AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం

10th Class Telugu 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రశ్నలు – జవాబులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం 1
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి యెదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి.
జవాబు:
రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోడానికి సంభాషణ జరుగుతోంది. సీతమ్మ జాడను తెలిసికొనివస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. సుగ్రీవుని అన్న వాలిని చంపి, కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని, రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
‘సీత’ జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు?
జవాబు:
సీతమ్మ జాడను హనుమంతుడు తెలిసికొన్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశమార్గంలో ఎగిరి, లంకకు చేరాడు.

ఇవి చేయండి.

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠంలోని పద్యాలను, రాగముతో, భావం తెలిసేలా చక్కగా చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘కటకట……….. పోయన దగెగా’ – పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
కవులు సామాన్యంగా సముద్రాన్ని భూమి అనే స్త్రీ ధరించిన వస్త్రంలా ఉందని ఉత్ప్రేక్షిస్తారు. ఇక్కడ లంక చుట్టూ సముద్రం ఆవరించి ఉండడం వల్ల కవి, ఆ సముద్రాన్ని, లంకా నగరం కోటగోడ చుట్టూ, శత్రువులు రాకుండా తవ్విన లోతైన కందకమేమో అన్నట్లు ఉందని ఉత్ప్రేక్షించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
పాఠానికి ‘సముద్రలంఘనం’ శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానో తెలపండి.
జవాబు:
ఈ పాఠంలో మహేంద్రగిరి నుండి త్రికూట పర్వతం మీదికి హనుమంతుడు ఎగిరి వెళ్ళిన ఘట్టాన్ని కవి వర్ణించాడు. హనుమంతుడు ఎగిరినప్పుడు ఏమయ్యిందో ఈ పాఠంలో చెప్పాడు.

హనుమంతుడు ఎగిరే ముందు ఏమి చేశాడో, ఈ పాఠంలో ఉంది. సముద్రం మీద వెడుతున్న హనుమంతుడు బాణంలా దూసుకుపోయాడని చెప్పాడు. ఎగిరి వెళ్ళేటప్పుడు అతని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలిపోయి అది చూసేవారికి ఎలా కనిపించిందో కవి చెప్పాడు.

హనుమంతుడు మహేంద్రగిరి నుండి త్రికూటగిరికి దాటి వెళ్ళడం గురించి, ఈ పాఠంలో ఉంది. కాబట్టి ఈ పాఠానికి “సముద్రలంఘనం” అన్న పేరు చక్కగా సరిపోయింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి, సందర్భం వివరించండి.
అ) ప్రవాహ తరంగాలు ఆకాశాని కెగిశాయి.
జవాబు:
“ఝరీతరంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి పడి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై అడుగువేసి, ఎగరడంతో ఆ పర్వతం కంపించడంతో ఆ పర్వత శిఖరంపై గల సెలయేళ్ళ కెరటాలు అన్నీ, ఆకాశమునకు ఎగిరాయి అని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఆ) ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు.
జవాబు:
“ఒక్కచో నిల్చి దక్షిణ దిక్కుఁజూచి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు సముద్రం మీదికి ఎగిరేటప్పుడు అతని వేగానికి పర్వత శిఖరాలు చలించాయి అనీ, హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి అంతటా తిరిగాడనీ, ఒకచోట నిలబడి దక్షిణ దిశవైపు చూచాడనీ, కవి వర్ణించిన సందర్భంలోనిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) ఒక గొప్పధ్వని పుట్టింది.
జవాబు:
“ఒక మహారవం బుదయింపన్”- అనే పద్యపాదం, పై అర్థాన్ని ఇస్తుంది. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం, గొప్ప ధ్వని వచ్చేలా, రాక్షసుల పట్టణం వైపు వేగంగా వెళ్ళిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఈ) బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది.
జవాబు:
“బలిమందిరంబు వాకిలియొ యనఁగ” అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలికి, సముద్ర జలం లోతుగా చీలింది. ఆ దృశ్యం ఆదిశేషుడు హనుమంతుని చూడ్డానికి వచ్చి తలుపులు తెరిచిన బలి చక్రవర్తి ఇంటివాకిలా? అన్నట్లు ఉందని కవి చెప్పిన సందర్భంలోనిది.

2. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్రలంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా! కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి. చదవండి.

అ) హనుమంతుని అడుగులు
జవాబు:
అడుగులొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల.

ఆ) హనుమంతుని చూపు
జవాబు:
భావిసేతు వచ్చుపడ లంకకడకును సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ఇ) హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం ,
జవాబు:
విపరీతగతిన్ దోల దొరకొనెనొ, రవియిటు దేలం బెనుగాడితోడి తేరు

3. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కుండలీకరణాలలో ( ) రాయండి.
తే॥ గీ॥ పవన తనయ నీ వర్గము, స్వర్ణసమము
వాయుపుత్ర నీ వేగము, వాయుసమము
అసుర వనమును కాల్చు నీ వగ్నిసమము
రామదూత నీ చరితము, రమ్యమయము.

అ) ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా ! స్వర్ణమంటే
i) వెండి
ii) ఇత్తడి
iii) బంగారం
iv) రాగి
జవాబు:
iii) బంగారం

ఆ) హనుమంతుని వేగం దీనితో సమానమైంది.
i) విమానంతో
ii) పక్షితో
iii) గరుడునితో
iv) వాయువుతో
జవాబు:
iv) వాయువుతో

ఇ) అసురులు ఎవరంటే
i) దేవతలు
ii) పాములు
iii) రాక్షసులు
iv) గంధర్వులు
జవాబు:
iii) రాక్షసులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఈ) రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు.
i) శివదూతగా
ii) ఇంద్రదూతగా
iii) బ్రహ్మదూతగా
iv) రామదూతగా
జవాబు:
iv) రామదూతగా

ఉ) అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు?
i) అగ్ని
ii) వాయువు
iii) ఇంద్రుడు
iv) రాముడు
జవాబు:
i) అగ్ని

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) హనుమంతుడికి లంక ఎలా కనిపించింది?
జవాబు:
సహజంగా సముద్రం, భూదేవి నడుమునకు కట్టిన వస్త్రంలా శోభిస్తుంది. అటువంటి సముద్రం, లంక వైపుకు వచ్చి, దుష్టరాక్షసులున్న లంకా నగరం కోటకు, చుట్టూ త్రవ్విన కందకంలా ఇప్పుడు హనుమంతుడికి కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సిద్ధమై, గట్టిగా కొండపై ఒత్తి అడుగులు వేశాడు. తన తోకను అటు ఇటూ తిప్పాడు. తన చేతితో కొండను బలంగా చరిచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. వాయుదేవునిలా పర్వత శిఖరాలు కదిలేలా తన శరీరాన్ని పెంచాడు. కొండపైకి ఎక్కి అటూఇటూ తిరిగాడు. తరువాత ఒకచోట నిలబడి, దక్షిణ దిక్కు వైపు చూశాడు.

ఇ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది?
జవాబు:
హనుమంతుడు కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి, ప్రయాణిస్తూ ఉంటే, సమీపంలోని వారికి, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లు అనిపించింది.

ఈ) హనుమంతుడు లంకవైపు ఎలా ఎగిరాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి తన చేతులను నడుమునకు ఆనించి, తోకను ఆకాశ వీధిలోకి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చి, తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి లంఘించాడు. హనుమంతుడు అప్పుడు కొండ అనే విల్లు నుండి వెలువడిన బాణంలా లంక వైపుకు దూసుకుపోయాడు.

ఉ) మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు?
జవాబు:
వాయుపుత్రుడైన హనుమంతుడు తన తోకతో పాటు ఎగరడం చూసి, దేవతలు “సూర్యుడు విపరీతమైన వేగంతో పెద్ద
కోడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ అటు వచ్చాడేమో” అనుకున్నారు.

5. కింది ప్రశ్నలకు ఐదేసి వాఠ్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినపుడు పెద్దపెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులూ, సింహాలూ పరుగులు పెట్టాయి. కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి.
జవాబు:
హనుమంతుని బలం వర్ణనా తీతం. అతడు కొండలను’ పిండి చేసేటంత బరువూ, శక్తి, బలం కలవాడు. అందుకే అతడు అడుగులు వేస్తే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. అతడు వాయుదేవుని అంత వేగం గలవాడు. అందుకే అతడు తోకను తిప్పితే, అక్కడి చెట్లు అన్నీ కూలిపోయి బయళ్ళు ఏర్పడ్డాయి. అతడు చేతితో గట్టిగా చరిస్తే ఏదో కర్రతో కొట్టినట్లు, క్రూర జంతువులు అన్నీ బెదరి పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే అక్కడి కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని కంఠధ్వని, మహా గంభీరమైనదని తెలుస్తోంది.

హనుమంతుడు మహా బలవంతుడు, శక్తిమంతుడు అయినందువల్లనే తాను ఒక్కడూ, నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళి లంకిణిని చంపి, అశోక వనాన్ని భగ్నం చేసి, లక్షల కొద్దీ రాక్షసులను చంపి, లంకను అగ్నితో కాల్చి, రావణునికి బుద్ధి చెప్పి, సీత జాడను తెలిసికొని రాముని వద్దకు తిరిగివచ్చాడు.

ఆ) వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్రలంఘనానికి హనుమంతున్లే ఎన్నుకోడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
మిగిలిన వానరులలో కొందరు తాము నూరు యోజనాల దూరం ఎగిరి వెళ్ళలేమన్నారు. మరికొందరు ఎగిరి వెళ్ళినా, తిరిగి రాలేమన్నారు.

హనుమంతుడికి బ్రహ్మ శాపం వల్ల తన బలం తనకు తెలియదు. అతడు వాయుదేవుని పుత్రుడు. అతడు వాయుదేవునితో సమాన బలం గలవాడు. 10 వేల యోజనాల దూరం దాటగలవాడు. అదీగాక శ్రీరాముడు హనుమంతుని బలాన్ని ముందే గుర్తించి, హనుమంతుని చేతికే, సీతమ్మకు ఇమ్మని, తన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు.

హనుమంతునివల్లే ఆ కార్యం నెరవేరుతుందని జాంబవంతుడు సలహా చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని వెళ్ళి రమ్మని ప్రోత్సహించాడు. ఈ కారణంగా హనుమంతుణే, సముద్రలంఘనానికి వానరులు ఎన్నుకున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించి పోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తప్పక సీత జాడను తెలిసికొని రాగలడని, ముందుగానే తన తోటి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ఈ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా! అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి.
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తన శరీరాన్ని బాగా పెంచాడు. పర్వదినాలలో ఉప్పొంగే సముద్రుడిలా శరీరాన్ని పెంచాడు. అతడు పర్వతమంత శరీరాన్ని ధరించాడు. హనుమంతుడు సముద్రం మీద ఎగిరేటప్పుడు అతని నీడ, పదియోజనాల పొడవు, ముప్ఫైయోజనాల వెడల్పు ఉందని రామాయణంలో చెప్పబడి ఉంది. అంత గొప్ప శరీరం కల హనుమంతుడు చూసేవారికి తెక్కలున్న పర్వతం వలె కనిపించాడు.

అందుకే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక పెద్ద కొండ ఎగిరిందా అని ప్రక్కనున్న వాళ్ళకి అనిపించింది.

6. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడి రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద్ర గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రాన్ని చూసి, చెవులు రిక్కించి, చేతులు నడుముకు ఆనించి, తన తోకను ఆకాశం వైపుకు పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, తాను నిలబడ్డ కొండను క్రిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు. అప్పుడు చూచేవాళ్ళకు పర్వతం ఎగురుతున్నట్లు అనిపించింది. బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీంచి ఎగిరాడు.

హనుమంతుని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలి, రాముని కోప ప్రవాహం, లంకకు చేరడానికి తవ్విన కాలువలా కనిపించింది. ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలిలా కనిపించింది. సేతు నిర్మాణానికి త్రవ్విన పునాదిలా కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, కిందికి వంగి, తన చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, తన పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను కిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగురుతున్నట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచి పెట్టబడిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి, పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది, రాముని క్రోధ రసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిలిలా కనిపించింది. ఆ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు.

7. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

1. హనుమంతుడి సముద్రలంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు? అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్లు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
మహేంద్రగిరి వద్ద హనుమంతుడు – జాంబవంతుడు – అంగదుడు
ఇతర వానరుల మధ్య సంభాషణ

అంగదుడు : వానరులారా ! మనలో ఎవరు సముద్రాన్ని దాటి, మా పినతండ్రి సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలరు? మీరు ఎంతెంత దూరం సముద్రం దాటగలరో చెప్పండి.

శరభుడు : యువరాజా ! నేను ముప్పై యోజనాల దూరం దాటగలను.

మైందుడు : యువరాజా ! నేను డెబ్బె యోజనాల దూరం వరకూ దాటగలను.

జాంబవంతుడు : మనము తప్పక రామకార్యం సాధించాలి. ఒకప్పుడు నాకు ఎగిరేందుకు మంచి బలం ఉండేది. నేనిప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇప్పటికీ 100 యోజనాలు దూరం దాటగలను. కాని తిరిగి రాలేనేమో ? అంగదా ! నీవు నూరు యోజనాల దూరం దాటి తిరిగి వెళ్ళి రాగలవు. కాని యువరాజువైన నిన్ను మేము పంపగూడదు. నేను సరయిన వాణ్ణి మీకు చూపిస్తా.

అంగదుడు : తాతా ! జాంబవంతా ! మనలో సముద్రం దాటి తిరిగి రాగల వీరుణ్ణి మాకు చూపించు”.

జాంబవంతుడు : ఆంజనేయా ! నీవు రామ, సుగ్రీవులంతటి బలం కలవాడవు. నీవు చిన్నప్పుడే 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని చేరిన వాడవు. మన వానరులంతా దిగులుగా ఉన్నారు. నీవు సముద్రం దాటి తప్పక తిరిగి రాగలవు. వెళ్ళిరా ! నాయనా !

హనుమంతుడు : తాతా ! నీవు చెప్పినది నిజము. నేను గరుడునికి అనేక వేల పర్యాయాలు ప్రదక్షిణం చేయగలను. నేను సీతమ్మను చూడగలను. నేను వాయువుతో సమానుడిని. 10 వేల యోజనాలు దూరం వెళ్ళి రాగలను.

అంగదుడు : భేష్ ! ఆంజనేయా! నీవే మా విచారాన్ని తీర్చగలవు. నీవు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలిసికొనిరా.

హనుమంతుడు : వానరులారా ! నన్ను దీవించండి.

జాంబవంతుడు : మంచిది నాయనా ! నీవు తప్పక కార్యం సాధిస్తావు. నీకు నా దీవెనలు. నాయనా వెంటనే బయలు దేరు.

హనుమంతుడు : మీరు ధైర్యంగా ఉండండి. నేను తప్పక కార్యం సాధించి వస్తా. మిత్రులారా ! సెలవు.
(లేదా)
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ, మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

విశాఖపట్టణం,
x x x x x

 

మిత్రుడు ప్రసాదు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను. ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
యస్. ప్రసాదు,
S/O. యస్. రమణారావుగారు,
ఇంటి నెం. 2-6-15, గాంధీపురం, కాకినాడ,
తూ||గో॥జిల్లా, ఆం.ప్ర.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనో హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామాగ్రిని తయారుచేయండి.
ఉదా : కిరీటం, గద, తోక మొదలగునవి. కావాల్సిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానారక పదాలను ఖాళీలలో రాయండి.

అ) హనుమంతుడు కొండకొమ్మున నిలబడ్డాడు, ఆ …….. న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. (కూటాగ్రము)
ఆ) వివరములో సర్పముంది. ఆ ……………….. లో చేయిపెట్టకు. (రంధ్రము)
ఇ) హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగిసింది. అది ……………. అంతటా వ్యాపించింది. తర్వాత …………….. లోని సూర్యుని కూడా కమ్మేసింది. (ఉప్పరము, ఆకాశము)

2. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాలలో ప్రయోగించండి.

అ) సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు.
జవాబు:
సముద్రము (ప్ర) – సంద్రము (వి)
సొంతవాక్యాలు:
ఓడలు సంద్రంలో తిరుగుతుంటాయి.

ఆ) దక్షిణ దిశ యముని స్థానం.
జవాబు:
దిశ (ప్ర) – దెస (వి)
సొంతవాక్యాలు:
రాజుగారి కీర్తి దెసలందు వ్యాపించింది.

ఇ) మంచి గొనములు అలవరచుకోండి.
జవాబు:
గుణములు (ప్ర) – గొనములు (వి)
సొంతవాక్యాలు:
మంచి గుణములు కలవారిని అందరు గౌరవిస్తారు.

ఈ) నిముసమైనా వృథా చేయకు.
జవాబు:
నిమిషము(ప్ర) – నిముసము (వి)
సొంతవాక్యాలు:
విద్యార్థులు నిమిషం వృథా కాకుండా చదువుకోవాలి.

ఉ) అగ్గిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
సొంతవాక్యాలు:
అగ్నిలో ఏ వస్తువు వేసినా తగలబడిపోతుంది.

3. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యర్థాలను జతచేయండి.

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 1. అపారమైన తీరం గలది.
ఆ) అమరుడు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఇ) ఉదధి 3. జూలు కలిగినది.
ఈ) ప్రభంజనం 4. కర్మకారునిచే చేయబడినది.
ఉ) దానవులు 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఊ) కేసరి 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఋ) ధరాధరం 7. మరణము లేనివారు.
ఋ) పారావారం 8. ధరను ధరించునది.

జవాబు:

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 4. కర్మకారునిచే చేయబడినది.
ఆ) అమరుడు 7. మరణము లేనివారు.
ఇ) ఉదధి 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఈ) ప్రభంజనం 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఉ) దానవులు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఊ) కేసరి 3. జూలు కలిగినది.
ఋ) ధరాధరం 8. ధరను ధరించునది.
ఋ) పారావారం 1. అపారమైన తీరం గలది.

వ్యాకరణాంశాలు

సంధులు, సమాసాలు

1. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి.
అ) హరియపుడు
జవాబు:
హరి + అపుడు . – – (హరి + య్ + అపుడు) – యడాగమం.

ఆ) కూటాగ్రవీధి
జవాబు:
కూట + అగ్రవీధి = (అ + అ = ఆ) – – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పురాభిముఖుడు
జవాబు:
పుర + అభిముఖుడు = (అ + అ = ఆ) ‘ – సవర్ణదీర్ఘ సంధి

ఈ) అణగదొక్కి
జవాబు:
అణగన్ + తొక్కి = (‘త’ – ‘ద’ గా మారింది) – సరళాదేశ సంధి

ఉ) వాడుగొట్టె జ. వాడు + కొట్టి = (‘క’ – ‘K’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఊ) నీవుడక్కరివి
జవాబు:
నీవు + టక్కరివి : ‘ట’ – ‘డ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఋ) వారు వోరు
జవాబు:
వారు + పోరు = (‘ప’ – ‘వ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

బ) రారుగదా
జవాబు:
రారు + కదా = (‘క’ – ‘X’ గా మారింది) – గసడదవాదేశ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

2) పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి.
ఉదా : కూటాగ్రము : కూటము యొక్క అగ్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:

సమాసములు విగ్రహవాక్యము సమాసనామము
1) తరంగ ఘటలు తరంగముల యొక్క ఘటలు షష్ఠీ తత్పురుష సమాసం
2) తమ తండ్రి తమ యొక్క తండ్రి షష్ఠీ తత్పురుష సమాసం
3) కూటకోటులు కూటము యొక్క కోటులు షష్ఠీ తత్పురుష సమాసం
4) గాడ్పు కొడుకు గాడ్పు యొక్క కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
5) ధరణీ కటి తటము ధరణి యొక్క కటి తటము షష్ఠీ తత్పురుష సమాసం
6) వప్ర పరిఘ వప్రమునకు పరిఘ షష్ఠీ తత్పురుష సమాసం
7) గాడ్పువేల్పుపట్టి గాడ్పువేల్పునకు పట్టి షష్ఠీ తత్పురుష సమాసం
8) ఏటిజోటి మగడు ఏటి జోటి యొక్క మగడు షష్ఠీ తత్పురుష సమాసం
9) శ్రవణ ద్వంద్వంబు శ్రవణముల యొక్క ద్వంద్వము షష్ఠీ తత్పురుష సమాసం
10) కటిసీమ కటి యొక్క సీమ షష్ఠీ తత్పురుష సమాసం
11) నభీవీథి నభస్సు యొక్క వీథి షష్ఠీ తత్పురుష సమాసం
12) పురాభిముఖంబు పురమునకు అభిముఖము షష్ఠీ తత్పురుష సమాసం
13) సురగరుడ దురవలోకము సురగరుడులకు దురవలోకము షష్ఠీ తత్పురుష సమాసం
14) కరువలి వేలుపు కొడుకు కరువలి వేలుపునకు కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
15) పవనజ జంఘ పవనజ జంఘ షష్ఠీ తత్పురుష సమాసం
16) పవనాశనకోటి పవనాశనుల యొక్క కోటి షష్ఠీ తత్పురుష సమాసం
17) రఘువరేణ్యుడు రఘువంశజులలో వరేణ్యుడు షష్ఠీ తత్పురుష సమాసం
18) రఘువరేణ్య క్రోధరసము రఘువరేణ్యుని యొక్క క్రోధరసము షష్ఠీ తత్పురుష సమాసం
19) సేతుబంధము సేతువు యొక్క బంధము షష్ఠీ తత్పురుష సమాసం
20) బలిమందిరము బలి యొక్క మందిరము షష్ఠీ తత్పురుష సమాసం

అలంకారాలు :

శబ్దాలంకారాల్లో వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
1. ముక్తపదగ్రసం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!

1) పద్యంలో మొదటి పాదం చివర ఉన్న తనమా అనే అక్షరాలు, రెండవపాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
2) రెండవ పాదము చివర ఉన్న ననుమా అనే మూడు అక్షరాలు, మూడవ పాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
3) మూడవ పాదము చివరన ఉన్న దనరం అనే మూడక్షరాలు, తిరిగి నాల్గవ పాదం మొదట ప్రయోగింపబడ్డాయి.
4) ఈ విధంగా ముందు పాదం చివర విడిచిపెట్టబడ్డ పదాలే, తరువాతి పాదాల మొదట తిరిగివచ్చాయి.

ముక్తపదగ్రస్త అలంకారం:

1) ఒక పద్యపాదంగాని, వాక్యంగాని ఏ పదంతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం
(లేక)
వాక్యం మొదలవుతుంది. దీన్నే ‘ముక్తపదగ్రస్త అలంకారం’ అంటారు.

2. యమకము :
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.

అ) లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ’ అంటే స్త్రీ ; ‘గెలువగలేమా’ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా (అంటే ఉన్నాం ‘ కదా!) అని భావము.

ఆ) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(‘తోరణం’ అంటే ద్వారానికి కట్టే అలంకారం ; ‘రణం’ అంటే యుద్ధము.

గమనిక :
పై రెండు ఉదాహరణములలోనూ, ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించబడింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

యమకము :
(వివరణ) రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదములు, తిరిగి తిరిగి అర్థభేదంతో వస్తే అది ‘యమకాలంకారము’.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

3. లాటానుప్రాస: కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.

అ) హరి భజియించు హస్తములు హస్తములు.
గమనిక :
పై వాక్యంలో హస్తములు అనే పదము ఒకే ఆద్దంతో వరుసగా రెండుసార్లు వచ్చాయి.

ఇక్కడ హస్తములు అన్న పదం యొక్క అర్థము ఒకటే అయినా, వాటి తాత్పర్యము భేదముంది. అందులో ‘హస్తములు’ అనే మొదటి పదానికి ‘చేతులే’ అని భావము. ‘హస్తములు’ అనే రెండవసారి వచ్చిన దానిని, నిజమైన చేతులు అని భావము.

ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
గమనిక :
ఇక్కడ ఈ వాక్యంలో ‘సేవ’ అనే పదము రెండుసార్లు వచ్చింది. వాటి అర్థాలు సమానమే. కాని తాత్పర్యం వేరుగా ఉంటుంది.

అందులో మొదటి ‘సేవ’ అనే పదానికి, సేవించుట అని భావము. రెండవ ‘సేవ’ అనే పదానికి, ‘నిజమైన సేవ’ అని తాత్పర్యము.

పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4 నుగాగమ సంధి:
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) చేయునతడు
జవాబు:
చేయు + అతడు

ఆ) వచ్చునప్పుడు
జవాబు:
వచ్చు + అప్పుడు
గమనిక :
చేయు, వచ్చు అనే క్రియలకు చివర ‘ఉత్తు’ ఉంటుంది. అనగా హ్రస్వమైన ‘ఉ’ కారము ఉంది. వీటికి అచ్చు కలిసింది. అతడు, అప్పుడు అనే పదాల మొదట, ‘అ’ అనే అచ్చు ఉంది. ఆ విధంగా క్రియాపదాల చివరన ఉన్న ఉత్తుకు, అచ్చు పరమైతే, అప్పుడు ఆ రెండు పదాలలోనూ లేని ‘స్’ అనే హల్లు, కొత్తగా వస్తుంది. ఆ విధంగా కొత్తగా వచ్చిన ‘స్’ అనే హల్లును, ‘నుగాగమము’ అంటారు. ‘న్’ ఆగమంగా వచ్చింది. అంటే దేనినీ కొట్టివేయకుండా కొత్తగా వచ్చి చేరింది. దీనినే ‘నుగాగమ సంధి’ అంటారు.

నుగాగమ సంధి సూత్రం:
ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది. కింది. ఉదాహరణలు విడదీసి, లక్షణాలు సరిచూడండి –

1. పోవునట్లు
జవాబు:
పోవు + అట్లు : ఇక్కడ ‘పోవు’ అనే క్రియ యొక్క చివర ‘ఉత్తు’ ఉంది. దానికి ‘అట్లు’ అన్న దానిలోని ‘అ’ అనే అచ్చు కలిసింది. నుగాగమ సంధి సూత్ర ప్రకారము, ‘పోవు’ అనే ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, అచ్చు పరమై నుగాగమం వచ్చింది.
ఉదా : పోవు + న్ + అట్లు = పోవునట్లు = నుగాగమ సంధి.

2. కలుగునప్పుడు
జవాబు:
కలుగు + అప్పుడు అని విడదీయండి.

ఇక్కడ ‘కలుగు’ అనేది, ఉత్తు చివర కల తద్ధర్మార్థక క్రియా విశేషణము, ఆ ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, “అప్పుడు” అనే శబ్దములోని ‘అ’ అనే అచ్చు పరమయ్యింది. నుగాగమము వచ్చింది.
ఉదా : కలుగు + న్ + అప్పుడు = కలుగునప్పుడు = (నుగాగమ సంధి)

పైన చెప్పిన సందర్భంలోనే గాక, మణికొన్ని స్థలాల్లో సైతమూ ‘సుగాగమం’ వస్తుంది. కింది పదాలను పరిశీలించండి.

అ) తళుకు + గజ్జెలు
1) నుగాగమ సంధి సూత్రము (2) : సమాసాలలో ఉదంతములైన స్త్రీ సమాలకు, పు, ంపులకు, పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది.
ఉదా : తళుకు + న్ + గజ్జెలు (‘తళుకు’ అనే ఉదంత స్త్రీ సమ శబ్దానికి, సరళము పరమై నుగాగమం)

2) ద్రుతమునకు సరళ స్థిరములు పరములైనప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు.
ఉదా : 1) తళుకు గజ్జెలు (ద్రుత లోపము)
2) తళుకున్దజ్జెలు (సంశ్లేషము)

3) సూత్రము : వర్గయుక్సరళములు పరములైనప్పుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువును కనబడుతుంది.
ఉదా : తళుకుంగజ్జెలు (పూర్ణబిందువు)

పుంప్వాదేశ, నుగాగమ సంధులు:
ఆ) ఉన్నతము + గొడుగు
1) పుంప్వాదేశ సంధి సూత్రము : కర్మధారయములలో మువర్ణకమునకు పు, ంపులగు.
ఉదా : ఉన్నతంపు గొడుగు

2) నుగాగమ సంధి సూత్రము (3) : సమాసాలలో ఉదంతాలైన స్త్రీసమాలకు పు, ంపులకు, పరుష సరళాలు పరములైతే నుగాగమం వస్తుంది.
ఉదా : ఉన్నతపు + న్ + గొడుగు

అ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములయినప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు. .
ఉదా : ఉన్నతంపు గొడుగు (ద్రుతలోపము)

ఆ) వర్గయుక్సరళములు పరములైనపుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువు కనబడుతుంది.
ఉదా : ఉన్నతంపుం గొడుగు (ద్రుతమునకు పూర్ణ బిందువు)

అభ్యాసము : కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణాలు సరిచూడండి

1) సరసపున్దనము = (సరసము + తనము)
సూత్రము : 1) కర్మధారయములందు మువర్ణమునకు పుంపులగు
సరసపు + తనము = పుంప్వాదేశము

నుగాగమ సంధి సూత్రము (4) : ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : సరసపు + న్ + తనము (పుంపులకు, తనము పరమై, నుగాగమం వచ్చింది)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
సరసపు + న్ + దనము (సరళాదేశము) .

ఆ) ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషలు విభాషణగు
ఉదా : సరసపున్దనము (సంశ్లేషరూపము)

2) తెల్లన్దనము = తెల్ల + తనము
సూత్రము : ఉదంత స్త్రీ సమంబులకు, పుంపులకు, అదంత గుణవాచకంబులకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : తెల్ల + న్ + తనము (అదంత గుణవాచకమైన ‘తెల్ల’ శబ్దానికి తనము పరమైనందున, నుగాగమం)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా : తెల్ల + న్ + దనము (సరళాదేశము)

ఆ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములగునపుడు లోప సంశ్లేషలు విభాషనగు
ఉదా : తెల్లన్దనము (సంశ్లేష రూపము) షష్ఠీ తత్పురుష సమాసాల్లో నుగాగమ సంధి.
నుగాగమ సంధి (5)

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

6. కింది పదాలను విడదీసి, పరిశీలించండి.
అ) విధాతృనానతి – (విధాత యొక్క ఆనతి) = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ – (రాజు యొక్క ఆజ్ఞ) = రాజు + ఆజ్ఞ
గమనిక :
1) పై సమాస పదాలకు విగ్రహవాక్యాలను పరిశీలిస్తే, అవి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవని తెలుస్తుంది.
2) పై రెండు ఉదాహరణలలోనూ సమాసాలలోని పూర్వపదాల చివర “ఋకారం”, “ఉత్తు” ఉన్నాయి.
3) షష్టీ సమాసపదాల్లో, ఉకార, ఋకారములకు అచ్చు పరమైతే నుగాగమము వస్తుంది.

నుగాగమ సంధి సూత్రము : షష్ఠీ సమాసము నందు, ఉకార ఋకారములకు అచ్చు పరమైనపుడు నుగాగమంబగు.
అ) విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
ఆ) రాజు + న్ + ఆజ్ఞ = రాజునాష్ట్ర

పూర్వస్వరం స్థానంలో ‘ఋ’కారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే – షష్టీ తత్పురుషాల్లో ఉకారానికి, ఋకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది.

అదనపు సమాచారము

సంధులు

1. ఎల్లెడలన్ = ఎల్ల + ఎడలన్ – అకారసంధి
2. ఎగసినట్లు = ఎగసిన + అట్ల – అకారసంధి
3. విప్పినయట్ల = విప్పిన + అట్ల – యడాగమ సంధి
4. కొట్టినయట్ల = కొట్టిన + అట్ల – యడాగమ సంధి
5. ఎగసినయట్ల = ఎగసిన + అట్ల – యడాగమ సంధి
6. మొత్తినయట్ల = మొత్తిన + అట్ల – యడాగమ సంధి
7. బిట్టూది = బిట్టు + ఊది – ఉత్వసంధి
8. గట్టెక్కి = గట్టు + ఎక్కి – ఉత్వసంధి
9. కెళ్లవుల కెల్లన్ = కెళవులకున్ + ఎల్లన్ – ఉకార వికల్ప సంధి
10. పాయవడు = పాయ + పడు – గసడదవాదేశ సంధి
11. అక్కొండ = ఆ + కొండ – త్రికసంధి
12. అచ్చెల్వ = ఆ + చెల్వ – త్రికసంధి
13. అయ్యుదధి = ఆ + ఉదధి – యడాగమ, త్రిక సంధులు
14. సూత్రపట్టు = సూత్రము + పట్టు – పడ్వాది మువర్ణలోప సంధి
15. దవాగ్ని = దవ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
16. పురాభిముఖంబు = పుర + అభిముఖంబు – సవర్ణదీర్ఘ సంధి
17. పవనాశన కోటి = పవన + ఆశన కోటి – సవర్ణదీర్ఘ సంధి
18. బంధాను రూపంబు = బంధ + అనురూపంబు – సవర్ణదీర్ఘ సంధి
19. కూటాగ్రవీథి = కూట + అగ్రవీథి – సవర్ణదీర్ఘ సంధి
20. మహోపలములు = మహా + ఉపలములు – గుణసంధి
21. నభీవీథి = నభః + వీథి – విసర్గ సంధి
22. యశోవసనంబు = యశః + వసనంబు – విసర్గ సంధి
23. దిక్కుఁజూచి = దిక్కున్ + చూచి – సరళాదేశ సంధి
24. అరుగఁజూచి = అరుగన్ + చూచి – సరళాదేశ సంధి
25. అడంగఁ దొక్కి = అడంగన్ + త్రొక్కి – సరళాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. మహోపలములు గొప్పవైన ఉపలములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బలుగానలు బలము గల కాననములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దవాగ్ని దవము అనే అగ్ని తన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. మహావివరము గొప్పదైన వివరము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. క్రోధరసము క్రోధము అనే పేరు గల రసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. నల్లని వల్వ నల్లనైన వలువ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతి

భిదురకము – పిడుగు
జంఘ – జంగ
నిమిషము – నిముసము
గుహ – గొబ
ఉపరి – ఉప్పరము
కార్యము – కర్జము
అగ్ని – అగ్గి
పుత్రుడు – బొట్టె
ఘట్టము – గట్టు
వీథి – వీది
యశము – అసము
రూపము – రూపు
బంధము – బందము
ఆశ – ఆస
త్వర – తొర
శరము – సరుడు
కుల్య – కాలువ
సముద్రము – సంద్రము
దిశ – దెస
గుణములు – గొనములు

పర్యాయపదాలు

1. తోక : పుచ్చము, లాంగూలము, వాలము
2. అంభోధి : సముద్రము, ఉదధి, పారావారము, ఏటిజోటి మగడు, అంబుధి, కడలి
3. కార్ముకం : విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
4. నింగి : ఆకాశం, మిన్ను, గగనము, నభము, ఉప్పరము
5. రవి : సూర్యుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు
6. వల్వ : వస్త్రము, వలువ, పటము, వసనము
7. వివరం : రంధ్రము, బిలము, కలుగు
8. మందిరము : భవనము, గృహము, ఇల్లు, సదనము, ఆలయము
9. తేరు : రథము, అరదము, స్యందనము, శతాంగము
10. అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు, గీర్వాణులు, త్రిదశులు, వేల్పులు
11. పవనజుడు : హనుమంతుడు, ఆంజనేయుడు, గాడ్పుపట్టి, కరువలి వేలుపు కొడుకు, గాడు వేల్పు పట్టి, హనుమ
12. హరి : వానరము, కోతి, మల్లు, కపి, మర్కటము
13. పవనము – : వాయువు, గాడ్పు, గాలి, అనిలము, ప్రభంజనము, సమీరము, కరువలి
14. శ్రవణము : చెవి, కర్ణము, శ్రుతి, శ్రోత్రము
15. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, నాన్న
16. కొండ : పర్వతము, గిరి, నగము, గట్టు, అద్రి
17. నభము . : ఆకాశము, మిన్ను, గగనము.

వ్యుత్వత్వరాలు

1. ధరాధరము : భూమిని ధరించునది – పర్వతము
2. తరంగము : దరిచేరినది – అల
3. కపి : చలించేది – కోతి
4. గాడ్పుకొడుకు : వాయువు యొక్క కొడుకు – హనుమంతుడు
5. పారావారము : అపారమైన తీరము గలది – సముద్రము
6. దానవులు : దనువు అనెడి స్త్రీ వల్ల పుట్టినవారు – రాక్షసులు
7. గాడ్పు వేల్పు పట్టి : వాయుదేవుని కొడుకు – హనుమంతుడు
8. ఏటిజోటి మగడు : నదీ కాంతకు భర్త – సముద్రుడు
9. అంబుధి : ఉదకములను ధరించునది – సముద్రము
10. హరి : 1. చీకటిని హరించేవాడు – సూర్యుడు
2. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు – విష్ణుమూర్తి
3. గజాదులను హరించునది – సింహము
11. కార్ముకము : యుద్ధ కర్మ కొఱకు సమర్థమైనది – విల్లు
12. కరువలి వేల్పు కొడుకు : గాలిదేవుని పుత్రుడు – హనుమంతుడు
13. పవనజుడు : వాయువునకు పుట్టినవాడు – హనుమంతుడు
14. పవనాశనులు : గాలి ఆహారముగా కలవి – సర్పములు
15. ఉదధి : ఉదకములను ధరించునది – సముద్రము
16. ప్రభంజనుడు : వృక్షశాఖాదులను విరుగగొట్టేవాడు – వాయువు
17. కరి : కరము (తొండము) కలది – ఏనుగు
18. ఝరి : కాలక్రమమున స్వల్పమైపోవునది – ప్రవాహము

నానార్థాలు

1. వీధి : త్రోవ, వాడ, పంక్తి
2. హరి : విష్ణువు, సింహము, కిరణము, కోతి, పాము, గుఱ్ఱము
3. నిమిషము : టెప్పపాటు, తెప్ప వేసేటంత కాలము, పూవులు ముడుచుకొనడం
4. శరము : బాణము, నీరు, రెల్లు –
5. పురము : పట్టణము, ఇల్లు, శరీరము, మరణము
6. రవి : సూర్యుడు, జీవుడు, కొండ, జిల్లేడు చెట్టు
7. రసము : పాదరసము, శృంగారాది రసములు, విషము, బంగారు
8. బలి : గంధకము, ఒక చక్రవర్తి, కప్పము

కవి పరిచయం

పాఠ్యభాగం : ‘సముద్రలంఘనం’

దేనినుండి గ్రహింపబడింది : “రామాభ్యుదయము” ఆరవ ఆశ్వాసం నుండి.

కవి : అయ్యలరాజు రామభద్రుడు.

కాలం : రామభద్రుడు 16వ శతాబ్దివాడు.

ఏ ప్రాంతము వాడు : కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతంవాడు.

ఎవరికి అంకితం : అయ్యలరాజు రామభద్రకవి, తన ‘రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు.

అష్టదిగ్గజకవి : రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్దానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.

ఇతర రచన : ఈ కవి మరొక రచన, “సకల కథాసార సంగ్రహం”

రామాభ్యుదయ కావ్య విశిష్టత : రామాభ్యుదయ కావ్యం, ప్రబంధరీతిలో ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ‘ఉత్తర కాండ’ను మాత్రం ఈ కవి వ్రాయలేదు.

బిరుదులు : ఈ కవికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, “ప్రతివాది మదగజపంచానన” అనే బిరుదులు ఉన్నాయి.

ఆ కవితా సామర్థ్యం : రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినదని, ఆయన వర్ణనల ద్వారా వెల్లడి అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1

సీ|| అదుగు లొత్తినపట్లఁ బిదుగు మొత్తినయట్ల
బహుమహెపలములు పగిలి పడగం
దోఁక త్రిప్పినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁ గూలి బయలు గాఁగఁ
గేలం దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలంగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ

తే.|| గంపితధరాధరాధిత్యకారరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిపి కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నులంజల్లజేయ,
ప్రతిపదార్థం :
అడుగులు + ఒత్తినపట్లన్ = (హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి) అడుగులు, నొక్కి పెట్టి వేసిన చోట
పిడుగు మొత్తినయట్ల = పిడుగు మీద పడిన విధంగా
బహుమహోపలములు; బహు = అనేకములైన
మహా + ఉపలములు = పెద్ద పెద్ద రాళ్ళు
పగిలి పడగన్ = ముక్కలై పడుచుండగా
తోక త్రిప్పినపట్లన్ = తన తోకను (హనుమంతుడు)
మూక విప్పినయట్లన్ = చెదరగొట్టినట్లుగా
బలుకానలు – పెద్ద పెద్ద అడవులు
ఇలఁగూలి (ఇలన్ + కూలి) = నేలపై కూలి
బయలుగాగన్ (బయలు + కాగన్) = ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా
కేలన్ = తన చేతితో
తట్టినపట్లన్ = తాకిన స్థలములలో
కోలన్ = కఱ్ఱతో
కొట్టినయట్లన్ – కొట్టిన విధంగా
కరి కేసరాదులు = ఏనుగులు, సింహాలు మొదలయిన
క్రూర జంతువులు

గమనిక :
‘కరి, కాసరారులు’ అని ఇక్కడ ఉండాలి. (శబ్ద రత్నాకరంలో ఇలానే ఉంది. (కాసర + అరులు) అనగా ఎనుబోతులకు శత్రువులయిన సింహాలు అని భావము. ‘కేసర’ + ఆదులు అన్న చోట, కేసర అంటే సింహము కాదు కేసరి అంటేనే సింహము)

కలగి, పఱవన్ = కలతపడి, పరుగెత్తి పోగా
రంతు చూపిన పట్లన్ = (హనుమ) సింహనాదము చేసిన చోట

గమనిక :
‘రంతు చూపుట’ అంటే సింహనాదము చేయడం అని సూర్యరామాంధ్ర నిఘంటువు).

వంతుమోపినయట్లన్ = పోటీ పడినట్లుగా
గుహలు = కొండ గుహలు
ప్రతిధ్వ నుల్ = ప్రతిధ్వనులను
క్రుమ్మరింపన్ = పోతపోయగా
కంపిత ధరాధరాధిత్యకాఝరీ తరంగ ఘటలు; కంపిత = కదల్పబడిన (హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన)
ధరాధర = పర్వతము యొక్క
అధిత్యకా = ఎత్తైన నేలమీది
ఝరీ = సెలయేళ్ళ
యందలి = కెరటముల యొక్క
ఘటలు = సమూహములు;
ఎల్లెడలన్ (ఎల్ల + ఎడలన్) = అన్ని చోటులందును
ఉప్పరంబులు = ఆకాశమంత ఎత్తుకు
ఎగసిపడి = లేచిపడి
తడిపి = (ఆ ప్రదేశాలను) తడిపి
కార్యదాహ విభ్రాంత కపుల; కార్య దాహ = సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో
విభ్రాంత = క్షోభపడిన
కపుల = వానరుల యొక్క
ఉల్లములతోన్ = మనస్సులతో పాటు
దవాగ్నులన్ = అక్కడనున్న దావాగ్నులను సైతము
చల్లఁజేయన్ (చల్లన్ + చేయన్) = చల్లపరచగా (చల్లార్చాయి)

భావం :
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, అడుగులు నొక్కిపెట్టి వేస్తున్నప్పుడు, పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి, పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్యప్రదేశములుగా ఏర్పడ్డాయి. చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు, ఏనుగులు, సింహాలు మొదలయిన క్రూర జంతువులు కలత చెంది, పరుగులు పెట్టాయి. హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు, పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనించాయి. అక్కడ కొండల కంపనాల వల్ల, కొండ నేలలపై ఉన్న సెలయేళ్ళ కెరటాలు, ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి. అవి దావాగ్నులతోపాటు, రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతమూ చల్లార్చాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 2

తే॥గీ॥ | ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరింగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుల జూచి.
ప్రతిపదార్థం :
ఒడలు వడసిన (ఒడలు + పడసిన) = శరీరమును ధరించిన
తన తండ్రి = తన తండ్రియైన వాయుదేవుని
యొక్క
వడువు = విధము
తోపన్ = కన్పడేటట్లుగా
రయమునకున్ = వేగానికి
కూటకోటులు = పర్వత శిఖరాలు
అన్నియున్ – అన్నియునూ
చలింపన్ = కదలగా
పెరిగి = పెద్ద రూపంతో పెరిగి
గిరిన్ = పర్వతమును
గాడ్పుకొడుకు = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
ఎక్కి = ఎక్కి
తిరిగి తిరిగి = అటూ ఇటూ దానిపై తిరిగి
ఒక్కచోస్ = ఒకచోట
నిల్చి = నిలబడి
దక్షిణ దిక్కున్ = దక్షిణ దిశను
చూచి = చూసి (చూశాడు)

భావం :
హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి, ఒకచోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు.
అలంకారం : ఉత్ప్రేక్షాలంకారం

పద్యం -3

క॥ కటకట! ధరణీకటితట
పట మనిపించుకొనఁ గన్న పారావారం
బిటు వచ్చి కుటిలదానవ
పుటభేదనవప్రపరిఖపో యనఁ దగెఁగా
ప్రతిపదార్థం :
కటకట = అయ్యయ్యో !
ధరణీకటితట పటము; ధరణీ = భూదేవి యొక్క
కటితట = నడుమున (కట్టిన)
పటము = వస్త్రము
అనిపించుకొనన్ = అని చెప్పుకొనేటట్లు
కన్న = కనిపించేటటువంటి
పారావారంబు = సముద్రము
ఇటువచ్చి = ఇక్కడకు వచ్చి (ఈ లంకకు వచ్చి)
కుటిల = మోసగాడైన
దానవ = రాక్షస రాజైన రావణుని యొక్క
పుటభేదనవ = పట్టణమైన లంకకు
వప్ర పరిఖ పో = కోటగోడ చుట్టునూ ఉన్న, అగడ్త ఏమో
అనన్ = అనేటట్లుగా
తగెఁగా = తగినట్లు ఉన్నది కదా !

భావం:
అయ్యోయ్యో ! భూదేవి నడుమునకు కట్టిన వస్త్రమువలె శోభిల్లే సముద్రము, ఈ దిక్కునకు వచ్చి, ఈ దుష్ట రాక్షసుల పట్టణమైన లంకకు కందకము (అగడ్త) అనేటట్లు అమరి ఉన్నది కదా !

పద్యం -4

ఆ॥ గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటి జోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కి జూద్కు వెలుఁగు
ప్రతిపదార్ధం :
గాడ్పు, వేల్పు పట్టి = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
గట్టెక్కి (గట్టు + ఎక్కి) = పర్వతమును ఎక్కి (మహేంద్రగిరిని ఎక్కి)
ఏటిజోటి మగనిస్; ఏటిజోటి = నదీ కాంతలకు (నదులు అనే స్త్రీలకు)
మగనిన్ = భర్తయైన సముద్రుని
భావి సేతువు = రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి
అచ్చుపడన్ = ఏర్పడడానికి
లంకకడకును = లంకా నగరము వఱకూ
సూత్రపట్టుమాడ్కిన్ = తాడు (దారము) పట్టుకొన్న విధంగా
చూడ్కి = తన కంటి చూపు
వెలుగన్ = ప్రకాశింపగా
సూటిన్ = నిటారుగా (నిదానముగా)
ఉక్కునన్ = స్థిరముగా
చూచెన్ = చూచాడు

భావం :
వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు, కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోడానికి పట్టుకొన్న దారమా అన్నట్లుగా, సూటిగా సముద్రుని చూచాడు.
అలంకారము : ఉత్ప్రేక్షాలంకారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 5 : కంఠస్థ పద్యం

మ|| | తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకటినీ మంబులన్ బూన్చి తోఁ
క నబోవీథికిఁ బెంచి యంపు లిజీయంగాఁ బెట్టి చిట్టూది గ్ర
క్కున నర్కొంద యడంగండ్రొక్కి పయికిం గుప్పించి లంఘించుచోవ్
ప్రతిపదార్థం :
తన చూపు = తన కంటి చూపును
అంబుధిమీదన్ = సముద్రంపై
చాచి = బాగా ప్రసరింపజేసి
శ్రవణ ద్వంద్వంబున్ = చెవుల జంటను (తన చెవులు రెండింటినీ)
రిక్కించి = నిక్కించి (నిక్కపొడిచేటట్లు చేసి)
వంచిన = కొంచెము వంచిన
చంచద్భుజముల్ (చంచత్ + భుజముల్) = కదలుతున్న చేతులను
సముత్కటకటిసీమంబులన్; సముత్కటి = మిక్కిలి విశాలమైన
కటీ సీమంబులన్ = మొలపై భాగములందు
పూన్చి = గట్టిగా ఉంచి
తోకన్ = తన తోకను
నభోవీథికిన్ = ఆకాశములోనికి
పెంచి = ఎత్తుగా పెంచి
అంఘ్రులు = పాదములు
ఇటీయంగాఁ బెట్టి (ఇటీయంగాన్ + పెట్టి) = బిగించి పెట్టి
బిట్టూది (బిట్టు + ఊది) = గట్టిగా గాలి పీల్చి
గ్రక్కునన్ = వెంటనే
ఆ క్కొండ (ఆ + కొండ) = ఆ మహేంద్ర పర్వతము
అడంగన్ = అణగి పోయేటట్లు
త్రొక్కి = కాళ్ళతో తొక్కిపెట్టి
పయికిన్ = ఆకాశములోనికి
కుప్పించి = ఎగిరి
లంఘించుచోన్ = దూకేటప్పుడు

భావం:
హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు. రెండు చెవులు రిక్కించి, వంగి కదలుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు, తోకను ఆకాశవీధికి పెంచి, తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చాడు. తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి దూకాడు.

పద్యం -6

కం॥ గిరి గ్రుంగంద్రొక్కి చెంగున
హరి నింగికి దాంటుగొనిన హరిహరి యవుడా
హరి యెగసినట్లు దోంచం
గిరి యెగానయట్లు తోఁచెం గౌళవుల కెల్లన్.
ప్రతిపదార్థం :
గిరిన్ = పర్వతమును (మహేంద్ర పర్వతాన్ని)
క్రుంగన్ = భూమిలోకి దిగిపోయేటట్లు
త్రొక్కి = త్రొక్కి
చెంగునన్ = ‘చెంగ్’ మనే ధ్వనితో
హరి = వానరుడయిన హనుమంతుడు
నింగికిన్ = ఆకాశములోకి
దాటుగొనినన్ = దూకగా
హరిహరి = ఆశ్చర్యము, ఆశ్చర్యము
అపుడు = ఆవేళ (ఆ సమయములో)
ఆ హరి = ఆ వానరుడైన ఆంజనేయుడు
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = పైకి ఎగిరినట్లు
తోచక = అనిపించక
కెళవులకున్ + ఎల్లన్ = దూరం నుండి చూసేవారు అందఱికీ
గిరి = పర్వతము
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = ఎగిరినట్లుగా
తోఁచెన్ = అనిపించింది (హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావము)

భావం :
ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి, ఆకాశం పైకి ఎగిరినపుడు, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లుగా, దూరం నుండి చూసిన వారికి అనిపించింది.

పద్యం -7

కం॥ గిరికారు కనిర్గమై
హరిశర మపు దసురవరపురాభిముఖంబై
సురగరుదదురవలోక
త్వరతో అనె నొకమహారవం బుదయింపన్
ప్రతిపదార్థం :
గిరికార్ముక నిర్గతమై; గిరీకార్ముక = పర్వతము అనే ధనుస్సు నుండి
నిర్గతము + ఐ = వెలువడినదై
హరిశరము = వానరుడు అనే బాణం
అపుడు = అప్పుడు
అసురవరపురాభిముఖంబై; అసుర వర = రాక్షసరాజయిన రావణాసురుని
పుర = లంకా పట్టణానికి
అభిముఖంబు + ఐ = ఎదురై
సురగరుడదురవలోక త్వరతోన్; సుర = దేవతలకును
గరుడ = గరుడ పక్షులకును
దురవలోక = చూడశక్యముకాని
త్వరతోన్ = వేగముతో
ఒక మహారవంబు = ఒక గొప్ప ధ్వని
ఉదయింపన్ = పుట్టే విధంగా
చనెన్ = వెళ్ళింది

భావం :
కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము, గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకానగరం వైపు వెళ్ళింది. అది దేవతలకు కాని, గరుడులకు కాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది.

గమనిక :
పై పద్యంలో శ్లేషాలంకారము ఉంది. దీనికి మరో అర్థం, ఇలా చెప్పవచ్చు. గమనించండి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 8

కం|| వాలంబుఁ దానుఁ గరువలి
వేలుపుల గొడు కరుగం జూచి విపరీతగతిన్
దోల దొరఁకొనెనొ రవి యిటు
దేలం టెనుగాడితోదితే రని రమరుల్
ప్రతిపదార్థం :
కరువలివేలుపుఁ గొడుకు= వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
వాలంబున్ = తోకయునూ
తానున్ = తానునూ
అరుగఁజూచి; (అరుగన్ + చూచి) = వెడుతుండగా చూసి
అమరుల్ = దేవతలు
విపరీతగతిన్ = గొప్ప వేగముతో
రవి = సూర్యుడు
ఇటు = ఈ వైపు
తేలన్ = గాలిలో తేలేటట్లు
పెనుగాడితోడి; (పెను + కాడి తోడి) = పెద్దకాడితో ఉన్న (పెద్ద నాగలితో ఉన్న)
తేరు = రథమును
తోలన్ = తోలడానికి
దొరకొనెన్ = పూనుకున్నాడేమో
అనిరి = అన్నారు

భావం :
వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు, తోకతో ఎగరడం చూసిన దేవతలు, “సూర్యుడు చాలా వేగంతో పెద్దకాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ, అలా వచ్చాడేమో” అనుకున్నారు.

పద్యం – 9

కం|| పవనణజంఘాసంభవ
పవనము వడింగదలిఁ బాయవడ నదంచి మహా
వివరమునకుం జారంబడి
పవనాశనకోటి నాశపణచి గమించెన్
ప్రతిపదార్థం :
పవనజ జంఘాసంభవ పవనము; పవనజ = వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క
జంఘా = కాలి పిక్కల నుండి
సంభవ = పుట్టిన
పవనము = గాలి
వడిన్ = వేగంగా
కడలిన్ = సముద్రమును
పాయవడన్ (పాయ + పడన్) = చీలిపోయేటట్లు
అడచి = అణచి
మహా వివరమునకున్ = గొప్ప రంధ్రములోకి (గొప్ప కన్నములోకి)
చొరంబడి = ప్రవేశించి
పవనాశన కోటిన్ (పవన + అశన + కోటిన్) = గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును
ఆశపఱచి = అశపెట్టి (తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి)
గమించెన్ = వెళ్ళిపోయింది

భావం :
వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి, వేగంగా సముద్రాన్ని చీలుస్తూ, లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు, ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. (హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావము.)

పద్యం – 10

సీ| | రఘువరేణ్యక్రోధరసము లంకకు ముట్టం
గ్రోవ్వారు కాలువ ద్రవ్వె ననంగ
నాగామి సేతుబంధానురూపంబుగాఁ
జేయు గుణావర్తమో యనంగ
నవయతో వసనంబు లవని కర్పించి య
చ్చెల్వ నల్లనివల్వ చించె ననఁగఁ
దనుఁ జూద శేషుందు తలుపులు దెఱచిన
బలిమందిరంబు వాకిలియొ యనంగ

తే॥॥ నొక నిమిష మాత్ర మప్పుదయ్యుదధి నడుమ
నుకువది తోంచె నదరంటం చి పఱచు
నలఘుణంఘా ప్రభంజనంబులఁ దనర్చి
యతండు వ్రాలెఁ ద్రికూటకూటాగ్రవీథి.
ప్రతిపదార్థం :
రఘువరేణ్యక్రోధరసము; రఘువరేణ్య = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క
క్రోధరసము = కోపము అనే నీరు
లంకకున్ = లంకా పట్టణానికి
ముట్టన్ = చేరడానికై
క్రొవ్వారు = అందమైన
కాలువన్ = కాలువను
త్రవ్వెననగన్ (త్రవ్వెన్ + అనగన్) = త్రవ్వినారా అనేటట్లు
ఆగామి సేతుబంధాను రూపంబుగాన్; ఆగామి = రాబోయే కాలంలో కట్టబోయే
సేతుబంధ = వారధి నిర్మాణానికి
అనురూపంబుగాన్ = తగిన విధంగా
చేయు = చేసే
గుణావర్తమోయనంగన్ (గుణావర్తమో + అనంగన్) = పునాది గొయ్యియా అన్నట్లుగానూ
నవయశోవసనంబులన్; నవయశః = క్రొత్త కీర్తులు అనే
వసనంబులన్ = వస్త్రములను
అవనికిన్ = భూదేవికి
అర్పించి = ఇచ్చి
అచ్చెల్వ (ఆ + చెల్వ) = ఆ భూదేవి యొక్క
నల్లని వల్ప = నల్లని వస్త్రాలను (చీరను)
చించెననగన్ | = చింపివేసినాడా అనేటట్లునూ
తనున్ = తనను
చూడన్ = చూడ్డానికి
శేషుండు = ఆదిశేషుడు
తలుపులు దెఱచిన; (తలుపులు + తెఱచిన) = తలుపులు తెరచిన
బలిమందిరంబు = బలిచక్రవర్తి ఇంటి
వాకిలియొ యనంగన్ (వాకిలి + 1 + అనంగన్) = వాకిలియా అనే విధంగా
ఒక్క నిమిషము = ఒక క్షణ కాలము
అప్పుడు = అప్పుడు
అయ్యుదధినడుమన్ (ఆ + ఉదధి, నడుమన్) = ఆ సముద్రము యొక్క మధ్యలో
నఱకువడి = నఱకుడు పడినట్లు (తెగిన విధంగా, చీలినట్లు)
తోచెన్ = కనబడింది
అదరంటన్ = గాఢముగా
చలచిపఱచు = కొట్టి వెడుతున్న
జంఘా ప్రభంజనములన్; జంఘా = కాలి పిక్కల బల వేగముతో
ప్రభంజనములన్ = వేగంగా లేచిన పెను గాలులతో
తనర్చి = అతిశయించి
అతడు = ఆ హనుమంతుడు
త్రికూటకూటాగ్రవీధిన్; త్రికూట = త్రికూట పర్వతము యొక్క
కూట + అగ్రవీధిన్ = శిఖరము యొక్క పైభాగముపై
వ్రాలెన్ = వ్రాలాడు.

భావం :
శ్రీరాముని క్రోధరసము, లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును, రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యి, అనేటట్లును, క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి, అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును, హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును, ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది. ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో, అతిశయించి హనుమంతుడు, త్రికూట పర్వత శిఖరముపై వ్రాలాడు.

Leave a Comment