership of the lands to their relations, friends, labourers etc., and saved their properties. Some lost everything with this Act. They cried a lot.
On the whole the Act caused relief to some and pain to some.

8th Class Social Studies 16th Lesson Abolition of Zamindari System InText Questions and Answers

Question 1.
While the slogan ‘Land to the Tiller’ meant that the tenant will get the land, what will happen to the landless agricultural worker, who works for wages? (Textbook Page No. 185)
Answer:
The conditions of the tenants were somehow improved. But the conditions of the landless agricultural workers remain the same. They are still in the same poverty.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 2.
Some people feel that the land reform laws only tried to help the landlords. Do you agree with them? (Textbook Page No. 186)
Answer:
Yes, I agree with them.
Giving compensation to the Zamindars, continuing them as owners of the Khudkasht etc., reveal this.

Question 3.
Some people feel that the land reform laws tried to transfer land and power to prosperous tenant farmers only. Do you agree with them? (Textbook Page No. 186)
Answer:
Yes, I agree with them. The reason behind it is the government made a rule that the tenants would be given land only if they paid some price for it. Those peasants who could pay became the owners of the land. Rest of them were remained as poor only.

Question 4.
Some others feel that the laws tried to strike a balance between the interests of different rural groups in order to minimise internal conflicts. Do you agree with them? (Textbook Page No. 186)
Answer:
Yes, I agree with them.
According to these laws, the Zamindars became landlords, some tenants became land owners and some poor became owners of banjar lands. So we can say that internal conflicts were minimised.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 5.
Some people think that it should have been implemented in 1950 while others feel that such a measure would have caused a lot of opposition. Discuss the two views in the class and decide which view you agree with. (Textbook Page No. 190)
Answer:
It is very difficult to implement these laws in 1950. “Acquisition of that much land from the owners, that too immediately after independence there might be a chance of inner conflicts and strong opposition. But there were many leaders like Sardar Vailabhai Patel. The government might meet the challenges arisen. So I also think that it should have been implemented in 1950.

Question 6.
Compare the implementation of Land Ceiling Act in West Bengal and in Andhra Pradesh discuss how the Act could be effectively implemented. (Textbook Page No. 191)
Answer:
We can say that the Act was implemented in a mean way.

Several landlords gave false declarations to the officers and did not reveal the excess land. Anticipating the Act several landlords transferred their lands in the names of their close relatives, friends, and even farm servants. There were also instances where fictitious divorces were taken in law courts to show husband and wife as separate families. In this way even those farmers who had surplus land as per the Act protected their lands and did not show any surplus. Some of the surplus land that was taken over by the government was not fit for cultivation.

One of the states in which the Land Ceiling Act was more efficiently implemented was West Bengal. The West Bengal government acted with great determination and mobilized the landless and small peasants to participate in the implementation of the ceiling laws.

The Act could not be implemented properly due to machinations of the landlords and also lack of sufficient political determination on the part of the government.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 7.
Do you think there was any other way of giving gainful employment to the rural poor? (Textbook Page No. 185)
Answer:
At present there are many ways of giving gainful employment. But there were less opportunities at that time. The British destroyed the occupational system of India. The people lost all their chances of employment. So I think there were no other ways.

Question 8.
How many acres of land does a family of four persons need to get a decent living in your area? (Give the figures separately for both irrigated and unirrigated land.) (Textbook Page No. 185)
Answer:
A family of four persons needs 8 acres of irrigated land and 30 acres of dry land to get a decent living in our area.

Question 9.
Who gained most and who did not gain at all? Do you think the landlords lost much? (Textbook Page No. 186)
Answer:
Zamindars gained most.
Reasons:

  1. Even though they lost their income, they received 20, 30 times to that as compensation.
  2. ‘Khudkasht’ lands were also under their control.
  3. They used various loop holes in the law to retain control over large portion of land. The poor did not gain at all.

Reason: They remained unrecognized and as agricultural labourers.

Question 10.
Which sections of the peasants of Telangana gained from the various reforms? In what ways did they benefit? (Textbook Page No. 189)
Answer:
From the various reforms in Telangana the landlords and the ryots of some castes gained.

  1. The dominant sections of the cultivating communities of these jagirs got patta right on lands.
  2. Jagirdars received crores of rupees as compensation.
  3. Big buildings, cattle sheds and agriculture implements were left in the possession of the erstwhile landlords.
  4. Thousands of acres of fertile land also remained with them as Khudkasht lands.
    So we can say that feudalists gained much.

Question 11.
To what extent did the landless service castes benefit from these reforms? (Textbook Page No. 189)
Answer:
They were not benefited in any way from these reforms.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

Question 12.
To what extent did the landlords loose and to what extent did they manage to protect their interests? (Textbook Page No. 189)
Answer:
We can say that landlords lost nothing.

Many of the laws were implemented tardily. Due to the delay in implementation the large landlords used it to their best advantage. Using the loop holes in the Tenancy Act the Zamindars regained control over the lands from the tenants. The Zamindars after abolition continued as big landlords claiming the land as their own. These lands were diverted to set up industries. For example, the Challapalli Zamindar showed 2650 acres under his sugar factory. But eventually they transformed as entrepreneurs in Andhra. But in Telangana they continued their domination into the twenty first century.

Question 13.
Observe the following table and fill in the blanks. (Textbook Page No. 189)

The Structure and Distribution of Landholdings in Andhra Pradesh, 1956-2006
Source: Directorate of Economic and Statistics (DES), Hyderabad.

1955-56 1980-81 2005-06
Share in no. of landholdings Share in cultivated area Share in no. of landholdings Share in cultivated area Share in no. of landholdings Share in cultivated area
Small 0-2 hect. 58% 18% 73% 29% 83% 48%
Medium 2-10 hect 32% 44% 25% 52% 16% 46%
Large 10 above hect. 10% 38% 2% 19% 1% 6%
Total 100% 100% 100% 100% 100% 100%

Answer:
Reading the table: Read the figures for the year 1955-56 carefully. It tells us that, after the land reforms had been implemented 58% of farmers were small farmers with less than 2 hectares of land each. Even though they formed more than half of all farmers, they had less than 20% of cultivated land. On the other hand you can see that large farmers or landlords who were only about 10% of the farmers had about 38% of all cultivated land.
After the land ceiling was implemented in 1970s see the changes that took place. The number of small farmers who were …58..% increased/decreased to …83.. %. Medium farmers now were less in number and controlled …32% to 16..% more/ less land than before. Large landowners declined to less than …1.. % but still owned about …6.. % of land.

Question 14.
Why did the Land Ceiling Act become necessary? (Textbook Page No. 190)
Answer:
Many Acts after independence have not changed the ownership of lands in India. It changed Zamindars as landlords, landlords as big farmers. But it did nothing to the common poor.
The ownership of the land was only a few hands. So the Land Ceiling Act became necessary.

AP Board 8th Class Social Studies Solutions Chapter 16 Abolition of Zamindari System

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.

ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.

వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.

ఈ ఆటలో కొన్ని నియమాలు :

  1. నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
    15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు.
  2. ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
  3. ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
  4. ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
  5. ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.

దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.

ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.

ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.

నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.246

ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును

– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్

– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్

– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.

– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు

– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.

ఆటలు ఆడటం తేలిక.
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు.
ఆటలు సవాళ్లను విసురుతాయి.
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం.
చదువుల కంటే ఆటలు తేలిక.
టెలివిజన్లో కనపడతాం.
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు.
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి

ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.

ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.

8th Class Social Textbook Page No.249

ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.

ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 2
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.

8th Class Social Textbook Page No.250

ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
  2. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
  3. రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
  4. రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
  5. క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
  6. క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
  7. వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
  8. క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
  9. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
  10. పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
  11. క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

8th Class Social Textbook Page No.251

ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.

ప్రశ్న 9.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.

2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.

3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.

4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 10.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’

– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.

‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’

– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.

2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.

3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.

4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.

5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 3

ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.

ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.

ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.

ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.

ప్రాజెకు

ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.

మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.

ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

సినిమాలు నాటకాలు
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి. 2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు.
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు. 3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.

కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.

ఉదా :

  1. ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
  2. పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.

ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.

  1. రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
  2. రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
  3. రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.

తేడాలు :

నేను చూసిన సినిమాలు గతంలోని సినిమాలు
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి. 1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి.
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు.   2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు.
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి. 3. ఇవి విలువలు ప్రధానమైనవి.
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. 4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు.
5. హాస్యం అపహాస్యం అవుతోంది. 5. హాస్యం సున్నితంగా ఉండేది.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.

మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు

సాయంత్రం 4.30 గంటలకు విడుదలు

ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.239

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.

ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.240

ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:

పోలికలు :

  1. రెండూ వినోద మాధ్యమాలే.
  2. రెంటిలోనూ నటులే నటిస్తారు.
  3. రెండూ ప్రజాదరణ పొందాయి.

తేడాలు :

నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.

సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట

అంశాలు మూకాభినయం నాటకం
1. నటనలో సౌలభ్యం ఇది నటించడం కష్టం. ప్రయత్నిస్తే తేలిక.
2. ఎంచుకోగల అంశాలు చిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి. సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి.
3. ప్రేక్షకులకు అర్ధం కావటం ప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు. డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది.

8th Class Social Textbook Page No.241

ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.

ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.

8th Class Social Textbook Page No.242

ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.

ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”

2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||

3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”

4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”

8th Class Social Textbook Page No.243

ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.

సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.

కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.

ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..

8th Class Social Textbook Page No.244

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –

మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.

ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.

జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.

సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…

మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.

ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.

ప్రశ్న 14.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.

ప్రశ్న 15.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.

2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.

3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.

5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

ప్రశ్న 16.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.

2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.

3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.

4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.

5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.

6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు

7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.

ప్రశ్న 17.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :

  1. సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
  2. టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
  3. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
  4. ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
  5. ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 18.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

SCERT AP 8th Class Social Study Material Pdf 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.
జవాబు:
సరియైనవి
అ) అన్ని వృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.

ప్రశ్న 2.
గత 50 సం||రాలలో జానపద కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను చర్చించండి. (AS1)
జవాబు:
సినిమాలు, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార, వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా గతంలోమాదిరి గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండటం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్లు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళకు మిగిలింది నైపుణ్యంలేని కూలిపని చేయటమే.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంతమేరకు సహాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రదర్శనలలో చెప్పాల్సిన అంశాన్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందచేస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 3.
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయా? దీనివల్ల మన సంస్కృతికి ఎటువంటి నష్టం జరుగుతుంది? (AS4)
జవాబు:
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయి. దీనివల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని కోల్పోతాయి. తరువాత తరాల వారికి వీటి గురించి తెలియకుండా పోతుంది. సాంస్కృతిక వారసత్వం ఒక దేశం యొక్క ఉనికిని నిలబెడుతుంది. అది లేకపోతే దాని ఉనికే ఉండదు.

ప్రశ్న 4.
ఆధునిక జీవితంలోని కొత్త అవసరాలకు అనుగుణంగా జానపద కళలను మలిచి వాటిని పునరుద్ధరించటం సాధ్యమవుతుందా? (AS4)
జవాబు:
సాధ్యమవదనే చెప్పాల్సి వస్తుంది. నేటి జీవనం చాలా వేగంగా ఉన్నది. టీవీలు, కంప్యూటర్లు మొదలైన వాటికి ఇంట్లో కూర్చుని చూడటానికి అలవాటు పడ్డవారు ఈ జానపద కళలను ఖర్చు పెట్టి చూస్తారా అన్నది అనుమానస్పదమే. విద్యుత్తు, ఫ్యానులు వచ్చాక విసనకర్ర అవసరం తగ్గిపోయింది. పవర్ కట్ వచ్చాక మళ్ళీ విసనకర్రలు అందరిళ్ళల్లో కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే తప్ప వీటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తేలేము.

ప్రశ్న 5.
సదిర్ నాటినుంచి భరతనాట్యంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. సదిర్ నాటి తమిళనాట ఉన్న నృత్య సాంప్రదాయం.
  2. దీనిని ఆరాధనలలో భాగంగా దేవదాసీలు దేవాలయాలలో ప్రదర్శించేవారు.
  3. నట్టువనార్లు వీరికి నాట్యం నేర్పి, ప్రక్కవాయిద్యకారులుగా ఉండి అనేక రకాలుగా సహకరించేవారు.
  4. బ్రిటిషు వారి ప్రభావంతో చదువుకున్న భారతీయులు దీనిని చిన్న చూపు చూడసాగారు.
  5. తరువాత దేవదాసీ విధానం సామాజిక దురాచారంగా మారి నిషేధించబడి, అంతమైపోయింది.
  6. ఆ విధంగా 20వ శతాబ్దం ప్రారంభంనాటికి ఈ సాంప్రదాయ నృత్య రూపం అంతరించి పోయింది.
  7. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఇ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చారు.
  8. దేవదాసీల కుటుంబాలవారైన, తంజావూరుకు చెందిన సుబ్బరామన్ నలుగురు కుమారులు ముత్తుస్వామి దీక్షితార్ గారి సంగీతంతో కలిపి దీనిని సదిర్ నుండి భరత నాట్యంగా మార్చారు.

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాళ్ళలో దేవదానీ వ్యవస్థను సమర్థించినవాళ్లు, వ్యతిరేకించినవాళ్లు, అందులో సంస్కరణలు చేయాలన్న వాళ్లు ఎవరు? (AS1)
బాల సరస్వతి, రుక్మిణీ దేవి, వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణ అయ్యర్, బెంగుళూర్ నాగరత్నమ్మ.
జవాబు:
సమర్థించినవాళ్లు : బాల సరస్వతి , బెంగుళూరు నాగరత్నమ్మ.
వ్యతిరేకించినవాళ్లు. : వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ
సంస్కరణలు చేయాలన్న వాళ్లు : రుక్మిణీదేవి, కృష్ణ అయ్యర్

ప్రశ్న 7.
తమ కళ ద్వారా జీవనోపాధి పొందటం కళాకారులకు ఎప్పుడూ కట్టుగా ఉండేది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు.
  2. వీళ్ళు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు.
  3. చివరకు వారు వారికి అలవాటులేని పనిమీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

వారికి ప్రభుత్వం మద్దతును కల్పించాలి.

  1. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవడం ద్వారా కొంత సహాయం చేయవచ్చు.
  2. ప్రస్తుతం టెక్నాలజీకి అలవాటు పడిన ప్రజలు ఈ కళల గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకోసం పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రకటనలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనలను ప్రభుత్వం ఈ కళారూపాల ద్వారా టెలివిజన్లలో ఇప్పించడం ద్వారా ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఏవైనా మీటింగులు, బహిరంగ సభల సమయంలో ఈ కళాకారుల ద్వారా స్టేజిషోలు ఇప్పించడం వలన వారికి కొంతమేలు జరుగుతుంది. వారికి నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. అంతరించిపోతున్న కళలను కాపాడవచ్చు. తోలుబొమ్మలాట, బుర్రకథ ఒగ్గునృత్యం ఇలాంటి వాటి ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో నెలకు ఒకసారి ఈ కళా ప్రదర్శనలను నిర్వహించడం వలన వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
జానపద కళలను పునరుద్ధరించడానికి కళాక్షేత్ర వంటి సంస్థలు దోహదం చేయగలవా? (AS6)
జవాబు:
చేయగలవు. కాని యివి డబ్బున్నవారికి, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ కళను అందివ్వగలవు. కాని యదార్థ వారసులకు మాత్రం అందివ్వలేవు. ఈ విధంగా కళాక్షేత్రం వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలు యివ్వగలవు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 9.
మీ ప్రాంతంలోని కళాకారులను కలిసి, వారు ప్రదర్శించే నాటకాలు, కళారూపాలతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:

నాటకాలు, కళారూపాలు అంశం
పక్షి వలస పక్షుల జీవనం
అంతం – అంతం – అంతం (నాటిక) ఎయిడ్స్ పై అవగాహన
ఫోర్త్ మంకీ (నాటిక) ఉగ్రవాదంపై అవగాహన
తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం
బుర్రకథ ప్రాచీన కళారూపం
చికాగో అడ్రస్ (నాటిక) స్వామి వివేకానంద పరిచయం

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.227

ప్రశ్న 1.
ప్రదర్శన కళల ఫోటోలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్నింటిని మీరు గుర్తించగలుగుతారు? ఫోటోల కింద వాటి పేర్లు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 2

ప్రశ్న 2.
వీటిలో ఏదైనా మీ ఊళ్లో ప్రదర్శింపబడటం చూశారా? మీ అనుభవాన్ని తరగతిలో పంచుకోండి.
జవాబు:
ఒకసారి శ్రీరామనవమికి మా ఊరి పందిట్లో భారతి అనే ఒక స్త్రీ భారత నాట్యాన్ని ప్రదర్శించారు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆమె ముఖకవళికలు, అలంకరణ నాకు ఎంతో నచ్చాయి.

ప్రశ్న 3.
ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు పాడేపాటలు, చేసే నాట్యాల గురించి మీ తల్లిదండ్రులతో, తాత, అవ్వలతో మాట్లాడి తెలుసుకోండి. సందర్భం, నమూనా పాటలతో ఒక జాబితా తయారు చేయండి. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరు తెలుసుకున్న విషయాలు తరగతిలో మిగిలిన విద్యార్థులతో పంచుకోండి?
జవాబు:

సందర్భం నమూనా పాట
1. సంక్రాంతి, గొబ్బిళ్ళు 1. కొలను దోపరికి గొబ్బియల్లో యదుకుల సామికి గొబ్బియల్లో
2. బతుకమ్మ పండుగకు 1. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలు ఆనటి కాలన ఉయ్యాలు
2. కలవారి కోడలు కలికి సుందరి కడుగు చుంది పప్పు – కడవలో పోసి వచ్చిరి వారన్నలు – వనములుదాటి
3. అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె ఒప్పులగుప్ప, ఒయ్యారిభామ సన్నబియ్యం – చాయపప్పు అట్లతద్దె ఆరట్లోయ్ ముద్దుపప్పు మూడట్లోయ్
4. హారతి పాటలు గైకొనవే హారతీ – గౌరీ పాహి అమ్మనాదుమనవి ఆలకించవమ్మా ఆ అర్ధనారీశ్వరి, అభయము నీయవే
5. దీపావళి 1. అమ్మా ! సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
2. దుబ్బు, దుబ్బు, దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి
6. దసరా దాండియా నృత్యం
7. భోగిమంటలు మంటచుట్టూ చప్పట్లు కొడుతూ నాట్యం , పాట ‘గోగులపూచే, గోగులుకాచే ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు చక్కగా విరిసే ఓ లచ్చా గుమ్మాడి.”

ఇటీవల కాలంలో చాలామంది వీటిని మోటుగా భావించి ఆచరించటం లేదు. కాని యింకా యివి మన రాష్ట్రంలో సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.229

ప్రశ్న 4.
ఊరూరూ తిరిగే కళాకారులు ప్రదర్శించేవాటిని మీరు ఏమైనా చూశారా? వాళ్లు ఎవరు, ఏం చేశారు, ప్రేక్షకులు వాళ్లపట్ల ఎలా వ్యవహరించారు వంటి వివరాలను తోటి విద్యార్థులతో పంచుకోండి.
జవాబు:
మా ఊరిలో శివరాత్రికి కళ్యాణం చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. అందులో భాగంగా రామాయణంలో ‘లంకా దహనం’ ను తోలుబొమ్మలాటలో ప్రదర్శించారు. హనుమంతుడు ఎగురు తున్నట్లు, లంకను తగులబెట్టినట్లు, రావణుడి పదితలకాయలు, చెట్టుకింద సీతమ్మ తల్లి, ఎంత బాగా చూపించారో?

ప్రేక్షకులు అంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. తోలు బొమ్మలను ఆడించినవారు ఒక గుంపుగా మా ఊరికొచ్చారు. 2 రోజులున్నారు. 7 గురు పెద్దవాళ్ళు 3 గురు పిల్లలు వచ్చారు. మా ఊరి వాళ్ళు వాళ్ళని ఆదరంగా చూశారు. కొందరు బియ్యం, పప్పులు, కూరగాయలు, కొందరు పాత బట్టలు, కొందరు డబ్బులు ఇచ్చారు. తరువాత వాళ్ళు మా పొరుగురుకు వెళ్ళారని మా అమ్మ చెప్పింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 5.
అటువంటి కళాకారులు దగ్గరలో నివసిస్తూ ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ల కళలు, జీవితాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా యింటి దగ్గర గంగాధరం గారి కుటుంబం నివసిస్తోంది. వాళ్ళయింట్లో గంగాధరం గారు, ఆయన కొడుకు బావమరిది ముగ్గురు బుర్రకథలు చెపుతారు. చుట్టుపక్కల ఊర్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీరిని పిలిపిస్తారు. దీని మీద వీరికొచ్చే ఆదాయం వీరికి సరిపోదు. అందుకని సంవత్సరం పొడుగునా వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. మధ్యలో కార్యక్రమాలున్నప్పుడు వాటికి వెళతారు. వీరు వీరగాథలు, అక్షరాస్యతమీద, కుటుంబ నియంత్రణ మీద బుర్రకథలు చెబుతారు.

8th Class Social Textbook Page No.233

ప్రశ్న 6.
జాతీయ ఉద్యమకాలంలో కళాకారుల పరిస్థితులలో, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలలోని అంశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
జవాబు:
జాతీయ ఉద్యమం తరువాత స్వాతంత్ర్య భారతంలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కళలను ఆదరించేవారు కరువయ్యారు. రాజులు, జమీందారులు లేకపోవటం మూలనా వీరు అనాథలయ్యారు. ప్రజలకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులోకి రావడం మూలంగా వీరి ప్రదర్శనలకి గిరాకీ తగ్గింది.

బుర్రకథ :
వీరు జాతీయోద్యమ కాలంలో అనేక వీరగాథలు, బ్రిటిషువారి అకృత్యాలు కంటికి కనబడేలా తెలియ చేసేవారు. కాని నేడు యివి ప్రభుత్వ ఆదరణలో అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తోలు బొమ్మలాట :
వీరు పురాణ గాథలను ఎంచుకుని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కళాకారులలోను, కళా ప్రదర్శనలలోను అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

ప్రశ్న 7.
టీ.వీ, సినిమాలు ప్రధాన వినోద సాధనాలుగా మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవసరం ఉంది. మన పూర్వీకుల నుండి సంస్కృత, సంప్రదాయాలు మనకు వారసత్వంగా వచ్చాయి. ముఖ్యంగా జానపద కళల రూపంలో, అనేక వినోద సాధనాలు మన జీవితాల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జానపద కళలు, మన జాతికి గర్వకారణాలు కాబట్టి వానిని కూడా కాపాడుకోవాలి.

ప్రశ్న 8.
జాతీయవాదులు, కమ్యూనిస్టులు జానపద కళలను పునరుద్ధరించడానికి ఎందుకు ప్రయత్నించారు?
జవాబు:
జాతీయవాదం, సామ్యవాదం వంటి కథలను ఇతివృత్తాలను వారు చేపట్టడం వల్ల వారిని బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు వేధించారు. పరదేశ కళలను వ్యతిరేకించి స్వదేశీ కళలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో జాతీయవాదులు కమ్యూనిస్టులు వీటిని ప్రోత్సహించారు.

8th Class Social Textbook Page No.234

ప్రశ్న 9.
దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించేవాళ్లు, సమర్థించేవాళ్ల మధ్య చర్చ జరుగుతోందని ఊహించుకోండి. ఇరువర్గాలు చేసే . వాదనలను పేర్కొనంది. ఈ చర్యతో ఒక చిన్న రూపకం తయారు చేయండి.
జవాబు:
రామప్ప పంతులు :
అయ్యో ! యిదేం వింత? తగుదునమ్మా అని ఈ వీరేశలింగం పంతులు గారు అన్ని విషయాల్లో చేసుకుంటున్నారు? ఏమండోయ్ గిరీశంగారు ! ఇది మహాచెడ్డ కాలం సుమండీ! లేకపోతే శుభప్రదంగా భగవంతునికి దాస్యం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తుంటే దాన్ని అమానుషం అంటారేంటండి? మీరైనా చెప్పండి ! యిలా ఈ దేవదాసీ విధానాన్ని ఆపడం పాపం కదండీ!

గిరీశం : ఏమండోయ్ రామప్ప పంతులుగారు ! నేను కూడా యాంటి-నాచ్చిలో ఉన్నానండోయ్ అది సరేగాని అదే పుణ్యమైతే మరి అందరి ఆడపిల్లల్ని పంపరేంటంట. యిది ఒక కులం వాళ్ళని, వాళ్ళ బలహీనతని భగవంతుడి పేరు చెప్పి ఉపయోగించుకోవడం అని మా అభిప్రాయం.

రామప్ప పంతులు :
అయితే మధురవాణి సంగతేంటంట? ఆమెనయితే నీవు …..

మధురవాణి : హ్పప్పు………. ఏం పంతులు బావగారు ! మధ్యలో నా పేరెత్తు తున్నారు. ఏంటి సంగతి. గిరీశం గారితో మళ్ళీ ఏవైనా గొడవలాంటిది.

రామప్ప పంతులు :
అబ్బెబ్బై … అహహ…. లేదు, లేదు మధురవాణి గిరీశం గారు యాంటి- నాచ్చి అంటుంటేనూ.

మధురవాణి : అవునండి ! గిరీశం బావగారు ఈ మధ్య మారిపోయారు. దేవదాసి విధానం మంచిది కాదని, దాని రద్దు చేయాలని, ప్రభుత్వానికి అర్టీలు కూడా పంపించారు. నిజంగానే దాని మూలంగా చాలామంది ఆడవాళ్ళు అజ్ఞాతంగా ఏడుస్తున్నారు. కాబట్టి నేను కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాను. మీ సంగతేమిటి?

రామప్ప పంతులు : అది నిజమే అనుకో. కానీ ……..

గిరీశం : డామిట్ ! కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కానీ లేదు గీనీ లేదు. మళ్ళీ కనిష్టీబు గారిని పిలవమందురా?

రామప్ప పంతులు : హాహా బలే వాడివోయ్ గిరీశం నేనేదో ఆలోచిస్తూ కానీ అన్నాను. ఇంతమంది స్త్రీలు బాధపడితే నేను మాత్రం ఎలా సహిస్తాను. రేపటి నుంచి నేను కూడా మీతోపాటు యాంటి-నాచ్చి లోనే….

మధురవాణి : మంచిది బావగారు ఇకనుంచైనా ఇతరుల మేలుకోరి బతకండి.

రామప్ప పంతులు : అదే మరి … ఇక నుంచి నన్ను బావగారు అనకు మధురవాణి.

మధురవాణి : సరే సరే …
జై కందుకూరి – జైజై కందుకూరి

8th Class Social Textbook Page No.235

ప్రశ్న 10.
దేవదాసీ జీవితం గడపటం ఇష్టం లేని ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కష్టాలు ఊహించుకోండి. ఆమె తన మిత్రురాలికి తన వ్యధను వ్యక్తపరుస్తూ ఉత్తరం రాసినట్టు ఊహించుకుని ఆ ఉత్తరం మీరు రాయండి.
జవాబు:
ప్రియమైన మీనాక్షి,

ఎలా ఉన్నావు? ఇక్కడ నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు నాకు తోడున్నావు. యిపుడేమో ఈ కష్ట సమయంలో వేరే ఊరు వెళ్ళిపోయావు. అందుకే ఉత్తరం ద్వారా నా బాధ నీకు తెలియపరుస్తాను.

నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి నాకు చదువంటే ఎంతో యిష్టమని. ఈ మధ్య నేను చదువుకో కూడదని అమ్మా, నాన్న చాలాసార్లు అంటుండడం విన్నాను. కానీ కారణం యిపుడు తెలిసింది. నన్ను దేవదాసిని చేస్తారట. మా యిలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ! కి నన్ను యిచ్చేస్తారుట. మా సాంప్రదాయాన్ని అనుసరించి నేను నృత్యం నేర్చుకుని దేవాలయంలో గజ్జ కట్టాలిట. నేను పెళ్ళి చేసుకోకూడదట. నన్ను ఎవరు కోరుకుంటే వారితోనే ఆ రోజు జీవితం గడపాలిట. నాకు బిడ్డలు పుడితే వారు కూడా యిలా గడపాల్సిందేట. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా మీనా ! నీకు తెలుసుగా నాకు ఇద్దరు చెల్లెళ్లు. అన్నలు, తమ్ములు లేరు. మేం అందరం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మా, నాన్నలను ఎవరు చూస్తారు. అందుకని పెళ్ళి చేయకుండా ఇలాచేస్తే వారి ముసలితనంలో వాళ్ళని నేను ఆదుకుంటానని వారి ఆశ.

నేను చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించి చూస్తానని చెప్పినా వాళ్ళు వినటం లేదు. వచ్చే నెల మొదటి గురువారం ఉదయం ముహూర్తం పెట్టారు.

మీనా నాకు యిది యిష్టం లేదు. మీ మావయ్య పోలీసుగా పనిచేస్తున్నారుగా ! నాకు సాయం చేయవూ ! ప్లీజ్ ! ఆయన్ని తీసుకుని వచ్చి మా వాళ్లకి చెప్పి భయపెట్టవూ ! లేకుంటే నువ్వు సరేనని ఉత్తరం రాయి. బస్సెక్కి నీ దగ్గరకు వచ్చేస్తా, ఏదైనా హాస్టలులో ఉండి చదువుకుంటాను. ప్లీజ్ నాకు సహాయం చేయవూ !
ఇట్లు కన్నీళ్ళతో,
నీ నేస్తం,
అరుంధతి.

8th Class Social Textbook Page No.236

ప్రశ్న 11.
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి అందులో ఎటువంటి మార్పులు చేసి ఉంటారు?
జవాబు:
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి చేసిన మార్పులు :

  1. ఈ నాట్యాన్ని మొదటిగా మార్చినవారు తంజావూరుకు చెందిన నట్టువనార్ సుబ్బరామన్ కుమారులు నలుగురు. వీరు ముత్తుస్వామి దీక్షితర్ వారి సహకారంతో సాదిరను భరతనాట్యంగా మార్చారు.
  2. ఇది విద్యాధికులు, బ్రాహ్మణులచే కూడా నేర్వబడింది.
  3. దీని ప్రదర్శనలో ఉన్న అసభ్యకరమైన అంశాలన్నింటినీ మార్పు చేసి ఉంటారు.
  4. దీనిని ముఖ్యంగా భక్తి పూరితంగా ప్రదర్శించి ఉంటారు.
  5. దేవదాసీలు పూర్వం వలే వ్యభిచారంతో సంబంధం లేకుండా కళాకారులుగా నాట్యాన్ని ప్రదర్శించి ఉంటారు.
  6. మహిళలకు బదులు పురుషులు ఎక్కువ దీనిని నేర్చుకుంటారు.
  7. మ్యూజిక్ అకాడమీ వేదిక మీద చోటు దొరకటం దీనికి మరింత గౌరవాన్ని ఆపాదించింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 12.
ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి ఇతర కులాలవాళ్లు దాన్ని హస్తగతం చేసుకోవటం ఎందుకు ముఖ్యమయ్యింది?
జవాబు:

  1. ఈ నాట్యం దేవదాసీలది.
  2. ఇది కొంత అసభ్యతతో కూడుకున్నది.
  3. తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థతోపాటు నాట్యం కూడా దురాచారంగా చూడబడింది.
  4. అందువల్ల దేవదాసీ నిషేధంతో ఈ కళ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వ్యతిరేక పరిణామాలన్నీ పక్కన పెట్టి నాట్యాన్ని కళగా చూడటానికి, ప్రదర్శించడానికి, అందరి ఒప్పుకోలు పొందడానికి ఇతర కులాలవాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవటం ముఖ్యమైంది.

ప్రశ్న 13.
ఒక వైపున సంప్రదాయంగా ఈ నాట్యం చేస్తున్న వాళ్లని దాంట్లో కొనసాగనివ్వలేదు. ఇంకోవైపున దానిని గౌరవప్రదంగా మార్చటానికి ఇతర కులాల వాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. ఈ మార్పులలో ఏదైనా అన్యాయం జరిగిందా?
జవాబు:
నిజం చెప్పాలంటే భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించినా అది ఇంకా అనధికారికంగా కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం ఈ సంప్రదాయంలోని చెడుని నిషేధించి కళను కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తే బాగుండేది. కాని యిపుడు వ్యవస్థ మారలేదు, వారికున్న కళావారసత్వం మాత్రం దూరమయ్యింది. మరి ఈ మార్పులలో అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.237

ప్రశ్న 14.
నట్టువనార్ల ప్రత్యేక పాత్ర ఏమిటి? వాళ్ల పాత్రను నాట్యం చేసే వాళ్లే చేపడితే భరతనాట్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
నట్టువనార్లు దేవదాసీలకు పుట్టిన మగ సంతానంవారే తరవాతి తరం దేవదాసీలకు గురువులయ్యే వారు. వీరు తరతరాలుగా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటే వచ్చారు. పునరుద్ధరణ సమయంలో ఇతర కులాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా దేవదాసీలు, నట్టువనార్లే శిక్షణ నిచ్చారు. నట్టువనార్లు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించగలిగారు. వీరి గ్రామాల పేర్లతో ప్రఖ్యాతి గాంచిన వైవిధ్య భరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి.

కాని ప్రస్తుత కాలంలో ఈ కళారూపానికి నట్టువనార్లు కాక నాట్యం చేసే వాళ్ళే సంరక్షకులుగా మారారు. దీనివలన నాట్య నాణ్యత బోధన దెబ్బ తింటోంది. నట్టువనార్ల వారసత్వం దెబ్బ తింటోంది. అంతేకాక నాట్యంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి. ఇది నాణ్యతను ప్రాచీనతను దెబ్బ తీస్తోంది.

ప్రశ్న 15.
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల కళపైన, కళాకారులపైన ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన కళకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి అది జనాధారణ పొందింది. ఇది కళాకారులను, వాద్యకారులను ఆకర్షించింది. నాట్యం వినోదం స్థాయినుండి విద్య స్థాయికి ఎదిగింది.

కళాకారులు దీనికి ఆకర్షితులయ్యారు. కులంతో సంబంధం లేకుండా కళాభిరుచి ఉన్నవారందరూ అనేక ప్రదర్శనలు యిచ్చి కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అంతేకాక తిరిగి వీరు శిక్షకులుగా మారి దీనిని, ముందుతరాలకు తీసుకుని వెళ్ళుచున్నారు.

ప్రశ్న 16.
భరతనాట్యానికి వచ్చిన విపరీత ప్రజాదరణ దానికి ఎలా తోడ్పడింది? ఏ కొత్త సమస్యలకు కారణమయ్యింది?
జవాబు:
తోడ్పాటు :
ఈ కళా రూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్లు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉండటం వల్ల శిక్షణ కేవలం నట్టువనార్లకు పరిమితం కాలేదు. కళాక్షేత్ర వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్యకారులు ముందుతరాలకు దీనిని నేర్పిస్తున్నారు. అంతేకాదు చాలామంది విద్యార్థులు నాట్యకారుల నుంచి వ్యక్తిగతంగా కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శనలలో నట్టువనార్లు పోషించిన పాత్రను ప్రత్యేక శిక్షణ పొందిన సంగీత వాయిద్యకారులు. నాట్యకారులు తీసుకున్నారు.

సమస్యలు :
భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. ప్రదర్శనల ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని సాధారణంగా పొందలేరు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోటానికి, నాట్యకారులుగా ఎదగటానికి తమ జీవితమంతా అంకితం చేయగలుగుతున్నారు. డబ్బులు సంపాదించటానికి నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాలలోనే దీనిని ఇతరులకు నేర్పటం మొదలు పెడుతున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది.

నట్టువనార్లు లేకుండా మరింతమంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. కొంతమంది శిక్షకుల చేతిలో కాకుండా అనేకమంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించటం వల్ల దీంట్లో కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి.

ప్రశ్న 17.
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు ఏది?
జవాబు:
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు పద్మశ్రీ .

ప్రశ్న 18.
నాజర్ వలీ ఎవరు?
జవాబు:
నాజర్ వలీ బుర్రకథకుడు.

ప్రశ్న 19.
నాజర్ వలీ జీవిత చరిత్ర ఏ పేరుతో విడుదలైంది?
జవాబు:
నాజర్ వలీ జీవిత చరిత్ర ‘పింజారి’ పేరుతో విడుదలైంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 20.
బుర్రకథను కోస్తా ఆంధ్రలో ఏమంటారు?
జవాబు:
బుర్రకథను కోస్తా ఆంధ్రలో జంగమకథ అంటారు.

ప్రశ్న 21.
నాట్యశాస్త్ర రచయిత ఎవరు?
జవాబు:
నాట్యశాస్త్ర రచయిత భరతుడు.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.

లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.

వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:

  1. మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
  2. ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.

ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో

ప్రశ్న 7.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.

ప్రశ్న 8.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

ప్రశ్న 9.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రాయానం

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 10.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.

అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.

ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.

కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.

ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.

ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :

  1. రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
  2. అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
  3. ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
  4. హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
  5. అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
  6. ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
  7. ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
  8. స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.

ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
  2. ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
  3. ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.

జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.

డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.

మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.

నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.

భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.

ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.

వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.

ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.

ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.

ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.

బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :

  1. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
  2. దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
  3. వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
  4. అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
  5. ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
  6. నవసమాజాన్ని నిర్మిస్తారు.

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.213

ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
  2. అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
  3. వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.

తేడాలు :

రామ్మోహన్ రాయ్ స్వామి వివేకానందుడు
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు. హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు.
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. రామకృష్ణ మిషను స్థాపించాడు.
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు. మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు.

ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:

  1. ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
  2. వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
  3. వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.

ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
  2. ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
  3. ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.

తేడాలు :

దయానందుడు రాంమోహన్ రాయ్ వివేకానందుడు
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు. 1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు. 1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు.
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు. 2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 2) రామకృష్ణ మిషను స్థాపించాడు.
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు. 3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.

ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:

  1. ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
  2. అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.

8th Class Social Textbook Page No.214

ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.

ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:

DAV పాఠశాల MAO కళాశాల
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు. 1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు. 2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది.
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. 3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.

2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.

3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.

ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.

8th Class Social Textbook Page No.215

ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.

ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.

శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.

ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.

రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.

8th Class Social Textbook Page No.217

ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:

  1. బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
  2. బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
  3. కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.

ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.

ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.218

ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.

8th Class Social Textbook Page No.219

ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.

ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
  2. ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
  3. ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.

తేడాలు :

నారాయణ గురు జ్యోతిబా పూలే
1) ఈయన ఒక మత గురువు. 1) ఈయన ఒక సంఘసంస్కర్త.
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు. 2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు.
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు. 3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు.

8th Class Social Textbook Page No.220

ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.

ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 2
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 3
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 4
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 5
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.

8th Class Social Textbook Page No.221

ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
  2. ఇరువురూ కాంగ్రెస్ వాదులే.

తేడాలు :

గాంధీజీ అంబేద్కర్
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు. 1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు.
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు. 2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు.
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు. 3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు.
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు. 4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 6

ప్రశ్న 27.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

SCERT AP 8th Class Social Study Material Pdf 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 18th Lesson హక్కులు – అభివృద్ధి

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిదిద్దండి. (AS1)
అ) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.
ఆ) పథకాల అమలును కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేలా ప్రజలు చూడాలి.
ఇ) సమాచార అధికారులు ఇష్టం వచ్చినంత కాలం సమాచారాన్ని వెల్లడి చేయకుండా ఉండవచ్చు.
ఈ) వివిధ పత్రాలు చూడటం ద్వారా కార్యక్రమాలు అవినీతి లేకుండా జరుగుతున్నాయని గుర్తించవచ్చు.
జవాబు:
ఆ) పథకాల అమలును ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పర్యవేక్షించాలి.
ఇ) అడిగిన సమాచారాన్ని అధికారులు నిర్దేశిత సమయంలో వెల్లడి చేయాలి.

ప్రశ్న 2.
“అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం అవసరం” శీర్షిక కింద గల పేరా చదివి దిగువ ప్రశ్నకు జవాబివ్వండి. (AS2)

ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది, సంక్లిష్టమయినది. విధానాలు, పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడటం చాలా కష్టం. పేదల ప్రయోజనాల కోసం, పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధరణంగా వాళ్లకు చేరవు, నిధులు మళ్లింపబడతాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవటం అవినీతి ప్రబలటానికి ఒక ప్రధాన కారణమవుతోంది.
మీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం వారు వికలాంగులకు, వృద్ధులకు ఫించన్లు ఇస్తున్నారు. ప్రతినెలకు వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లు ఇస్తారు. ఈ నిధులు 2, 3 నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. వీటిని స్థానిక సంస్థల ద్వారా వీరికి అందచేస్తారు.

అయితే వీటిని బట్వాడా చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అందరినీ అక్కడికి రమ్మని చెబుతారు. దాదాపు ఒక్కో ప్రదేశంలో 400, 500 మంది వరకు 2, 3 రోజులు బట్వాడా జరుగుతుంది. పాపం వృద్ధులు, వికలాంగులు అంతంత సేపు ఎండలో, వానలో వరుసలో ఉండాల్సి వస్తుంది. ఒక్క రోజు సాయంత్రం వరకూ ఉన్నా వారికి రావాల్సిన సొమ్ము అందదు. మరలా మరుసటి రోజు రావాల్సి వస్తుంది. ఇదంతా చూడటానికి మాకు ఎంతో ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ప్రభుత్వం ఆలోచించి వీరి లాంటి వారికి సొమ్మును నేరుగా ఇంటికే అందచేయవచ్చుగా అనిపించింది. ఇలాంటి విషయాలలో అధికారులు, నాయకులు మానవీయ కోణంలో ఆలోచించాలని మా ప్రార్థన.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం (స.హ.చ) ద్వారా సాధించిన విజయాలను వార్తాపత్రికల నుండి సేకరించి మీ తరగతిలో చెప్పండి. (AS3)
జవాబు:
వార్త – 1, న్యూఢిల్లీ :
హర్యానాకు చెందిన 70 సం||ల వృద్ధురాలు లక్ష్మి సింగ్ తన కుమారుడు అనూప్ సింగ్ ను ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అనూప్ సింగ్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్యకు ఫించను ఇచ్చారు. కాని ఆమె కొద్ది సం||ల తరువాత ద్వితీయ వివాహం చేసుకుంది. లక్ష్మి దిక్కులేనిదయింది. అప్పుడు ఆమె స.హ. చట్టం ద్వారా పిటీషను పెట్టుకోగా ప్రభుత్వం వారు ఫించను మార్చి ఆమెకు ఇచ్చారు.

వార్త -2:
క్షేత్రమణి భువనేశ్వర్ లో ఒక చిన్న స్థలం కొనుక్కుంది. అమ్మకందారు, ఆమె రిజిష్ట్రార్ ఆఫీసులో రిజిష్టరు చేసుకున్నారు. కాని అక్కడి గుమాస్తా 1½ సం||రం అయినా ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. దానితో స.హ. చట్టం ఆఫీసును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే ఆమె కాగితాలు ఆమెకు తెచ్చి ఇచ్చాడు ఆ గుమాస్తా.

వార్త -3:
లక్నోలో నివసిస్తున్న ఆషియానా 13 సం||ల బాలిక. మే 2005లో ఆమె ఆరుగురుచే సామూహిక అత్యాచారానికి గురి అయింది. అయితే అందులో ప్రథమ నిందితుడు తాను మైనరనని సాక్ష్యాలు చూపించి జువెనైల్ కోర్టుకు కేసును మరల్చాడు.

ఆషియానా తండ్రి స.హ. చట్టం ద్వారా అతని డ్రైవింగ్ లైసెన్సును, తుపాకీ లైసెన్సును పొందిన వివరాలను సేకరించి వాటిని కోర్టుకు సమర్పించాడు. అప్పుడు కోర్టు అతనిని ‘ఆ సంఘటన జరిగినప్పుడు అతను మేజరే’ అని తేల్చింది.

వార్త – 4:
‘నాకాబందీ’ సమయంలో మోటారు వాహనాలలో కూర్చుని కనబడకుండా కొంతమంది తప్పించుకుంటున్నారని స.హ. చట్టం ద్వారా అప్పీలు చేయటం మూలంగా ప్రభుత్వం ఈ క్రింది రూలు విధించింది.

మోటారు కార్ల అద్దాలకు డార్క్ ఫిల్ములుగానీ, ఏ ఇతరాలు కానీ అంటించరాదు. ఇది 4.5.2012 నుండి అమలులోనికి వచ్చింది.

ప్రశ్న 4.
విద్యాహక్కు చట్టం బాలలకు వరం వంటిది. వివరించండి: (AS1)
జవాబు:
6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత విద్యకు హక్కు ఉందనీ విద్యాహక్కు చట్టం తెలియచేస్తుంది. పిల్లల పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించటం, సరైన అర్హతలున్న టీచర్లను నియమించటం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించటం వంటి పనులను ప్రభుత్వం చేయాలి. విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని కృత్యాల ద్వారా, పరిశోధన, ఆవిష్కరణ పద్ధతుల ద్వారా సాగాలని చట్టం చెబుతోంది. పిల్లలు మాతృభాషలో చదువు నేర్చుకోవాలని, వాళ్ళు భయం, ఆందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కూడా చట్టం చెబుతోంది.

పరిసర ప్రాంతాలలో పాఠశాలలు అందుబాటులో లేకపోయినా, పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినా, బోధన – అభ్యసన పరికరాలు తగినన్ని అందుబాటులో లేకపోయినా, పిల్లలను కొట్టినా, భయభ్రాంతుల్ని చేసినా అటువంటి సందర్భాలలో అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు.

కాబట్టి ఇది బాలలకు వరం.

ప్రశ్న 5.
మీకు ఇంకా ఏమైనా హక్కులు అవసరమని భావిస్తున్నారా? అవి ఏమిటి? ఎందుకు? (AS4)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత ఈ హక్కులు బాధ్యతతో కూడినవి అని అర్ధం చేసుకున్నాను. నాకు ఏమి కావాలో అన్నీ నా దేశం చూసుకుంటోంది. కాబట్టి నాకు కొత్త హక్కులు అవసరం లేదు. ఉన్న హక్కులను పొందటానికి, కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 6.
సమాచార హక్కు చట్టం ప్రకారం మీ పాఠశాల గురించి ప్రధానోపాధ్యాయుడిని ఏ సమాచారం అడుగుతారు? (AS4)
జవాబు:
సమాచార చట్టం హక్కు ప్రకారం పాఠశాల గూర్చి ప్రధానోపాధ్యాయునికి అడిగే సమాచారం.

  1. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చిన నిధులెంత?
  2. ఆ నిధులను దేనికొరకు ఖర్చు చేసారు?
  3. పాఠశాల మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు వచ్చాయా? వస్తే ఎంత వచ్చాయి? వేటికొరకు ఎంత ఖర్చు చేస్తారు?
  4. బడిపిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారా?

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 7.
అవినీతిని ఎదుర్కోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? (AS6)
జవాబు:
అవినీతిని ఎదుర్కొనడంలో సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందే హక్కు ప్రజలకు లభించింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన పథకాలు, ఖర్చు, లబ్దిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలుజరిగిన దానితో పోల్చడం ద్వారా అవినీతి జరిగితే తెలుసుకొని పోరాడవచ్చు.

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి InText Questions and Answers

8th Class Social Textbook Page No.204

ప్రశ్న 1.
పేజి నెం. 204 లో ఉన్న ఉదాహరణలోని పవన్, అతడి తల్లి గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారా?
జవాబు:
ఎవరైనా సరే చట్ట, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా జీవనం సాగిస్తే అది గౌరవప్రదమైన జీవనమే అవుతుంది. పవన్ తల్లి వేరొకరింట్లో కష్టపడి పనిచేయటం గౌరవకరమే. కానీ పవన్ గుడి దగ్గర అడుక్కోవడం మాత్రం సరియైనది కాదు అని నా భావన.

ప్రశ్న 2.
దేని ద్వారా వాళ్లకి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది?
జవాబు:
కష్టించి పనిచేసి జీవనం గడపటం ద్వారా మాత్రమే వారికి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది.

ప్రశ్న 3.
తమకు కావలసింది చేసే స్వేచ్ఛ పవన్‌కు కానీ, అతడి తల్లికి కానీ ఉందా?
జవాబు:
ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, అధికారులైనా పనిలో స్వతంత్రంగా వ్యవహరించరాదు, వ్యవహరించలేరు. అలాగే వీరు కూడా పని వ్యవహారంలో యజమానిని అనుసరించి పోవాలి. స్వంత విషయాలలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించ వచ్చు.
ఉదా :
పవన్ తల్లి ఇష్టం లేకపోతే వారింట పని మానేయవచ్చు. వేరే చోట చేరవచ్చు.

ప్రశ్న 4.
పవన్, అతడి తల్లి ఈ విధమైన జీవితం గడపటానికి ఎవరు కారణం? వాళ్ల పరిస్థితికి వాళ్లనే నిందించాలా?
జవాబు:
వీరి పరిస్థితికి తరతరాలుగా వస్తున్న వ్యవస్థ కారణం అని చెప్పాలి. సమాజంలో ధనికులు ఇంకా ధనికులుగాను, పేదవారు కటిక పేదవారుగానూ మారతారు. వీరు కూడా అంతే. భారతదేశంలో ‘కర్మ’ అని ఎవరికి వారే నిందించుకోవడం అలవాటు. అలాగే వారినే నిందించుకోవాలి లేదా వ్యవస్థ తీరును నిందించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 5.
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
జవాబు:
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది.

8th Class Social Textbook Page No.206

ప్రశ్న 6.
ఒక రోడ్డు లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని గుత్తేదారులు ఎలా నిర్వహిస్తున్నారో చర్చించండి.
జవాబు:
ఏదైన ఒక రోడ్డు లేదా ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు ముందు గుత్తేదారుల నుండి టెండర్లు స్వీకరిస్తారు. టెండర్లలో ఆ కట్టడాన్ని వారు కోరిన విధంగా నిర్మించడానికి ఎవరు అతితక్కువ ధరని ‘కోట్’ చేస్తారో వారికి మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. పని మొదలు పెట్టిన తరువాత గుత్తేదారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి. ఏ సిమెంటు వాడారు? సిమెంటు, ఇసుక ఏ నిష్పత్తిలో కలిపారు, ఇటుక మందం ఎంత, కొలతలు మొదలైనవి అన్నింటిని ఒక పుస్తకంలో నమోదు చేసి ఉంచుతారు. ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పని చేశారు? వారి కూలిరేట్లు ఎంత? ఎంత చెల్లించారు? మొదలైనవన్నీ దీంట్లో నమోదు చేసి ఉంటాయి. నిర్మాణం తాలూకు యజమాని (ప్రభుత్వం / ప్రైవేటు సంస్థ) వీటిని చూసి, నాణ్యతను పరీక్షించి, వీరికి వాయిదాలలో సొమ్ము చెల్లిస్తారు. ప్రభుత్వం వారయితే సంబంధించిన ఇంజనీరుతో పర్యవేక్షింపచేస్తారు.

ప్రశ్న 7.
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా, జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చు?
జవాబు:
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా పనిచేసేవారికి, దానిని పర్యవేక్షించేవారికి కూడా కొంత భయం, తప్పనిసరి నిజాయితీ అలవడతాయి. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.

8th Class Social Textbook Page No.208

ప్రశ్న 8.
గత సంవత్సర కాలంలో మీ ఉపాధ్యాయులకు విద్యాశాఖనుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాల వంటి వాటి జాబితా తయారుచేయండి. విద్యాశాఖకు అందచేయటానికి పాఠశాల ఎటువంటి రికార్డులు నిర్వహిస్తుంది? మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తారు?
జవాబు:
విద్యాశాఖ నుండి ఆదేశాలు, నివేదికలు, సలహాల జాబితా :

  1. బడి ఈడు బాలబాలికలు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  2. డ్రాపవుట్సును తిరిగి పాఠశాలకు రప్పించాలి.
  3. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాం, టెక్స్ట్ పుస్తకాలు అందచేయాలి.
  4. పదవ తరగతి విద్యార్ధులకు అదనపు తరగతులు నిర్వహించాలి.
  5. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
  6. విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించాలి.
  7. విద్యార్థులకు Deworming మాత్రలు వేయాలి.
  8. విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  9. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.

పాఠశాల నిర్వహించే రికార్డులు :

  1. అడ్మిషను రిజిస్టరు
  2. టి.సీ.ల పుస్తకం
  3. హాజరు పట్టీలు
  4. మధ్యాహ్న భోజన వివరాల రిజిస్టరు.
  5. జీతాల రిజిస్టరు, బిల్లులు
  6. విజిటర్సు రిజిస్టరు
  7. మార్కుల రిజిస్టరు మొదలైనవి

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు :
1. బియ్యం రిజిస్టరు
2. తేదీ
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 1
3. రోజువారీ మెనూ పుస్తకం
4. నెలవారీ లెక్కల రిజిస్టరు మొ||నవి.

ప్రశ్న 9.
రాష్ట్ర సమాచార కమిషన్ సందర్భంలో ‘స్వతంత్ర’ అన్న పదం ఎందుకు కీలకమైంది?
జవాబు:
రాష్ట్ర సమాచార కమిషన్ పాలనా యంత్రాంగానికో, కార్యనిర్వాహక వర్గానికి అనుబంధమైతే అది అవినీతిని ప్రశ్నించలేదు, అరికట్టలేదు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించలేదు. కాబట్టి అది ‘స్వతంత్రం’గానే వ్యవహరించాలి, ఉండాలి. – అందువలన ‘స్వతంత్ర’ అన్న పదం కీలకమైంది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 10.
ఆరోగ్యశాఖలో, సమాచార అధికారిని అడగటానికి ప్రశ్నల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. విపత్కర సమయాలలో రోగులను ఆదుకోవటానికి అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి?
  2. ప్రాంతీయ ఆసుపత్రులలో సౌకర్యాలు ఏమి ఉన్నాయి?
  3. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు కొనసాగటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
  4. ‘పిచ్చి కుక్కలు వంటివి కరిచినప్పుడు ఉపయోగించాల్సిన మందులు అన్ని చోట్లా ఉన్నాయా?
  5. ‘ఆరోగ్యశ్రీ’లో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించడం లేదు?

8th Class Social Textbook Page No.210

ప్రశ్న 11.
మీ బడి ఈ ప్రామాణికాలకనుగుణంగా ఉందా?
జవాబు:
అవును. మా బడి ఈ ప్రామాణికాలకు అనుగుణంగానే ఉన్నది.

  1. మా పాఠశాలలో సరైన అర్హతలున్న టీచర్లు ఉన్నారు.
  2. అవసరమైన సౌకర్యాలున్నాయి.
  3. పారాలు ల్యాబ్ లో, LCD రూములలో బోధించబడుతున్నాయి.
  4. మేము పాఠశాలలో బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తాము.
  5. మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు.

ప్రశ్న 12.
అవసరమైతే మీ బడి పనితీరుపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోంది.
జవాబు:
అవసరమైతే బడి తీరుపై జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారికి, రాష్ట్రస్థాయిలో డైరెక్టరు, పాఠశాల విద్యకు ఫిర్యాదు చేయాలి.

ప్రశ్న 13.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించుము.
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 2
ఇది వర్షాలు కురవని సంవత్సరం
జవాబు:
ఈ చిత్రం చాలా ఏళ్ళనాటిదని వృద్ధురాలి వస్త్రధారణను, ఇంట్లోని మట్టిబానలను, కుండలను చూసి చెప్పవచ్చు. ఒకప్పుడు ధాన్యం దాచుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఒక పాత్రలో బియ్యంలో ఎక్కడో అడుగున ఉన్నాయి. వృద్ధురాలు కూడా సరియైన తిండిలేక వడలిపోయి ఉన్నది. అది కరవు కాలం అని భావించవచ్చు.

ప్రశ్న 14.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

13 సంవత్సరాల పవన్ అనే బాలుడు వాళ్ల అమ్మతో కలిసి ఎంతోమంది భక్తులు సందర్శించే ఒక పుణ్యస్థలంలో ఉంటాడు. పవన్ గుడి బయట నిలబడి భక్తుల కాళ్లమీద పడి అడుక్కుంటాడు. అతడికి కొంతమంది మిగిలిపోయిన పాచి పదార్థాలు తినటానికి ఇస్తారు. కొన్నిసార్లు అతడు బరువైన సామాను మోస్తాడు, అందుకు వాటి యజమానులు కొంత డబ్బు ఇస్తారు.

అతడి తల్లి వేరొకరి ఇంటిలో పనిచేస్తుంది. ఆమె రోజుకి 12 గంటలపాటు, నెలలో 30 రోజులూ పనిచేస్తుంది. యజమానురాలే కాకుండా, చిన్న పిల్లలు సైతం ఆమెను ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంటారు. అందరూ తిన్న తరవాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు. యజమానుల ముందు ఆమె కూర్చోటానికి వీలులేదు. వాళ్లతో భయభక్తులతో మాట్లాడాలి. చిన్న చిన్న తప్పులకు, ఆలస్యానికి ఆమెను తరచు అవమానిస్తుంటారు. ఆమె కన్నీళ్లతోపాటు కోపాన్ని కూడా దిగమింగుకోవాలి. లేదంటే పని నుంచి తీసేస్తారు.
1. పవన్ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
జవాబు:
13 సంవత్సరాలు.

2. పవన్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు?
జవాబు:
అతడు బరువైన సామాను మోసినందుకు ఇస్తారు.

3. అతడి తల్లి ఏమి చేస్తుంది?
జవాబు:
వేరొకరి ఇంటిలో పని చేస్తుంది.

4. ఆమెకున్న ఇబ్బందులను లేదా కష్టాలను రెండింటిని చెప్పండి.
జవాబు:
1. యజమానుల ముందు కూర్చోడానికి వీలులేదు.
2. అందరూ తిన్న తరువాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు.

5. పవన్ కాళ్ల మీద పడి ఎందుకు అడుక్కుంటాడు?
జవాబు:
వారికి జాలి కలిగి డబ్బులు ఇస్తారని

ప్రశ్న 15.
కింది పేరాను చదివి జవాబులు వ్రాయుము.

ప్రజా విచారణ :
‘జన్ సునావాయి’ (అంటే ప్రజా విచారణ) పేరుతో MKSS (మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్) సమావేశాలు నిర్వహించేది. పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదవలేరన్నది వాస్తవం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పత్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి వీటిని పైకి చదివి వినిపించేవాళ్లు, వివరించేవాళ్లు. చేతిపంపు వేయటానికి ఎవరెవరికి కూలీ చెల్లించారో మస్టర్/హాజరు జాబితా తెలియచేస్తుంది. మస్టర్ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు ఆ సమయంలో ఊళ్లో ఉన్నారో, లేక వలస వెళ్లారో ప్రజలు చెప్పగలుగుతారు, లేదా మస్టర్‌లో పేర్కొన్న మొత్తం వాళ్లకు చెల్లించారో లేదో చెప్పగలుగుతారు. దీని ద్వారా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది వెల్లడవుతుంది. ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్లు. పత్రాలలో ఉన్న సమాచారం గురించి వివరించటానికి, సమర్ధించుకోటానికి అధికారులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్లు. ఈ సమావేశాల్లో జిల్లా పాలనా యంత్రాంగం, పంచాయితీ అధికారులు కూడా పాల్గొనేవాళ్లు. అవినీతిని గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేవాళ్లు.
1. ‘జన్ సునావాయి’ అంటే తెలుగులో ఏమిటి?
జవాబు:
ప్రజా విచారణ.

2. పత్రాలను పైకి చదివి ఎందుకు వినిపించేవారు?
జవాబు:
పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను చదవలేరు. అందుకే వాటిని పైకి చదివి వినిపించేవారు.

3. ‘మస్టర్’ అంటే ఏమిటి?
జవాబు:
కూలీవాళ్ళు లేదా చేతిపనులు చేసేవాళ్ళు ఆ రోజు పనికి హాజరయ్యారో లేదో ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. దానినే మస్టర్ అంటారు.

4. సమావేశాల ద్వారా ప్రజలు ఏం చేసేవారు?
జవాబు:
సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్ళు.

5. కేసులు ఎప్పుడు నమోదు చేసేవాళ్ళు?
జవాబు:
అవినీతిని గుర్తించినప్పుడు కేసులు నమోదు చేసేవాళ్ళు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 16.
‘సమాచారాన్ని వెల్లడి చేయడం పై ప్రజల వాదనలు ఏవి?
జవాబు:
వారి వాదనలు :

  1. మానవ అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కులకు సమాచారం కీలకమైనది. అధికారిక పత్రాల రూపంలో తగినంత సమాచారం ఉన్నప్పుడే ప్రజలు పాలనలో భాగస్వాములై, న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు.
  2. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటంవల్ల ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరును పర్యవేక్షించటం, అవినీతి జరగకుండా చూడటం సాధ్యమవుతుంది.
  3. పేదల మనుగడకు సమాచారం కీలకమైనది.
  4. సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటాన్ని అరికట్టవచ్చు.

ప్రశ్న 17.
విద్యా హక్కు చట్టంలోని ఏవేని 6 ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 :
6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు :

  1. పిల్లలందరికి అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
  2. పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి.
  3. పిల్లలందరిని వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి.
  4. వయస్సుకు తగ్గ రీతిలో చేర్చిన తరవాత వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.
  5. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతోపాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాటు చేయాలి.
  6. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము, ఛార్జీలు వసూలు చేయరాదు.

ప్రశ్న 18.
సమాచారం వెల్లడి కోసం ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
రాజస్థాన్లో కొంతమంది మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (MKSS) పేరుతో సంఘటితమై ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు, స్థానికసంస్థలు డబ్బులు ఎలా ఖర్చు చేశామో తనిఖీ లేదా MNREGA వంటి సమాచారం అడగసాగారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సమాచారం పొందటానికి ఎటువంటి చట్టబద్ధ హక్కులేదు. మొదట్లో కొంతమంది అధికారుల సహాయంతో సంబంధిత పత్రాలను సేకరించి బహిరంగ సమావేశాల్లో ప్రజలు వీటిని తనిఖీ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలం తరవాత ఈ వివరాలు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఈ విషయమై మూడు సంవత్సరాల పాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో ఉద్యమించారు. ఈ విధంగా ఉద్యమం మొదలైంది.

ప్రశ్న 19.
విద్యా హక్కు చట్టం గురించి తెలపంది.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 : 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 20.
86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది.

ప్రశ్న 21.
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
జవాబు:
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది.

ప్రశ్న 22.
ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడింది.

ప్రశ్న 23.
జీవించే హక్కు అంటే?
జవాబు:
మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 24.
జాతీయస్థాయిలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
2005లో

ప్రశ్న 25.
స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలకృష్ణ గోఖలే ఏ వర్గానికి చెందినవాడు?
జవాబు:
మితవాదులు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 17th Lesson పేదరికం – అవగాహన

8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తీవ్రమైన ఆకలిగా పేదరికం అన్న నేపథ్యంలో కింద వాక్యాలలో సరైనవి ఏవి? (AS1)
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైనన్ని కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఇ) నాగలితో దున్నే వ్యక్తికీ, వరికోత యంత్రం నడిపే వ్యక్తికీ ఒకే మోతాదులో కాలరీలు ఉన్న ఆహారం అవసరం.
ఈ) దుకాణదారుడు కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
జవాబు:
సరియైనవి
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైన కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఈ)దుకాణదారుడి కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

ప్రశ్న 2.
ఈ అధ్యాయంలో పేదరికానికి పేర్కొన్న ప్రధాన కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
‘పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకపోవటంగా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 3.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి పథకాలలోని ప్రధానమైన అంశాలు ఏమిటి? పేదరికంలోని ఏ అంశాలను అవి పరిష్కరించటానికి పూనుకుంటున్నాయి? చౌకధరల దుకాణాలు ఎందుకు అవసరం? (AS4)
(లేదా)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది? వివరించండి.
జవాబు:
ప్రధానమైన అంశాలు :
1) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం :
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.

  • నీటి నిల్వ, సంరక్షణ
  • కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
  • షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
  • చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ

ii) ప్రజా పంపిణీ వ్యవస్థ :
చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (Public Distribution System (PDS)) అంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పట్టణ, పల్లె ప్రజలందరికీ ఆహార ధాన్యాలను చేర్చటంలో ఇది కీలకపాత్ర వహించింది. దీని పనితీరులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ దుకాణాలను సమయానికి, లేదా క్రమం తప్పకుండా తెరవరు. ఎవరూ కొనగూడదన్న ఉద్దేశంతో ఆహార ధాన్యాలను కలీ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రజలకి కాకుండా ఇతర దుకాణాలకు సరుకులు అమ్మే చౌకధరల దుకాణాదారులు ఉన్నారు. దీంతో పేద ప్రజలతో సహా చాలామందికి ఆహారధాన్యాలు అందవు. భారతదేశంలోని పేదరాష్ట్రాలు, పేద ప్రాంతాలలో సాధారణంగా వీటి పనితీరు ఆశించిన మేరకు లేదు.

  • ఉపాధిని కల్పించడం, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సరసమైన ధరలలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం అనే అంశాలను పరిష్కరించడానికి పూనుకున్నాయి.
  • నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువగా ఉంటే ఉపాధి, ఆదాయాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి మౌలిక అవసరాలను ప్రభుత్వం చౌకగా అందిస్తుంది. వీటికోసం చౌకధరల దుకాణాలు అవసరం.

ప్రశ్న 4.
ఉపాధి లేని ప్రజలకే భూమి, పశువులు, దుకాణాలు వంటి ఆస్తులు సాధారణంగా ఉండవు. ఎందుకు? (AS1)
జవాబు:
ఉపాధిలేని వారికి సంపాదన ఉండదు. వారి నిత్యావసర ఖర్చులకే డబ్బులు సరిపోవు. యింక మిగులు సొమ్ములకు అవకాశం ఉండదు. పొదుపు చేయలేనివారు ఆస్తులను సమకూర్చుకోలేరు. కాబట్టి వీరికి సాధారణంగా ఆస్తులు ఉండవు.

ప్రశ్న 5.
పేజి నెం. 202 లో “జీవించే హక్కు కోసం పోరాటం” శీర్షికలోని మొదటి రెండు పేరాలు చదివి వ్యాఖ్యానించండి. (AS2)

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కొత్త విధానంపై ఎంతో చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అయిదు మందిలో నలుగురు అవసరమైన కనీస కాలరీల కంటే తక్కువ ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారని మనకు తెలుసు. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పది కుటుంబాలలో మూడు కుటుంబాలకు కూడా అంత్యోదయ, BPL కార్డులు లేవు. అంటే అంతకుముందు ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పుడు పొందటం లేదు. భూమిలేని కూలీల కుటుంబాలలో చాలా వాటికి BPL కార్డులు లేవు. ఇందుకు విరుద్ధంగా కొన్ని సంపన్న కుటుంబాలకు BPL కార్డులు ఉన్నాయన్న వార్తలొచ్చాయి.

ఈ కొత్త ప్రజా పంపిణీ వ్యవస్థ విధానంలో ఇతర వైరుధ్యాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం వద్ద రైతుల దగ్గర నుంచి కొన్న) ఆహారధాన్యాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ ఆహారధాన్యాలను ఎలుకలు తినేసిన, కుళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చౌకధరల దుకాణాలు సరసమైన ధరలకు ఆహారధాన్యాలను BPL, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న వాళ్ళకే అమ్ముతారు. కాబట్టి అక్కడ కూడా ఆహారధాన్యాలు నిల్వ ఉండిపోతాయి. ఇంకోవైపున అందరి ఆకలి తీర్చలేకపోతున్నామనే భావన కూడా ఉంది.
జవాబు:
జీవించే హక్కు అనేది ప్రజలు ఇంకా ఓ హక్కుగా భావించటంలేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం “ఆహార భద్రత బిల్లు”ను పార్లమెంటులో ఆమోదించడం, ఇవి చట్టం కావడంతో ప్రజలు ఈ దిశగా ఇప్పుడిప్పుడే ఆలోచించడం ప్రారంభించారు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 6.
మీ గ్రామంలో PDS పథకం నిర్వహణపై జిల్లా కలెక్టర్ కు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

జిల్లా కలెక్టర్
కరీంనగర్ వారికి
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లికి
చెందిన 8వ తరగతి విద్యార్థి నమస్కరించి వ్రాయులేఖ.అయ్యా!
మా ప్రాంతంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయుచున్న నిత్యావసరాలు కొలతలలో తేడాలు వస్తున్నాయి. నెలలో రెండు, మూడు రోజులు మాత్రం దీనిని తెరిచి ఉంచుతున్నారు. దీనితో బీదవారు సరకులను తీసుకోలేకపోతున్నారు. కావున, మీరు ఈ అంశాలను దర్యాప్తు చేసి న్యాయం చేయగలరు.

మీ
విధేయురాలు,
పి. కామాక్షమ్మ,
D/O సుందరరావు,
కొత్తపల్లి,
కరీంనగర్.

8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.193

ప్రశ్న 1.
చంద్రయ్య, రామాచారి జీవితాలలో పోలికలను చర్చించండి.
జవాబు:

  1. చంద్రయ్య, రామాచారి ఇరువురూ పేదవారు.
  2. ఇరువురూ ఆకలితో అలమటించేవారే.
  3. ఇరువురి భార్యలు పనిరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు.
  4. ఇరువురికీ ఒంట్లో ఆరోగ్యం తగ్గిపోయింది.
  5. ఇద్దరూ వయస్సుకి మించి ముసలివారుగా కనిపించేవారు.

ప్రశ్న 2.
రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ఏ విధంగా ముడిపడి ఉంది?
జవాబు:
కొన్ని సంవత్సరాల క్రితం వరకు రామాచారి వద్ద పని చేయించుకోటానికి 40 మంది దాకా వచ్చేవాళ్లు. వాళ్ళల్లో ఎక్కువమంది రైతులు. అతడు చేసిన పనులకు రైతులు ధాన్యం రూపంలో చెల్లించేవాళ్లు. ఒక్కొక్కళ్లు సంవత్సరానికి 70 కిలోల ధాన్యం ఇచ్చేవాళ్లు. అలా వచ్చిన 2800 కిలోల ధాన్యంలో కుటుంబానికి కావలసినంత ఉంచుకుని, మిగిలినది. మార్కెట్టులో అమ్మేవాడు. 70 కిలోల ధాన్యం 375 రూపాయలకు అమ్మేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ విధంగా కుటుంబానికి సరిపడా బియ్యంతోపాటు సంవత్సరానికి 8000 రూపాయలు పొందేవాడు. దీనితోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకొచ్చేవాడు.

ఈ విధంగా రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ముడిపడి ఉంది.

ప్రశ్న 3.
రామాచారి కుటుంబం కష్టాలు ఎదుర్కోటానికి కారణం :
అ) రామాచారి సరైన ప్రయత్నాలు చేయకపోవటం, తగిన అవగాహన లేకపోవటం, లేక
ఆ) గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.
జవాబు:
గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 4.
రామాచారి కుటుంబానికి రోజూ రెండు పూటలా భోజనం లభించాలంటే ఏం చేయాలి? ఆలోచించండి.
జవాబు:
రామాచారి కూడా భార్యతో పాటు పట్టణానికి వలస వెళ్ళి కూలీనాలీ చేయాలి. అపుడే అతని కుటుంబానికి రెండు పూటలా భోజనం లభిస్తుంది.

ప్రశ్న 5.
రామాచారి గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని ఎలా వర్ణిస్తావు?
జవాబు:
రామాచారి పనికీ, గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని నేను ఈ విధంగా వర్ణిస్తాను. “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు”.

ప్రశ్న 6.
సాధారణంగా సంవత్సరానికి రామాచారి తన కుటుంబ అవసరాలకు ఎన్ని కిలోల ధాన్యం ఉంచుకునేవాడు?
జవాబు:
రామాచారి సాధారణంగా, సంవత్సరానికి దాదాపు 1300 కిలోల ధాన్యాన్ని ఉంచుకొనేవాడు.

ప్రశ్న 7.
(ఆహార ధాన్యాలు కాకుండా) కుటుంబ ఖర్చులకు సంవత్సరానికి 8000 రూపాయలు సరిపోతాయా?
జవాబు:
సం||రానికి రూ॥ 8000/-లు అంటే సుమారు నెలకు 667/-లు ఇవి కచ్చితంగా వారికి సరిపోవు.

ప్రశ్న 8.
ప్రక్క పట్టణ దృశ్యంలో జీవన విధానాలలో తేడా గురించి చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 1
తేడాలు

భవంతులలోని వారు డేరాలలోని వారు
1. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 1. వీరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు.
2. వారు ధనికులు. 2. వీరు కటిక పేదవారు.
3. వీరికి చక్కటి సౌకర్యాలు ఉంటాయి. 3. వీరికి కనీస సౌకర్యాలు కూడా ఉండవు.

8th Class Social Textbook Page No.194

ప్రశ్న 9.
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకి ఎన్ని కాలరీలను తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కి॥ కాలరీలను తీసుకుంటున్నారు.

ప్రశ్న 10.
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవాల్సిన కాలరీల కంటే సగటున వాళ్లు తీసుకుంటున్న కాలరీలు ఎంత శాతం తక్కువ?
జవాబు:
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవలసిన కాలరీల కంటే సగటున 23% కాలరీలు తక్కువ తీసుకుంటున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 11.
పేద ప్రజలు చాలా తక్కువ కాలరీలు తీసుకోవానికి గల కారణాలు ఏవి?
జవాబు:
పేద ప్రజల కొనుగోలు శక్తి తక్కువ. ఎక్కువ కాలరీలు ఉన్న ఖరీదైన పదార్థాలు కొనలేరు, తినలేరు, తిని పని చేయలేరు. కాబట్టి కడుపు నిండే ఆహార పదార్థాలు మాత్రమే తినగలుగుతారు.
ఉదా :
అన్నం, పచ్చడి లేదా అన్నం, కూర లేదా అన్నం, సాంబారు. కాబట్టి వారు చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.196

ప్రశ్న 12.
వ్యక్తి ఆర్ధిక స్థాయికీ, వాళ్ళ పోషకాహార స్థాయికీ మధ్య ఏమైనా సంబంధం కనబడుతోందా?
జవాబు:
కనబడుతోంది. వ్యక్తి ఆర్ధిక స్థాయి బాగుంటే పోషకాహార స్థాయి బాగుంటుంది. వ్యక్తి ఆర్థిక స్థాయి తక్కువగా ఉంటే పోషకాహార స్థాయి తక్కువగా ఉంటుంది.

8th Class Social Textbook Page No.197

ప్రశ్న 13.
కృత్యం :

పెద్దవాళ్లు పోషకాహారలోపానికి గురైనదీ, లేనిదీ తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రజ్ఞులు చెప్పే శరీర పదార్థ సూచిక (Body Mass Index) లెక్కకట్టాలి. దీనిని లెక్కకట్టడం తేలిక. వ్యక్తి బరువు ఎంతో కిలోల్లో తీసుకోండి. ఆ వ్యక్తి ఎత్తును మీటర్లలో తీసుకోండి. బరువును ఎత్తు వర్గంతో భాగించాలి. ఫలితంగా వచ్చిన సంఖ్య 18.5 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి పోషకాహార లోపానికి గురైనట్టు. శరీర పదార్థ సూచిక 25 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిది ఊబకాయం అన్నట్లు. ఈ నియమం ఎదుగుతున్న పిల్లలకు వర్తించదని గుర్తుంచుకోండి. భిన్న ఆర్థిక నేపథ్యాలకు చెందిన (ఉదాహరణకు శ్రామికులు, పనివాళ్లు, వ్యాపారస్తులు) ముగ్గురు పెద్దవాళ్ల బరువు, ఎత్తు ప్రతి ఒక్క విద్యార్థి సేకరించండి. అందరు విద్యార్థులు తెచ్చిన వివరాలను ఒకరు పట్టికలో పొందుపరచండి. శరీర పదార్థ సూచిక (BMI) లెక్కకట్టండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 3

8th Class Social Textbook Page No.199

ప్రశ్న 14.
‘నగదు బదిలీ పథకం’ ప్రజా పంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
‘నగదు బదిలీ పథకం’ ప్రజాపంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయం కాదు అని నా భావన.

కారణం :
PDSల ద్వారా ప్రభుత్వం పేదలకు కిలో రూ|| 1/- కి బియ్యం అందిస్తోంది. దానిపై ప్రభుత్వం యిచ్చే సబ్సిడీ రూ|| 19/- లు. ఈ మొత్తం రూ|| 20/- లు ప్రభుత్వం నగదు బదిలీ పథకం క్రింద లదారులకు పంపిణీ చేస్తోంది. వీటితో వారు బయట దుకాణాలలో బియ్యం కొనుక్కుని తినాలి. కానీ బియ్యం రేట్లు పెరిగి రూ|| 40/- లు, రూ॥ 50/- లు అయినపుడు వారికి ఈ ధరకి బియ్యం దొరకవు. అప్పుడు వారికి ఆహార భద్రత కొరవడుతుంది.

కాబట్టి ఇది సరైన ప్రత్యామ్నాయం కాదు.

8th Class Social Textbook Page No.201

ప్రశ్న 15.
కొత్త విధానం వల్ల పేదవాళ్లకు మేలు జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు యివ్వండి.
జవాబు:
ఈ కొత్త విధానం వల్ల పేదవాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తెల్లకార్డులు సంపాదించిన వారందరి నుండి అవి వెనుకకు తీసుకోబడతాయి. కేవలం పేదవారికి, అట్టడుగువారికి మాత్రమే ఈ దుకాణాల ద్వారా సరుకులు అందుతాయి.

ప్రశ్న 16.
ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి మరికొన్ని సూచనలు చేయండి.
జవాబు:
కొన్ని సూచనలు:

  1. నిజమైన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగాలి.
  2. BPL వారితోపాటు మధ్యతరగతి వర్గాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
  3. ఈ దుకాణాలలో దొరికే సరుకులను సరియైన తూకంతో యివ్వాలి.
  4. ఈ దుకాణాలకు నాణ్యమైన సరుకును సరఫరా చేయాలి.
  5. డీలర్ల ఎంపిక సక్రమమైన పద్ధతులలో జరగాలి.

8th Class Social Textbook Page No.202

ప్రశ్న 17.
రేషను దుకాణాలను చౌకధరల దుకాణాలని కూడా అంటారు. ఎందుకో తెలుసా?
జవాబు:
రేషను దుకాణాలలో దొరికే సరుకులన్నీ బయట మార్కెట్టు ధరకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి వీటిని చౌకధరల దుకాణాలని కూడా అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 18.

“పేదరికం ఎందుకు ఉంది? దాన్ని ఎలా నిర్మూలించవచ్చు” అనే శీర్షిక కింద పేరాను చదివి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి.
పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవటం అని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఉపాధి అవకాశాలు లేకపోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల కొనుగోలు శక్తి (ఆదాయం ) తగ్గుతుంది. కనీస . కొనుగోలు శక్తి లేనప్పుడు వాళ్లు తీవ్ర ఆకలికి గురవుతారు.

పేదరికానికి గల ఇతర కారణాలు ఏవి?
జవాబు:
పేదరికానికి గల ఇతర కారణాలు :

  1. కుటుంబంలో వ్యక్తులు ఎక్కువగా ఉండటం.
  2. ఒక్కరే పనిచేసి, ఎక్కువమంది కూర్చొని తినాల్సి రావటం.
  3. సామర్థ్యానికి తగిన అవకాశాలు రాకపోవటం.
  4. వేతన కూలీ రేట్లు చాలా తక్కువగా ఉండటం మొ||నవి.

ప్రశ్న 19.
క్రింది గ్రాఫుని చూసి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 2
1) ఎవరు ఎక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
ధనికులు.

2) ధనికులకు రెండవ పాతిక శాతానికి మధ్యన గల కాలరీల తేడా ఎంత?
జవాబు:
621 కాలరీలు.

3) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగువారు.

4) ఈ చిత్రాన్ని బట్టి నీకు ఏమి అర్థం అయింది?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహార స్థాయిని నిర్దేశిస్తుంది.

ప్రశ్న 20.
వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయంపై ఆధారపడిన వారికి మద్దతుగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఈ కింద ఉన్నాయి. ప్రతిదాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. అది ఎందుకు ముఖ్యమో తెలియచేయండి. మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
1. రైతులు వ్యాపారస్తులు/దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలి. ఇవి నాణ్యతగా ఉండేటట్టు, సరసమైన ధరలకు దొరికేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జవాబు:
రైతులు వ్యవసాయంపై సంపాదించినదే తక్కువగా ఉంటుంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందకపోతే వారు యిబ్బందుల పాలవుతారు. దళారీల దగ్గర ఎక్కువ ధరలకు కొనలేరు. ఇందులో ఏవి లేకపోయినా వారు పెట్టుబడి మొత్తాన్ని నష్టపోతారు.
ఉదా :
ఇటీవలే కొన్ని జిల్లాల్లో ప్రత్తి విత్తనాలు నాసిరకం యివ్వడం మూలంగా ప్రత్తి రైతులు కోలుకోలేనంతగా దెబ్బ తిన్నారు.

2. చిన్నతరహా సాగునీటి పథకాలు.
జవాబు:
భారతదేశంలో వ్యవసాయం వర్షాధారం, ఇవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు. వాటి మీద ఆధారపడితే రైతు పరిస్థితి దీనస్థితి.
ఉదా :
గతంలో ఒకసారి వర్మాలు లేవని రైతులు నారు పోయలేదు. జులై నెలలో విపరీతంగా వర్షాలు పడి వాగులు, వంకలు నిండిపోయాయి. అపుడు వారు ఎక్కువ ధరకు నారు కొని తెచ్చి నాట్లు వేశారు. చేను ఏపుగా ఎదిగి మంచిగా పండింది. నవంబర్‌లో తుఫాను వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసేసింది. ఆ కాబట్టి చిన్న తరహా సాగు నీటి పథకాలు ఉండాలి.

3. న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకు ద్వారా రుణాలు.
జవాబు:
న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకులు ఋణాలివ్వకపోతే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళతారు. హెచ్చువడ్డీలు వారికి చెల్లించాల్సి వస్తుంది. రైతులు అప్పుల పాలయిపోతారు.

4. ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరికేలా మార్కెటింగు సౌకర్యాలు.
జవాబు:
ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరకాలి. లేదంటే వారికి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అవుతుంది. అందుకే ప్రభుత్వంవారు కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు.

5. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచటం.
జవాబు:
రోడ్డు, రవాణా సౌకర్యాలు లేకుంటే పండిన పంటను గ్రామం నుండి మార్కెట్టుకు చేర్చడం కష్టమవుతుంది. కొన్ని పంటలు త్వరగా పాడయిపోయేవి ఉంటాయి. అవి ఎందుకూ పనికి రాకుండా అయిపోతాయి.
ఉదా :
గతంలో ఒకసారి లారీల స్వంతదారులు సమ్మె చేశారు. ఆ సమయంలో చెరకు పంట. కోసి ఫ్యాక్టరీకి పంపడం కొంతమంది రైతులకు వీలవలేదు. ఆలస్యమయ్యేసరికి చెరుకు ఎండిపోయి దాని విలువను కోల్పోయింది. రైతులు పూర్తిగా నష్టపోయారు.

6. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు సహాయం అందించటం.
జవాబు:
పంటలు నష్టపోయినపుడు బ్యాంకువారు, తరువాత పంటకి అప్పులివ్వటం, కొంత వడ్డీని మాఫీ చేయడం లాంటివి చేయాలి. లేదంటే రైతులు ఉన్న అప్పును తీర్చలేరు, మళ్ళీ పంటని పండించలేరు. ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే రైతులంతా ఈ బాపతువారే.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 21.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానము లిమ్ము.
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.

  • నీటి నిల్వ, సంరక్షణ
  • కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
  • షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
  • చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ

1. మీ ఉపాధ్యాయుల సహాయంతో పైన ఇచ్చిన పనులు ఏమి సూచిస్తాయో తెలుసుకోండి.
జవాబు:
పైన యిచ్చిన పనులు వ్యవసాయావసరాలను తీరుస్తాయి. గ్రామాలు వాటి వనరులను అవే సమకూర్చుకునేలా చేస్తాయి. ఈ పనులు గ్రామాభివృద్ధిని సూచిస్తాయి.

2. మీ ఊరు/పట్టణానికి దగ్గరలో ఉపాధి హామీ చట్టం కింద జరుగుతున్న పని స్థలాన్ని సందర్శించండి. అక్కడ వాళ్లతో మాట్లాడి దాని గురించి రాయండి.
జవాబు:
మా ఊరు కోరుట్లలో ఉపాధి హామీ చట్టం క్రింద కాలువగట్లు బాగు చేస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. చెరువులో పూడిక తీస్తున్నారు. దీనిమూలంగా ఇక్కడి పనివారికి వేసవికాలంలో అంటే పనులు లేని కాలంలో కూడా కూలీ పనులు లభిస్తున్నాయి అని సంబరపడుతున్నారు.

3. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతను ఇస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం కొంత సొమ్మును రిజర్వు చేసి ఉంచుతుంది. చాలా సం||రాల నుండి ఈ సొమ్ము వాడక నిల్వ ఉండిపోయింది. కాబట్టి వీటిని వెంటనే వారికి సాగునీరు, తాగునీరు అందించటానికి ఉపయోగిస్తున్నారు. దీనివలన వారు స్వయం సమృద్ధిని సాధించుకోగలుగుతారు.

4. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధుల రక్షణలో ఉపాధి హామీ చట్టాన్ని ఒక పెద్ద ముందడుగుగా ఎందుకు పేర్కొంటున్నారు?
జవాబు:
ఈ చట్టం లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వారి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. వారి కుటుంబాలు అల్లల్లాడేవి. ఈ చట్టం మూలంగా వారికి సం||రానికి 150 రోజులు పని దొరకటమే కాక గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇది ఒక పెద్ద ముందడుగుగా పేర్కొనబడింది.

ప్రశ్న 22.
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానము లిమ్ము.

అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేశారు. వాళ్లకంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ పేదవాళ్లుగా పరిగణించబడే వాళ్లకు (BPL) (తెల్ల) కార్డులు ఇచ్చారు. మిగిలిన వాళ్లకి ఎపిఎల్ (గులాబీ) కార్డులు ఇచ్చారు.

ఒక్కొక్కరికి చౌకధరల దుకాణం నుంచి లభించే సరుకుల మొత్తం, వాటి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమ) ఇస్తారు. BPL కారు ఉన్నవాళ్లకి తెలంగాణలో ప్రతి వ్యక్తికీ నెలకి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహారధాన్యాలు ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి, వయసుమళ్లిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.

1. అంత్యోదయ కార్డులు ఎవరికి జారీ చేశారు?
జవాబు:
అత్యంత పేద కుటుంబాలకు.

2. BPL వారికి ఏ రంగు కార్డులిచ్చారు?
జవాబు:
తెల్లకార్డులు.

3. BPL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకు దిగువున అని అర్థం.

4. APL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకి ఎగువున అని అర్థం.

5. APL వారికి ఏ రంగు కార్డులు యిచ్చారు?
జవాబు:
గులాబీ రంగు కార్డులు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 23.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతనిస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ నిధులు మిగిలిపోతాయి. ఈ నిధులతో త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఉపయోగిస్తున్నారు.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలోని చౌకధరల దుకాణాన్ని సందర్శించి ఈ దిగువ విషయాలు తెలుసుకోండి.

ప్రశ్న 1.
చౌకధరల దుకాణం ఎప్పుడు తెరిచి ఉంటుంది?
జవాబు:
చౌకధరల దుకాణం రోజూ ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు తెరచి ఉంటుంది.

ప్రశ్న 2.
చౌక ధరల దుకాణంలో ఏ సరుకులు అమ్ముతున్నారు?
జవాబు:
చౌక ధరల దుకాణంలో బియ్యం, గోధుమలు, పంచదార, చింతపండు, కందిపప్పు, పామాయిల్ మొ||నవి అమ్ముతున్నారు.

ప్రశ్న 3.
రకరకాల కార్డులు ఉన్న విధానం మీకు కనపడిందా?
జవాబు:
అవును. తెలుపు, గులాబి రంగుల కార్డులు నాకు కనబడ్డాయి.

ప్రశ్న 4.
(పేదరికంలోని కుటుంబాలకు) చౌక ధరల దుకాణాలలో బియ్యం, పంచదారల ధరలను కిరాణా దుకాణాలలో ధరలతో పోల్చండి. (కిరాణా దుకాణంలో సాధారణ రకం బియ్యం ధర అడగండి.)
జవాబు:
చౌకధరల దుకాణంలో ధరలు కిరాణా దుకాణంలో ధరలు
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 4

ప్రశ్న 5.
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 5
చిత్రం చూశారు కదా! మీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అభిప్రాయం.

మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం చక్కగా నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో తయారైన వేడి వేడి వంటకాలను వడ్డిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో రుచికరమైన ఆహారాన్ని తయారుచేయిస్తారు. భోజనానికి ముందు, తరువాత మేం చేతులు, నోటిని శుభ్రంగా కడుగుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ‘మెనూ’ ప్రకారం రోజుకోరకమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే భోజనశాల ప్రత్యేకంగా లేకపోవడంతో ఆరుబయట తినవలసి వస్తోంది.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

SCERT AP 8th Class Social Study Material Pdf 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
శాసనసభలో చట్టాలు చేసేటప్పుడు దానిపై వివిధ దృష్టి కోణాల నుంచి ఎంతో చర్చ జరుగుతుంది. 1950లలో భూసంస్కరణల చట్టంపై వివిధ అభిప్రాయాలు ఏమై ఉంటాయి ? ఏ దృష్టి కోణం బలంగా ఉండి ఉంటుంది? (AS1)
జవాబు:
వివిధ అభిప్రాయాలు :

  1. జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి.
  2. నష్టపరిహారంగా వీరికి ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించాలి.
  3. పేదలకు భూమిని పంచాలి.
  4. కౌలుదార్లను స్వంతదారులుగా మార్చాలి.
  5. వెట్టి / బేగారను రూపుమాపాలి.
  6. అటవీ, బంజరు భూములపై నియంత్రణ సాధించి పేదలకు పంచాలి.
  7. శిస్తు వసూలు అధికారం ప్రభుత్వానికి ఉండాలి.
  8. భూస్వామ్య దోపిడీ నుండి సామాన్య రైతులను రక్షించాలి.

బలమైన దృష్టికోణం :
గ్రామీణ పేదరిక నిర్మూలన అనే దృష్టి కోణం బలీయంగా ఉండి ఉంటుంది.

ప్రశ్న 2.
1970లలో భూ పరిమితి చట్టాలు చేసినప్పుడు ఎటువంటి అభిప్రాయాలు ఉండి ఉంటాయి? (AS1)
జవాబు:

  1. దేశంలోని సంపద ఒక చోటే కేంద్రీకృతమై ఉంది.
  2. చాలామంది రైతులు చిన్నచిన్న కమతాలను కలిగియున్నారు.
  3. దళితులు భూమిలేని వారై ఉన్నారు.
  4. పశువుల కొట్టాలు, భవనాలు మొదలైనవన్నీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి.
  5. జమీందారులు భూస్వాములుగానూ, భూస్వాములు పారిశ్రామికవేత్తలుగానూ మారారు.
  6. ఈ అవకతవకలన్నింటినీ సరిచేయాలనే భావన ఉండి ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
ఈ సంస్కరణల వల్ల రైతాంగ మహిళలు ఏమైనా లబ్ది పొందారా ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
రైతాంగ మహిళలు కొంతవరకు లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు:

  1. కొంతమంది మిగులు భూములను భార్యల, కూతుళ్ళ, కోడళ్ళ పేరు మీదకు బదిలీ చేసి వారిని ఆస్తిదారులను చేశారు.
  2. ఉత్తుత్తి విడాకులు ఇచ్చుకుని భార్యాభర్తలు రెండు కుటుంబాలుగా మారిపోయారు. ఈ రకంగా కూడా మహిళలు ఆస్తి పరులయ్యారు.
  3. మహిళలు కూడా తమ భర్తలతో పాటు యజమానుల పొలాలలో పనిచేసేవారు. ఈ చట్టాల వలన స్వంత పొలాలలో పని, వాటిపై అజమాయిషీ చేయగలుగుతున్నారు.

ప్రశ్న 4.
అన్ని వర్గాల రైతాంగానికి పెట్టి ఎందుకు సమస్యగా ఉంది? భూస్వాములు తమ భూములను సాగుచేయడానికి ప్రస్తుతం ఏం చేస్తూ ఉండి ఉంటారు? (AS6)
జవాబు:
‘వెట్టి’ మానవత్వానికి మాయని మచ్చ వంటిది. దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి. కాబట్టి ఇది అన్ని రకాల రైతాంగానికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం పూర్వకాలం నాటి భూస్వాములు లేరు. ఉన్నవారు పాలేర్లను, కూలీలను నియమించుకుని భూములను సాగు చేస్తున్నారు.

ప్రశ్న 5.
మీరు ఒక కౌలుదారు. భూ సంస్కరణ చట్టాల వల్ల మీకు భూమి లభించింది. అప్పుడు మీ అనుభవాలను గురించి వ్రాయండి. (AS4)
జవాబు:
“నాకు ఈ చట్టం వలన 4 ఎకరాలు భూమి లభించింది. దీనికోసం నేను కొద్ది మొత్తం చెల్లించాను. ఇప్పటి వరకు నేను, నా భార్యా, పిల్లలు అందరూ మా దొరగారి పొలంలో పని చేయాల్సి వచ్చేది. కానీ నేటి నుండి ఈ పొలానికి నేనే యజమానిని. నా కుటుంబం అంతా ఈ పొలంలోనే చెమటోడ్చి, శ్రమించి పండిస్తాము. మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాము. స్వేచ్ఛా వాయువులు మమ్మల్ని పరవశింపచేస్తున్నాయి.”

ప్రశ్న 6.
భూసంస్కరణల చట్టం సమయంలో మీరు ఒక భూస్వామి అని ఊహించుకోండి. అప్పుడు మీ భావాలు, చర్యలు ఎలా ఉంటాయో రాయండి. (AS4)
జవాబు:
“అయ్యో ! ఈనాడు ఎంత దుర్దినం. నా 4000 ఎకరాల భూమిని కోల్పోవలసివచ్చింది. నేటి వరకు నా యిల్లు ధాన్యం తోటి నౌకర్లు, చాకర్లు, వెట్టివారితోటి కళకళలాడుతూ ఉండేది. ఇవ్వాళ ఎన్నో అబద్దాలాడి కేవలం 150 ఎకరాలు . మిగుల్చుకోగలిగాను. నా దేశానికి స్వాతంత్ర్యం రావడం ఆనందమే అయినా, నేను మాత్రం చాలా నష్టపోయాను. అధికారమూ, ఆస్తులు లేకుండా మేమెలా జీవించాలి?”

ప్రశ్న 7.
రైతులు ఇష్టం వచ్చినప్పుడు తొలగించగల కౌలుదార్లకు భూసంస్కరణల వల్ల వాస్తవానికి నష్టం జరిగిందని చాలామంది అభిప్రాయపడతారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు తెల్పండి. (AS1)
జవాబు:
ఇది కొంతవరకు ఏకీభవించదగ్గ విషయమే. కారణాలు:

  1. ప్రభుత్వం చెల్లించమని నిర్ణయించిన వెలను చెల్లించి కొంతమంది కౌలుదారులు భూయజమానులయ్యారు.
  2. చట్టబద్ద గుర్తింపు లేని వారు ఎటువంటి ప్రయోజనం పొందలేదు.
  3. జమీందారులు ‘ఖుదా కాస్తే’ను అడ్డం పెట్టుకుని, చాలావరకు భూమిని సొంత సాగులోనే చూపించారు.
  4. కౌలుదార్లను పెద్ద ఎత్తున తొలగించి భూమిని జమీందారులు తమ సొంత సాగులోనికి తెచ్చుకున్నారు.

ప్రశ్న 8.
ప్రభుత్వం సమర్థవంతమైన చట్టాలు చేసినా భూ పరిమితి చట్టాన్ని సమర్థంగా ఎందుకు అమలు చేయలేకపోతుంది? (AS1)
జవాబు:
ప్రభుత్వం సమర్ధవంతమైన చట్టాలు చేసినా, భూస్వాముల పన్నాగాల వల్ల, ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగా అమలు కాలేదు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూదాన ఉద్యమస్ఫూర్తి “భూస్వామ్యాన్ని అంతం చేయడం”లో, “దున్నేవానికే భూమి ఇవ్వటం”లో ఎందుకు విఫలమైంది? (AS1)
జవాబు:
ఈ ఉద్యమంలో భూస్వాములు తమంతట తామే భూములను దానంగా ఇవ్వాలి. అంతటి ఔదార్యం అందరికీ ఉండదు. ఇచ్చినవారు కూడా బంజరు, బీడు భూముల్నే ఇచ్చారు కానీ, సారవంతమైన వాటిని ఇవ్వలేదు. సారవంతమైనవి ఎక్కువ భూస్వాముల దగ్గరే ఉండటం మూలాన ఇది భూస్వామ్యాన్ని అంతం చేయలేకపోయింది. దున్నేవానికి భూమి ఇవ్వలేక పోయింది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పటంలో (నల్గొండ) యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1

ప్రశ్న 11.
“స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం” అనే శీర్షిక కింద మొదటి పేరా చదివి ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)

స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది (65 శాతం), అంటే 18:6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా. వాళ్లకు భూమి వంటి వనరులు ఏవీ అందుబాటులో లేవు, కనీస ఉపాధి పొందటానికి ఉపయోగపడే చదువు లేదు. వాస్తవానికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా తక్కువ కూలీ దొరికే వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు దొరికేది. వ్యవసాయదారుల్లో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమిలేదు. వాళ్లలో కొంతమంది భూస్వాములకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. భూస్వాముల పొలాల్లో వీళ్లు కూలీ లేకుండా పని చేయాల్సి వచ్చేది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి. ఆకలి ఎప్పుడూ వాళ్లని వెంటాడుతూనే ఉండేది.
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయా? ఎలా?
జవాబు:
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. వీరు వ్యవసాయ పనులకే కాక ఇతర పనులకు కూడా వెళుతున్నారు.
ఉదా :
పారిశ్రామిక పనులు, రోడ్డు పనులు, అనేక రకాలైన చేతివృత్తులు మొదలైనవి. వీరు ప్రస్తుతం విద్యను కూడా అభ్యసిస్తున్నారు. నేడు వ్యవసాయ కూలీలకు మంచి డిమాండు ఉన్నది. కాబట్టి వీరి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చును.

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు InText Questions and Answers

8th Class Social Textbook Page No.185

ప్రశ్న 1.
“దున్నేవానికి భూమి” అన్న నినాదంతో కౌలుదారులకు భూమి లభిస్తుంది. మరి కూలికి పనిచేసే వ్యవసాయ కూలీల . పరిస్థితి ఏమిటి?
జవాబు:
కౌలుదార్ల పరిస్థితి కొంత బాగవుతుంది. కాని వ్యవసాయ కూలీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంటుంది. వారి పరిస్థితి నేటికీ అలాగే ఉందని మనం భావించవచ్చు.

ప్రశ్న 2.
గ్రామీణ పేదలకు ఆదాయం వచ్చే ఉపాధి కల్పించడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయని నీవు భావిస్తున్నారా?
జవాబు:
నేటికాలంలో అయితే అనేక మార్గాలున్నాయి. కానీ నాటి కాలంలో ఉపాధి మార్గాలు తక్కువగానే ఉన్నాయి. బ్రిటిషు వారు మనదేశంలో వృత్తి, ఉపాధుల మీద దెబ్బకొట్టారు. ఉన్న కొన్ని అవకాశాలు కూడా చేయిజారి పోయాయి. కాబట్టి ఇంక వేరే ఏ మార్గాలు లేవని నేను భావిస్తున్నాను.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఎన్ని ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది?
జవాబు:
మా ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపడానికి 8 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 30 ఎకరాలు నీటి వసతి లేని భూమి ఉంటే సరిపోతుంది.

8th Class Social Textbook Page No.186

ప్రశ్న 4.
భూ సంస్కరణ చట్టాలు భూస్వాములకు సహాయం చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
నేను వారితో ఏకీభవిస్తాను. జమీందారులకు నష్టపరిహారం చెల్లించడం, ఖుద్ కాస్త లకు వారినే యజమానులుగా కొనసాగించడం మొదలైనవి ఈ వాదనను బలపరుస్తున్నాయి.

ప్రశ్న 5.
భూ సంస్కరణ చట్టాలు భూమినీ, అధికారాన్ని సంపన్న కౌలు రైతులకు మాత్రమే బదిలీ చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వారితో ఏకీభవిస్తాను.

ప్రభుత్వం కౌలుదారులకు భూమిని ఇవ్వడానికి కొంత మొత్తాన్ని వెలగా నిర్ణయించింది. ఇది చెల్లించిన వారు మాత్రమే వీరు తాము సాగుచేసే భూమిని పొందగలిగారు. చెల్లించలేని పేదవారు కూలీలుగానే మిగిలిపోయారు.

ప్రశ్న 6.
వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించటానికి అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
ఈ చట్టాల వల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారు? ఎవరు అస్సలు లాభపడలేదు ? భూస్వాములు చాలా నష్టపోయారని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఈ చట్టాల వలన జమీందారులు ఎక్కువ లాభపడ్డారు. కారణం

  1. వీరికి ఆదాయం పోయినా, అంతకు 20, 30 రెట్లు నష్టపరిహార రూపంలో లభించింది.
  2. ఖుదా కాలు కూడా వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
  3. చట్టంలోని లొసుగులను ఉపయోగించి ఎక్కువ భూములను నియంత్రణలోనికి తెచ్చుకున్నారు.
    ఈ చట్టాల వల్ల అస్సలు లాభపడని వారు పేద వ్యవసాయ కూలీలు.

కారణం :
వీరు గుర్తింపు లేక వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.

8th Class Social Textbook Page No.189

ప్రశ్న 8.
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో ఏ వర్గాల రైతాంగం లబ్ధి పొందింది? ఏ రకంగా లబ్ధి పొందింది?
జవాబు:
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో భూస్వామ్య, ఆధిపత్య కులాల రైతాంగం లబ్ది పొందింది.

  1. జాగీర్దారీ రద్దు వల్ల ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఈ భూముల మీద పట్టాలు లభించాయి.
  2. జాగీర్దార్లు నష్టపరిహారంగా కొట్లు సంపాదించారు.
  3. పెద్ద పెద్ద భవనాలు, పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాలు భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయి.
  4. వేలాది ఎకరాలు ఖుద్ కాఫ్ కింద ఉండిపోయాయి.
    ఈ రకంగా భూస్వామ్య వ్యవస్థ లబ్ధి పొందిందని చెప్పవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూమిలేని వృత్తి కులాలవారికి ఈ సంస్కరణల వల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగింది?
జవాబు:
ఈ సంస్కరణల వలన వీరికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు.

ప్రశ్న 10.
భూస్వాములు ఎంత నష్టపోయారు? తమ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుకోగలిగారు?
జవాబు:
భూస్వాములు ఏమీ నష్టపోలేదని చెప్పవచ్చును. అనేక చట్టాలను సరిగా అమలుచేయలేదు. వీటి అమలులో జాప్యం వల్ల భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు. కౌలుదారీ చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకుని జమీందారులు కౌలుదారుల నుంచి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జమీందారీల రద్దు తరువాత వాళ్లు ఆ భూములన్నీ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు. ఈ భూములను పరిశ్రమలు నెలకొల్పటానికి మళ్లించారు. ఉదాహరణకు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. కాలక్రమంలో వీళ్లు ఆంధ్రలో పారిశ్రామికవేత్తలుగా మారారు. తెలంగాణలో వీళ్లు 21వ శతాబ్దంలో సైతం తమ పెత్తనాన్ని కొనసాగించారు.

ప్రశ్న 11.
కింది పట్టికను గమనించి ఖాళీలను పూరింపుము.
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 2

పట్టికను చదవటం :
1955-56కు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా చదవండి. భూ సంస్కరణల తరవాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు 58 శాతంగా ఉన్నారు. రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల కింద 20 శాతం కంటే తక్కువ సాగుభూమి ఉంది. ఇంకొకవైపున 10 శాతంగా ఉన్న పెద్ద రైతులు, భూస్వాముల కింద మొత్తం సాగుభూమిలో 38 శాతం ఉంది.

భూ సంస్కరణలు అమలు జరిపిన తరువాత 1970 దశకంలో చాలా మార్పులు వచ్చాయి. సన్నకారు రైతులు 58% నుండి 83% వరకు పెరిగారు. చిన్న రైతులు 32% నుండి 16% కు తగ్గారు. కాని వారు గతం కంటే కొంచెం ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. పెద్ద రైతులు 10% నుండి 1% కు తగ్గారు. వారి ఆధీనంలోని భూమి కూడా 38% నుండి 6% కి తగ్గింది.

8th Class Social Textbook Page No.190

ప్రశ్న 12.
ఈ చట్టాన్ని 1950లలోనే అమలు చేసి ఉండాల్సిందని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చి ఉండేదని కొంతమంది అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల గురించి తరగతిలో చర్చించండి. మీరు దేనితో ఏకీభవిస్తారు?
జవాబు:
1950లో అమలుచేయటం నిజంగానే కష్ట సాధ్యం అయ్యేది. ఒకేసారిగా అందరి నుండి అంతంత భూమిని తీసుకున్నట్లయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే దేశ అంతర్గత పరిస్థితి అస్తవ్యస్తమయ్యేది. దీనివల్ల వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది. కాని నాడు ‘ఉక్కు మనిషి’ అని పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకులున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను త్వరలోనే అధిగమించగలిగేది. కాబట్టి అప్పుడు అమలుచేసి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 13.
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ, పశ్చిమ బెంగాల్ లోనూ అమలు అయిన విధానాన్ని పోల్చండి. చట్టాన్ని సమర్ధవంతంగా ఎలా అమలు చేయాలో చర్చించండి.
జవాబు:
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లో చాలా అధ్వాన్నంగా అమలు అయిందని చెప్పవచ్చు. అనేకమంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ప్రకటనలు చేసి, అదనపు భూమిని వెల్లడి చేయలేదు. చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేకమంది భూస్వాములు తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ళ పేరు మీద కూడా బదిలీ చేశారు. భార్యాభర్తలను వేరువేరు కుటుంబాలుగా చూపించటానికి కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూములను కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిలో చాలా వరకు సాగుకు పనికిరానిదిగా ఉంది. భూపరిమితి చట్టాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ ఒకటి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు, భూమిలేని పేదలను సమీకరించి భూ పరిమితి చట్టాలు అమలు అయ్యేలా చూసింది. ఇది సరిగా అమలు కావాలంటే రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజానీకానికీ కూడా నిబద్ధత ఉండాలి.

ప్రశ్న 14.
భూ పరిమితి చట్ట అవసరం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
1950 నుండి ఎన్ని రకాల చట్టాలు చేసినా అవి భారతదేశంలోని భూమి యాజమాన్య పరిస్థితులను మార్చలేకపోయాయి. జమీందారులను భూస్వాములు గాను, భూస్వాములు పెద్ద రైతులు గాను మారారు తప్ప సామాన్య ప్రజానీకానికి, పేదవారికి ఒరిగినదేమీ లేదు. భూమి అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. అందువలన భూ పరిమితి చట్టం అవసరం ఏర్పడింది.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 15.
మొదటి భూదాన భూమిని అందుకున్న మైసయ్యగా మిమ్మల్ని ఊహించుకోండి. ప్రార్థనా సమావేశంలో మీకు భూమి లభించినప్పుడు మీ భావాలను వివరించండి.
జవాబు:
“అయ్యా ! వినోబాజీ ! మీ పుణ్యమా అని నా జీవిత కల నెరవేరి భూమికి యజమానిని అయ్యాను. మీరు, రామచంద్రారెడ్డి కుటుంబీకులు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చల్లంగా ఉండాలి. నా కుటుంబం అంతా రెండు పూటలా అన్నం తింటాం.

మాకు ఈ రోజు నిజమైన పండగొచ్చిన రోజు.

గాంధీ గారికి జై
భారత మాతాకి జై
“ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నంద నందనా ” ||ఉందిలే !||

ప్రశ్న 16.
అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించడానికి ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

ప్రాజెక్టు

అయిదుగురు విద్యార్ధుల చొప్పున బృందాలుగా ఏర్పడి, మీ ప్రాంతంలోని కొంతమంది పెద్దలతో భూ సంస్కరణల అమలులో వాళ్ల అనుభవాల గురించి అడగండి. ఈ పాఠంలో పేర్కొన్న అంశాలు మీ ఊల్లో కూడా జరిగాయేమో తెలుసుకోండి. దీనిపై ఒక నివేదిక తయారుచేసి తరగతిలో చర్చించండి.
జవాబు:

నివేదిక

మా ప్రాంతంలో దాదాపు 15 మంది పెద్దలను మేము అనుభవాలు అడిగి తెలుసుకున్నాము. ఈ భూ సంస్కరణల అమలులో కొద్దిమంది. బికారులు అయిపోయారట. కొద్దిమంది తప్పించుకున్నారట. రాత్రికి రాత్రి చట్టం గురించి తెలిసిన వారు ఆస్తిని బంధువులు, పాలేర్లు అందరి పేర్ల మీద మార్చి తమ భూములను కాపాడుకున్నారు. విషయం తెలియని వారు వారి భూమిని, ఆస్తిని పోగొట్టుకున్నారని వాపోయారు. మొత్తం మీద ఇది కొంతమందికి ఉపశమనాన్ని, కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

SCERT AP 8th Class Social Study Material Pdf 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) ఎఫ్.ఐ.ఆర్ ను కోర్టులో దాఖలు చేస్తారు. (తప్పు)
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా పోలీసు స్టేషనులోని రిజిస్టరులో నేరం వివరాలను పొందుపరచాలి. (ఒప్పు)

2) పోలీసులు అరెస్టు చేయడమంటే శిక్షింపబడటంతో సమానం. (తప్పు)
జవాబు:
పోలీసులు అరెస్టు చేయడమంటే విచారణకు తీసుకెళ్ళారని అర్ధం. (ఒప్పు)

3) హామీల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తారు. (ఒప్పు)
4) దేశంలో అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు. (ఒప్పు)

ప్రశ్న 2.
రవి విషయంలో మొదటి విచారణ నుంచి హై కోర్టులో తుది తీర్పు వరకు ఏం జరిగిందో ఈ పట్టికలో వివరించండి. (AS1)
AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం 1
జవాబు:

సాక్షుల పాత్ర ఇచ్చిన శిక్ష రవి హాజరు కావలసిన అవసరం
వాయిదాకు కొద్దిమందిని 4 సం||లు.
విచారించేవారు.
తప్పనిసరి జైలుశిక్ష
హాజరు కానవసరం లేదు 1 సం|| జైలుశిక్ష ఒకసారి హాజరయితే చాలు.
హాజరు కానవసరం లేదు 1 సం|| జైలుశిక్ష అసలు హాజరు కానవసరం లేదు.

ప్రశ్న 3.
క్రిమినల్, సివిల్ కేసుల మధ్య తేడాల దృష్ట్యా వీటి గురించి ఒక్కొక్క వాక్యం రాయండి.
అ) శిక్ష, జైలు ఆ) ప్రభుత్వ న్యాయవాదులు ఇ) ఎఫ్.ఐ. ఆర్. నమోదు (AS1)
జవాబు:

అంశాలు క్రిమినల్ సివిల్
అ) శిక్ష, జైలు సాధారణంగా దోషులకు జైలు శిక్ష విధిస్తారు. సివిల్ వాదాలలో జైలు శిక్ష వేయకపోవచ్చు.
ఆ) ప్రభుత్వ న్యాయవాదులు ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు. ప్రభుత్వం తరఫున వాదనలు చేస్తారు. వీరి పాత్ర ఏమీ ఉండదు
ఇ) ఎఫ్. ఐ. ఆర్. నమోదు FIR ను పోలీసువారి రిజిష్టరులో నమోదుచేయాలి. FIR ఉండదు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 4.
హైకోర్టు నిర్ణయాన్ని సెషన్సు లేదా జిల్లా కోర్టు మార్చగలవా? ఎందుకు? (AS1)
జవాబు:
హైకోర్టు నిర్ణయాన్ని దాని కన్నా క్రిందస్థాయి కోర్టులైన సెషన్సు లేదా జిల్లా కోర్టులు మార్చలేవు. ఎందుకంటే క్రిందస్థాయిలో జరిగిన వాదనలు, విచారణలు సంతృప్తి చెందకపోతే పై కోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు. హైకోర్టు తీర్పు సంతృప్తిగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు.

ప్రశ్న 5.
సెషన్సు కోర్టు, హైకోర్టు తీర్పులతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్లు ఏం చేయవచ్చు? (AS1)
జవాబు:
సెషన్సు కోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.

ప్రశ్న 6.
ఎస్. హెచ్.ఓ, మెజిస్ట్రేట్ల పాత్రలలో తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఎస్. హెచ్.ఓ పోలీసు స్టేషను స్థాయి అధికారి. మేజిస్ట్రేట్ అంతకన్నా పై స్థాయి అధికారి. S.I తాను అరెస్టు చేసిన వ్యక్తిని విచారణ చేసి 24 గం||ల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.

ప్రశ్న 7.
మీ అభిప్రాయంలో రవి విషయంలో తీర్పు ఎలా ఉండాలి? (AS2)
జవాబు:
రవి విషయంలో తీర్పును నేను సమర్థిస్తున్నాను. కానీ విచారణ మరింత వేగవంతంగా జరిగితే బాగుండేదని భావిస్తున్నాను.

ప్రశ్న 8.
ఒక వ్యక్తి పోలీసు స్టేషనులో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని ఆరు నెలలపాటు నిర్బంధంలో ఉంచారు. ఇది సరైన విధానమేనా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
ఇది సరైన విధానం కాదు. తన నేరాన్ని ఒప్పుకున్నాక అతనిని కోర్టుకు అప్పచెప్పాలి. అంతేకాని తమ నిర్బంధంలో ఉంచుకోకూడదు. అది న్యాయవిరుద్ధం అవుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 9.
ఈ అధ్యాయంలో ఇచ్చిన కార్యనిర్వాహక, న్యాయవర్గాల భిన్న పాత్రలను గుర్తించండి. (AS1)
జవాబు:
పోలీసువారు కార్యనిర్వాహక వర్గంలోకి వస్తారు. కేసును నమోదు చేసుకోవడం, ప్రాథమిక విచారణ చేయడం మొదలైన పనులన్నీ వీరిచే నిర్వహించబడ్డాయి.
న్యాయవిచారణ, సాక్షుల విచారణ, తీర్పు మొదలైన అంశాలన్నీ న్యాయవర్గాలు నిర్వహిస్తాయి.
ఈ విధంగా వీరిరువురూ ఒకరి అధికారాలలో ఒకరు జోక్యం చేసుకోకుండా వ్యవహరిస్తారు.

8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం InText Questions and Answers

8th Class Social Textbook Page No.173

ప్రశ్న 1.
పోలీసుస్టేషనులో రవిపై క్రాంతి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో క్రింద పేర్కొన్న వివరాలు ఉండాలి :
1. పోలీసు స్టేషను అధికారి (ఎసీహెచ్ఓ)ని సంభోదిస్తూ ఫిర్యాదు రాయాలి.
జవాబు:
S.H.O గారికి,

2. ఫిర్యాదు వివరాలు.
జవాబు:
క్రిమినల్ కేసు.

3. నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం.
జవాబు:
10.8.2013 గం|| 8.30 ని॥లు రవి ఇంటివద్ద.

4. ఏం జరిగింది?
జవాబు:
రవి సాంబను అనగా నన్ను కొట్టాడు.

5. నిందితుల పేరు, లింగం, చిరునామా, మొ||నవి.
జవాబు:
రవి, పురుషుడు, x x x x

6. సాక్షుల పేర్లు (నేరం ఎవరి సమక్షంలో జరిగింది?)
జవాబు:
రవి పక్కింటి వ్యక్తి, రవి స్నేహితుడు సాంబ కొడుకు క్రాంతి.

7. విన్నపం (నిందితులను చట్టం ప్రకారం శిక్షించమని కోరటం, తెలిసి ఉంటే వర్తించే సెక్షన్ సంఖ్యను సూచించాలి).
జవాబు:
చట్ట ప్రకారం అతనిని తగినవిధంగా శిక్షించవలసిందిగా విన్నపం.

8. ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు.
జవాబు:
సాంబ, x x x x సహకార సంఘంలో ప్యూను.

8th Class Social Textbook Page No.174

ప్రశ్న 2.
ప్రతి పోలీసు స్టేషను కింద కొంత ప్రాంతము ఉంటుంది. మీ యిల్లు ఏ పోలీసుస్టేషను పరిధిలోకి వస్తుందో తెలుసుకోండి.
జవాబు:
మా ఇల్లు తిరుపతి, వటౌన్ పోలీసుస్టేషను పరిధిలో ఉన్నది.

ప్రశ్న 3.
ఎస్ హెచ్ఓ/ఎస్ఎ వచ్చే వరకు వాళ్లు ఎందుకు వేచి ఉన్నారు? ఇటువంటి నివేదిక మీరు రాయాల్సి వస్తే అందులో మీరు ఏమి రాస్తారు?
జవాబు:
ఎహెచ్ఓ ను స్టేషనుకు పెద్ద అధికారి. ఎఐఆర్ నమోదు చేయాలంటే ఆయన తప్పనిసరిగా ఉండాలి. అందుకే వేచి ఉన్నారు. నేను ఇటువంటి నివేదిక రాయాల్సి వస్తే జరిగిన విషయాలన్నీ వివరిస్తాను. గొడవ ఎలా జరిగింది, ఎవరెవరికి జరిగింది, సాక్షులు ఎవరు, చిరునామాలు మొదలైనవి రాస్తాను.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 4.
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి దాని ప్రతిని తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి తాను ఫిర్యాదు ఇచ్చినట్లు ఋజువుగా దాని ప్రతిని తీసుకోవాలి. దానిని దాఖలు చేసిన తరువాత కేసుని పరిశోధించి, పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది.

8th Class Social Textbook Page No.175

ప్రశ్న 5.
నేరాన్ని ఎవరు విచారించారు? ఎలా విచారించారు?
జవాబు:
నేరాన్ని ఎస్.ఐ విచారించారు.

ఈ కేసులో ఎస్.ఐ ఆ ఊరికి వెళ్లి విచారణ మొదలుపెట్టాడు. ముందుగా సాంబకి అయిన గాయాలు చూశాడు. దెబ్బలు బాగానే తగిలాయని ఆసుపత్రి నివేదిక తెలుపుతుంది. తరవాత అతడు రవి ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్లను విచారించాడు. జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను చుట్టుపక్కలవాళ్లు ఇచ్చారు. సాంబ మీద రవి దాడి చేసి, గాయపరిచాడని ఎటువంటి అనుమానానికి తావులేకుండా స్పష్టమయ్యింది.

అప్పుడు ఎస్.ఐ రవి వాళ్ల ఇంటికి వెళ్లి సాంబ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఆరోపణపై అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పాడు. అతడు రవిని అరెస్టు చేసి మండల పోలీసు స్టేషనుకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ప్రశ్నించాడు. సాంబను కొట్టానని రవి ఒప్పుకోలేదు. రవితోటి అతడి నేరాన్ని అంగీకరింపచేయటానికి ఎస్.ఐ ప్రయత్నించాడు కానీ అతడు ఒప్పుకోలేదు. మరునాడు మెజిస్ట్రేటు ముందు హాజరుపరచటానికి రవిని పోలీసు లాకప్లో నిర్బంధించాడు.

ప్రశ్న 6.
నిందితుడు అంటే ఏమిటి ? ఈ కథలో నిందితుడు ఎవరు?
జవాబు:
నేరం మోపబడిన వ్యక్తిని నిందితుడు అంటారు. ఈ కథలో నిందితుడు రవి.

ప్రశ్న 7.
నిందితుడిపై మోపిన ఆరోపణలు ఏమిటి?
జవాబు:
నిందితుడిపై

  1. ప్లాటుకు డబ్బు కట్టించుకుని అదివేరే వారికి ఇచ్చి మోసం చేసాడని.
  2. డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని మరియు
  3. సాంబపై తీవ్రంగా దాడి చేసి, గాయపరిచాడని ఆరోపణలు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 8.
రవిని శిక్షించడానికి ఎస్.ఐ అతడిని నిర్బంధించాడని సాంబ అనుకున్నాడు. అది నిజమేనా?
జవాబు:
అది నిజం కాదు. శిక్ష వేసే అధికారం కోర్టులకే తప్ప పోలీసులకు లేదు.

8th Class Social Textbook Page No.176

ప్రశ్న 9.
1) సాంబ ప్లాటుని రవి మరొక వ్యక్తికి అమ్మినపుడు అది సివిల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)
2) సాంబని రవి కొట్టినపుడు అది క్రిమినల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)

8th Class Social Textbook Page No.177

ప్రశ్న 10.
నేర, పౌర చట్టాల గురించి మీరు అర్థం చేసుకున్నదాని ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:

ఘటన వివరణ ఏ చట్టం అనుసరించే విధానం
1. బడికి వెళుతున్న దారిలో బాలికల బృందాన్ని ఒక బాలుర బృందం నిత్యం వేధిస్తూ ఉంది. నేరచట్టం పోలీసులు బాలుర బృందంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. బాలురు దోషులు అని ఋజువు అయినట్లయితే వారికి జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా ఉంటుంది.
2. ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు దావా వేయటం. పౌరచట్టం కిరాయిదారు న్యాయస్థానంలో దావా వేస్తారు. కోర్టు నష్టానికి గురి అయిన వారికి ఉపశమనం కలిగిస్తుంది.

8th Class Social Textbook Page No.178

ప్రశ్న 11.
న్యాయమైన విచారణ అంటే ఏమిటి? అది అవసరమా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది. ఒకరు దోషులో కాదో నిర్ణయించటానికి అతడు/ ఆమెపై న్యాయమైన, నిష్పాక్షికమైన బహిరంగ విచారణ జరుపుతారు. నేర విచారణ ‘అమాయకులు అన్న భావన’తో మొదలవుతుంది. ఎటువంటి అనుమానానికి తావులేకుండా నేరం నిరూపింపబడాలి.

ఈ విధంగా విచారించడాన్నే న్యాయమైన విచారణ అంటారు.

న్యాయమైన విచారణ అవసరమే. బాధితులకు సరియైన న్యాయం జరుగకపోతే ప్రజలలో న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. అరాచకం పెరిగిపోతుంది. తమకు న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉంటేనే ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.

8th Class Social Textbook Page No.179

ప్రశ్న 12.
స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు:
న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ప్రభుత్వం తరఫున పనిచేయవు. పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. ఇలా న్యాయశాఖ స్వతంత్రంగా , ఉండే విధానాన్నే స్వతంత్ర్య న్యాయవ్యవస్థ అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 13.
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ నాయకులకు ఏమైనా ఆస్కారం ఉందా? ఎందుకని?
జవాబు:
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ అధికారులకు ఆస్కారం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు – స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినది. కాబట్టి ఇందులో ఎవరూ కలిగించుకోలేరు. న్యాయమూర్తి కూడా విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు.

ప్రశ్న 14.
రవి కేసును ఏ న్యాయస్థానం విచారిస్తోంది?
జవాబు:
రవి కేసును జ్యుడీషియల్ మేజిస్ట్రేటు కోర్టు విచారిస్తోంది.

ప్రశ్న 15.
మొదటి వాయిదాలో ఏమయ్యింది?
జవాబు:
చాలాసేపు వేచి ఉన్న తరువాత రవి, సాంబలను విచారణకు పిలిచారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందు ఇదే మొదటి వాయిదా.

ఎస్ఎఆర్ ప్రతిని, పోలీసుల నివేదికను రవి న్యాయవాదికి ఎస్ఎ ఇచ్చాడు. దీనివల్ల తన క్లయింటుపై మోపబడిన ఆరోపణలు ఏమిటో అతడికి తెలుస్తాయి. ఈ నివేదికల ద్వారా రవికి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు ఏమిటో కూడా అతడికి తెలుస్తాయి. ఈ కేసులో నిందితుడైన రవి తరపున అతని న్యాయవాది వాదించటానికి ఇదంతా దోహదపడుతుంది.

మొదటి వాయిదాలో తీవ్రంగా గాయపరిచాడంటూ రవిపై జ్యుడీషియల్ మెజిస్టేటు నేరారోపణ చేశాడు. ఈ నేరం రుజువైతే 4 సంవత్సరాల దాకా జైలుశిక్ష పడవచ్చు. రవి నేరాన్ని అంగీకరించలేదు. దాంతో మెజిస్ట్రేటు తరవాత విచారణను 15 రోజులకు వాయిదా వేశాడు.

ప్రశ్న 16.
ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదిని ఏమంటారు?
జవాబు:
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ప్రభుత్వ న్యాయవాది అంటారు.

8th Class Social Textbook Page No.180

ప్రశ్న 17.
ఏ కేసులోనైనా సాక్షులు చెప్పే వాటిని వినాల్సిన అవసరం ఏమిటో చర్చించండి.
జవాబు:
ఏ కేసులోనైనా నిందితులు, బాధితులు ఎవరికి అనుకూలంగా వారే మాట్లాడుతారు. కావున సత్యం తెలియదు. సాక్షులు చెప్పేవాటిని వింటే సత్యం తెలుస్తుంది. అందుకే వారు చెప్పినది వినాలి.

8th Class Social Textbook Page No.181

ప్రశ్న 18.
మీ టీచరు సహాయంతో మీ ప్రాంతానికి సంబంధించి ఈ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి?
జవాబు:
మా ప్రాంతానికి సంబంధించి జిల్లా కోర్టులు విజయవాడలోను, హైకోర్టు మచిలీపట్నంలోను ఉన్నాయి.

ప్రశ్న 19.
ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేస్తోందనీ, ఒక గిరిజనుడు కట్టెపుల్లల కోసం కొమ్మలు నరుకుతున్నాడని ఊహించుకోండి. – నిష్పక్షపాతంగా వ్యవహరించటం మంచిదేనా? చర్చించండి.
జవాబు:
గిరిజనులకు అడవిమీద అధికారం ఉంటుంది. వారి నిత్యావసరాలకు, వారు అడవిమీద ఆధారపడతారు. అడవికి – హానిచేయరు. దీనిని సమర్థించవచ్చు.

ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేయడం. అనేది చట్ట విరుద్ధమైన చర్య. ఇది పర్యావరణానికి ముప్పు, కాబట్టి ఇది సమర్థనీయం కాదు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 20.
కింది నుంచి పై వరకు న్యాయస్థానాల వ్యవస్థ పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బొమ్మలో నింపండి.
(లేదా)
కింద ఇవ్వబడిన ఫ్లోచార్టలోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
i) మనదేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి?
ii) దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది?
iii) “సబార్డినేట్” న్యాయస్థానాలని వేటిని అంటారు?
iv) భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు ఏ న్యాయస్థానానికి లోబడి ఉండాలి?
జవాబు:
i) మనదేశంలో మూడు స్థాయిలలో న్యాయ స్థానాలు ఉన్నాయి.
ii) దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
iii) కింది స్థాయి న్యాయస్థానాలను సబార్డినేట్ న్యాయస్థానాలు అంటారు.
iv) అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టుకు లోబడి ఉంటాయి.

8th Class Social Textbook Page No.182

ప్రశ్న 21.
“మా నాన్నకి న్యాయం జరిగింది, కానీ చాలా ఆలస్యం అయింది” అని క్రాంతి అన్నాడు. మీరు అతడితో ఏకీభవిస్తారా? Page No.182)
జవాబు:
నేను క్రాంతితో ఏకీభవిస్తాను. ఎందుకంటే న్యాయం జరగడానికి సుమారు 3 సం||రాల కాలం తీసుకుంది. ఇది తక్కువ సమయమేమీ కాదు.

ప్రశ్న 22.
రవి శిక్షను సెషన్స్ కోర్టు తగ్గించటానికి కారణాలను ఊహించండి.
జవాబు:
ఏ దేశంలోనైనా శిక్షా స్మృతి దోషుల మనసు మార్చడానికే రాయబడి ఉంటుంది. రవికి మేజిస్ట్రేట్ కోర్టు 4 సం||రాల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పుపై అభ్యంతరంతో రవి సెషన్సు కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. సెషన్సు కోర్టులో కేసు తేలడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అంటే అతని శిక్షాకాలంలో సగం కోర్టు నిర్ణయానికే వేచి ఉండాల్సి వచ్చింది. ఇంత కాలంలో మనిషిలో మార్పు రావడానికి అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఈ భావనను పరిగణనలోనికి తీసుకుని కోర్టు రవికి శిక్ష తగ్గించి ఉండవచ్చు.

ప్రశ్న 23.
నిందితులను కానీ, సాక్షులను కానీ హైకోర్టు తన ముందుకు రమ్మని అడగదు. ఎందుకని?
జవాబు:
క్రిందిస్థాయి కోర్టులో నిందితులను, సాక్షులను విచారిస్తారు. కాబట్టి హైకోర్టు మరలా విచారించాల్సిన అవసరం లేదు అని హైకోర్టు భావిస్తుంది. అందుకే వారిని తన ముందుకు రమ్మని అడగదు.

ప్రశ్న 24.
పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాలి? భద్రత దృష్ట్యా కొన్ని సూచనలు చేయండి.
జవాబు:
పిల్లల పట్ల పెద్దలు ప్రేమ పూర్వకంగా మరియు స్నేహభావంతో మెలగాలి. పిల్లల చదువుల విషయంలో వారికి ఒక స్నేహితుడిలాగ అవగాహన కలిగించి వారు సరియైన దారిని ఎంచుకునే లాగ ప్రోత్సహించాలి. వారు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసి చూపకుండ వారు చేసిన తప్పును సరిదిద్ది మరలా వారు దానిని చేయకుండా చూడాలి. వారికి చదువు ఒక్కటే కాదు ఆటలు, పాటలు అనేవి కూడా వారి జీవన విధానంలో ప్రధానమని ప్రోత్సహించాలి. పిల్లలకు పెద్ద వారిని గౌరవించడం నేర్పాలి. వారు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో గమనించాలి. పిల్లలకు లోకజ్ఞానమును నేర్పించాలి. వారికి వాహనములను నడపడం పట్ల మరియు రోడ్డు భద్రత అంశాల మీద అవగాహన కలిగించాలి. సోషల్ మీడియాను పిల్లలు సరియైన దారిలో ఉపయోగించేలాగ చూడాలి.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 25.
నిన్ను ఒకరు వేధిస్తున్నారని ఊహించుకోండి. దానికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరుస్తూ పోలీస్ అధికారికి . ఫిర్యాదు రాయండి.
జవాబు:

మహరాజశ్రీ, విజయవాడ వటౌన్ పోలీస్ స్టేషన్ S.I. గారి దివ్య సుముఖమునకు పంజాగుట్ట కాలనీవాసురాలిని మరియు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ‘నేహ’ అనే విద్యార్థిని చేసుకుంటున్న విన్నపము.

అయ్యా ,
గతకొంతకాలంగా నేను పాఠశాలకు నడచి వెళ్తున్న సమయంలో మా వీధిలోని కొంతమంది పనిచేయకుండా ఖాళీగా ఉన్న యువకులు టీజింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గర పెద్దవారికి చెప్తే వారు వచ్చి ఆ యువకులను మందలించగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మరలా ఒక నెల రోజుల నుండి టీజింగ్ చేయడమే కాకుండా, అసభ్య పదజాలమును వాడటం, నా వెనకాల స్కూలుదాగ రావడం చేస్తున్నారు. దీని వలన నా చదువు దెబ్బతింటుంది. నాకు పాఠశాలకు వెళ్ళాలంటే భయము వేస్తుంది. కావున దయ ఉంచి మీరు నన్ను వారి బారీ నుండి కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
తమ విధేయురాలు,
నేహ.

అడ్రసు :
నేహ
D/O. శ్రీనివాసరావు
పంజా సెంటర్
4వ నెంబరు వీధి
133-1/11

ప్రశ్న 26.
గ్రామాలలో / కుటుంబాలలో తరచు తగాదాలు ఎందుకు వస్తాయి? దానికి కారణాలు ఏవి? అవి రాకుండా ఉందాలంటే మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావాలి?
జవాబు:
గ్రామస్తులు ఒకరితో ఒకరు కలసిమెలిసి ఉంటారు. ఇంకొకరి విషయాలలో వారి అనుమతి లేకుండానే తలదూరుస్తారు. ‘వ్యక్తిగతం’ అనేదాన్ని విస్మరిస్తారు. కావున తగాదాలు వస్తాయి. కాబట్టి వారు పట్టణ/నగర నాగరికతను అలవరుచుకుంటే మంచిది.

ప్రశ్న 27.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

బెయిలు :
రవిది క్రిమినల్ కేసు కాబట్టి నేరారోపణ పత్రం (చార్జిషీటు దాఖలు చేసిన తరవాత లాకప్ లో నిర్బంధించారు. క్రిమినలు కేసులలో నిందితులను జైలులో ఉంచుతారు. అయితే ఇది శిక్షకాదు. ఇది నేర విచారణలో దోహదపడటానికి, లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండటానికి, లేదా సాక్షులను బెదిరించకుండా ఉండటానికి ఉద్దేశించినది. పోలీసు లాకప్ లో కొన్ని రోజులు ఉన్న తరువాత రవి కుటుంబం బెయిలు కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు దొరకకపోవచ్చు. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఆస్తులు కావచ్చు లేదా పూచీకత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు. బాండు కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడని బాండు హామీ ఇస్తుంది. బెయిలు మంజూరు చేయాలో, లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిర్ణయిస్తారు.
అ) రవిని ఎందులో నిర్బంధించినారు?
జవాబు:
రవిని లాకప్ లో నిర్బంధించినారు.

ఆ) క్రిమినల్ కేసులలో నేర విచారణలో దోహదపడటానికి ఏం చేస్తారు?
జవాబు:
నిందితులను జైలులో ఉంచుతారు.

ఇ) బెయిలు కోసం ఎవరికి దరఖాస్తు చేశారు?
జవాబు:
న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు.

ఈ) బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో ఏమి ఇవ్వాలి?
జవాబు:
న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి.

ఉ) బెయిల్ ను ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:
న్యాయమూర్తి

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 28.
ఈ క్రింది పేరాను చదివి జవాబులిమ్ము.

ఇంతకు ముందు అధ్యాయాలలో మనం భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకున్నాం. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరు చేయటం. దీని అర్థం ఒక రంగంలో మిగిలిన రంగాలు అంటే ఉదాహరణకు న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ అధీనంలో లేవు. ప్రభుత్వం తరపున పని చేయవు.

పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. వాళ్లు కార్యనిర్వాహక రంగానికి చెందినవాళ్లు. గత సంవత్సరం మీరు జిల్లాస్థాయి పరిపాలన గురించి చదివారు. జిల్లాస్థాయిలో కలెక్టరు మాదిరిగా శాంతి, భద్రతల నిర్వహణకు జిల్లాస్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.
అ) రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం ఏది?
జవాబు:
రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయడం.

ఆ) న్యాయస్థానాలు ఎవరి ఆధీనంలో లేవు?
జవాబు:
న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు.

ఇ) పోలీసులు ఏ రంగానికి చెందినవారు?
జవాబు:
పోలీసులు కార్యనిర్వాహక రంగానికి చెందినవారు.

ఈ) పోలీసుశాఖ ఎవరి క్రింద పనిచేస్తుంది?
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.

ప్రాజెక్టు

వీస్ ల్యాండ్ అనే పట్టణం ఉంది. దానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఆటస్థలంలో ఫియస్టా, జుబిలీ అనే ఫుట్ బాల్ టీముల మధ్య తుది పోటీ జరగాల్సి ఉంది. అయితే మరునాడు మైదానాన్ని జుబిలీ బృందం మద్దతుదారులు పాడుచేశారని తెలిసింది. పీల్యాండ్ లో ఫియస్గా మద్దతుదారులు జుబిలీ మద్దతుదారుల ఇళ్లపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది పురుషులు చనిపోయారు. అయిదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 50 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు.

మీరు, మీ మిత్రులు నేర న్యాయవ్యవస్థలో భాగమని ఊహించుకోండి. ముందుగా తరగతిలోని విద్యార్థులను ఈ కింది రకంగా విభజించండి.

  1. పోలీసు
  2. ప్రభుత్వ న్యాయవాది
  3. నిందితుల తరపు న్యాయవాది
  4. న్యాయమూర్తి

పాఠం నుండి ప్రతి జట్టు చేయవలసిన విధులను, ఫియస్గా అభిమానులచే హింసకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా కేటాయించండి. ఈ విధులు ఏ క్రమంలో పూరించాలో సూచించండి.

ఇదే పరిస్థితిని తీసుకుని ఫియస్గా అభిమానియైన ఒక విద్యార్ధిని పైవిధులన్నీ నిర్వర్తించమనండి. నేర న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒక్కరే నిర్వర్తించినప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.

నేర న్యాయవ్యవస్థలో వివిధ పాత్రలను వివిధ వ్యక్తులు పోషించాలనటానికి రెండు కారణాలను పేర్కొనండి.
జవాబు:
న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒకరే నిర్వహించితే కచ్చితంగా -ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది.
ఉదా :
ఫియస్గా అభిమాని విచారణ జరిపితే జూబిలీ వారికి అన్యాయం జరుగుతుంది.

రెండు కారణాలు :

  1. నేరవ్యవస్థలో ప్రాథమిక ఆధారాలని బట్టి మాత్రమే విచారణ చేసి కేసు పెడతారు.
  2. న్యాయ వ్యవస్థలో వాటిని కూలంకషంగా పరిశీలించి తీర్పునిస్తారు. కాబట్టి రెండు వ్యవస్థలు వేరువేరుగా ఉండాలి.