AP 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

These AP 10th Class Telugu Important Questions 1st Lesson మాతృభావన will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 1st Lesson Important Questions and Answers మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్త్రీలను గౌరవించాలనే ఉదాత్త సందేశాన్నిచ్చిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి. (March 2015)
జవాబు:
1. కవి, కాలము : కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు, (1894-1980) ఆధునిక కాలము, కడపజిల్లా, జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రామ వాస్తవ్యులు.
2. రచనలు : మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి.
3. బిరుదు : కవితా వతంస / కవిసింహ | అవధాన పంచానన
4. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖులు, శతావధాని, బానిసత్వాన్ని నిరసించారు.

ప్రశ్న 2.
మాతృభావన నేపథ్యం వ్రాయండి.
జవాబు:
కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దారు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత పాఠ్యభాగం మొదలవుతుంది.

ప్రశ్న 3.
మాతృభావన రచయిత గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం.

శాస్త్రిగారు కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్ళ దిన్నె గ్రామానికి చెందిన వారు. వారి తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్యగార్లు, శాస్త్రిగారు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశారు. శాస్త్రిగారు శతావధాని. వీరు మరొక శతావధానియైన రాజశేఖర శతావధాని గారితో కలిసి, కావ్యనాటకాలు రచించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శివభారతంలోని తృతీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది.

గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతం” గుర్తుకు వస్తుంది. బానిసత్వాన్ని నిరసించి, స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం.

మురారి, పుష్పబాణ విలాసం, మల్లికామారుతం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాథీయం మొదలైన అనేక గ్రంథాలు శాస్త్రిగారు రచించారు.

శాస్త్రిగారికి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను సాహితీ విమర్శకులు ఇచ్చారు.

ప్రశ్న 5.
‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు’ అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
గడియారము వేంకటశేషశాస్త్రి కవిగారు ‘మాతృభావన’ అనే పాఠంలో, భారతదేశంలో అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలున్నారని వారు పుట్టింటిని, మెట్టింటిని తమ పాతివ్రత్యంతో రక్షించారని చెప్పారు.

‘కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం. స్త్రీలు భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే కల్పవృక్షాల వంటి వారని కవి ఉద్దేశ్యం.

స్త్రీలను గౌరవిస్తే భారతదేశం సౌభాగ్యముగా సర్వసంపదలతో సుఖంగా ఉంటుందని కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 6.
శివాజీ స్త్రీలపట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారిని గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
శివాజీ స్త్రీల పట్ల గౌరవభావం చూపినట్లే, మా గ్రామ సర్పంచి కూడా స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు. వారు ఎదురు పడితే మాతృభావంతో మెలిగేవాడు. గ్రామంలోని స్త్రీలను ఎవరైనా ఏమన్నా వేధించడానికి చూస్తే ఊరుకొనేవాడుకాదు. వాళ్ళకు తగినబుద్ధి చెప్పేవాడు. ఇతర స్త్రీలను మన తల్లిలాగా, సోదరిలాగా భావించి గౌరవించాలని బోధించేవాడు.

ప్రశ్న 7.
“స్త్రీలు పూజ్యనీయులు” అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
జవాబు:
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీని కూడా, ఆ సర్దారుతో పాటు బంధించి తెచ్చాడు. అది చూసి శివాజీ కోపంతో ఉగ్రుడైనాడు. స్త్రీలను తల్లులలాగా, తోబుట్టువుల్లాగా గౌరవించాలనేది శివాజీ అభిప్రాయం.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు ఈ భరతమాత కన్నబిడ్డలు. అగ్నిజ్వాలల వంటి స్త్రీలకు అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానమూ చేయకూడదనేది శివాజీ మాటల వెనుక ఆంతర్యం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 8.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. శివాజీ :
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తాడు. స్త్రీలకు అవమానం జరిగితే సహించడు. స్త్రీలకు కష్టాన్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తాడు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.

2. సోన్ దేవుడు :
శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తులు కలవాడు. ‘కళ్యాణి’ దుర్గం జయించాడు. రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డాడు. క్షమార్పణ చెప్పి శాంతింపజేశాడు. తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడే స్వభావం కలవాడు.

ప్రశ్న 9.
మీ తోడి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తావు?
జవాబు:
మేము మా తోడి బాలికలను అక్కలుగా, చెల్లెళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తాము. వారికి ఏ సహాయం కావలసినా, మేము మాతోడి బాలురతో కలిసి సాయం చేస్తాము. మా తోడి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తాము. ఎవరైనా ఆకతాయి, అల్లరి పిల్లలు, వారిని అల్లరి పెడితే, మేము ఆ పిల్లలను బెదరించి వారిని తరిమి వేస్తాము. అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తాము. మా తోడి బాలికలకు స్వంత అన్నదమ్ములవలె మేము చేదోడు వాదోడుగా నిలబడతాము.

అవసరం అయితే వారి కోసం మేము మా ప్రాణాలు కూడా ఇచ్చి సాయం చేస్తాము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము .

ప్రశ్న 10.
పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెట్టిన కొందరు స్త్రీలను గురించి వివరించండి.
జవాబు:
అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తన పాతివ్రత్యంతో, త్రిమూర్తులను చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాట పాడింది. సావిత్రి అనే ఇల్లాలు యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకొంది. సీతా మహాదేవి, భగభగమండే అగ్ని గుండంలో దూకి, పూలరాశిలో తిరిగినట్లు బయటకు సురక్షితంగా వచ్చింది. సుమతి అనే పతివ్రత తన భర్త ప్రాణాలను రక్షించడం కోసం, సూర్యుడు ఉదయించకుండా సూర్యోదయాన్ని నిలిపి వేసింది. ఈ ఇలా ఎందరో భారతీయ స్త్రీలు, తమ పాతివ్రత్య భాగ్యంతో, తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చి,
గౌరవాన్ని నిలబెట్టారు. ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

10th Class Telugu 1st Lesson మాతృభావన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“స్త్రీలు పూజింపదగినవారు వారికి ఏ అవమానం చేయకూడదు” అని చాటి చెప్పిన శివాజీ వ్యక్తిత్వాన్ని “మాతృభావన” పాఠం ద్వారా విశ్లేషించండి. (S.A. I – 2018-19)
జవాబు:
వ్యక్తిత్వం అంటే మాటకూ, చేతకూ తేడా లేనితనం. శివాజీ పరస్త్రీలను సైతం కన్నతల్లులవలె, సోదరీమణులవలె చూసి గౌరవించేవాడు. శివాజీ ధర్మప్రభువు. శత్రు దుర్గాలపై దండెత్తినపుడు అక్కడ ఉండే స్త్రీలకూ, బ్రాహ్మణులకూ అపకారం తల పెట్టవద్దని, తన సర్దారులను హెచ్చరించేవాడు.

తన సర్దారు సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, అతడు యవనకాంతను బంధించి తెచ్చినందుకు అతడిపై శివాజీ కోపపడ్డాడు. వెంటనే ఆ యవనకాంతను విడిపించి, తన సర్దారు తొందరలో తప్పు చేశాడనీ, తనను క్షమించమనీ ఆమెను కోరాడు. ఆమెను సత్కరించి తనవారిని తోడిచ్చి, ఆమెను ఆమె ఇంటికి తిరిగి పంపాడు.

శివాజీ క్షమామూర్తి, తప్పు చేశానని అంగీకరించిన సో దేవుడిని క్షమించాడు. శివాజీ స్త్రీలపై అత్యధిక గౌరవం కలవాడు. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని, వారు అగ్నిజ్వాలల వంటివారని, స్త్రీలకు అపచారం చేస్తే నశిస్తారనీ, వారి సంపదలు నశిస్తాయనీ శివాజీ తలంచేవాడు. శివాజీ శత్రువులను సైతం అవమానించని ధర్మమూర్తి. శివాజీది మహోన్నత వ్యక్తిత్వం.

ప్రశ్న 2.
‘మాతృభావన’ పాఠ్యాంశం ఆధారంగా దానిని రచించిన కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
మాతృభావన పాఠం ‘శివభారతము’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యాన్ని గడియారం వేంకటశేషశాస్త్రి గారు రాశారు. శివభారతము బానిసత్వాన్ని నిరసించి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన కావ్యం.

శివాజీ హిందూమత ధర్మంపై గొప్పభక్తి గౌరవాలు కలవాడు. స్త్రీలందరినీ, కన్నతల్లుల వలె శివాజీ గౌరవించాడు.

గడియారంవారు కూడా, గొప్ప దేశభక్తులు. శివాజీ వంటి దేశభక్తులైన చారిత్రక పురుషులపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు. గడియారంవారు శివభారతము రచించే రోజుల్లో మన దేశానికి స్వాతంత్ర్యము రాలేదు. అందుకే మన భారతీయులలో స్వాతంత్ర్యంపై కోరికను ఉద్దీపింపజేయడానికి శివభారతాన్ని గడియారం వారు వ్రాశారు.

ఈ పాఠాన్ని బట్టి గడియారంవారు, గొప్ప దేశభక్తులని, హిందూమతంపై భక్తి గౌరవాలు కలవారని, గొప్ప స్వాతంత్ర్య వీరులనీ, మహాకవులనీ మనం గ్రహించగలము. వీరు స్త్రీల పై గౌరవం కలవారు.

అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు గడియారం వారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 3.
సోన్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
జవాబు:
అబ్బాజీసో దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సో దేవుడు, శివాజీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తాడు. శివాజీ, సో దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సో దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి వెంట తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సోన్ దేవునిపై మండిపడ్డాడు.

వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సో దేవుడిని ఆజ్ఞాపించాడు. రాజభక్తి గల సో దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సో దేవుడు, శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సోన్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సోన్ దేవుడు గొప్ప రాజభక్తి కల సర్దారు.

ప్రశ్న 4.
సోన్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దుకొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
జవాబు:
సోన్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సోన్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సోన్ దేవుడు కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ వద్దకు తీసుకువచ్చాడు.

పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ మహారాజు సోన్ దేవునిపై ఉగ్రుడయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తుల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు.

సోన్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే సోన్ దేవుడు మరో మాట మాట్లాడకుండా, తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి సోన్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దుకొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.

ప్రశ్న 5.
శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రాయము. అందుకే కళ్యాణి దుర్గంలోని అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సో దేవుడి పై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తానన్నాడు.

స్త్రీలు భారతభూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చారని, శివాజీ మెచ్చుకున్నాడు.

పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తారనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 6.
శివాజీ యవనకాంతను ఎందుకు క్షమాపణ కోరాడో వివరించండి.
జవాబు:
శివాజీ, సో దేవుడు అనే సైన్యాధిపతిని కల్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. శివాజీ దండయాత్రకు తన సైన్యాన్ని పంపేటప్పుడు, పతివ్రతలయిన స్త్రీలకు ఎటువంటి అపచారము చేయవద్దని వారిని హెచ్చరించేవాడు.

కాని సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించిన ఉత్సాహంతో, దాని సర్దారునూ, అచటి అంతఃపురకాంతలనూ బంధించి తెచ్చాడు. అంతఃపుర స్త్రీలను బంధించి తీసుకురావడం తప్పని శివాజీ అభిప్రాయము.

పతివ్రతలయిన స్త్రీలు అగ్నిజ్వాలల వంటివారని, వారిపట్ల అపచారం చేసేవారు, సంపదలు పోగొట్టుకొని సర్వనాశనం అవుతారనీ, వారి వంశం కూడా నిలువదనీ, శివాజీ అభిప్రాయము. పతివ్రతలు భారతదేశపు భాగ్య కల్పలతలని శివాజీ, నమ్మకము.

అందుకే శివాజీ తన సర్దారు తొందరపడి తప్పు చేశాడనీ, ఆ దోషానికి బాధపడవద్దనీ, తన తప్పును క్షమించమనీ యవనకాంతను కోరాడు. ఆమెను తన తల్లిగా, చెల్లెలుగా భావించి, తన చేతులపై ఆమెను నడిపిస్తాననీ, ఓర్పు చూపించి, తనను సహించి క్షమించమనీ శివాజీ ఆమెను కోరాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లులుగా, తన సోదరీమణులయిన అక్కాచెల్లెండ్రుగా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తితో చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తారో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా చూడాలి.

ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సోదరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు . చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తికొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి, పోరాడాలి. అవసరం అయితే పోలీసులకు తెలియజేయాలి.

స్త్రీలు అందరూ మనకు తల్లులవంటివారు. స్త్రీలు, పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తారు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా, ఇంకొకరికి కన్నబిడ్డగా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. వారు అనల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే, వారి వంశమూ, సంపదలూ నశిస్తాయి. కాబట్టి స్త్రీలను దేవతామూర్తులవలె, మాతృమూర్తులవలె గౌరవించాలి.

ప్రశ్న 8.
నిజ జీవితంలో స్త్రీలను ఎప్పుడు ఎలా గౌరవించాలో వివరించుము.
జవాబు:
స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. స్త్రీలలో చిన్న పిల్లలను మనం ప్రేమగా చూడాలి. బాలికలను మనం కన్నబిడ్డల వలె ఆదరించాలి. తోడి బాలికలను మన స్వంత అక్కాచెల్లెళ్ళ వలె ప్రేమతో ఆదరంగా చూడాలి. మనకంటే పెద్దవారైన ఆడవారిని, మన కన్నతల్లులుగా చూసి గౌరవించాలి..

సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న స్త్రీలను దేవతా మూర్తులుగా గౌరవించాలి. ప్రహ్లాదుడు పరస్త్రీలను మాతృమూర్తులుగా భావించి గౌరవించేవాడు. స్త్రీలు ఆపదలో ఉంటే, మన శక్తియుక్తులను అన్నింటినీ ధారపోసి, వారికి మనం సహాయం చెయ్యాలి. మన బడిలో మనతో చదువుకొనే బాలికలను, మన చెల్లెళ్ళవలె వాత్సల్య భావంతో చూడాలి. వారికి కావలసిన సహాయం చేయాలి. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. స్త్రీలు శక్తి స్వరూపిణులు. స్త్రీల పట్ల సర్వకాల సర్వావస్థలలోనూ గౌరవమూ, ప్రేమ, వాత్సల్యమూ, ఆదరమూ కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవిస్తే సకల సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది. అన్ని విద్యలను సరస్వతి ఇస్తుంది.

10th Class Telugu 1st Lesson మాతృభావన Important Questions and Answers

ప్రశ్న 1.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

రాజమహేంద్రవరం,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీ లేఖ అందింది. సమాజంలోని స్త్రీల పట్ల మనం ఎలా నడచుకోవాలో ఈ లేఖలో నీకు రాస్తున్నా.

స్త్రీలు దేశ సౌభాగ్యానికి కల్పలతల వంటివారు. స్త్రీలు, కన్నబిడ్డలు, కన్నతల్లులుగా, సోదరీమణులుగా మనకు ప్రేమాదరములను పంచిపెడుతున్నారు. నేడు సంఘంలో స్త్రీల పట్ల అపచారాలు పెరుగుతున్నాయి. స్త్రీలపట్ల అపచారం చేసేవారిని నిర్భయ చట్టంతో శిక్షించాలి.

మనము తోటి స్త్రీలను మన అక్కాచెల్లెళ్ళుగా చూడాలి. మన తోటి చిన్నవారైన బాలికలను ప్రేమగా లాలనగా చూడాలి. పెద్దవారైన స్త్రీలను మన తల్లులవలె చూసి వారిని గౌరవించాలి. స్త్రీలను గౌరవిద్దాం. సంఘాన్ని కాపాడుదాం.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, మునిసిపల్ హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
స్త్రీలకు ధైర్యాన్ని పురికొల్పుతూ, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
సోదరీమణులారా ! ఈ రోజుల్లో మీ పై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ అరాచకాలను చూసి మీలో కొందరు పాఠశాలలు, కళాశాలలు మాని, ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. సంఘంలో స్త్రీలు కూడా పురుషులతో అన్ని విధాల సమం. దేశంలో మీరు ఇంచుమించుగా 50% మంది ఉన్నారు. మీరు నిర్భయంగా ముందుకు వచ్చి మీ స్నేహహస్తాన్ని అందించకపోతే, సంఘాభివృద్ధి కుంటుపడుతుంది.

మీరు నిర్భయంగా ముందుకు రండి. మీకు మేము తోడుగా ఉంటాం. పోలీసులు తోడుగా ఉంటారు. నిర్భయ చట్టం వచ్చింది. ఆకతాయి వారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫోటో కెమేరాలు వచ్చాయి. దుండగులు ఎంతటి వారైనా దొరుకుతారు. శిక్ష పడుతుంది. మీరు శక్తి స్వరూపిణులు. ధైర్యమే మీ ఆయుధం.

మేము మీకు రామదండులా తోడు ఉంటాము. నేరస్తులను పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెపుతాము. మేము అంతా మీ అన్నదమ్ముల్లా మీకు సాయం చేస్తాము. నిర్భయంగా మీరు సంఘంలో తిరిగి హాయిగా మీ చదువులు సాగించండి. దేశాభివృద్ధికి మీ చేయూత నివ్వండి. రండి. సాహసించండి.

ఇట్లు,
గాంధీ ‘యువజన సంఘం,
కాకినాడ.

ప్రశ్న 3.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తారు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డలను కని, వారిని చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్లలకూ కడుపు నింపుతుంది. బిడ్డలను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డలకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది.

దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికీ, కుటుంబ రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొదుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లులుగా, అక్కాచెల్లెళ్ళుగా గౌరవించాలి.

స్త్రీలు పిల్లలను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధులు నేర్పిస్తారు. పిల్లలకు, కన్నతల్లులే మొదటి గురువులు. స్త్రీలు విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, MLA లుగా, MP లుగా ముఖ్యమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు.

స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తున్నారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత నిస్తున్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధికైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
‘స్త్రీ గౌరవం’ అనే అంశంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీ గౌరవం,

‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారని అర్థం. కాబట్టి స్త్రీలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు అంటే లక్ష్మి, సరస్వతి, గాయత్రి, శివుడు, విష్ణువు మొదలైనవారు. వారంతా కొలువై ఉంటే డబ్బుకు, చదువుకు, ఆనందానికి, ఆరోగ్యానికి లోటుండదు.

మనకు జన్మనిచ్చిన స్త్రీని తల్లిలా పూజించాలి. గౌరవించాలి. తల్లి ఆలన పాలన చూడకపోతే శ్రీ రామచంద్రుడైనా లేడు కదా! 9 నెలలు తన కడుపులో మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లిఋణం తీర్చుకోవటం మగజన్మకు సాధ్యంకాదు. కాని సమాజంలోని ప్రతి స్త్రీలోను తల్లిని దర్శించడం ద్వారా కొంత ఋణం తీరుతుంది.

‘స్త్రీలను గౌరవించాలి. వారి మనసుకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. స్త్రీల మనసు సుకుమారమైనది. స్త్రీకి కోపం కలిగేలా ప్రవర్తిస్తే నాశనం తప్పదు. రావణుడు, దుర్యోధనుడు మొదలైనవారు అలాగే నశించారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు’ అన్నారు పెద్దలు. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరవు, కాటకాలు, దరిద్రం వస్తాయి.

అందుకే శివాజీ వంటి గొప్పవారు స్త్రీలను గౌరవించారు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చదివిన వారెవ్వరూ స్త్రీని బాధపెట్టే సాహసం చేయరు. ఇది భారతీయతత్వం.

ఇవేవీ నమ్మని వారు కూడా గుర్తుపెట్టుకోవలసినది మన చట్టాలు. చట్ట ప్రకారం స్త్రీని బాధిస్తే చాలా కఠిన శిక్షలకు గురి అవుతారు. సమాజంలో వెలివేయబడతారు. అందుచేత స్త్రీలను గౌరవించడమంటే మనను మనం గౌరవించుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్న 5.
స్త్రీల చైతన్యంపై 10 నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. అబలలన్నది పాతమాట – సబలలన్నది నేటిమాట
  2. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  3. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు – స్త్రీలు పూజ్యార్హలు
  4. ఆడది చదువుకుంటే – ఆ ఇంట్లో సంస్కారం ఉంటుంది
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానిస్తే – శ్రీదేవిని కాలదన్నినట్లే
  7. చదివిస్తే స్త్రీలు – నేర్వలేని విద్యలేదు
  8. ఆడవాళ్ళను – అగ్రస్థానంలో ఉంచండి
  9. మహిళలు – మన జాతి మాణిక్యాలు
  10. వనితలన్న – నీవు ఎపుడు తల్లి చెల్లిలాగ చూడు

ప్రశ్న 6.
“మహిళల రక్షణ మన కర్తవ్యం” అనే అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
(“మహిళల రక్షణ మన కర్తవ్యం “)

సోదర సోదరీ మణులారా ! చెప్పడానికి, సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ మన మహిళలకు అవమానం నిత్యం జరుగుతూనే ఉంది. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. యాసిడ్, దాడులు, ఈవ్ టీజింగ్లు, హింసాకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మన ఇంట్లో మన తల్లిని, అక్క చెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన ప్రక్క మహిళలను సైతం, మనమే రక్షించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే, లోకం సహించదు అనే విషయం దుర్మార్గులకు తెలియాలి.

మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీరు సహించకండి. ఉగ్రనరసింహరూపం ఎత్తి అన్యాయాన్ని అరికట్టండి. అవసరం అనుకుంటే ప్రక్కవారి సాయం తీసుకోండి. పోలీసుల సాయం కోరండి. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

మనం అంతా ఉద్యమిస్తేనే, మన మహిళకు రక్షణ దొరుకుతుంది. మనం మహిళలను గౌరవించి, మన పవిత్ర భారతమాత ఖ్యాతిని నిలుపుకుందాం. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

జైహింద్

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
మానవ జీవితాన్ని గురించిన విశ్లేషణను 8, 10 పంక్తులకు తగ్గని కవిత ద్వారా తెల్పండి.
జవాబు:
(“మనిషి మాయం అయ్యాడు” (కవిత) ,

“మాయమవుతున్నాడు మనిషన్నవాడు
మానవత్వమ్ము మరి మచ్చుకైనా లేదు
నూటికో కోటికో ఒక్కడున్నాడేమో
కంటికీ కనరాని కమలాక్షుడతడు” ||మాయ ||

“నిలువెత్తు స్వార్థమ్ము నిజాయితీ శూన్యమ్ము
అన్నదమ్ముల బంధ మావిరయ్యిందమ్మ
ఇరుగు పొరుగుల మైత్రి ఇగిరిపోయిందమ్మ
అవినీతి బంధాలు అతికించుకున్నాడు.
రూపాయి చుట్టునా ప్రదక్షిణం చేస్తాడు” ||మాయ ||

“చీమలకు పాములకు పంచదారా పాలు
తోడబుట్టిన వార్కి గంజైన పోయడు
మతము పేరున లోకహితము గుర్తుకు రాదు
ముసలి తల్లీతండ్రి విషము అయిపోతారు.
పెళ్ళాము బెల్లమ్ము అత్తమామలు ముద్దు
చెల్లితల్లీ లేదు చెడునడత వనీతన్న
మాయమయి పోయాడు మనిషన్నవాడు” ||మాయ ||

ప్రశ్న 8.
శివాజీకి, సోన్ దేవుడికి మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
శివాజీ : సోన్ దేవా ! ఏంటీ ! రాణివాసాన్ని బంధించి తెచ్చావా? హిందువు అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నా ఆజ్ఞ నీకు గుర్తులేదా? అర్థం కాలేదా? చావాలని అనుకుంటున్నావా? నీ గర్వాన్ని ఎంతమాత్రం
సహించను. తక్షణం వెళ్ళి వారి బంధాలు విడిపించి తీసుకురా! వెళ్ళు.

సోన్ దేవుడు : చిత్తం మహారాజా !

శివాజీ : వెంటనే వెళ్ళు

సోన్ దేవుడు : (అంతఃపుర కాంతను తీసుకువచ్చి) అయ్యా (ప్రభూ!) నన్ను క్షమించండి. విజయోత్సాహంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెడ్డ చేయాలనే ఆలోచన నాకులేదు. మీ ఆజ్ఞ అతిక్రమించాలనే సాహసం లేదు. మీ పాదాలపై ఒట్టు.

శివాజీ : సోన్ దేవా! తప్పు చేశావు. స్త్రీలను పూజించాలి. వారిని అవమానించకూడదు. నా సైన్యాధిపతులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సరేలే నీ మనస్సు నేను గ్రహించాను. నీలో తప్పులేదు. ఇక ముందు జాగ్రత్త. వెళ్ళు.

ప్రశ్న 9.
స్త్రీలను దేవతలుగా భావించి పూజించాలి’ అనే మాటలను సమర్ధించండి.
జవాబు:
గడియారం వేంకటశేష శాస్త్రిగారు చెప్పినట్లు స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు. అనసూయ పాతివ్రత్యంతో త్రిమూర్తులను పురుటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడింది. సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. సీతాదేవి పూలరాశిలో దూకినట్లు అగ్నిగుండంలో దూకింది. సుమతి తన భర్తను బ్రతికించుకోడం కోసం సూర్యోదయాన్ని నిలిపివేసింది.

స్త్రీలు అందరూ దేవతామూర్తులే. స్త్రీలను గౌరవించిన చోటనే దేవతలు విహరిస్తారని పెద్దలంటారు. స్త్రీలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులు. మనకు పాలిచ్చి పెంచే సహనమూర్తులు. వంటవండి మనకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టే దేవతలు. ఆ దేవతల వంటి స్త్రీలపై దౌర్జన్యాలు, మానభంగాలు చేయడం మహాపాపం.

స్త్రీలను గుడిలో దేవతామూర్తుల వలె పూజించాలి. గౌరవించాలి. స్త్రీలను తల్లులుగా, సోదరీమణులుగా, మాతృమూర్తులుగా గౌరవించాలి.

మనదేశంలో అరుంధతి, అనసూయ వంటి పతివ్రతలు ఎందరో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇందిర, దుర్గాబాయి, మీరాకుమారి, మహాజన్, సరోజినీనాయుడు, మాంటిసోరీ వంటి దేవతాస్వరూపిణులు ఎందరినో మనం చూస్తున్నాం.

ప్రశ్న 10.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’ సోదరులారా ! మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీ మూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోటి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళవంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది. జాగ్రత్త.

స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా భయంకరంగా శిక్షించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణ చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు,
x x x x.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 11.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసే వారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

ప్రశ్న 12.
స్త్రీలను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తూ పది సూక్తులు రాయండి.
జవాబు:

  1. స్త్రీలు అబలలు కాదు – సబలలు
  2. మహిళలు – మనజాతి మాణిక్యాలు
  3. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  4. స్త్రీలే జాతిరత్నాలు – స్త్రీలే ఆణిముత్యాలు
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానపరిస్తే – జాతిని అవమానపరిచినట్లే
  7. స్త్రీలను గౌరవిస్తే – దేవతలు ఆనందిస్తారు
  8. వనితలేని ఇల్లు – వనంతో సమానం
  9. స్త్రీ లక్ష్మీ స్వరూపిణి – స్త్రీ పూజ్యురాలు
  10. స్త్రీని గౌరవించు – మాతృమూర్తిగా ఆదరించు

10th Class Telugu 1st Lesson మాతృభావన 1 Mark Bits

1. వారు మదోన్మాదముతో ప్రవర్తించారు – గీత గీసిన పదంలో గల సంధి ఏది? (S.A. I – 2018-19, June – 17)
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) గుణసంధి

2. చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఛేకానుప్రాసం
D) వృత్యానుప్రాసం
జవాబు:
A) లాటానుప్రాసం

3. ధర్మసామ్యము చేత ఉపమేయమును ఉపమానంగా ఊహించుట – ఈ లక్షణం గల అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేష
జవాబు:
B) ఉత్ప్రేక్ష

4. అనసూయ పతివ్రతలలో శిరోమణి – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించుము. (March 2017)
A) మంచి అవయవములు గలది.
B) చిత్రమైన వర్ణములు గల మెడ గలది.
C) నీటియందు పుట్టినది.
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.
జవాబు:
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

5. పురాణ వాజ్మయమును చదివి అవగాహన చేసుకోవాలి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (March 2017)
A) యణాదేశ సంధి
B) వృద్ధి సంధి
C) జశ్వసంధి
D) అనునాసిక సంధి
జవాబు:
D) అనునాసిక సంధి

6. ‘స, భ, ర, న, మ, య, వ’ ఏ పద్యానికి చెందిన గణాలు? (March 2017)
A) శార్దూలం
B) మత్తేభం
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
B) మత్తేభం

7. జననికి, జన్మభూమికి గౌరవమివ్వడం ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) చెల్లి
B) తల్లి
C) నల్లి
D) వల్లి
జవాబు:
B) తల్లి

8. రాజులు యుద్ధములందు ఏనుగులను ఎక్కువగా ఉపయోగించేవారు – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (March 2018)
A) ఏడు
B) రోజు
C) టేడు
D) రాట్టు
జవాబు:
C) టేడు

9. వాన బాగా పడేసరికి ఇల్లు తడిసిన వస్త్రములతో నిండింది – గీత గీసిన పదాలకు నానార్థపదమును గుర్తించుము. (S.A. I – 2018-19, June – ’18)
A) వాసం
B) మోసం
C) సహవాసం
D) వేషం
జవాబు:
A) వాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

10. ఆ యేమీ యొక రాణివాసమును …….. అనే పద్యపాదంలో గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి. (June 2018)
A) మ గణం
B) త గణం
C) భ గణం
D) న గణం
జవాబు:
A) మ గణం

11. జాతి, గుణ, క్రియాదులను ఉన్నది ఉన్నట్లు వర్ణించినచో అది ఏ అలంకారమో గుర్తించండి. (S.A. I – 2018-19)
A) సమాసోక్తి
B) స్వభావోక్తి
C) శ్లేష
D) రూపకము
జవాబు:
B) స్వభావోక్తి

12. ఎప్పుడూ అమ్మను కష్టపెట్టకూడదు. (ప్రకృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంభ
B) అంబ
C) అమ్మమ్మ
D) అమ్మవారు
జవాబు:
B) అంబ

13. “అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడా యంభూ” ఏ పద్యపాదమో గుర్తించండి. (S.I. I – 2018-19)
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

14. చంపకమాల పద్యపాదంలో యతి స్థానం (S.A. I – 2018-19)
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

15. మాతా ! తప్పు సైరింపుమీ – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) తల్లీ ! తప్పును సైరింపకుము.
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !
C) తల్లీ ! ఈ దోషమును సైరింపుము.
D) తల్లీ ! అందరి దోషంబులు సైరింపుము.
జవాబు:
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

16. వనితా రత్నంబులీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018)
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.
B) స్త్రీలు ఈ హిందూ భూమిపై సంచరించే పుణ్యదేవతలు కారు.
C) స్త్రీ రత్నాలు హైందవ భూమిపై తిరిగే జంగమదేవతలా?
D) హిందూ భూమిపై తిరిగే స్త్రీలు పుణ్యదేవతలు కావచ్చును.
జవాబు:
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.

17. శివాజీ యవనదేశ స్త్రీని తల్లిగా భావించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2011)
A) శివాజీ యవన స్త్రీని తల్లిగా భావించలేదు.
B) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడలేదు.
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.
D) యవన దేశ స్త్రీ శివాజీ తల్లిగా భావించబడింది.
జవాబు:
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.

18. మా యాజ్ఞన్ గమనింపవో? (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) మా ఆజ్ఞని గమనింపవా?
B) మా యాజ్ఞ గమనింపవే?
C) మా యాజ్ఞను గమనింపుమా !
D) మా యాజ్ఞ గమనింపుడు !
జవాబు:
A) మా ఆజ్ఞని గమనింపవా?

19. క్రింది వానిలో ‘శత్రర్థకం’ గుర్తించండి.
A) విని
B) వినగలడు
C) వింటూ
D) వినక
జవాబు:
C) వింటూ

Leave a Comment