AP 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

These AP 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 5th Lesson Important Questions and Answers ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.

Leave a Comment