TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Access to a variety of TS Inter 1st Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

సూచనలు :

  1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
  2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న క్రింద వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి.

ప్రశ్న 1.
పల్లవి : దేహమైతే మనదిగాదు ……… తన సొమ్ముయా॥
జవాబు:
పల్లవి : దేహమైతే మనదిగాదు
మోహములు విడువండయా
సాహ సం బున గురుని జేరితే
సోహమే తన సొమ్ముయా॥

భావం : ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.

ప్రశ్న 2.
గతాన్ని కాదనలేను ………. నా ఊరు ప్రజావాటి
జవాబు:
గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి

భావం : గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి ?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారులు వీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.

మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.

భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ‘ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.

తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.

అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.

కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే.. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.

ప్రశ్న 2.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్ర్య బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్ర్యబాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని దర్శించి – ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్య్రము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే- ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా? యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమాన మిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని గాంచి – బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. . మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గా యాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపుర కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశల మడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్టతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను.. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము.

ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు. కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు.

తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండ కూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి ?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్య లహరి” సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు.

సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవివేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవ వాఙ్మయమంతా ఇతనిరచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మషాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవ సాహిత్యాన్ని సృష్టించాడు.

ఇతని తరువాతి వారు సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. తెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుష్యాదులన ప్రవేశపెట్టాడు.

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండిషారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిష్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన

భాష:
“ఉరుతర గద్య పద్యోక్తుల కంటె
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిడైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.

ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్య మిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండిషారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.

వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండిషారాధ్య చరిత్రలో

“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
జలజల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న…..”

ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.

జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది.

రామాయణరచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమనిచెప్పింది. కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది.

ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రబోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.

మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం ….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి ?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది.

పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక. సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే ! అర్థరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది. “నేను పోలీసోన్ని కాను రజోకార్ను కాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు ! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్ ! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత ! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు ! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా ! మా పోతా… ఒక్కటే పోకడ ! చక్కంగ స్వర్గమే పోతా ! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా ! నీవెందుకొచ్చెగా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం ! ఇక కూకోవాని పక్క ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటె, ఏం మానవతివి గదవే ! నీ సిగ్గు అగ్గిలబడ ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట ! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదే! వాని జూత్తె జాలి పుడుతలేదె నీకు ! ఆ! గట్ల ! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో ! ఎన్నడన్న తాగినావు తాతా గట్క ? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక ? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా ? పోయేపానం మర్లుతది. చూడు మరి – కులం జెడిపోతవని భయపడుతున్నావా ? నువ్వు యేకులమోడవైనా సరే- మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి ” వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు ! కాంగ్రెసోడాయేం”అంటే “వాడెవ్వడా ? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా ? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే ! అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

ప్రశ్న 2.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలుపేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి.ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది.

ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాలపేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటుచూడు…. ఆ సామానంతా క్రింద పెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయికూకో” చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. – నీ కింత పొగరుండీ మాకెంతుండాల్నే ? ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకన్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా ! ఎక్కడ సచ్చిండు ? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు..

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి.సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు. “ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని. డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే ! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.
మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు.

మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నే తీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో …. రికి కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహిం- కపోతున్నారని కవి బాధపడ్డాడు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
స్నేహలతాదేవి ఆత్మ విశ్వాసాన్ని వివరించండి ?
జవాబు:
స్నేహలతాదేవి అను పాఠ్యభాగం డా॥ ముదిగంటి సుజాతారెడ్డిచే రచించ బడింది. ఆమె కథల సంపుటి “విసుర్రాయి”లోనికి ఈ కథ. ఈ కథ నేటి తరం మహిళా సాధికారికతను ప్రతిబింబిస్తుంది. స్త్రీల జీవితంలో పెళ్ళికే కాకుండా సమాంతరంగా విద్య, ఉద్యోగానికి, ఆర్థిక స్వావలంబనకు చాలా ప్రాధాన్యం ఉందన్న వాస్తవాన్ని వివరిస్తుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించాలన్న మానవీయ విలువలను ఆధర్మాలను తెలుపుతుంది. యువత ప్రతి చిన్న విషయానికి అసంతృప్తికి గురి అవుతున్నారని, చిన్న ఓటమికే కృంగిపోయే మనస్తత్వంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తుంది.

స్నేహలతాదేవికి తనపై తనకు అంచంచల ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనకు నేర్పాయి. తన తనతల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమార్తె. తల్లిదండ్రులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహ విషయంలో తన తల్లిదండ్రుల బాధే స్నేహలతను కలిచివేసింది.

స్నేహలతకు వివాహం కావడం లేదని తల్లిదండ్రులు చింతిస్తున్నారు. వారి బాధను చూడలేక వారిని ఓదార్చుతూ తనపై తాను విశ్వాసాన్ని పెంచుకుంది స్నేహలత. పెళ్ళి చూపుల మీద పెళ్ళిచూపులు జరిగాయి. ఇది ఆడదానికి జరిగే అవమానాలలో ఒకటి. నాకేం తక్కువ ? చదువుకుంది. సంస్కారం ఉంది. మరీ అంత అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేను.

నన్ను చూడటానికి వచ్చేవారికి వీటితో అస్సలు పనేలేదు. నేనిచ్చే కట్నంపైనే వారి దృష్టి. నేను ఇచ్చే కట్నాన్ని ఆశించి ఎవరూ నన్ను వివాహం చేసుకుంటానని అనటం లేదు. ఎందుకంటే అది వారికి నచ్చలేదు. ఈ దేశంలో. స్వయం శక్తిపై విశ్వాసం లేనివాళ్ళు పెరిగిపోతున్నారు. పరాయిధనానికి ఆశకాదు అత్యాశ పడేవారే అధికమవుతున్నారు.

నా గురించి మీరు ఇల్లు అమ్ముకుని బజారును పడవలసిన పనిలేదు. నాకు చదువుంది. డిగ్రీ వుంది. ఆ డిగ్రీలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. భవిష్యత్తులో నా జీవన పథంలో నేనంటే ఇష్టపడేవాడు. వ్యక్తిగా నన్ను గౌరవించే వాడు డబ్బుకోసం కాక, వరకట్నం కోసం కాక నా సాహచర్యం కోసం నా వ్యక్తిత్వం చూసి నన్ను పెళ్ళాడే వాడు దొరికినపుడే వివాహం చేసుకుంటాను. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు భయపడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను.

నాకా శక్తిని ఈ సమాజం ఇచ్చింది. ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటాను. ఉద్యోగం సాధించగానే మీకు ఉత్తరం రాస్తాను. మీరు కూడా నా దగ్గరికే వచ్చి ఉండవచ్చు. మీరు నా దగ్గర ఉండటానికి ఇష్టపడే వాడు దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. ఈ సమాజంలో స్త్రీ శక్తి మేల్కొవాలి.

ఎవరికి తగిన స్థాయిలో వారు ఆర్థిక స్వాలంబనను పొందటానికి కృషిచేసి వరకట్నం వంటి దురాచారాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాని స్నేహలతాదేవి తనతోపాటు స్త్రీ జాతి కంతటికి ఆత్మ విశ్వాసాన్ని కల్గించింది.

ప్రశ్న 4.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది. కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించటం ప్రారంభమౌ తుంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.

రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు. అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టి నట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు.

“ఒక్కపేకాటేకాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”.

“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియాసొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి.
సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.

సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్దీ కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కోవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది..

అపుడు రాంరెడ్డి ! “సుబానీ ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న. గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు, మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము : ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము : మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.
భావము : ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 2.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది. సందర్భము : ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది
భావము : గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.

ప్రశ్న 3.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం : స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.
భావం : ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు..

ప్రశ్న 4.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము.
జవాబు:
పరిచయము : శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము : శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది.
భావము : చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

VI. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.

కృష్ణమార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు. అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.

ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

ప్రశ్న 4.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు.

కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను.

గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచు కొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ఘల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను – అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

VII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

ప్రశ్న 1.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది ?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనే పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.

దుంఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో ఉన్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేనివారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మానవత్వం అనిపించు కుంటుందని అష్టాంగ హృదయం బోధించింది.

ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి ?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.

తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు. ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు.

పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులహూర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోనం, స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్ఠించటంగా భావిస్తారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 3.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి ?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నది కదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మా కోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది. బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందట మాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 4.
‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు ?
జవాబు:
రాజా బహద్దూర్ `కటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన హద్దూర్ వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. రెడ్డిగారు 1926లో తెలంగానలో గోల్కొండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేదు. ఆయనే 20 సం||ల పాటు -దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దూర్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కొండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం

గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణాలయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ.7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి. తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.

VIII. ఈ క్రింది వానిలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
(పాఠ్యాంశ కవులు / రచయితలు)

ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.

ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.

వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం. మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.

ప్రశ్న 2.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.

మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబుఁ” ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు. గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు.

ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతార”గా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.

ప్రశ్న 3.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభావము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.

హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవిషా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.

అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

ప్రశ్న 4.
రచయిత రావి ప్రేమలత గురించి వ్రాయండి.
జవాబు:
డా. రావి ప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ, నాగిరెడ్డిలు. భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పిహెచ్.డి పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు అన్న అంశంపై పరిశోధనచేసి పిహెచ్.డి సాధించారు.

రావి ప్రేమలతా జానపద విజ్ఞానం సిద్ధాంతాల నేపధ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాససంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామ రాజు జానపదవిజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారాన్ని అందుకుంది.

ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమవిమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాససంపుటిని వెలువరించారు. Folk Tales of South India-Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావి ప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్యపీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.

IX. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (5 × 1 = 5)
(పద్యభాగం నుండి)

ప్రశ్న 1.
కవి కంటికి రుచించేదేమిటి ?
జవాబు:
హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి

ప్రశ్న 2.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవి వలె కనిపించింది.

ప్రశ్న 3.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు ?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు.

ప్రశ్న 4.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు ?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.

ప్రశ్న 5.
కవిరాజుమూర్తిని ఏ మహాకవితతో పోల్చవచ్చు ?
జవాబు:
చిలీ దేశ మహాకవి! బ్లో నెరుడాపాతో పోల్చవచ్చు.

ప్రశ్న 6.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు.

ప్రశ్న 7.
ద్రోణుడిని ధనుర్విగ్వాచార్యుడిగా ఎవరు నియమించారు ?
జవాబు:
భీష్ముడు

ప్రశ్న 8.
‘మిత్ర ధర్మం’ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

X. ఈ క్రింది వానిలో ఐదింటికి ఏకపద/వాక్య సమాధానం రాయండి. (2 × 3 = 6)
(గద్యభాగం నుండి)

ప్రశ్న 1.
సోమన మొదటి కృతి ఏది ?
జవాబు:
సోమన మొదటి కృతి ‘అనుభవసారము’

ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనరసమ్మ, నరసయ్యలు.

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 4.
అనాధ బాలబాలికల కోసం ఎలాంటి శాసనము వచ్చింది ?
జవాబు:
అనాధ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక” శాసనము వచ్చింది.

ప్రశ్న 5.
గుమ్మడి కాయ, గుమ్మడి పూలు దేనికి సంకేతం ?
జవాబు:
గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.

ప్రశ్న 6.
‘ఉర్దూ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది ?
జవాబు:
18వ శతాబ్దంలో

ప్రశ్న 7.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి ?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 8.
సురవరం ప్రతాపరెడ్డి ఎపుడు జన్మించారు ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896న జన్మించారు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

XI. ఈ కింది వానిలో ఒకదానికి సమాధానం రాయండి. (1 × 5 = 5)

1. పోగొట్టుకున్న సైకిల్ కోసం పోలీస్ స్టేషన్కి లేఖ రాయండి.
జవాబు:

దిలావర్పూర్.
10.08.2023.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.
ఆర్యా!
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్పర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని. నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

2. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి.
జవాబు:

నల్లగొండ,
26.07.2023.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు
నిర్దేశము : నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2023.

ఈ నెల తేది 20.07.2023 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు,
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు :

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

XII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1) జీవితాశ
జవాబు:
జీవితాశ = జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

2) తెగనేసిన
జవాబు:
తెగనేసిన = తెగన్ + ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి.
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

3) నేలబ్రడి
జవాబు:
నేలబ్రడి = నేలన్ + పడి – ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము : ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు.

4) సూకరంబునకేల
జవాబు:
సూకరంబునకేల = సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

5) గతమంత
జవాబు:
గతమంత = గతము + అంత = గతమంత – ఉత్వసంధి/ ఉకారసంథి
సూత్రము : ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

6) వేరైనా
జవాబు:
వేరైనా = వేరు + ఐన – వేరైన – ఉత్వసంధి /ఉ. కార సంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

7) ఎల్లి యెల్లక
జవాబు:
ఎల్లి యెల్లక =. ఎల్లి + ఎల్లక – యడాగమసంధి
సూత్రము : సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.

8) ముత్యమట్లు
జవాబు:
ముత్యమట్లు = ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళమగును.

XIII. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) గురునిపాదము
జవాబు:
గురునిపాదము – గురునియొక్క పాదము – షష్ఠితత్పురుషసమాసం

2) భానుకాంతి
జవాబు:
భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీ తత్పురుష సమాసం

3) భుజబలము
జవాబు:
భుజబలము – భుజముల యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసము

4) మైత్రే బంధము
జవాబు:
మైత్రే బంధము – మైత్రీ చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం

5) దయాపయోనిధి
జవాబు:
దయాపయోనిధి – దయా పయోధి – షష్ఠీ తత్పురుష సమాసము

6) ప్రియభాషలు
జవాబు:
ప్రియభాషలు – ప్రియమైన భాషలు – విశేషణపూర్వపద కరధాయ సమాసం

7) గరగృహం
జవాబు:
గరుగృహం – గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమాసము

8) దివ్యబాణం
జవాబు:
దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం

XIV. ఈ క్రింది అంశాలలో ఒకదానిని గురించి వ్యాసం రాయండి. (1 × 5 = 5)

ప్రశ్న 1.
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం
జవాబు:
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం. ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు. ‘ చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం.

వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం’ చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్టు మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటల ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహనులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 – 1686) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724- 1948 తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగ్ నగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి.

పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికీ, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ద సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో. కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుద్దాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

ప్రశ్న 2.
యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం
జవాబు:
శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో. ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది. ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి.

పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు. ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి .చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు.

ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు.

తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు. ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం.

అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు. సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు. అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు.

కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు.

ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు. తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

ప్రశ్న 3.
జాతీయ విపత్తులు-
జవాబు:
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు.

విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం.

సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్ 19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల. పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

XV. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి.

1. Language is the dress of the thought.
జవాబు:
ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష.

2. Ours is a joint family.
జవాబు:
మాది ఉమ్మడి కుటుంబం.

3. Education is the most powerful weapon which can change the world.
జవాబు:
ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే.

4. A poor workman blames his tools.
జవాబు:
పని చేతకానివాడు పనిముట్లని నిందిస్తాడు.

5. There is no substitute for hard work.
జవాబు:
కృషికి ప్రత్యామ్నాయం లేదు.

TS Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

XVI. ఈ క్రింది వ్యాసాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది.

ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం. ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.

తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది.

ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో

ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలనోప్పో

ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి

ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి

Leave a Comment