AP 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

These AP 10th Class Telugu Important Questions 8th Lesson సముద్ర‌లంఘ‌నం will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 8th Lesson Important Questions and Answers సముద్ర‌లంఘ‌నం

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. రామలక్ష్మణులు, సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలో ఆంజనేయుని బృందం, దక్షిణ దిక్కుకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమౌతాడు.

ప్రశ్న 2.
హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టలను గురించి రాయండి. (June 2018)
జవాబు:

  1. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పెద్ద పెద్దగా అంగలు వేస్తూ బలంగా నడవడం, తోకను వేగంగా తిప్పడం, చేతిని జబ్బపై చరచడం, సింహనాదం చేయడం వంటి పనులను చేశాడు.
  2. ఈ పనులు అతని ఆత్మవిశ్వాసాన్ని, సమస్త శక్తులను కూడగట్టుకోవడాన్ని సూచిస్తున్నాయి.
  3. ఏ పనినైనా చేయడానికి పూనుకొనే ముందు శక్తులన్నింటినీ సమీకరించడం వీరులు చేసే ముఖ్యమైన పని.
  4. మహావీరుడైన రూనుమంతుడు కూడా తనలో అంతర్గతంగా ఉన్న శక్తులను బయటకు రప్పించడానికే అలా చేశాడని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
జవాబు:
‘సముద్రలంఘనం’ పాఠ్యభాగ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఇతడు ప్రసిద్ధుడు. వీరి రచనల్లో రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం వంటి రచనలు రచించాడు. రామాభ్యుదయంలో ఎనిమిది ఆశ్వాసాలు ఉంటాయి. ఉత్తరకాండను వదలివేశారు. వీరికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాది మదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి. వీరి శైలి కవితాసామర్థ్యంతో కూడి యుంటుంది. వీరి వర్ణన సహజ ధోరణిలో సాగుతుంది.

ప్రశ్న 4.
హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
హనుమంతుడు, సుగ్రీవునకు, మంత్రి, ఇతడు మహాబలశాలి. స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ భక్తుడు. సుగ్రీవునికి నమ్మిన బంటు. రామలక్ష్మణులకు, ఇతడే సుగ్రీవునితో స్నేహం కల్పించాడు. శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడిని వానర రాజ్యాధిపతిని చేశాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ప్రముఖ పాత్ర వహించాడు. నూరుయోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి పట్టుదలతో సీతాదేవి జాడను కనిపెట్టి, సీతమ్మకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతమ్మ తనకు ఇచ్చిన చూడామణిని, శ్రీరామునకు తెచ్చి ఇచ్చి, సీత వృత్తాంతాన్ని రామునకు తెలియచెప్పాడు. ఇతడు ఒంటరిగా లంకకు వెళ్ళి, రాక్షస సైన్యాన్ని చంపి, లంకను దహనం చేసి, రావణునికి, రాముని సందేశం అందించిన రామదూత. ఇతడు రామరావణ యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. ఆంజనేయుడు మహావీరుడు.

ప్రశ్న 5.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
నేను, నా మిత్రులతో కలిసి విహారయాత్రకై మహానంది బయలుదేరాను. ఈ యాత్ర నాకు మధురానుభూతిని మిగిల్చింది. ముఖ్యంగా ఈ క్షేత్రం నల్లమల అడువుల్లో ఉంటుంది. గిద్దలూరు దగ్గరి నుండి నంద్యాల వరకు రైలు ప్రయాణం అరణ్యం గుండా జరిగింది. వంపుసొంపుల మార్గాలు, ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్న పర్వత శిఖరాలు, వాటిపై పొడవైన చెట్లు, ఆ చెట్టుకున్న ‘పూలు చూడముచ్చటగా ఉన్నాయి. మధ్యలో పొడవైన రెండు పెద్ద గుహలు. ఆ గుహల్లోకి రైలు వెళ్ళగానే అంతా దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఇది చూచి అనుభవించి తీరవలసిందే. ఎతైన కొండల నుండి కిందికి జాలువారే సెలయేళ్ళు, అక్కడక్కడా గిరిజనుల నివాసాలు సుమనోహరంగా ఉన్నాయి. ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. భూదేవికి పచ్చని చీర కట్టినట్లుగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, కోయల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని ప్రవర్తనను బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించిపోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తాను తప్పక సీత జాడను తెలిసికొని రాగలనని, ముందుగానే తన తోడి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ప్రశ్న 7.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినపుడు సమీపంలోని వారికి ఎలా కనిపించాడు? ఎందుకో వివరించండి.
జవాబు:
హనుమంతుడు మహేందగిరిపై కాళ్ళు వేసి, దానిని క్రిందికి అణగదొక్కి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు కాకుండా ఒక పర్వతము ఆకాశంలో ఎగురుతున్నట్లు సమీపం నుండి చూసే వారికి కనబడింది.

కారణము : హనుమంతుడు సూరుయోజనాల సముద్రాన్ని దాటడానికి తన రూపాన్ని బాగా పర్వతం అంత ఆకారంలో పెంచి వేశాడు. అందుకే హనుమంతుడు అప్పుడు చూసేవారికి పర్వతం అంత పరిమాణంలో కనిపించాడు. అందుకే ఆకాశంలో పర్వతం ఎగురుతున్నట్లు దగ్గర నుండి చూసేవారికి కనిపించింది.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన హనుమంతుడిని కవి వర్ణించాడు కదా ! అయితే నీవు చూచిన ఒక అద్భుత ప్రకృతి దృశ్యాన్ని నీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పవిత్రమైన భారతదేశంలో చూడదగిన ముఖ్యప్రదేశం కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడి వాతావరణం సుమనోహరం. ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కల్గిస్తాయి. ఒక్కమాటలో, చెప్పాలంటే కాశ్మీర్ ఒక భూతల స్వర్గం.

ఇక్కడ ఎటు చూసినా సమున్నత పర్వత శ్రేణి, వృక్షసంపద, సెలయేటి ధారలు యాత్రకులకు అలౌకికమైన అనందాన్ని కలిగిస్తాయి. పచ్చని పంటల శోభ, వాటి మధ్య ప్రవహించే కొండవాగుల అందం అన్నీ కలగలిపి భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చలపతకంలా కాశ్మీరు లోయ ప్రకాశిస్తుంది.

పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ‘బనిహాల్’కనుమ ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడ కొండల అంచుల్ని మంచు ముసుగు కప్పేస్తుంది. ఆ కొండల చివళ్ళనున్న మంచు పెళ్ళలుగా గట్టిగా పాలరాతి ముక్కల్లా మెరుస్తోంది. నల్లగా నిగనిగలాడే కొండ శరీరంపై అంచున తెల్లని పాలరాతి ముక్కలు ‘ఎమ్ బాస్’ చేసినట్లుగా ఉంది. అక్కడ కొండవాలుల్లో అన్నీ వరిపైర్లు, కొండవాగులోని నీరే ఆ పంటలకు ఆధారం. పచ్చని పైర్ల శోభ, వాటి మధ్య కొండవాగుల అందం అన్నీ కలగలిపి, భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చల పతకంలా కాశ్మీరలోయ ప్రకాశిస్తోంది. అది అంత అందమైన లోయ కాబట్టే ప్రభుత్వం వారు కూడా అక్కడ ‘స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ బనిహాల్’ (ఆగి బనిహాల్ సౌందర్యాన్ని దర్శించండి) అనే బోర్డు పెట్టి యాత్రికుల మనస్సులను సైతం అటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 2.
ప్రాచీన కావ్యాలకు సంబంధించిన వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి.
జవాబు:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని.

  • మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు.
  • మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు.
  • శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు.
  • ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు.

ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.

ప్రశ్న 3.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పటి పరిస్థితిని బట్టి అతని బలాన్ని ఊహించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, మహేంద్ర పర్వతంపై అడుగులు నొక్కిపెట్టి వేసినపుడు, పిడుగులు పడ్డట్లుగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. దీనిని బట్టి హనుమంతుడు గొప్ప బరువు కలవాడని తెలుస్తోంది. హనుమంతుడు వేగంగా తోకను తిప్పినప్పుడు, ఆ వేగానికి పెద్ద పెద్ద అడవులు సైతం ఖాళీ ప్రదేశాలు అయ్యాయి. చెట్లు అన్నీ కూలిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడు వాయుదేవుని మించిన వేగం గలవాడని తెలుస్తోంది.

హనుమంతుడు చేతితో చరిస్తే, కఱ్ఱతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు సైతం బెదరి పారిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడి చేతిలో గొప్పబలం, శక్తి ఉందని తెలిసింది. హనుమంతుడు సింహనాదం చేస్తే, ఆ ధ్వనికి గుహలు సైతం ప్రతిధ్వనించాయి. దీనినిబట్టి హనుమంతుని సింహనాదం, కర్ణకఠోరంగా భయంకరంగా ఉంటుందని తెలిసింది.

హనుమంతుడు నడుస్తూంటే, కొండలు కంపించిపోయాయి. ఆ కంపనాలకు కొండలపై ఉన్న సెలయేటి కెరటాలు ఆకాశాన్ని అంటేటట్లు ఎగసిపడ్డాయి. దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని అపారశక్తి సామర్థ్యాలు కలవాడని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 4.
అందరు వానర వీరుల్లో హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని ఎలా గుర్తించారు?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు, మన పాఠంలో లేదు. అయినా రామాయణాన్ని బట్టి, దీనికి సమాధానం ఇలా ఉంటుంది.

సీతను అపహరించిన రావణుని గూర్చి, లంకా నగరాన్ని గూర్చి సంపాతి, వానరులకు చెప్పింది. దానితో వానరులు సముద్రాన్ని దాటడంలో వారి వారి శక్తి సామర్థ్యాలను గూర్చి చెప్పారు.

వానరులలో కొందరు తాము 50 యోజనాల దూరం’ దాటగలం అన్నారు. జాంబవంతుడు తాను 90 యోజనాల దూరం దాటగలనన్నాడు. యువరాజైన అంగదుడు తాను సూరుయోజనాల సముద్రాన్ని దాటగలను గాని, తిరిగి రాలేనేమో అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అంగదుడు యువరాజు కాబట్టి అతడు లంకకు వెళ్ళడం తగదని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వెళ్ళి, అతడు వాయుపుత్రుడని సముద్రాన్ని దాటగలడని చెప్పాడు. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకొని నూరు యోజనాలు ఎగిరాడని అతనికి గుర్తు చేశాడు. బ్రహ్మవరం వల్ల హనుమంతుడిని వజ్రం కూడా ఏమి చేయలేదన్నాడు.

దానితో హనుమంతుడు తన శక్తిని వెల్లడించాడు. వేలకొద్దీ యోజనాల దూరం తాను దాటగలనని ప్రకటించాడు. అందువల్ల హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని వానర వీరులు గుర్తించారు. హనుమంతుడిని మెచ్చుకొని సీతాన్వేషణకు అతడినే పంపారు.

ప్రశ్న 5.
మీ పాఠం ఆధారంగా హనుమంతుడి సమర్థతను వివరించండి.
జవాబు:
హనుమంతుడి సమర్దత :
హనుమంతుడు సముద్రం పైకి ఎగిరేటప్పుడు మహేంద్ర పర్వతం పై పాదాలు నొక్కివేస్తే పిడుగులు పడినట్లుగా పెద్దరాళ్ళు పగిలిపోయాయి. హనుమ తోకను త్రిప్పిన గాలివేగానికి అడవులు అన్నీ కూలి శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. హనుమ చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు పారిపోయాయి. హనుమ సింహనాదం చేస్తే పోటీపడ్డట్లు గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. ఆ కంపనాలకు కొండలపై సెలయేళ్ళు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడు వలె ఉన్నాడు. హనుమ తన శరీరాన్ని పెంచితే, పర్వత శిఖరాలు కదలిపోయాయి.

హనుమంతుడు మహేంద్రగిరిని అణగదొక్కి, ఆకాశంపైకి ఎగిరినప్పుడు పర్వతము ఎగిరినట్లు కనబడింది. దానిని బట్టి హనుమ, పర్వతం అంత ఆకారంలో ఉన్నాడని తెలుస్తుంది.

హనుమంతుడి కాలిపిక్కల నుండి పుట్టిన గాలివేగానికి సముద్రం లోతుగా చీలిపోయింది. హనుమంతుడి కాలిపిక్కల నుండి వచ్చే గాలి వేగానికి సముద్రము మధ్య చీలినట్లు కనబడింది.

ఆ విధంగా చీలిన సముద్రాన్ని చూసినవారికి, రాముడి క్రోధరసము లంకకు చేరడానికి కాలువ త్రవ్వారేమో అనిపించింది. రాబోయే కాలంలో కట్టబోయే సేతువుకు పునాది త్రవ్వారేమో అనిపించింది. హనుమంతుడిని చూడ్డానికి పాతాళంలోని ఆదిశేషువు వచ్చి తలుపులు తెరిచాడేమో అన్నట్లు కనబడింది. హనుమంతుడు భూదేవికి కీర్తి వస్త్రాలను అర్పించి, ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చీల్చివేసినట్లు కనబడింది. హనుమంతుడు మహా సమర్థుడు.

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని చేష్టలు సమర్థనీయమా? చర్చించండి.
జవాబు:
సముద్రమును దాటడానికి ముందు హనుమంతుడు మహేంద్రగిరిపై గట్టిగా ఒత్తి అడుగులు వేసి కొండ రాళ్ళను పగుల గొట్టాడు. తన తోకను త్రిప్పి ఆ గాలివేగంతో చెట్లను కూలగొట్టాడు. క్రూర జంతువులను సైతం బెదిరించి పారిపోయేటట్లు చేశాడు. గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. పర్వత శిఖరాలు కంపించిపోయేలా చేసి, సెలయేరులోని నీళ్ళు ఆకాశానికి తగిలేలా చేశాడు.

ఈ పనుల వల్ల హనుమంతుడు తన శక్తిని, బలాన్ని మిగిలిన వానరులకు చూపించాడు. సముద్రమును దాటడం ఎలాగా అని, ఆందోళన పడుతున్న తనతోడి వానరులకూ, యువరాజు అంగదుడికీ, ధైర్యం చేకూర్చాడు. తాను సముద్రాన్ని దాటివెళ్ళి సీత జాడను తెలిసికొని రాగలనని, తనవారికి ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తివంతుడననీ, కొండలను పిండి చేయగలనని నిరూపించాడు.

తాను వాయుదేవుని అనుగ్రహంతో ఎంతటి సాహసకార్యం అయినా చేయగలనని తనవారికి భరోసా కల్పించాడు. హనుమంతుడు మహాశక్తివంతుడని, బలవంతుడని ఈ చర్యల ద్వారా మిగిలిన వానరులకు అర్థమయ్యింది. వారి ఆరాటం శాంతించింది. కాబట్టి సముద్రమును దాటే ముందు హనుమంతుడు చేసిన చేష్టలు, సమంజసంగానే ఉన్నాయి.

ప్రశ్న 7.
మీ పాఠం ఆధారంగా హనుమంతుని స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. ధైర్యశాలి. సాహసం కలవాడు. దృఢమైన దీక్ష కలవాడు. కార్యసాధకుడు. అందువల్లనే సముద్రలంఘనానికి తాను సిద్ధపడ్డాడు.

హనుమంతుడి శక్తి బలములు :
హనుమంతుడి బలము, శక్తి, ధైర్యము అసమానములైనవి. .సముద్రం దాటడానికి అతడు పర్వతంపై ఒత్తి అడుగులు వేస్తే కొండరాళ్ళన్నీ, పగిలిపోయాయి. అతడు తోకను త్రిప్పిన గాలి వేగానికి చెట్లన్నీ కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే క్రూర జంతువులు సైతం పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే, గుహలు ప్రతిధ్వనించాయి. హనుమంతుడి పాదాల ఒత్తిడికి పర్వతాలు కంపించి, ఏరులలోని జలాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

పర్వతం అంత ఆకారము:
హనుమంతుడు తన శరీరాన్ని పెంచితే సాక్షాత్తు అతని తండ్రి వాయుదేవుడిలా కనిపించాడు. అతడు ఎగురుతూ ఉంటే, పర్వతం ఎగిరినట్లు కనిపించింది.

సోదర వానరులకు ధైర్యం :
హనుమంతుడు సముద్రంపై ఎగిరే ముందు, తన శక్తి సామర్థ్యాలను తోడి వానరులకు చూపించి తప్పక తాను సీత జాడ తెలిసేని రాగలనని వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు మహేంద్ర గిరిపై పాదాలు తొక్కిపెట్టి, పైకి లేవగా ఆ పర్వతమే భూమిలోకి దిగిపోయింది.

కాలిపిక్కల వేగం :
హనుమంతుడు ఎగిరేటప్పుడు అతడి కాలిపిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రము చీలిపోయింది. అది రాముడి క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతువు కట్టడానికి తవ్విన పునాదిలా, బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా కన్పించింది.

దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని, ధైర్యం కలవాడని, గొప్ప సాహసవంతుడని, కార్యసాధకుడని తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 8.
సముద్రలంఘనం పాఠంలో కవి చాతుర్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
సముద్రలంఘనం పాఠం అయ్యలరాజు రామభద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ ప్రబంధములోనిది. ఈ కవి గొప్ప – కవితాచాతుర్యం కలవాడు. గొప్ప భావకుడు, మంచి కవితాశక్తి కలవాడు. ఆలంకారిక సిద్ధహస్తుడు.

ఈ పద్యాలలో స్వభావోక్తి, ఉత్ప్రేక్షాలంకారాలు చక్కగా ఉన్నాయి. హనుమంతుడు ఎగరడానికి ముందు చేసిన చేష్టల వర్ణన, చక్కని స్వభావోక్తిలో ఉంది. హనుమంతుడి అడుగులకు కంపించి ఎగిరిన సెలయేళ్ళ జలాలు, ఆకాశం ఎత్తు ఎగిరి దావాగ్నులను, వానరుల మనస్సులలోని తాపాన్ని చల్లార్చాయని కవి చక్కగా చెప్పాడు.

హనుమంతుడు ఎగిరినప్పుడు వచ్చిన పిక్కలగాలికి సముద్రం రెండుగా లోతుగా చీలి పోయిందట. అప్పుడు అది ఆ రాముని క్రోధరసాన్ని లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా, హనుమంతుడిని చూడ్డానికి శేషుడు వచ్చి తలుపు తెరిచిన బలిమందిరంలా ఉందని, అద్భుతమైన ఉత్ర్ఫేక్షలు ఇక్కడ కవి ప్రయోగించాడు.

రామభద్రకవి ఊహాశక్తికి జోహార్లు అర్పిద్దాం.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం Important Questions and Answers

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి ఎలా సహకరించింది?
జవాబు:
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి అనేక విధాలుగా సహకరించింది. రామ కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. హనుమంతునికి శ్రమ కలుగకూడదని సముద్రుడు భావించాడు. సముద్రుని ఆజ్ఞపై మైనాకుడు సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడ్ని కొంతసేపు తన బంగారు శిఖరాల మీద విశ్రాంతి తీసుకోమన్నాడు.

ప్రశ్న 2.
సముద్రలంఘనం పాఠం కథ రూపంలో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రి పై దిగాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
‘సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు’ అనే అంశం దృష్టిలో పెట్టుకొని సామాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

(కరపత్రం )

విద్యార్థినీ, విద్యార్థులారా ! ఒక్కసారి ఆలోచించండి. మనం మన దృష్టిని చదువు పైనే కేంద్రీకరిద్దాం. కొద్దిగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనం నిరుత్సాహపడకూడదు. మనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నాం, కాన్వెంట్లకు వెళ్ళలేక పోతున్నాం అని బాధపడకండి.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేస్తే సామాన్యులు సైతం, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మొన్న ఐ.ఎ.యస్ పరీక్ష ఫలితాలు గమనించండి. ఒక కూలి వాని బిడ్డ, ఒక ఫ్యాక్టరీ గుమస్తా కుమార్తె, ఒక మత్స్యకారుని కుమారుడు, ఒక దర్జీ కొడుకులు, కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐ.ఎ.యస్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. సామాన్య విద్యార్థులు సైతం ఐ.ఐ.టీలలో సీట్లు సాధించి, లక్షలు, కోట్ల జీతాలపై నేడు ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు స్వయంకృషితో మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులుగా, రాజకీయనాయకులుగా తయారవుతున్నారు. టీలు అమ్మిన మన మోదీ గారు నేడు మన ప్రధాని అయ్యారు. విదేశాలలో మంచి ప్రధానమంత్రిగా ఆయన రాణిస్తున్నాడు. ఎందరో చిన్న చిన్న పనివారల పిల్లలు, పెద్ద జీతాలు సాధిస్తున్నారు. MP లుగా, MLA లుగా పేరు సంపాదిస్తున్నారు.

అందుకే నేను సామాన్యుడనని మీరు అనుకోకండి. కృషి చేయండి. పట్టుదల పట్టండి. గొప్పవారు కావాలనే కలలు కనండని మన మాజీ రాష్ట్రపతి కలామ్ మనకు చెప్పిన మాటలు మరచి పోకండి. చిన్న చిల్లర కొట్టు యజమాని కొడుకు మన అబ్దుల్ కలామ్, గొప్ప శాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడైన రాష్ట్రపతిగా ఆయన కీర్తిని సంపాదించాడు కదా !

అందరూ సంపన్నులుగా, తెలివి కలవారుగా, పెట్టి పుట్టిన వారుగా పుట్టరు. మనమే భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. గొప్పవారు కండి.

రాష్ట్ర విద్యార్థి యూనియన్,
విజయవాడ.

ప్రశ్న 4.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(కరపత్రం )

మిత్రులారా !

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. ఆమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మనదేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు వున్నాయి. గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించు పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

ఇట్లు
గ్రంథాలయాల అభివృద్ధి మండలి

ప్రశ్న 5.
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
వి.సతీష్ చంద్ర, 10వ తరగతి,
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రవహించే నదిని వర్ణిస్తూ, ఒక కవితా గేయం రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :

“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసె
గౌతముడు కోపాన కనువిచ్చి చూసే
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
సన్నని పాయగా ప్రభవించెనంత
ప్రవహించి జలము గోభస్మమును ముంచె
గోవు స్వర్గతి చెంద మునియు హర్షించె
గోదావరీ పాయ గౌతమి నదియై
సాగు తాగునీరు జనులకు నందించె
మోక్షమ్ము తా నొసగె దేహమ్ము ముంప
స్వర్గమోక్షదమ్ము గోదావరమ్ము
వేద నాదం బొలుకు దాని కమ్ర రవమ్ము”

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 1 Mark Bits

1. దనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. వీరు దేవతలకు శత్రువులు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దానవులు
B) ధర్మాత్ములు
C) దుర్జనులు
D) దుష్టులు
జవాబు:
A) దానవులు

2. అపారమైన తీరము గలది – (వ్యుత్పత్తిని చెప్పే పదం గుర్తించుము. ) (March 2017)
A) పారాశర్యుడు
B) పారావారం
C ) తాపసుడు
D) కార్ముకం
జవాబు:
B) పారావారం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

3. యమకాలంకారానికి ఉదాహరణ గుర్తించుము. (March 2017)
A) రాజు కువలయానందకరుడు
B) మా పొలంలో బంగారం పండింది
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !
D) శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ
జవాబు:
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !

4. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఇందులోని అలంకారం గుర్తించండి. (June 2018)
A) లాటానుప్రాసము
B) ఛేకానుప్రాసము
C) యమకము
D) ముక్తపదగ్రసము
జవాబు:
A) లాటానుప్రాసము

5. హనుమంతుడు పర్వతమెక్కాడు – (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) హనుమంతుడు పర్వతమెక్కుటలేదు.
B) హనుమంతుడు పర్వతమెక్కలేడు.
C) హనుమంతుడు పర్వతమెక్కుట కష్టం.
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.
జవాబు:
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.

Leave a Comment