AP 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

These AP 10th Class Telugu Important Questions 2nd Lesson అమరావతి will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 2nd Lesson Important Questions and Answers అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు?
జవాబు:
అమరావతిని శాతవాహనులు తొలి రాజధానిగా చేసుకొని అభివృద్ధి పరిచారు. ఇక్ష్వాకులు కూడా అమరావతిని మెరుగుపరిచారు. పల్లవులు తమ శాయశక్తులా అభివృద్ధి చేశారు. చాళుక్యులు, విష్ణుకుండినులు కూడా అభివృద్ధి చేశారు. కోటబేతరాజు వంశీయులు కూడా అభివృద్ధి చేశారు.

ప్రశ్న 2.
అనేక రాజవంశాలు అమరావతిని ఎందుకు అభివృద్ధి పరిచారు?
జవాబు:
రాజవంశాలు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాయి. వారి అభిలాషలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దుకొన్నారు. వారి అవసరాలకు తగినట్లుగా అమరావతిని మలచుకొన్నారు. వారి కళా పిపాస తీర్చుకోవడానికి అందమైన నిర్మాణాలు చేయించారు. ఆ పాలకుల మతాలకు, సంప్రదాయాలకు తగినట్లు రాజధాని ఉండాలి కనుక అభివృద్ధి పరిచారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడంలోని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
శరీరంలో కొన్ని కొలతలతో అవయవాలుంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా కొలతలు గల అవయవ నిర్మాణం, రంగు, ఒడ్డు, పొడుగు ఉంటేనే అందంగా పరిగణించబడుతుంది. అటువంటి లక్షణాలను కల్పించడం దైవానికి మాత్రమే సాధ్యం.

శిలతో చెక్కిన శిల్పంలో మానవ శరీరం యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబింపచేయడం నిపుణులైన కళాకారులకు మాత్రమే సాధ్యం. అటువంటి శిల్పాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. అటువంటి శిల్పాలు ఉన్నచోట సంపదలు వృద్ధి చెందుతాయనే విశ్వాసం కూడా ఉంది.

ప్రశ్న 4.
శాతవాహనుల కులగురువు యొక్క స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘నాగార్జునుడు’ అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన రాజులకు కుల గురువు. ఈయన ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలోనూ ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు. ఆ రోజుల్లో అక్కడ గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము ఉండేది. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధభిక్షువులు ఉండేవారు. ఆ విశ్వవిద్యాలయములో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి వంటి తత్త్వవేత్తలు బోధించేవారని, క్రీ.శ. 640లో ఈ ప్రాంతాన్ని దర్శించిన చైనా యాత్రికుడు, హ్యూయత్సాంగ్ తెలియపరచాడు.

10th Class Telugu 2nd Lesson అమరావతి 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి నగర సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా సంపదనుగురించి సొంతమాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకమే కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది.
  2. శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, విష్ణుకుండిన మొదలగు వంశాలకు చెందిన రాజుల పరిపాలనాకాలంలో అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది.
  3. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది.
  4. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు.
  5. కాలానుగుణంగా ఆయా రాజుల పరిపాలనలో మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతి మీద ప్రభావం చూపినందున ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతులు విలసిల్లి; నాటి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
  6. అమరావతి అద్భుత శిల్పకళకు కాణాచి. ఇక్కడి శిల్పాలు శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి రూపొందాయి. చిత్రకళలో మాత్రమే వీలైన హావభావ ప్రకటనలు శిల్పకళలో కూడా ప్రదర్శితం కావడం ఈ శిల్పాల విశిష్టత. క్రోధం, కరుణ, ప్రేమ, విషాదం, ఆరాధన వంటి భావాలు. ఈ శిల్పాలలో చక్కగా కనిపిస్తాయి.

ప్రశ్న 2.
ఏయే రాజవంశాలు అమరావతిని అభివృద్ధిపరచాయో తెల్పండి. (March 2018)
జవాబు:

  1. అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని సమగోప, గోబధ, నరన, కంవాయల వంశాలకు చెందిన రాజులు శాతవాహనుల కంటే ముందు పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
  2. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు అమరావతిని పాలించారు. అభివృద్ధిపథంలో నడిపించారు.
  3. కోట బేతరాజు వంశస్థులు పాలించారు.
  4. విజయనగర ప్రభువులు సైతం అమరావతిని పాలించారు.
  5. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతమైన నగరంగా తీర్చిదిద్దారు.

ప్రశ్న 3.
ఒక మామూలు నగరం రాజధానిగా ఉండడానికి పనికి వస్తుందా? రాదా? విశ్లేషించండి.
జవాబు:
ఒక మామూలు నగరం, రాష్ట్రమునకు రాజధానిగా ఉండడానికి పనికిరాదు. రాష్ట్ర రాజధాని నగరంలో మంత్రుల పరిపాలనకు సెక్రటేరియట్, డైరెక్టర్ల కార్యాలయాలు, అసెంబ్లీ భవనములు, హైకోర్టు భవనాలు ఉండాలి. మంత్రులకు, శాసనసభ్యులకు నివాస భవనాలు ఉండాలి. ఉద్యోగులకు నివాస భవనాలు ఉండాలి.

రాష్ట్ర రాజధాని నగరానికి రాకపోకలకు విశాలమైన రోడ్డుమార్గాలు ఉండాలి. రాష్ట్ర, కేంద్ర మంత్రుల రాకపోకలకు, విమాన సౌకర్యం ఉండాలి. రైలుమార్గాలు ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. పెద్ద వర్తక కేంద్రాలు ఉండాలి. కేంద్రమునకు సంబంధించిన కార్యాలయాలకు భవనాలు ఉండాలి. క్రీడా సదుపాయాలు ఉండాలి.

కాబట్టి ఒక మామూలు నగరం, రాష్ట్ర రాజధానిగా ఉండడానికి ఎంత మాత్రం పనికిరాదు. రాజధానికి కావలసిన అన్ని హంగులతో రాజధాని నగరాన్ని వేరుగా నిర్మించుకోవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 4.
ఒక మామూలు నగరం రాజధానిగా మారాలంటే రావలసిన మార్పులేమిటి?
జవాబు:
మామూలు నగరం రాజధానిగా మారాలంటే, ముఖ్యంగా అక్కడ పరిపాలనకు సెక్రటేరియట్ భవనాలు రావాలి. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కావాలి. పోలీసుశాఖకు తగిన భవనాలు నిర్మించాలి.

మంత్రులకు, గవర్నరు గారికి, శాసనసభ్యులకు నివాస భవనాలు నిర్మించాలి. సెక్రటేరియట్ ఉద్యోగులకు నివాస భవనాలు కావాలి. రాజధానిలో నివసించేవారికి సరిపడ మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. చక్కని రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన ప్రయాణ సౌకర్యములు ఉండాలి. విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద వైద్యశాలలు ఉండాలి.

క్రీడలకు సదుపాయాలు ఉండాలి. ఉద్యానవనాలు, సరస్సులు ఉండాలి. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మించాలి. పెద్ద పెద్ద వర్తక కేంద్రాలు, అత్యాధునిక హంగులతో కూడిన అన్ని సదుపాయాలు కావాలి. మంచి విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండాలి. ప్రజలు సులభంగా రాజధానికి రావడానికి, పోవడానికి ప్రయాణ సౌకర్యాలు కావాలి.

ప్రశ్న 5.
అమరావతి భిన్న సంస్కృతుల నెలవు కావడానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
అమరావతి రాజధానిగా ఒకటవ శతాబ్దంలోనే, శాతవాహన చక్రవర్తులు దీనిని పాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని మంచి రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు.

ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతిపై గట్టి ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ బుద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల, సంస్కృతుల ప్రభావాలు కన్పిస్తాయి.

క్రీ.పూ. 5వ శతాబ్దిలోనే గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. అమరావతిలో బుద్ధుని ధాతువుల భరిణను ఉంచి, దానిపై మహా చైత్యం నిర్మించారు. నాగార్జునుడనే బౌద్ధమత గురువు, శాతవాహన రాజులకు కుల గురువు. ఆ రోజుల్లో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము, దానిలో 7,700 మంది బౌద్ధ భిక్షువులూ ఉండేవారు.

ఆ కాలంలో అమరావతి కేంద్రంగా, జైనమతం కూడా విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ ఉంది.

12, 13 శతాబ్దాల్లో శైవమతం ఇక్కడ విస్తరించింది. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠ చేశాడట. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం, పంచారామాలలో ఒకటి.

రాజా వేంకటాద్రినాయుడు అమరావతికి దగ్గరలో, వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఇక్కడ వ్యాప్తి చెందాయి.

ఈ విధంగా అమరావతీ నగరం భిన్న సంస్కృతులకు నెలవు అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 6.
“ఆచార్య నాగార్జునుడు విద్యాప్రదాత” అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన, రాజులకు కుల గురువు. ఈయన కాలంలో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. దీనికి ధాన్యకటక విశ్వవిద్యాలయం, శ్రీ పర్వత విద్యాపీఠం అనే పేర్లు కూడా ఉండేవి.

అనేక దేశాల విద్యార్థులు వచ్చి, అక్కడ విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రస, రసాయన, వృక్ష, లోహ శాస్త్రములను బోధించేవారు.

నందికొండలో 1500 గదుల ఆరామాలలో వివిధ శాస్త్ర గ్రంథాలు నిండి ఉండేవనీ, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్త్వవేత్తలు, అక్కడ బోధించేవారనీ, చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ తన రచనల్లో తెలిపాడు.

దీనిని బట్టి ఆచార్య నాగార్జునుడు విద్యా ప్రదాత అని మనం చెప్పగలము.

ప్రశ్న 7.
అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు ఇక్కడ మహా బౌద్ధస్తూపం నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు. శిల్పులు ఈ చైత్యం చుట్టూ, అద్భుతమైన శిల్పకళా ఖండాలను అమర్చారు. శిల్పులు అక్కడ నలుచదరము శిలా ఫలకాల మీద బుద్ధుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. మెకంజీ 1779లో అమరావతి శివారులో ఉన్న దీపాల దిన్నె దిబ్బ దగ్గర ఉన్న శిల్ప సంపదను గుర్తించాడు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని, అక్కడ చెక్కించి, ఆ శిల్పాల గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలిపాడు.

దంతగిరి, నేలకొండ పల్లి, ధూళికట్ట, భట్టిప్రోలులలో లభించిన శిల్పాలను, “అమరావతి స్కూలు ఆఫ్ ఆర్ట్” అంటారు. ఇక్కడి శిల్పాలు, ఎన్నో కాలగర్భంలో కలిసాయి. కొన్ని విదేశాలకు వెళ్ళిపోయాయి. పల్నాడు పాలరాయిపై చెక్కిన 120కి పైగా అమరావతి శిల్పాలు, బ్రిటిష్ మ్యూజియంలో నేటికీ ఉన్నాయి. అవి అమరావతి శిల్పకళ గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. మరికొన్ని అమరావతి శిల్పాలు, మద్రాసు, కలకత్తా మ్యూజియంలలోనూ, కొన్ని నాగార్జున కొండ మ్యూజియంలోనూ దాచారు. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు చాలా గొప్పవని, గొప్ప శిల్పకళా పరిశోధకుడైన ఫెర్గూసన్ చెప్పాడు. దీనిని బట్టి అమరావతి శిల్ప కళలకు కాణాచి అని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
సాంస్కృతిక వైభవానికి అమరావతి నెలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అనేకమంది రాజుల కాలంలో కాలానుగుణంగా అనేకమార్పులు పొందింది. ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో అమరావతిలోని అమరారామంలో కాలు పెట్టాడు. అందువల్ల అమరారామం, పవిత్రమయ్యింది. 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర పరివర్తనం నిర్వహించాడు. అశోకుడు బుద్ధుని అస్థికలపై ఇక్కడ మహా చైత్యం నిర్మించాడు. నాగార్జునాచార్యుడు దానికి ప్రాకారం కట్టించాడు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది.

తరువాత అమరావతి కేంద్రంగా జైనమతం విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, ఇక్కడ జైనమత వికాసానికి సాక్షి. 12, 13 శతాబ్దాలలో అమరావతిలో శైవమతం వ్యాప్తి చెందింది. అమరావతిలోని అమరారామం మందార యం పంచారామాలలో ఒకటి.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు అమరావతి దగ్గరలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఈ పై కారణాల వల్ల, అమరావతి సాంస్కృతిక వైభవానికి నెలవు అని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 9.
“అమరావతి గొప్ప రాజధాని” – నిరూపించండి.
జవాబు:
అమరావతి రాజధానికి 22. 10.2015న మన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మన కొత్త రాజధానికి మంచి పేరు తెచ్చేందుకు శ్రమిస్తానని మన ముఖ్యమంత్రిగారు ప్రతిజ్ఞ చేశారు.

మన రాజధానిని ఐదు అంచెల్లో పూర్తి చేస్తారు. మొత్తం మూడు దశల్లో 35 సంవత్సరాలలో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. దీనికి ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. దీనితో ఇది వెనిస్ నగరంలా ఉండబోతోంది.

సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో తొమ్మిది నగరాలు నిర్మిస్తారు.

అందులో పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యా నగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అభివృద్ధి అవుతాయి.

ఈ విధంగా అమరావతి చాలా గొప్ప రాజధాని అవుతుంది. 2016 జూలై నుండి అమరావతి కేంద్రంగా మన రాష్ట్ర పాలన సాగుతుంది.

ప్రశ్న 10.
నాటి – నేటి అమరావతిని విశ్లేషించండి.
జవాబు:
నాటి అమరావతి :
ఒకటవ శతాబ్ది నాటికే అమరావతి మహా నగరంగా విరాజిల్లేది. అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో అమరావతిని గుర్తించి రాశాడు. అశోకుడికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉండేదని తెలుస్తోంది.

శాతవాహన రాజులు అమరావతిని రాజధానిగా చేసుకొని క్రీ.పూ. 220 వరకు పరిపాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు దీనిని పాలించారు. తరువాత కోట బేతరాజు వంశస్థులు పాలించారు. 1798లో అమరావతిని గొప్ప రాజధానిగా జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తీర్చిదిద్దాడు.

నేటి అమరావతి :
ఇప్పుడు అమరావతి నగరం ఐదుకోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ఈ రాజధానికి 22.10.2015న మన ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ రాజధాని 35 సంవత్సరాలలో సంపూర్ణ అమరావతి నగరంగా రూపొందుతుంది.

అమరావతికి రైలు, రోడ్డు సదుపాయాలు ఏర్పాటు అవుతాయి. సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం అవుతాయి. అమరావతి నగరం, అత్యాధునిక హంగులతో ప్రజా రాజధానిగా అభివృద్ధి అవుతుంది. 2016 జూలై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇక్కడి నుండే సాగుతుంది.

10th Class Telugu 2nd Lesson అమరావతి Important Questions and Answers

ప్రశ్న 1.
అమరావతి పర్యాటకులను ఆహ్వానిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(ఆహ్వానము)

దేశ విదేశ పర్యాటకులకు ఇదే మా ఆహ్వానము. మీరు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతిని గురించి వినే ఉంటారు. ఇది గొప్ప సాంస్కృతిక రాజధాని. అందాల కృష్ణమ్మ ఒంపులు తిరుగుతూ దీని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. “అమరావతీ నగర అపురూప శిల్పాలు, తప్పక చూడదగినవి. ప్రపంచ ప్రసిద్ధ శిల్పకళా పరిశోధకుడు ఫెర్గూసన్ ప్రపంచ శిల్పకళా సంపదలో అమరావతీ శిల్పాలు మిక్కిలి గొప్పవని మెచ్చుకున్నాడు.

అమరావతిలో అశోకుడు కట్టించిన మహా బౌద్ధస్తూపం ఉంది. దానికి నాగార్జునుడు కట్టించిన మహా ప్రాకారం ఉంది. పంచారామాలలో ప్రసిద్ధమైన అమరారామం ఇక్కడే ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన వేంకటేశ్వరాలయం ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడ ముచ్చటగా ఉంటాయి.

అమరావతిలో జైనమత వికాసానికి సాక్షిగా పార్శ్వనాథుని దేవాలయం ఉంది. అమరావతి నగరం, గొప్ప సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక మతాలు అభివృద్ధి చెందాయి. అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన గొప్ప శిల్ప సంపద ఉంది.

అమరావతి అద్భుతమైన శిల్ప కళలకు కాణాచి. అమరావతి శిల్పాలు, నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ శిల్పాలు అమరావతీ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

ఇంత అందమైన శిల్పకళా లక్ష్మికి నిలయమైన రాజధాని అమరావతిని మీరు తప్పక దర్శించండి. మీకు ఇదే మా సుస్వాగతం. ఇదే మా ఆహ్వానం, పర్యాటకులకు అమరావతి కనులపండువగా ఉంటుంది. ఈ ప్రదేశాలు చూడడానికి బస్సులు ఉన్నాయి. రండి అమరావతిని దర్శించండి.
దివి. x x x x x

ఇట్లు,
అమరావతీ పర్యాటక సంస్థ,
అమరావతి,

ప్రశ్న 2.
“అమరావతి” ఆత్మకథ రాయండి.
జవాబు:
నేను ‘అమరావతి’ నగరాన్ని. తొలి తెలుగు రాజులు శాతవాహనులు నన్నే రాజధానిగా చేసుకొని సుమారు 220 సంవత్సరాలు పాలించారు. నా ప్రక్కనే కృష్ణానది గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. నన్నే రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నన్ను అందమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు – నా గడ్డపై బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తి చెందాయి.

గౌతమబుద్ధుడు క్రీ.శ. 5వ శతాబ్దిలోనే నా నేలపై అడుగుపెట్టాడు. ఆ మహాత్ముడి పాద స్పర్శతో నేను పునీతం అయ్యాను. నా ఈ నగరంలోనే మహా బౌద్ధస్తూపం, దానికి ప్రాకారాలు ఉన్నాయి. నా నగరంలోనే నాగార్జునుడు ఒకనాడు బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పరచాడు.

నా అమరావతీ నగరంలో వెలిసిన శిల్పం, ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నా నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు నేను ఐదుకోట్ల ఆంధ్రులకు అందాల రాజధానిని అయ్యాను. ఇక్కడ తొమ్మిది నగరాలు అత్యాధునిక హంగులతో ఏర్పాటు అవుతున్నాయి. మనదేశ ప్రధాని ఇక్కడ నూతన రాజధానికి శంకుస్థాపన చేశారు. మూడు దశల్లో 35 ఏళ్ళలో నేను తెలుగువారికి గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి అవుతాను. నన్ను సర్వహంగులతో తీర్చిదిద్దుకోవడం, ఐదు కోట్ల తెలుగు ప్రజల కర్తవ్యం. ఉంటా…..

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
అమరావతిని సందర్శించిన ఇద్దరు పర్యాటకుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(రాజయ్య, వీరారెడ్డి అనే పర్యాటకుల సంభాషణ).

రాజయ్య : ఏవండీ ! మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీ పేరేమిటి?

వీరారెడ్డి : నేను అనంతపురం నుండి వచ్చా. నా పేరు వీరారెడ్డి. మీరు ఎక్కడివారు? మీ పేరేమిటి?

రాజయ్య : నేను శ్రీకాకుళం నుండి వచ్చా. నా పేరు రాజయ్య. మీరు ఇక్కడ ఏమి చూశారు?

వీరారెడ్డి : నేను అశోకుడు నిర్మించిన మహా బౌద్ధ స్తూపాన్ని, నాగార్జునాచార్యుడు దానికి కట్టించిన మహా ప్రాకారాన్ని చూశాను. అది ఎంత గొప్ప శిల్పం అండీ ! చాలా బాగుంది.

రాజయ్య : నేనూ అవి చూశాను. నిజంగా అమరావతి శిల్పం, అత్యద్భుతంగా ఉంది.

వీరారెడ్డి : నేను అమరారామం చూశా ! రాజయ్యగారూ ! శివలింగం, పై అంతస్థులో ఉంది.

రాజయ్య : అవునండి. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని, దేవరాజు ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడటండీ ! ఇది గొప్ప మహా పుణ్యక్షేత్రం.

వీరారెడ్డి : నేను కృష్ణానదిలో స్నానం చేసి, ఆ నీళ్ళతో అమరలింగేశ్వరునికి అభిషేకం చేశానండి.

రాజయ్య : రెడ్డిగారూ ! మీరు పుణ్యాత్ములు. నాకు నదీస్నానం అంటే భయం. మీరు దీపాల దిన్నె వెళ్ళారా?

వీరారెడ్డి : లేదండి. ఏమిటి అక్కడ విశేషం?

రాజయ్య : పూర్వం ప్రతిరోజూ అక్కడ బౌద్ధ భిక్షువులు దీపాలు వెలిగించేవారట. అందుకే దాన్ని దీపాల దిన్నె అంటారట. అక్కడ ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని చక్కగా చెక్కించాడు.

వీరారెడ్డి : నేనూ చూడాలి. నేను మొన్న ప్రధాని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళా. పరిసరాలు బాగున్నాయి. అక్కడ తొమ్మిది నగరాలు నిర్మిస్తారట.

రాజయ్య : బాగుంది. మొత్తం పై మన ముఖ్యమంత్రిగారు మంచి ప్రదేశాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేశారు. భేష్.

వీరారెడ్డి : సరే ఉంటానండి. ఇంకా నేను ఎన్నో చూడాలి.

రాజయ్య : సరేనండి. నేనూ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ప్రదేశం చూస్తా.

10th Class Telugu 2nd Lesson అమరావతి 1 Mark Bits

1. అమరావతి శిల్పకళకు కాణాచి. – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (June 2018)
A) వలయము
B) నిలయము
C) ప్రధానము
D) సంకేతము
జవాబు:
B) నిలయము

2. మంచి మార్కులు రాలేదని నిరాశ చెందకుండా కష్టపడి చదవాలి – గీత గీసిన పదంలో గల సంధి పేరు గుర్తించండి. (June 2018)
A) గుణసంధి
B) అనునాసిక సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) పడ్వాది సంధి
జవాబు:
D) పడ్వాది సంధి

3. ఒకనాటికీ, నేటికీ ఎన్నో విషయాలలో అంతరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) పోలిక, సమానం
B) న్యాయం, ధర్మం
C) నీతి, నిజాయితీ
D) భేదము, తేడా
జవాబు:
D) భేదము, తేడా

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

4. స్వభావముచేత ఐశ్వర్యము కలవాడు పార్వతీ దేవిని వివాహమాడెను. (వ్యుత్పత్తి పదమును గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) రుద్రుడు
B) మహేశ్వరుడు
C) ఈశ్వరుడు
D) శివుడు
జవాబు:
C) ఈశ్వరుడు

5. “దేవాలయ గోపురాలు ఆకాశాన్నందుతున్నాయి” అలంకారం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) స్వభావోక్తి
B) అర్థాంతరన్యాసం
C) అతిశయోక్త
D) ఉత్ప్రేక్ష
జవాబు:
C) అతిశయోక్త

6. అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. (కర్మణివాక్యం గుర్తించండి.) (June 2017)
A) అమరావతి శిల్పాలు నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరచలేదు.
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.
C) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో మ్యూజియంలో దాచారు.
D) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి.
జవాబు:
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.

7. ‘ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది’ అని అందరనుకుంటున్నారు. (పరోక్ష కథనం గుర్తించండి.) (June 2017)
A) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడదని అందరనుకుంటున్నారు.
B) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడుతుందని ఎవరూ అనలేదు.
C) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడలేదని అందరనుకుంటున్నారు.
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

8. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి.) (June 2017 )
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
B) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు.
C) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
D) “అతనికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
జవాబు:
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.

9. అమరావతీ ! నీ కీర్తి చిరకాలం వర్ధిల్లుగాక ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశీరర్థకం
B) నిశ్చయార్థకం
C) సందేహార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ఆశీరర్థకం

10. “నేను తిరుపతికి వెళతాను” అని అమ్మ అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది.
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.
C) నేను తిరుపతికి వెళ్ళను అని అమ్మ అన్నది.
D) నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అనలేదు.
జవాబు:
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.

11. చెప్పుడు మాటలు వినవద్దని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) “చెప్పుడు మాటలు వినవచ్చు” అని రచయిత అన్నాడు.
B) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అనలేదు.
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.
D) “చెప్పుడు మాటలు వినమని” రచయిత అన్నాడు.
జవాబు:
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

12. “నేటి సినిమాలు నేను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను – పరోక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) తాను ఈనాటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
B) తాను ఈనాటి సినిమాలను చూడలేనని అమ్మతో అన్నాను.
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
D) నాటి సినిమాలను తాను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
జవాబు:
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.

13. తన రచనలో తన జీవితముందని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) “మా రచనలో నీ జీవితముంది” అని రచయిత అన్నాడు.
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.
C) “తన రచనలో అతని జీవితముంది” అని రచయిత అన్నాడు.
D) “నా రచనలో ఎవరి జీవితం లేదు” అని రచయిత అన్నాడు.
జవాబు:
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.

14. తనకు అమరావతి నిర్మాణం ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
B) “మీకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
C) అమరావతి నిర్మాణం వారికి ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు.
D) ముఖ్యమంత్రి అన్నాడు “తమకు అమరావతి నిర్మాణం అవసరం.”
జవాబు:
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.

15. రాజులు కూడా జైన మతాన్ని ఆవలంబించారు. (కర్మణి వాక్యం గుర్తించండి) (S.I. 1 – 2018-19)
A) రాజులచేత కూడా జైన మతం అవలంబించారు.
B) జైన మతం కూడా రాజులు అవలంబించారు.
C) జైన మతంచేత రాజులు అవలంబించబడ్డారు.
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.
జవాబు:
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.

16. పునీతం : గంగానదీ జలంతో భారతావని పునీతం అయ్యింది.

Leave a Comment