AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ

10th Class Telugu ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
జవాబులు
అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.

2. అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమకన్ను ఒక్కసారిగా అదిరింది.
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన
వాలిని తప్పక వధిస్తాన’ని మాట ఇచ్చాడు.
జవాబులు
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వదిస్తాన’ని మాట ఇచ్చాడు.
అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.

3. అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.
జవాబులు
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

4. అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారసు హనుమంతుడు ఓదార్చాడు.
ఆ) ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఆ) ఒకనాటి అర్థరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు.

5. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.

6. అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
జవాబులు
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.

7. అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
జవాబులు
అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

8. అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిదికాదని తార బోధించింది.
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
జవాబులు
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని తార బోధించింది.

9. అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
జవాబులు
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంత సేపటికి తేరుకున్నాడు.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.

10. అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.

పాత్ర స్వభావాలు

1. సుగ్రీవుడు :
వాలి యొక్క తమ్ముడు. రాజనీతి బాగా తెలిసినవాడు. వారిని ఓడించడానికి శ్రీరామునితో స్నేహం చేశాడు. ఓడించాడు. శ్రీరామునకు సీతాదేవి జాడను తన మంత్రి అయిన హనుమంతుని ద్వారా కనుగొన్నాడు. రామరావణ సంగ్రామంలో తన బలగాలను వినియోగించాడు. శ్రీరాముని విజయానికి కారకుడయ్యాడు.

2. హనుమంతుడు :
అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. సుగ్రీవుని మంత్రి, సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునకు చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు. శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు.

3. వాలి :
ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. మహాబలవంతుడు. బలగర్వం ఎక్కువ. తమ్ముడైన సుగ్రీవుని బాధించాడు. భయపెట్టాడు. అతని భార్యను అపహరించాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“కాలి అందెలు మాత్రం, మా వదినెగారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల గుర్తుపట్టాను” అని రామునికి లక్ష్మణుడు చెప్పిన మాటను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశానని, ఆమె రామా ! లక్ష్మణా ! అని అరిచిందనీ, ఒక నగల మూటను విసిరిందనీ చెప్పి సుగ్రీవుడు ఆ నగలను రామునికి చూపించాడు. శ్రీరాముడు సీత నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలను చూసి తాను ఆ నగల మూటలోని కేయురాలను, కుండలాలను గుర్తుపట్టలేనని అందులోని కాలి అందెలు మాత్రం సీతాదేవివని చెప్పాడు.

ఈ మాటలను బట్టి లక్ష్మణుడు తన వదిన సీతను, ఆ 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తలపైకి ఎత్తి ఆమె ముఖాన్ని చూడలేదని గ్రహించాను. లక్ష్మణుడు మహాభక్తుడని వదినకు నిత్యం నమస్కరించే వాడనీ గ్రహించాను. లక్ష్మణుని వంటి సుగుణవంతుడు, సచ్చీలుడు మరొకరుండరని గ్రహించాను.

ప్రశ్న 2.
‘లక్ష్మణా ! ఈ హనుమంతుని మాటల్లో ఒక్క వ్యాకరణ దోషం లేదు’ అని రాముడు పలికిన మాటల వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను సమీపించాడు. సుగ్రీవుని దూతగా వచ్చాడు. హనుమంతుని మాటల తీరు రామునికి నచ్చింది. హనుమంతుని మాటల్లో వ్యాకరణ దోషాలు లేవని లక్ష్మణుడితో చెప్పాడు.

శ్రీరాముని మాటల తీరును బట్టి హనుమంతుడు మంచి వాక్చాతుర్యం కలవాడని, ఉచ్ఛారణపరమైన, భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాలు లేకుండా మాట్లాడగలిగే సామర్థ్యం కలవాడని గ్రహించాను. మాటల్లో ఎలాంటి దోషాలు లేకుండా మాట్లాడాలని, అది అందరిని ఆకట్టుకుంటుందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
“తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని రాముడు పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వాలిని సంహరించాడు. వాలి రామునితో “నన్ను ఎందుకు సంహరించావు?” అని అడిగాడు. దానికి సమాధానంగా రాముడు “తమ్ముని భార్యను చెరబెట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని చెప్పాడు.

శ్రీరాముని మాటల వల్ల పరస్త్రీని చెరబెట్టడం అన్యాయమని గ్రహించాను. సోదరుని భార్యను కూతురుగా భావించాలని, ధర్మాన్ని అతిక్రమించకూడదని గ్రహించాను. శ్రీరాముడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మపరుడైన వాలిని సంహరించాడని గ్రహించాను. అధర్మపరులను శిక్షించడమే ధర్మాత్ముల లక్షణంగా గ్రహించాను.

ప్రశ్న 4.
శ్రీరాముడు తన కాలిబొటనవేలితో దుందుభి కళేబరాన్ని దూరంగా పడవేయడం, ఒకే బాణంతో మద్దిచెట్లను చీల్చడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపించారు. పరస్పరం స్నేహం చేసుకోవాలనుకున్నారు. శ్రీరాముడు సుగ్రీవునికి తన పరాక్రమంపై నమ్మకాన్ని కల్గించడానికి దుందుభి కళేబరాన్ని కాలిబొటనవేలితో దూరంగా పడవేశాడు. ఒకే బాణంతో మద్ది చెట్లను చీల్చాడు.

దీనివల్ల శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల సమర్థుడని గ్రహించాను. దీనివల్ల శ్రీరాముని బలపరాక్రమాలపై సుగ్రీవునికి నమ్మకం కల్గియుంటుందని గ్రహించాను. విశ్వాసంతోనే మైత్రి చిరకాలం నిలుస్తుందని గ్రహించాను.

ప్రశ్న 5.
“సుగ్రీవా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు” అని రాముడు పలకడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపిరచారు. పరస్పరం సహకారం అందించుకోవాలనుకున్నారు. అగ్నిసాక్షిగా స్నేహం చేశారు. రాముడు సుగ్రీవుని బాధలను విని ‘మిత్రమా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు’ అని మిత్ర ధర్మాన్ని గురించి పలికాడు.

శ్రీరాముని మాటల ద్వారా ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని గ్రహించాను. మిత్రుని కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. మిత్రుని యొక్క సుఖాల్లోనే కాదు, అతనికి అనుకోని ఆపదలు వచ్చినప్పుడు కూడా. ఆదుకోవాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
సంపాతి తన సోదరుడైన జటాయువు మరణవార్త విని బాధపడి వానరులకు సీత జాడను తెలియజేశాడు. దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
సంపాతి జటాయువు సోదరుడు. వానరుల ద్వారా జటాయువు మరణవార్త విని దుఃఖించాడు. ఆ దుఃఖంలోనే వానరులకు సీత జాడను తెలిపాడు. లంకకు వెళ్ళే మార్గాన్ని చెప్పాడు. తరువాత రెక్కలు రావడంతో సంపాతి గగనమార్గంలో వెళ్ళాడు.

జటాయువులాగే ఇతడు కూడా పరోపకారబుద్ధి కలవాడని, శ్రీరాముని సేవలో పరోక్షంగా సహకరించాడని గ్రహించాను. అతని పరోపకారబుద్ధి వల్లే రెక్కలు వచ్చాయని గ్రహించాను. శ్రీరాముని సేవలో తరించిన సంపాతి నిజంగా ధన్యజీవి అని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఒకడు సన్యాసి రూపంలో వచ్చిచెడు చేశాడు. మరొకడు సన్యాసి రూపంలోనే వచ్చి మంచి చేశాడు. వారెవరు? అవేమిటి?
జవాబు:
రావణుడు సన్యాసి రూపంలో వచ్చి, సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. సీతారాములకు ఎడబాటు కలిగించి వారి దుఃఖానికి కారకుడయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు. –
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. సుగ్రీవునితో స్నేహం కుదిర్చాడు. సీతారాముల కలయికకు మార్గం చూపించాడు. తన జన్మ ధన్యం చేసుకొన్నాడు.

ప్రశ్న 2.
వాలి వధలో అధర్మం ఉందా? లేదా? ఎందుకు?
జవాబు:
వాలి వధలో అధర్మం లేదు. వాలి తన తమ్ముని భార్యను అపహరించాడు. అధర్మంగా ప్రవర్తించాడు. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు అధర్మాన్ని సహించలేడు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. అందుకే మరణదండన విధించాడు. వాలి వానరుడు కనుక జంతువులను చెట్ల చాటు నుండి వేటాడడం వేట ధర్మం, కనుక వాలి వధలో అధర్మం లేదు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
‘సుగ్రీవాజ్ఞ’ అంటే మీకు ఏమి అర్థమైంది?
జవాబు:
‘సుగ్రీవాజ్ఞ’ అంటే తిరుగులేని ఉత్తరువు (శాసనం) అని అర్థం. ఆయన చెప్పింది తలవంచి చేయాల్సిందే. సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో శ్రీరాముడికి సహాయపడాలనుకున్నాడు. ఆయన వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
(లేదా)
వాలి, సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. తండ్రి తరువాత ‘కిష్కింధ’ కు వాలి రాజు అయ్యాడు. మాయావి రాక్షసుడికీ, వాలికీ విరోధం ఉంది. మాయావి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలిసుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి, సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర ఉండమని చెప్పి, తాను బిలంలోకి వెళ్ళి మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. గుహలోపల రాక్షసుడివి, వాలివి అరుపులు వినబడ్డాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి, రాక్షసుడు పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి వచ్చి, సుగ్రీవుడు రాజుగా ఉన్నందున కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి, సుగ్రీవుని భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభీతితో పారిపోయి భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. మతంగముని శాపం వల్ల వాలి ఆ పర్వతానికి రాలేడు. వాలి ఋష్యమూకంపై కాలుపెడితే మరణిస్తాడని మతంగ మహర్షి శపించాడు.

రామలక్ష్మణులు’ సీతాదేవిని వెదకుతూ, ఋష్యమూక పర్వత సమీపానికి వచ్చారు. ధనుర్భాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, వారు వాలి పంపితే తన్ను చంపడానికి వచ్చారని అనుకున్నాడు. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి. హనుమ రామలక్ష్మణులను కలిసి, సుగ్రీవుని వృత్తాంతాన్ని వారికి చెప్పాడు. లక్ష్మణుడు సీతాపహరణం గురించి చెప్పాడు. హనుమ, రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మైత్రిని చేకూర్చాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. వానరులను పంపి, సీతను వెదికిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు.

రాముని మాటపై సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే పోలిక. అందువల్ల రాముడు సుగ్రీవుని మెడలో “నాగకేసరపులత”ను వేయించాడు. ఓడిపోయిన సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలిపై వేశాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పచెప్పి వాలి మరణించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 2.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి.
జవాబు:

  1. సీతాన్వేషణలో భాగంగా ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకొన్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడిన సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకొమ్మని కోరాడు.
  2. సన్యాసిరూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణుల రూపలావణ్యాలను పొగిడి పరిచయం కోరాడు. మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులకు తన వివరాలు తెల్పి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు.
  3. సుగ్రీవుని గుణగణాలు తెల్పి, అన్నయైన వాలి అతడికి చేసిన అన్యాయాన్ని చెప్పి, రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు.
  4. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచాక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడిని ఎంతగానో ఆకట్టుకొంది.
  5. శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతం చెప్పవలసినదిగా లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెల్పి సుగ్రీవుని సహాయం కావాలని కోరాడు.
  6. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.

ప్రశ్న 3.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకుపోయాడు. ఈ విధంగా సస్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామలక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, అంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయంతోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకువచ్చాడు.

ప్రశ్న 4.
రామసుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని, భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

ప్రశ్న 5.
వాలి సుగ్రీవుల యుద్దానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహాద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహాద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహాద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? కాదా? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు రాముడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిపై దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పు పట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెష్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు.

రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

ప్రశ్న 7.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది?
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నానని చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు.

సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

Leave a Comment