AP 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

These AP 10th Class Telugu Important Questions 6th Lesson శతక మధురిమ will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 6th Lesson Important Questions and Answers శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు? (March 2018)
జవాబు:
జాతకాలు చెప్పడం, రాజులకు సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి. (March 2019)
జవాబు:
వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు అనే విషయాన్ని మారదవెంకయ్య ఏ ఉపమానంతో చెప్పాడు?
జవాబు:
‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు.

అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ప్రశ్న 4.
‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ప్రముఖమైనది. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకపద్యాలు నీతిని, ధర్మాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. శతక పద్యాలు నైతిక విలువలను ప్రబోధిస్తాయి. శతకపద్యాలు జగతిని జాగృతం చేస్తాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక దాతను గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మా ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్పదాత. తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తాడు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం, స్కూలు యూనిఫారం కుట్టించడం మొదలగు పనులు చేస్తుంటాడు. వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాడు.

ఎవరైనా పేదవారు పెళ్ళిళ్ల సమయంలో వచ్చి యాచిస్తే వారికి ధన సహాయం చేస్తాడు. బంగారు మంగళసూత్రాలు దానం చేస్తాడు. ఆయన దేవాలయాలకు, ధర్మసత్రాలకు, అన్నసత్రాలకు, విద్యాలయాలకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇరుగుపొరుగు ప్రాంతాలవారు వచ్చి యాచించినా ‘లేదు’ అనకుండా అందరికీ తన శక్తికొద్దీ దానం చేస్తుంటాడు. మా ప్రాంతంలో ఆయన ‘దాత’గా మంచి కీర్తి సంపాదించాడు.

ప్రశ్న 6.
సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జవాబు:
దైవం మనపై దయతో సంపదలు ప్రసాదిస్తాడు. కలిగినంతలో పేదలకు పెట్టాలి. నిందించకుండా, ఆదరణతో పెట్టాలి. ఆ విధంగా పెట్టినవారు ఏ ప్రయత్నం చేయకపోయినా సంపద వారిని చేరుతుంది.

దీనిలో విశేషమేమిటంటే విష్ణువుకు (దరిద్ర) నారాయణుడు, (దరిద్ర) దామోదరుడు అని పేర్లు. అంటే దరిద్రులలో నారాయణుడు ఉంటాడు. నారాయణుని భార్య లక్ష్మీదేవి. తన భర్తను ఆదరించిన వారి దగ్గరకే భార్య కూడా వెడుతుంది. కానీ, ఆదరించని వారి దగ్గరకు వెళ్ళదు కదా ! అందుచేత పేదలను (నారాయణుని) ఆదరించే వారి దగ్గరకు లక్ష్మి వెడుతుంది. సంపదలు ప్రసాదిస్తుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 7.
ఎవరిని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించండి.
జవాబు:
మనిషి అధముడిని ఆశ్రయిస్తే, అతడు కూడా అధముడై పేరు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే తాను కూడా ఉత్తముడు అవుతాడు.

భర్తృహరి ఈ విషయాన్ని చక్కగా సోదాహరణంగా ఇలా వివరించాడు. నీళ్ళు కాల్చిన ఇనుముమీద పడితే, అవి ఆవిరి అయిపోయి పేరులేకుండాపోతాయి. ఆ నీళ్ళు తామరాకు మీద పడితే ముత్యములవలె ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే, ముత్యపుచిప్పలలో పడితే, ముత్యములవలె మారతాయి. నీటి బిందువు తాను ఆశ్రయించిన స్థానాన్ని బట్టి ప్రకాశించింది. అలాగే మనిషి తాను పొందిన ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాడని మనం గ్రహించాలి.

ప్రశ్న 8.
ధర్మవర్తనులు పాలసముద్రం వంటివారని ఎలా చెప్పగలవు?
జవాబు:
ధర్మప్రవర్తన గల మనుష్యులు పాలసముద్రం వంటివారు. ధర్మప్రవర్తనతో పేరుపడిన మానవుడిని, ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో నిందించినా, తిరస్కరించినా, ఆ ధర్మాత్ముడికి ఎటువంటి లోపమూ కలుగదు. దీనికి భర్తృహరి ఒక మంచి దృష్టాంతం ఇలా చెప్పాడు.

పాలసముద్రం మీదుగా ఎగిరివెళ్ళే కాకి, ఆ పాలసముద్రములో రెట్టవేస్తుంది. అంతమాత్రంచేత ఆ పాలసముద్రానికి ఏమి లోపము రాదు.

అలాగే పాలసముద్రం వంటి ధర్మవర్తనులను నీచులు నిందించినా, ధర్మవర్తనులకు లోటురాదు. దీనిని బట్టి ధర్మవర్తనులు పాలసముద్రం వంటి వారని మనము చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 9.
ధర్మవర్తనులకు, ముష్కరులకు గల తేడా ఏమిటో చర్చించండి.
జవాబు:
ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు.

ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.

ప్రశ్న 10.
మంచివాని లక్షణములేవి?
జవాబు:
మంచివారు, ఇతరులు తమకు అపకారము చేసినా, తాము మాత్రం ఇతరులకు ఉపకారమే చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, మంచివారు తమ ధనమాన ప్రాణాలను పరుల మేలు కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మంచివారు ప్రత్యుపకారాన్ని కూడా కోరుకోరు.

పై విషయాన్ని సమర్థిస్తూ భాస్కర శతకకర్త మంచి దృష్టాంతము చెప్పాడు. పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంత గట్టిగా చిలుకుతున్నా, పెరుగు ఆ బాధను ఓర్చుకొని, చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది.

అలాగే మంచివాడు. తనకు ఇతరులు కీడు చేస్తున్నా తాను మాత్రం వారికి అపకారము చేయడు. అంతేకాదు మంచివాడు తనకు కీడు చేసినవారికి సైతం ఉపకారము చేస్తాడు.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుభాషిత రత్నావళి’ ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే
ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున తెనిగించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :

  1. రామేశ్వర మాహాత్మ్యం,
  2. విశ్వామిత్ర చరిత్ర,
  3. గంగా మాహాత్మ్యం,
  4. రామవిలాసం
    అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 2.
శతక మధురిమలో కొన్ని నీతి పద్యాల నుండి నీతులను గ్రహించావు కదా ! మంచి విద్యార్థికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండాలి.

విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచుకోవాలి.

విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లాడడం, క్రమశిక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి – వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.

శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేట తెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజాకవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు. కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమానికి ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి వర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి. రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు.

ప్రశ్న 4.
సమాజానికి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు శతక కవులు – ఈ విషయాన్ని వివరించండి..
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు తమ అనుభవసారాన్ని మధించి చక్కని నీతి పద్యాలను రచించారు. వేమన, సుమతి, కృష్ణ, దాశరథి మొదలైన శతకాలు ప్రజల్లో నీతివర్తనను కలుగజేస్తాయి.

అక్కరకు రాని చుట్టము, వినదగునెవ్వరు చెప్పిన, పుత్రోత్సాహము మొదలైన పద్యాలు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. సమాజంలోని అసమానతలను, కుళ్ళు, కుతంత్రాలను లోకానికి చాటాడు. భూర్జటి రాజాశ్రయం పొందినా రాజుల దురహంకారాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి వంటివారు తేటతెలుగు పద్యాల్లో రచించారు. కరుణశ్రీ గారి తెలుగుబాల శతకంలోని పద్యాలు బాలల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. శతక పద్యాలు తెలుగు పలుకుబడులను, సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తేటతెల్లం చేస్తున్నాయి

ప్రశ్న 5.
ఆశ్రయించిన వారిని బట్టి పొందే గౌరవంలో మార్పు వస్తుందనే విషయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
వ్యక్తులు మంచివారిని ఆశ్రయిస్తే, మంచి గౌరవం పొందుతారు. అధముడిని ఆశ్రయిస్తే వారు నశిస్తారు. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని సోదాహరణంగా ఇలా వివరించారు.

  1. నీరు కాల్చిన ఇనుము మీదపడితే, ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు యొక్క రూపమే నశిస్తుంది.
  2. అదే, నీరు తామరాకుపై పడితే, ముత్యమువలె అందంగా మెరుస్తుంది.
  3. అదే నీరు ముత్యపుచిప్పలలో పడితే, మణులవలె మారుతుంది.

దీనిని బట్టి ఈ క్రింది విషయం మనకు తెలుస్తుంది. మనిషి ఒక అధముడిని ఆశ్రయిస్తే తాను కూడా అధముడు అవుతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే, తాను కూడా ఉత్తముడు ఔతాడు.

మనిషి అధముడిని ఆశ్రయిస్తే కాల్చిన ఇనుము మీద నీరువలె నామరూపాలు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే రామరాకుపై నీరువలె మెరుస్తాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యపుచిప్పలో నీరువలె మణిగా మారుతాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 6.
మూర్యులకు నీతులు చెప్పడం ఎటువంటిది?
జవాబు:
మూర్చులకు నీతులు చెప్పడం వ్యర్ధము. అందువల్ల కొంచెము కూడా ప్రయోజనం ఉండదని భర్తృహరి సుభాషిత పద్యాల్లో క్రింది ఉదాహరణములు ఇచ్చాడు.

మూర్సులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, మదించిన ఏనుగును తామరతూడులోని దారములతో బంధించాలని ఆలోచించడం వంటిది. ఏనుగువంటి బలమైన జంతువును సన్నని, బలహీనమైన తారతూడులోని దారాలతో బంధించలేము. అలాగే మూర్చులకు నీతులు బోధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

మూర్చులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బద్దలు కొట్టాలని చూడడం వంటిది. మెత్తని దిరిసెనపువ్వుతో కఠినమైన వజ్రాన్ని భేదించలేనట్లే, మూర్యుడికి నీతులు బోధించడం అసాధ్యం. అది వ్యర్థమైన పని.

మూరులకు నీతులు చెప్పవలెనని అనుకోవడం, ఒక- తేనె బొట్టుతో ఉప్పు సముద్రంలోని నీటిని తియ్యగా మార్చాలనుకోవడం వంటిది. ఒక్క తేనె బిందువుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చడం అసాధ్యం. అలాగే మూర్ఖుడికి నీతులు బోధించడం కూడా అసాధ్యం అని, భర్తృహరి చెప్పాడు.

ప్రశ్న 7.
పరద్రవ్యము నాశించిన వాని ప్రవర్తనను విశ్లేషించండి.
జవాబు:
ఇతరుల నుండి ధనాన్ని ఆశించి కొందరు అనేకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పరద్రష్యం కోసం అలాంటి తప్పుడు పనులు చేయడం వ్యర్థమని ఆ ద్రవ్యము వారివద్ద ఎన్నాళ్ళో ఉండదనీ, వారు కూడా శాశ్వతంగా జీవించరనీ, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు.

కొందరు పరధనాన్ని ఆశించి, జాతకములు చెపుతారు. మరికొందరు రాజులకు సేవలు చేస్తారు. కొందరు అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటారు. కొందరు చాడీలు చెపుతూ ఉంటారు. కొందరు ఇతరులను హింసిస్తూ ఉంటారు. కొందరు ఉన్నవీ లేనివీ మాట్లాడుతూ ఉంటారు. ఈ పైన చెప్పిన పనులన్నీ, వారు ఇతరుల నుండి ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు.

కాని నిజానికి ఆ ద్రవ్యము వారి వద్ద ఎన్నాళ్ళో ఉండదు. అలా చెడుపనులు చేసేవారు కూడా, శాశ్వతంగా ఈ లోకంలో బ్రతికియుండరు. అందువల్ల పైన చెప్పినటువంటి చెడుపనులు చేసి డబ్బు సంపాదించడం వ్యర్థం అని గుర్తించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 8.
నైతిక విలువల వలన ప్రయోజనములేవి?
జవాబు:
నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహము వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు.

సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో, ఈ నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది.

మన శతకకవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. ‘ అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తృహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు.

ఈ పద్యాల్లోని నీతివాక్యాలను పాటించి నడచుకుంటే మనుషులు ధర్మవర్తనులు అవుతారు. ఆ నైతిక విలువలు, నేటి తరం వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగల్గుతారు.

శాంతి, సత్యము, దయ, ప్రేమ వంటి సద్గుణాలు వారికి అలవడుతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతకపద్యాలను పిల్లలకు నేర్పించాలి.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన శతక కవిని గూర్చినీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

అమలాపురం,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది తెలుగు సాహిత్యంలో ఎంతోమంది శతక కవులు ఉన్నారు. వారిలో వేమన కవి నాకు బాగా నచ్చిన కవి. ఈ మహాకవి తన జీవిత అనుభవసారాన్ని తేట తెలుగు పద్యాల్లో అందించాడు. జీవిత సత్యాలను. అలనాటి సామాజిక రుగ్మతలను చక్కగా తెలియజేశాడు. తన పద్యాలను అంటరానితనం వంటి అసమానతలపై ఆయుధంగా వాడుకున్నాడు. అందుకే నాకు వేమన అంటే బాగా ఇష్టం. నీకు నచ్చిన కవిని గురించి వివరంగా తెలియజేయి. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
x x x x x x x

చిరునామా :
వి. రాకేష్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
మీరు సందర్శించిన పర్యాటక ప్రదేశాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

ప్రియమైన కృష్ణకు,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయులేఖ.

నేనీ మధ్య అమరావతి వెళ్ళాను. అమరావతి చాలా విశాలమైన నగరం. చాలా అందమైన నగరం. కృష్ణానది పరవళ్ళతో ఆ అందం రెట్టింపయింది.

చక్కటి ఉద్యానవనాలున్నాయి. కొత్త కొత్త భవనాలు కట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం చక్కగా ఉంది. చూపరులను కట్టిపడేసే అందాలతో విరాజిల్లుతున్న అమరావతి మన నవ్యాంధ్ర రాజధాని కావడం మన అదృష్టం. అమరావతిలో విశేషమైన శిల్ప సంపద ఉంది. మానవ శరీర ధర్మ శాస్త్రాననుసరించి చెక్కిన ఆ శిల్పాలను చూడవలసింది.
ఉంటాను మరి

ఇట్లు,
మాధుర్ వ్రాలు

చిరునామా:
చింత. శివరామకృష్ణ,
10వ తరగతి – ఎ,
మునిసిపల్ హైస్కూల్, పవర్ పేట, ఏలూరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథలకు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను, వదాన్యతను లోకానికి చాటించుకోవాలని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ఆపన్నహస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం !

వదాన్యులారా ! ధనవంతులారా ! ఒక్క మనవి ఆలకించండి. మన సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉంది. ముఖ్యంగా సంపన్నుల పైన ఎక్కువగా ఉంది. ఎంతో మంది అనాథలు చదువులకు దూరంగా ఉన్నారు. వృద్ధులు నిరాదరణకు లోనవుతున్నారు.

స్వార్థం కొంత మానుకొని తోటి సమాజశ్రేయస్సుకై పాటుపడాలి. అనాథలపై కనికరం చూపండి. పేదలకు భోజన వసతులను కల్పించండి. అనాథాశ్రమాలను పోషించండి. పేద విద్యార్థుల చదువుకు ధన సహాయం చేయండి. గ్రామాలను, పాఠశాలలను దత్తత తీసుకోండి. మీలోని మానవీయతను చూపండి. అందరికి ఆదర్శంగా నిలవండి. సమాజ శ్రేయస్సునే మీ శ్రేయస్సుగా భావించండి. పేదలు లేని నవసమాజాన్ని నిర్మించడానికి కృషిచేయండి. ఈ మహాయజ్ఞంలో మీ వంటి ధనవంతుల భాగస్వామ్యం తప్పక ఉండాలి.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి,
కనిగిరి.

ప్రశ్న 4.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కరపత్రం

శతక పద్యాలు, శతకకర్తల అనుభవసారాలు. వారు జీవితాన్ని కాచివడపోసిన అనుభవంతో, గమనించిన సత్యాలతో శతకాలు రచించారు. శతకంలో సుమారు వందపద్యాలు ఉంటాయి. ప్రతి శతకంలోనూ మకుటం ఉంటుంది. శతకాలలో నీతి, భక్తి, వైరాగ్య శతకాలు ఉన్నాయి.

ఈనాడు సంఘంలో ఎన్నో అవకతవకలు, అధర్మ ప్రవర్తనలు, తెలివితక్కువ పనులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది సంఘాన్ని మంచిదారిలో నడపాలంటే చిన్నప్పటి నుండే మంచి నీతులు నేర్చుకొని తెలివిగా బ్రతకాలి. ధర్మబద్ధంగా, ఇతరులకు ఆటంకాలు లేకుండా న్యాయబద్ధంగా, నీతి మార్గంలో నడవాలి.

అందుకు మనకు ఉన్నది ఒక్కటే మార్గం. మన కవులు మనకు అందించిన శతక పద్యాలను కంఠస్థం చేసి, వాటిలో చెప్పిన నీతిమార్గాన్ని పాటించి, నైతిక విలువలను కాపాడాలి. అందుకే మా పాఠ్యపుస్తకాల్లో ప్రతి తరగతిలోనూ నీతి శతక పద్యాలను పాఠాలుగా పెడుతున్నారు.

మనం అంతా శతకాలు చదువుదాం. మన పిల్లలచే శతకాలు చదివిద్దాం. శతక పద్యాలు చదివి, వాటిలో వేమన, సుమతీ శతకకర్త, భాస్కర శతకకర్త, భర్తృహరి వంటి వారు చెప్పిన శతకపద్యాలలోని విలువలను నేర్చుకుందాం. మన జీవితాన్ని బంగారుబాట పట్టిద్దాం. మన పిల్లలను మేలిమి రత్నాలుగా తీర్చిదిద్దుకుందాం. అందుకే మనం అంతా దీక్షగా శతక పద్యాలు చదువుదాం, కదలండి.

దివి, x x x x x

ఇట్లు,
ఆంధ్రభాషా ప్రవర్థక సమితి,
అమరావతి.

ప్రశ్న 5.
శతకాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:

శతకములు – ప్రయోజనములు

‘శతకము’ అంటే నూరు పద్యాల గ్రంథము. శతకాలలో నూరు నుండి. నూట ఎనిమిది వరకు పద్యాలు ఉంటాయి. శతకాలలో మకుటం ఉంటుంది. మకుటం లేని శతకాలూ ఉన్నాయి. మన తెలుగు భాషలో ఎందరో కవులు శతకాలు వ్రాశారు. వీటిలో నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను మూడింటినీ రచించి, ‘సుభాషిత త్రిశతి’ అని పేరు పెట్టాడు.

శతకములలో వేమన రచించిన వేమన శతకము, కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకము, సుమతీ శతకము, భాస్కర శతకము, ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకము వంటివి బాగా ప్రసిద్ధి పొందాయి.

శతకములు చదవడం వల్ల ముఖ్యంగా ప్రజలలో నీతివర్తనం, భక్తి పొందుతుంది. నీతి శతకాలు మానవులకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయి. నీతి శతకాలవల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. ముఖ్యంగా పిల్లలచే నీతి శతక పద్యాలు చదివిస్తే, వారు మంచి పౌరులుగా తయారు అవుతారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుస్తుంది. వేమన నీతులను దృష్టాంతాలతో సులభంగా చెప్పాడు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో చెప్పాడు. వీటిని చదవడం వల్ల సులభంగా మనకు నీతులు పట్టుపడతాయి.

భక్తి శతకాల ద్వారా దైవభక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులు భక్తి, నీతి కలవారై యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం. మన పిల్లలచే చదివిద్దాం.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 1 Mark Bits

1. కులం కంటె గుణం ప్రదానం – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) కాలము
B) కొలం
C) కలము
D) కన్నం
జవాబు:
B) కొలం

2. గగ, భ, జ, స, నల గణములు మాత్రమే వచ్చే పద్యమేది? (June 2017)
A) సీసము
B) కందము
C) ద్విపద
D) తరువోజ
జవాబు:
B) కందము

3. సృష్టి మర్మమును ఎవరు తెలుసుకోగలరు? – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) పుట్టుక
B) నడవడిక
C) రహస్యం
D) ఆచరణ
జవాబు:
C) రహస్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

4. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2018)
A) చంపకమాల
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) శార్దూలము
జవాబు:
C) ఉత్పలమాల

5. సిరి సంపదలకన్నా ప్రవర్తన గొప్పగా ఉండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. (June 2018)
A) శ్రీశ్రీ
B) శ్రీ
C) శ్రీకారం
D) సాకారం
జవాబు:
B) శ్రీ

6. మహనీయులు వారు చేసిన పనుల వలన ఉత్తములుగా కీర్తి పొందారు. (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) స్నేహితులు
B) గొప్పవారు.
C) మధ్యములు
D) పేదవారు
జవాబు:
B) గొప్పవారు.

7. కరి రాజును తామరతూడులతో బంధించలేము. (పర్యాయ పదములు గుర్తించండి) (S.A. I – 2018-19)
A) కరము, కిరణము
B) గజము, ఏనుగు
C) హస్తి, హస్తము
D) గజము, సింహము
జవాబు:
B) గజము, ఏనుగు

8. మనదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అమరులుగా నిలిచారు. (వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) మరణం పొందినవారు
B) మరణం లేనివారు
C) మరణం లెక్కచేయని వారు
D) మరణానికి భయపడనివారు
జవాబు:
B) మరణం లేనివారు

9. దేశాల మధ్య శాంతి కాపాడుకోవాలి. (విడదీసిన సరియైన రూపం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) దే + శాల
B) దేశ + అల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

10. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంత్యానుప్రాసము
B) లాటానుప్రాసము
C) ఛేకానుప్రాసము
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
D) వృత్త్యనుప్రాసము

11. పరధనాపహరణము కంటె దిరియుట మంచిది – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018 )
A) ఇతరుల డబ్బు దొంగతనం చేయకూడదు.
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.
C) ఇతరుల సొమ్ము దొంగిలించకుండా అడుక్కోవాలి.
D) పరుల నగదు అడిగి తీసుకోవడం మంచిది.
జవాబు:
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.

12. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) నిషేధాకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) విధ్యర్థకం

చదవండి – తెలుసుకోండి

మహాత్మాగాంధీ బోధలు

సత్యం :
ప్రపంచానికి బోధించటానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాలంతటి ప్రాచీనమైనవి.

సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి అహింస మార్గం.

సత్యమనేది, నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యమనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమైవుండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు.

నా జీవితమంతటా, సత్యంపై దృఢంగా నిలబడటం రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవటం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం (అహింసాత్మక ప్రతిఘటన)లో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తరా జీవితంలో నేను చూడగలిగాను.

నిలకడవున్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధచూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని గాని లేదా మాంసం కరిగిపోవటంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన గాని నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి యిచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే.

సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దానిని ఆవహించివున్న అజ్ఞానమనే సాలెగూళ్ళను నీవు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

అహింస:
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటివాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దురలుని శరీరముకున్న దుష్టమాంసఖండములే నా శరీరమునకూ ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేనూ తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి.

అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి, అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది.

మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో తమ సూత్రాల పట్ల అదే పరిగణనకు ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవటానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది.

క్రమశిక్షణ – విధి నిర్వహణ:
జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం.

మనం ఏదైనా గొప్పదైన, శాశ్వతమైనదాన్ని సాధించే ముందు కఠినమైన, ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యాసంబంధమైన వాదన నుండి, హేతువుకు, తర్కానికి విజ్ఞప్తి చేయటం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి.

సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది గాని సాధించటంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్నిస్తుంది.

నిరంతర అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదాలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు.

హక్కులకు సిసలైన మూలం విధి. ‘మనందరం గనుక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులు నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరుగెడితే అవి అగమ్య గోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి.

తన విధులు సష్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి.

ధైర్యం – దృఢ విశ్వాసం:
ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు, అది హృదయానికి సంబంధించింది. అతి గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం.

శారీరక దారుఢ్యం నుండి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుండి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినపుడు అది ప్రబలమవుతుంది.
ప్రపంచంలో చూడాలని నీవు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి.

నమ్రత:
అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారి తీస్తుంది.

నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే, అది ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి ఉద్దేశించింది కాదు. అయితే అది ‘అహింసకు తప్పనిసరి పరీక్ష, ఎవరిలోనైతే ‘అహింస’ ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది.

తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు – దైవాంశ సంభూతులైనా సరే. తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవటం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషిచేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా వుండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు.

మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పటం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి వున్నవారు దేశానికి శత్రువులని చెప్పటం దురలవాటు.

సహనశీలత – అస్పృశ్యత:
అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధిచెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరచుకోవాలంటే మనం అసహనపరులుగా వుండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలోగల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది.

ఇతరులు మనలను చూస్తునట్లుగా మనల్ని మనం చూసుకోటం మంచిది. మనం ప్రయత్నించినా, మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేము. ముఖ్యంగా మనలోని దుష్టపార్శ్వాన్ని అసలు తెలుసుకోలేము. మనలను విమర్శించేవారిపట్ల ఆగ్రహం చెందకుండా వున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చెప్పినప్పటికీ సహృదయంతో స్వీకరించాలి.

స్వేచ్ఛ – ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా వుంటాయి. ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురి అయ్యే అవకాశముంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించటం కాదు, దుర్వినియోగ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే.

ప్రజాస్వామ్యం సారాంశం ఏమంటే, అందరి సమష్టి ప్రయోజనానికి సేవచేయటంలో అన్ని విభాగాల ప్రజల ఉద్యం యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం.

Leave a Comment