Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 3rd Poem నందీశ్వరుని శాపం Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 3rd Poem నందీశ్వరుని శాపం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కుబేరుడు రావణునకు చేసిన హితబోధను వివరించండి.
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. బ్రహ్మ వలన వరాలను పొందిన రావణుడు బల గర్వముతో జైత్రయాత్రలు చేశాడు. అన్ని లోకముల వారిని బాధలకు గురిచేస్తుండగా వాని దురాగతాలను చూసి రావణుని అన్న అయిన కుబేరుడు దూతను పంపి నీతిని బోధింపమన్నాడు. రావణుడు ఆ దూతను చంపి అలకాపురిపై అంటే కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. అపుడు కుబేరుడు రావణునకు హితమును బోధించాడు.
నాకు తమ్ముడవుకదా అని దూతను పంపి మంచిమాటలు చెప్పించాను. నామాటలు లెక్కచేయక నా దూతను చంపావు. నన్ను జయించుటకు రాక్షసమూకలతో వచ్చావు. నీకు బుద్దులు చెప్పాలని తలచిన నన్ను నేను నిందించుకోవాలి. రోగము వచ్చిన వానికి ఆహార పదార్థములు రోగమును పెంచినట్లు, కోపముతో ఉన్న నీవంటి వానికి మంచిమాటలు కోపమును మరింత పెంచాయి. ఈ మాటలు మృత్యువు నీ సమీపమునకు వచ్చినపుడుగాని గుర్తుకు రావులే అన్నాడు.
అన్నకు తండ్రికి గురువుకు హాని ఎవరు చేస్తారో, అటువంటి వానిని చూసిన వానికి మహా పాపము చుట్టుకుంటుంది. తనువు అస్థిరము. మృత్యువు ఎపుడూ మనకు దగ్గరగానే తిరుగుతుంటుంది. సంపదలు పుణ్యము చేయుట వలన మనకు దక్కుతాయి. ఈ విషయాలను గ్రహించి మసలుకొనేవాడు కృతార్థుడవుతాడు. మానవులు చంచల మనస్సుతో ఉండక ఏ పనులను చేస్తాడో దాని ఫలాన్ని అనుభవిస్తాడు. ఇది మంచిపని, ఇది చెడ్డపని అని ఆలోచించి చేసిన వానిని దేవతలు మెచ్చుకుంటారు. అపుడు ఆ మానవునకు సంపద, ఆరోగ్యము లభించి సుఖాలను అనుభవిస్తాడు.
ధనము, మణులు వస్తు వాహనములు, స్త్రీలు, ప్రజలు బలమని ధర్మమును ఆచరించకుండిన, దేవతలందరూ నా శత్రువులని తలచిన నిన్ను చూడటం వలన నాకు నరకము వస్తుంది. అని కుబేరుడు రావణునకు హితబోధ చేశాడు.
ప్రశ్న 2.
దశకంఠుడు మాయా యుద్ధములో ధనదుడ్డి గెలిచిన విధానాన్ని తెలుపండి.
జవాబు:
నందీశ్వరుని శాపము అని పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయా శ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ చేత వరాలను పొందిన రావణుడు లోకములన్నింటిలోని వారిని బాధలకు గురిచేస్తుండగా రావణుని అన్న అయిన కుబేరుడు అతనికి నీతులు చెప్పమని దూతని పంపాడు. రావణుడు కోపముతో ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు.
రావణుని మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, ధూమ్రాక్షులు కుబేరుని ముందు నిలువలేకపోవటం వలన రావణుడే స్వయంగా కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. రావణుడు వాడియైన బాణములను కుబేరునిపై ప్రయోగించాడు. కుబేరుడు కోపముతో గదాయుధమును చేపట్టి రావణుని పది తలలపై ఉన్న కిరీటములు కొట్టి సింహనాదం చేశాడు.
రావణుడు కోపించి వాడియైన బాణములు కుబేరుని వక్షస్థలంపై గుచ్చునట్లు ప్రయోగించాడు. అపుడు కుబేరుడు రావణునిపై ఆగ్నేయాస్త్రమును వేశాడు. దానికి విరుగుడుగా రావణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ కుబేరులు ఒకరికొకరు తీసిపోకుండా పోరాడు రెండు సింహములవలే యుద్ధము చేశారు. వారిద్దరి పోరాటమును చూసి దేవతలు పొగడ్తలతో ముంచెత్తారు.
అపుడు రావణుడు అష్ట సిద్ధులను పొందినవాడై మాయా యుద్ధమును చేయ ప్రారంభించాడు. ఒకసారి మేఘము వలే ఆకాశ మార్గమునుండి పిడుగులను కురిపించాడు. ఒకసారి సింహ రూపమును, ఒకసారి కొండ రూపమును మరొకసారి సముద్ర రూపమును, అలా పులి రూపమును, అడవిపంది రూపమును, హానికరమైన పాము రూపమును ధరించి యుద్ధము చేశాడు.
అలా మాయాయుద్ధము చేస్తూ రావణుడు గదను ధరించి కుబేరుని తలపై కొట్టాడు. ఆ దెబ్బకు కుబేరుడు పూచిన అశోక వృక్షము గాలికి కూలినట్లు రధముపై కూలాడు. ఆ విధంగా నేలకూలిన కుబేరుని రధమును, సారధి నందానదీ తీరమునకు తీసుకొని పోయాడు. రావణుడు మాయా యుద్ధమున గాని కుబేరుని గెలవలేకపోయాడు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పుష్పక విమాన విశేషాలేమిటి ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. పుష్పక విమానమును బ్రహ్మదేవుడు కుబేరునకు కానుకగా ఇచ్చాడు. ఆ విమానమును రావణుడు కుబేరుని యుద్ధములో జయించి తాను పొందాడు. అది వేలవేల బంగారు స్తంభములు కలిగి ఉన్నది. వైడూర్య తోరణముల సమూహములతో ముత్యాలతో చాందినీలు కలిగి ఉన్నది.
చంద్రకాంత శిలలతో వేదికలు, వజ్రాల సోపానాలు ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షములున్నాయి. మనోవేగాన్ని మించిన వేగం పుష్పక విమానానికున్నది. దానికి కోరిన చోటికి తీసుకుపోగల మహిమ ఉన్నది. కామరూపాన్ని ధరించి, మహిమ గల కాంతితో వెండి రంగులో ప్రకాశవంతంగా పుష్పక విమానమున్నది. ఎంతమంది ఎక్కినా, మరొకరికి చోటు ఉంటుందని పెద్దలన్నారు.
ప్రశ్న 2.
రావణుడు ఏ విధంగా కైలాసానికి వెళ్ళాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ నుండి వరాలను పొందిన రావణుడు గర్వముతో లోకములలోని వారినందరిని బాధించసాగాడు. అపుడు రావణుని అన్న కుబేరుడు అతనికి నీతిని చెప్పమని దూతను పంపాడు.
రావణుడు ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధం చేసి కుబేరుని ఓడించి అలకాపురం చేరి అక్కడున్న పుష్పకము తీసుకున్నాడు. రావణుడు ఆ పుష్పక విమానము ఎక్కి తన మంత్రి సామంతులైన మారీచ, దూమ్రాక్ష, ప్రవాస్త, శుక మొదలగు వారిని దానిలో ఎక్కించుకొని కైలాస పర్వతమును చేరుకున్నాడు. కైలాసమున ప్రవేశింపబోగా ఆ పుష్పకము కైలాస వాకిట పొగడచెట్టు నీడలో ఆగిపోయినది. కారణము తెలియక శివుని నిందించి నందీశ్వరునిచే శాపము పొందాడు.
ప్రశ్న 3.
నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు.
అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.
ప్రశ్న 4.
కంకంటి పాపరాజు రచనలను, కవితా శైలిని వివరించండి.
జవాబు:
కంకంటి పాపరాజు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరి పట్టణమునకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు. యోగ, గణితశాస్త్ర ప్రావీణ్యుడు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. “పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే యెట్టి వారికిన్” అని నమ్మినవాడు పాపరాజు.
వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా ఉత్తర రామాయణాన్ని వ్రాశాడు. ఇది ‘8’ ఆశ్వాసాల ప్రబంధం. రాజనీతిని ఈ కావ్యంలో చక్కగా వివరించాడు. ఉత్తర రామాయణంతో పాటుగా ఈయన “విష్ణు మాయా విలాసము” అని యక్షగానాన్ని రచించాడు. ఈ రెండింటిని మదనగోపాల స్వామికి అంకితం చేశాడు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నందీశ్వరుని శాపము రచించినదెవరు ?
జవాబు:
కంకంటి పాపరాజు.
ప్రశ్న 2.
నందీశ్వరుని శాపము ఏ గ్రంథం నుండి గ్రహించబడింది ?
జవాబు:
ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది.
ప్రశ్న 3.
కంకంటి పాపరాజు ఏ శతాబ్దమునకు చెందినవాడు ?
జవాబు:
17వ శతాబ్దమునకు చెందినవాడు.
ప్రశ్న 4.
ఉత్తర రామాయణము ఏ ప్రక్రియకు సంబంధించిన గ్రంథం ?
జవాబు:
ప్రబంధ ప్రక్రియలో వ్రాయబడిన గ్రంథము.
ప్రశ్న 5.
ఉత్తర రామాయణమునకు మూలమేది ?
జవాబు:
వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండ.
ప్రశ్న 6.
కంకంటి పాపరాజు తల్లిదండ్రులు ఎవరు ?
జవాబు:
నరసమాంబ, అప్పయ్య మంత్రి.
ప్రశ్న 7.
పాపరాజు ఏఏ శాస్త్రములలో ప్రావీణ్యం సంపాదించాడు ?
జవాబు:
యోగ, గణితశాస్త్రములలో.
ప్రశ్న 8.
“పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదె యెట్టి వారికిన్” అన్నది ఎవరు ?
జవాబు:
కంకంటి పాపరాజు.
ప్రశ్న 9.
ఉత్తర రామాయణము ఎన్ని ఆశ్వాసముల గ్రంథము ?
జవాబు:
ఎనిమిది(8) ఆశ్వాసాల గ్రంథము.
ప్రశ్న 10.
ఉత్తర రామాయణంలో పాపరాజు చెప్పిన నీతి ఏది ?
జవాబు:
రాజనీతి.
ప్రశ్న 11.
కంకంటి పాపరాజు రచించిన గ్రంథము లేవి ?
జవాబు:
ఉత్తర రామాయణము, విష్ణు మాయావిలాసము (యక్షగానం).
ప్రశ్న 12.
పాపరాజు వ్రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణు మాయావిలాసం.
ప్రశ్న 13.
పాపరాజు తన రచనలను ఎవరికి అంకితం చేశాడు ?
జవాబు:
తనకు ఇష్ట దైవమైన మదనగోపాలునికి అంకితం చేశాడు.
ప్రశ్న 14.
కుబేరుని పట్టణం పేరేమిటి ?
జవాబు:
అలకాపురం.
ప్రశ్న 15.
రావణుడు మాయాయుద్ధం ఎవరితో చేశాడు ?
జవాబు:
కుబేరునితో.
ప్రశ్న 16.
నంది ఎవరి వాహనం ?
జవాబు:
శివుని వాహనం.
ప్రశ్న 17.
పౌలస్త్యుడెవరు ?
జవాబు:
రావణాసురుడు.
ప్రశ్న 18.
రావణుడు అలకానగరంలో పొందినదేది ?
జవాబు:
పుష్పకవిమానం.
ప్రశ్న 19.
పుష్పక విమానాన్ని ఎవరు ఎవరికి ఇచ్చారు ?
జవాబు:
బ్రహ్మ కుబేరునకు ఇచ్చాడు.
ప్రశ్న 20.
పుష్పక విమానమెక్కి రావణుడు ఎక్కడకు వెళ్ళాడు ?
జవాబు:
కైలాసమునకు.
ప్రశ్న 21.
రావణునకు బుద్ధులు చెప్పినది ఎవరు ?
జవాబు:
కుబేరుని దూత.
ప్రశ్న 22.
రావణుని మంత్రి సామంతులెవరు ?
జవాబు:
మారీచుడు, ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు, శుకుడు.
ప్రశ్న 23.
అనిమిషులంటే ఎవరు ?
జవాబు:
దేవతలు.
ప్రశ్న 24.
దశాననుండెవరు ?
జవాబు:
పది ముఖములు కలవాడు రావణుడు.
ప్రశ్న 25.
రావణుడు ఎవరి కోరికపై పుష్పకమును సాధించాడు ?
జవాబు:
తల్లి కోరికపై.
ప్రశ్న 26.
హరుడు అంటే ఎవరు ?
జవాబు:
శివుడు.
ప్రశ్న 27.
రావణుడు ఏ యుద్ధమున కుబేరుని జయించగలిగాడు ?
జవాబు:
మాయా యుద్ధము వలన.
ప్రశ్న 28.
ధనదుడంటే ఎవరు ?
జవాబు:
కుబేరుడు.
ప్రశ్న 29.
ఆజతనూజుడెవరు ?
జవాబు:
బ్రహ్మ కుమారుడైన నారదుడు.
ప్రశ్న 30.
రెండారు చేతల రేడు ఎవరు ?
జవాబు:
కుమారస్వామి.
ప్రశ్న 31.
రజనీచరులంటే ఎవరు ?
జవాబు:
రజనీ అంటే చీకటి. చీకటిలో నడిచేవారు రాక్షసులని అర్థం.
ప్రశ్న 32.
ఈ కథలో ఎవరు ఎవరిని శపించారు ?
జవాబు:
నందీశ్వరుడు రావణుని శపించాడు.
ప్రశ్న 33.
నందీశ్వరుడు రావణుని ఏమని శపించాడు ?
జవాబు:
నా వలే కోతి ముఖములు గలిగిన వానరముల వలన నీ రాక్షస వంశం నాశనం అవుతుందని శపించాడు.
ప్రశ్న 34.
పుష్పకము ఎక్కడ ఆగిపోయింది ?
జవాబు:
కైలాసం ముందున్న పొగడచెట్టు నీడన ఆగింది.
ప్రశ్న 35.
మానసజవంబు అంటే ఏమిటి ?
జవాబు:
మనోవేగమని అర్థం.
సందర్శ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
ధర్మము వహించు జనుండు కృతార్థుఁడెయ్యెడన్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
కుబేరుడు రావణునకు నీతులు చెప్తున్న సందర్భంలోనిది.
భావం :
అన్నకు, తండ్రికి, గురువుకు ద్రోహము చేసిన వాని ముఖము చూసిన మహా పాపములు వస్తాయి. శరీరము అశాశ్వతము. సంపదలు పుణ్యముల వలన వస్తాయి. కావున ధర్మమును ఆచరించువాడు కృతార్థుడని ఇందలి భావం.
ప్రశ్న 2.
మార్కొని నిలువగ లేక చనిరి కోచతనమునన్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
రావణుని అనుచరులు యుద్ధమునందు కుబేరుని ధాటికి ఆగలేక పారిపోయారని చెప్పిన సందర్భంలోనిది.
భావము :
తమ రాజైన రావణుని తిట్టినాడని మారీచ ప్రహస్తాదులు కుబేరునితో యుద్ధమున అతని ధాటికి ఆగలేక పారిపోయారని ఇందలి భావం.
ప్రశ్న 3.
ఇద్దరిద్దరయి శౌర్య స్ఫూర్తి బోరాడగన్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
రావణ కుబేరులు యుద్ధమును కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము :
రావణ కుబేరులు ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధము చేయునపుడు వింటినారి ధ్వనులు వ్యాపించాయి. రెండు సింహములు పోరాడుతున్నట్లు ఇద్దరికిద్దరే అన్నట్లు శౌర్యముతో పోరాడారని ఇందలి భావం.
ప్రశ్న 4.
ప్రమథ వర్యులకివి రచ్చపట్టు లేమొ !
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
కైలాస శిఖర సమూహములను కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము :
కైలాస పర్వత సమూహాలు మొక్కల గుబురులతోను, కలువపూల కొలనుల తోను, కల్పవృక్షములతోను, బిల్వ రుద్రాక్ష వృక్షములతోను నిండియున్నాయి. శివుడు ఇక్కడ తాండవం ఆడతాడు. ఈ ప్రాంతం ప్రమథ గణాలకు నెలవులు అని ఇందలి భావం .
ప్రశ్న 5.
బరికించి దశాననుండు పకపక నగియెన్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
రావణుడు నందీశ్వరుని చూసి నవ్విన సందర్భంలోనిది.
భావము :
నందీశ్వరుడు పెద్దదయిన శూలమును చేతితో పట్టుకొని అపర శివునివలే వానర ముఖముతో ఉన్నాడు. రావణుడు శివుని నిందించినందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. రావణుడు నందీశ్వరుని రూపమును చూసి పకపక నవ్వాడని ఇందలి భావం.
ప్రశ్న 6.
కపులిఁక నీఁ కులంబడపఁ గళైదరంతటఁ గండ గర్వమున్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
నందీశ్వరుడు రావణుని శపించిన సందర్భంలోనిది.
భావము :
వానర ముఖముతోనున్న నన్ను చూసి అవమానించావు. అదే ముఖముతో నున్న వానరులు వారి గోళ్ళను ఆయుధములుగా చేసుకొని నిన్ను, నీ కులమును నాశనం చేస్తారు అని నందీశ్వరుడు రావణుని శపించాడని ఇందలి భావం.
ప్రశ్న 7.
కటతటమదరగా నిట్టులనియె.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
నందీశ్వరుని చూసి రావణుడు పకపక నవ్విన సందర్భంలోనిది.
భావము :
తనని చూసి నవ్వుతున్న రావణుని చూసి అపర శివునివలే ఉన్న నందీశ్వరుడు కనురెప్పలదరగా కోపంతో శపించ పూనుకున్నాడని ఇందలిభావం.
ప్రశ్న 8.
పై నెక్కి యతడు తారాద్రికరిగి.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం :
రావణుడు కుబేరుని జయించి పుష్పకమును స్వాధీనం చేసుకొని కైలాసమునకు ప్రయాణమయిన సందర్భంలోనిది.
భావము :
రావణుడు కుబేరుని పుష్పకాన్ని చూశాడు. మనోవేగము కలిగి, కల్పవృక్షములు కలిగి రత్నమణిమయములతో బంగారు స్తంబములు కలిగిన పుష్పకాన్ని తన సొంతం చేసుకొని దానిపై కూర్చొని కైలాసమువైపు బయలుదేరాడని ఇందలి భావం.
సంధులు
1. గుణ సంధి సూత్రం :
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు వచ్చును. ఏ, ఓ, అర్లను గుణములంటారు.
ఉదా :
- హితోక్తులు – హిత + ఉక్తులు – గుణ సంధి
- మహర్షి = మహా + ఋషి = గుణ సంధి
- దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు = గుణ సంధి
- శుభోదయము = శుభ + ఉదయము = గుణ సంధి
- మహోగ్ర : మహా + ఉగ్ర = గుణ సంధి
2. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వానికి దీర్ఘములు ఏకాదేశమగును.
ఉదా :
- తారాద్రి – తార + అది . : సవర్ణ దీర్ఘ సంధి
- కవీంద్ర – కవి + ఇంద్ర = సవర్ణ దీర్ఘ సంధి
- భూనూదయము – భాను + ఉదయము = సవర్ణ దీర్ఘ సంధి
- పితృణము – పితృ + ఋణము – సవర్ణ దీర్ఘ సంధి
- కృతార్థుడు – కృత + అర్థుడు . సవర్ణ దీర్ఘ సంధి
3. యడాగమ సంధి సూత్రం :
సంధిలేని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
- రోదసియెల్ల = రోదసి + ఎల్ల : యడాగమ సంధి
- నీ యనుజులు = నీ + అనుజులు = యడాగమ సంధి
4. గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వలు బహుళముగానగు.
ఉదా :
- నగరంబు సొచ్చి = నగరంబు + చొచ్చి – గసడదవాదేశ సంధి
- అట్లు గావున = అట్లు + కావున = గసడదవాదేశ సంధి
- నీవుడక్కరివి = నీవు + టక్కరివి = గసడదవాదేశ సంధి
- బలివెట్టి = బటి + పెట్టి = గసడదవాదేశ సంధి
5. యణాదేశ సంధి సూత్రములు :
- ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, ర, వ, లు వచ్చును. య, వ, ర లను యజ్ఞులు అంటారు.
- ఇ, ఉ, ఋలకు అసవర్ణమైన అచ్చులు పరమగునపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశముగా వచ్చును.
ఉదా :
- ఆద్యనిమిషులు = ఆది + అనిమిషులు = యణాదేశ సంధి
- అత్యంత : అతి ‘ + అంత = యణాదేశ సంధి
- మధ్వరి – మధు + అరి = యణాదేశ సంధి
- పిత్రంశ = పితృ + అంశ = యణాదేశ సంధి
- వహ్న్యస్త్రము – వహ్ని + అస్త్రము = యణాదేశ సంధి
- ప్రత్యక్షము = ప్రతి + అక్షము = యణాదేశ సంధి
- అణ్వస్త్రము – అణు + అస్త్రము = యణాదేశ సంధి
- పిత్రార్జితము = పితృ + ఆర్జితము = యణాదేశ సంధి
సమాసాలు
1. భక్ష్య భోజ్యములు – భక్ష్యములును, భోజ్యములును – ద్వంద్వ సమాసం
2. పాపఫలము – పాపము యొక్క ఫలము – షష్ఠీ తత్పురుష సమాసం
3. దశాననుండు – పదిముఖములు గలవాడు రావణుడు – బహుప్రీహి సమాసం
4. యక్షరాక్షసులు – యక్షులును, రాక్షసులును – ద్వంద్వ సమాసం
5. రజనీ చరులు – చీకటినందు సంచరించువారు రాక్షసులు – సప్తమీ తత్పురుష సమాసం
6. రౌరవ బాధలు – రౌరవమునందలి బాధలు – సప్తమీ తత్పురుష సమాసం
7. ధనాధిపుడు – ధనము చేత అధిపుడు – తృతీయా తత్పురుష సమాసం
8. ఉగ్రశరంబు – ఉగ్రమైన శరంబు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
9. కొత్తనెత్తురు – కొత్తదైన నెత్తురు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
10. రాక్షసాధముడు – అధముడైన రాక్షసుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
11. దశకంఠుడు – పది తలలుగలవాడు రావణుడు – బహుబ్లిహి సమాసం
12. చిమ్మచీకటి – గాఢమైన చీకటి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అర్థ తాత్పర్యములు
ప్రశ్న 1.
తమ్ముఁడవంచు నీ కొకహితం బెఱిఁగింపఁగ దూతఁ బంచినన్
వమ్మొనరించి నాపలుకు వానిని జంపి ననున్ జయింపరే
ద్రిమ్మరి గుంపుతోడ నరు దెంచితి నిన్నన నేల నీకు డెం
దమ్మున మేలు గాఁ దలఁచు నన్నె యనన్ దగుఁగాక దుర్మతీ !
జవాబు:
ప్రతిపదార్థం :
దుర్మతీ = చెడ్డబుద్ధి గల ఓ రావణ !
తమ్ముడవంచు = తమ్ముడవని
నీకున్ + ఒక = నీకొక
హితంబు = మంచిని
ఎఱింగింపగన్ = తెలియజేయుటకు
దూతన్ = దూతను
పంచినన్ = పంపితిని
నా పలుకు = నా మాటలు వినక
వమ్మున్ + ఒనరించి = మోసము చేసి
వానిన్ + చంపి = దూతను చంపి
ననున్ = నన్ను
జయింపరే = జయించుటకు
త్రిమ్మరి = వ్యముగా తిరిగెడు
గుంపుతోడన్ = సమూహముతో
అరుదెంచితివి = ఇక్కడికి వచ్చితివి
నిన్నున్ = నిన్ను
అనుట + ఏల = అనుట అనవసరము
నీకున్ = నీకు
డెందమ్మున = మనస్సులో
మేలు = మంచిని
కాద్రలచు = చేయవలెననుకొనుట
నన్నె = నన్నే
అనన్ = అనుకోవలెను (నిందించుకోవలెను)
తగన్ + కాక = అదే సరియైనది .
తాత్పర్యం :
ఓ రావణా ! మనమిద్దరము అన్నదమ్ములము. నీకు మేలు కలుగవలెనని నా దూత ద్వారా మంచి మాటలను నా మాటగ చెప్పి పంపించితిని. నా మాటను పెడచెవిని పెట్టితివి. దూతను వధించితివి. నన్ను జయించుటకై త్రిమ్మరి గుంపుతో వచ్చితివి. నిన్ను అనుట ఎందుకు ? నీకు మంచి కలుగవలెనని నా మనస్సులో అనుకొనుట నేను చేసిన తప్పు అని కుబేరుడు తనను తానే నిందించుకున్నాడు.
ప్రశ్న 2.
రోగికి భక్ష్యభోజ్యముల రోగము హెచ్చుగతిన్ బటు క్రుధా
యోగికి నీకు మాదృశ హితోక్తులఁ గ్రోధము మించు మాటికిన్
నీ గుణచర్య లేటికివి నింద యొనర్పఁగ నీకె తెల్లమౌ
రాఁగల మృత్యువుం బొరసి రౌరవబాధలఁ బొందుచున్నెడన్.
జవాబు:
ప్రతిపదార్థం :
రోగికి = రోగముతో ఉన్నవానికి
భక్ష్యభోజ్యముల = తినదగిన భోజన పదార్థముల వలన
రోగము హెచ్చుగతిన్ = రోగము అధికమగునట్లుగా
పటు = మిక్కిలి
క్రుధాయోగికిన్ = క్రూరత్వము కల్గిన
నీకు = నీ వంటి వారికి
మాదృశ = మా వంటివారి
హిత + ఉక్తులన్ = మేలు కల్గించే మాటల వలన
క్రోధము = కోపము
మాటికిన్ = మాటిమాటికిన్
మించున్ = అధికమగును
నీ గుణ = నీ గుణమునకు
చర్యలు = తగిన పనులు
నిందయొనర్పగన్ = నిందించుట
ఏటికిని = ఎందులకు
రాగల = రాబోవు
మృత్యువున్ = మృత్యువు
పొరసి = ప్రవేశించునపుడు
రౌరవబాధలన్ = రౌరవాది నరక బాధలను
పొందుచున్నెడన్ = పొందుచున్నప్పుడు
నీకే = నీకే
తెల్లము + ఔ = స్పష్టమగును
తాత్పర్యము :
రోగికి భోజన పదార్థముల వలన రోగము అధికమగును. అట్లే క్రూరుడవైన నీకు మా వంటి వారి మాటలు రుచించవు. పైగా క్రోధము అధికమగును. కాబట్టి నిన్ను నిందించి ప్రయోజనం లేదు. మృత్యువు వాటిల్లినప్పుడు రౌరవాది నరక బాధలు పొందునపుడు, నీకు ఏది హితమో తెలియును.
ప్రశ్న 3.
ఆపద లావహించు దురహంకృతి నీగతి మూర్యుండుగపుం
బాపము లాచరించి విష పాన మొనర్చి శరీర మంతయున్
వ్యాపక మైనఁ జింతలు జడాత్మువలెన్ యమపాశ అధ్ధుండై
పాప ఫలంబుఁ జెందు నెడఁ బాపముఁ జేసితి నంచు వందురున్.
జవాబు:
ప్రతిపదార్థం
ఆపదలు = కష్టాలు
ఆవహించు = కలిగేటప్పుడు
దురహంకృతిన్ = అహంకారంతో చేసెడి పనులు
మూర్ఖుడు = మూర్ఖుడు
ఉగ్రము = భయంకరమైన
పాపములు = చెడ్డపనులు
ఈగతిన్ = ఈ విధముగా
ఆచరించి = చేసి
విష పానమున్ = విషము త్రాగుట వలన
ఒనర్చి = దాని ప్రభావం
శరీరమంతయున్ = దేహమంతా
వ్యాపకమైనన్ = వ్యాపించినప్పుడు
చింతిలు = బాధపడు
జడ + ఆత్ముని వలె = మూర్చుని వలె
యమ = యమునిచే
పాశబద్ధుడై = కట్టబడినవాడై
పాప ఫలంబున్ = చేసిన పాప ఫలితము
చెందున్ = అనుభవించు
ఎడన్ = సమయమున
పాపమున్ = దుష్కార్యములు
చేసితినంచు = చేసితిని అనుచు
వందురున్ = బాధపడును
తాత్పర్యము :
దుర్మార్గుడు కఠినమైన పాపములను చేస్తాడు. విష పానము చేసినవాడు, శరీరమంతా ఆ విషము వ్యాపించినపుడు గాని బాధ చెందడు. అప్పుడు చింతించిన ప్రయోజనముండదు. అయ్యో ! ఎంత పాపము చేశానో అని అప్పుడు బాధపడతావు అని కుబేరుడు రావణునితో అన్నాడు.
ప్రశ్న 4.
అన్నకుఁ దండ్రికిస్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
ల్గొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అన్నకున్ = అన్నకు
తండ్రికిన్ = కన్నతండ్రికి
గురువునకున్ = విద్య బోధించే గురువునకు
ఎవ్వడున్ = ఎవరైతే
ఆపద = కష్టాలు, అపకారము
ఒనర్చు = కలిగించునో
వానిన్ = అటువంటి వారిని
కల్గొన్న = చూచినట్లయితే
మహా + ఉగ్ర = గొప్ప భయంకరమైన
పాతకము = పాపము
అగున్ = కలుగుతుంది
తనువు = ఈ శరీరము
అస్థిరము = స్థిరముగా నిలుచునది కాదు
ఎప్పుడున్ = ఎల్లప్పుడు
మృత్యువు = మరణము
సన్నిహిత = సమీపమున
స్థితిన్ మెలగు = పొంచియుండును
సంపద = భోగభాగ్యములనుభవించుట
పుణ్యవశంబు = పూర్వ పుణ్యము వల్లనే కలుగును
అటంచున్ = అని
లోన్ = మనస్సులో
ఇన్నియున్ = ఇహ పరములందు కలుగు సుఖములు
ఎంచి = ఆలోచించుకొని
ధర్మము = సన్మార్గమున
వహించు = నడచుకొన్న
జనుండు = మానవుడే
కృతార్థుడు + అయ్యెడన్ = కృతార్థుడౌతాడు
తాత్పర్యము :
అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.
ప్రశ్న 5.
కలఁగక బుద్ధి పూర్వకముగా జనుఁ దేక్రియం జేయుఁ దల్జియా
ఫల మనుభూతిగా నిది శుభంబశుభం బిది యంచు రెంటినిన్
దెలిసి సుకర్మమున్ సలుప దేవతలందజు మెత్తు రందునన్
గలిమియు జెల్మి యిచ్చటనె కల్లు సుఖంబె లభించు నచ్చటన్. –
జవాబు:
ప్రతిపదార్థం :
కలగక = సంక్షోభము లేకుండా
బుద్ది పూర్వకముగా = వివేకముతో
జనుడు = మానవుడు
ఏ క్రియన్ = ఏ పనిని
చేయున్ = చేయునో
తత్ + క్రియా = ఆ పని యొక్క
ఫలము = ఫలితము
అనుభూతిగా = అనుభవించునదిగా లభిస్తుంది
శుభంబు = హితమైనది
అశుభంబు = హితము కానిది
ఇది + అంచు = ఇది అని
రెంటినిన్ = రెండింటిని
తెలిసి = తెలుసుకొని
సుకర్మమున్ = మంచిపనులు
సలుప = చేసినచో
దేవతలు = దేవతలు
అందఱు + మెత్తురు = అందరు మెచ్చుకుంటారు
అందునన్ = అందువలన
కలిమియున్ = సంపదలు
బల్మి = బలము
ఇచ్చట = ఈ లోకమున
కల్గు = కలుగుతాయి
అచ్చటన్ = పరలోకమున (స్వర్గములో)
సుఖంబె = సుఖము
లభించు = లభిస్తుంది
తాత్పర్యము :
కలత చెందకుండా వివేకముతో మానవుడు ఏ పనిని చేయునో ఆ పని యొక్క ఫలితమే అనుభవిస్తాడు. ఏది మంచో ఏది చెడో రెండింటిని తెలుసుకొని మంచి పనులు చేసినచో దేవతలు అందరూ మెచ్చుకుంటారు. కలిమి బలిమి ఈ లోకములో లభిస్తాయి. స్వర్గములో సుఖము లభిస్తుంది.
ప్రశ్న 6.
ధన మణి వస్తు వాహ వనితా జనతాదులు బల్ని సంతరించుకుంది
చిన యవి యంచు ధర్మములు సేయక యుండిన నేమి యంచు న
య్యనిమిషు లందున్ బగతురంచు మహాపదలొంద నున్నని
న్ననుజుండ నన్నం గల్గు నిరయంబు రయంబున రమ్ము పోరికన్.
జవాబు:
ప్రతిపదార్థము :
ధన మణి = ధనము, మణి మాణిక్యములు
వస్తు, వాహ = వస్తువులు, వాహనములు
జనతాదులు = జన సమూహము వలన
బల్మి = బలము
సంతరించినయవి = చేకూరినవి అని
అంచు = అనుకొని
ధర్మములు = న్యాయము
చేయక = చేయకుండా
ఉండిన = బతికిన
ఏమి + అంచు = ఏమి ఫలము
ఆ + అనిమిషులు = ఆ దేవతలు
అందఱున్ = అందరు
పగతురు + అంచు – శత్రువులే అని
మహా + ఆపదలు = గొప్ప ఆపదలు
ఒందన్ + ఉన్న = పొందే
నిన్ను = నిన్ను
అనుజడన్ + అన్న = తమ్ముడవు అని అనుకుంటే
నిరయంబు = నరకము
కల్గు = ప్రాప్తిస్తుంది
రయంబున = వేగముగా
పోరికిన్ = యుద్ధానికి
రమ్ము = రమ్ము
తాత్పర్యం :
ధనమును, మణులను, వస్తు వాహనములను, స్త్రీలను, ప్రజలను తనకు బలమిస్తాయని ధర్మమును చేయకుండా ఉన్నా ఏమౌతుందిలే అనుకొనిన, దేవతలందరూ తనకు పగవారిగా, భావించినా నీవు మహా ఆపదలను పొందుతావు. అటువంటి నిన్ను నేను చూస్తే నాకు నరకము వస్తుంది. వెంటనే నిన్ను వధించవలసి ఉంది. నాతో యుద్ధానికి రమ్మని కుబేరుడు రావణునితో అన్నాడు.
ప్రశ్న 7.
అని తమదొర దూలెడు ధన
దుని మారీచ ప్రహస్త ధూమ్రాక్ష శుకా
ద్యనిమిషరిపు మంత్రులు మా
ర్కొని నిలువఁగ లేక చనిరి కోంచతనమునన్.
జవాబు:
ప్రతిపదార్థము :
అనిన్ = యుద్ధమున
తమదొర = తమ దొర అయిన రావణుని
దూబెడు = దూషించెడు
ధనదుని = కుబేరుని ముందు
అనిమిషరిపుమంత్రులు = రాక్షస మంత్రులైన
మారీచ = మారీచుడు
ప్రహస్త = ప్రహస్తుడు
ధూమ్రాక్ష = ధూమ్రాక్షుడు మొదలగు వారు
మార్కొని = ఎదిరించి
నిలువగలేక = నిలువలేక
కోచతనమున్ = పిరికితనముతో
చనిరి = వెళ్ళిరి
తాత్పర్యము :
యుద్ధ రంగమున రావణుని దూషించెడి కుబేరుని ముందు రాక్షస మంత్రులైన మారీచ, ప్రహస్త, ధూమ్రాక్షాదులు నిలువలేక పిరికితనముతో పారిపోయారు.
ప్రశ్న 8.
అని నిటులాత్మ మంత్రులు ధనాధిపుకోలల కోర్వలేమి న
ద్దనుజవరేణ్యుం దుగ్రనిశిత ప్రదరంబుల వాని ముంచినన్
గనలుచు దాసి కిన్నర శిఖామణి వాని కిరీట పంక్తి ఖం
గున రొద సేయ భూరిగదఁ గైకొని బెట్టుగ మోంది మార్చినన్.
జవాబు:
ప్రతిపదార్ధము :
అనిన్ = యుద్ధరంగమున
ఇటులు = ఈ విధముగ
ఆత్మమంత్రులు = రావణుని మంత్రులు
ధనాదిపు = కుబేరుని
కోలలకు = బాణంబులకు
ఓర్వలేమి = తట్టుకొనలేక
ఆ + దనుజవరేణ్యుడు = ఆ రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు
ఉగ్ర = భయంకరమైన
నిశిత = వాడియైన
ప్రదరంబులన్ = బాణములచే
వానిన్ = ఆ కుబేరుని
ముంచినన్ = ముంచివేయగా
కనలుచు = కోపించి
డాసి = సమీపించి
కిన్నెర శిఖామణి = కుబేరుడు
కిరీట పంక్తి = కిరీటముల వరుసను
భూరి గదన్ = పెద్ద గదతోను
కైకొని = తీసుకొని
బెట్టుగా = గట్టిగా
మోది = కొట్టి
ఆర్చినన్ = అరచెను
తాత్పర్యం :
రావణుడు తన మంత్రులు కుబేరుని ధాటికి నిలువలేకపోవుట తెలుసుకొని భయంకరమైన బాణముల సమూహములతో అతనిని ముంచేశాడు. కుబేరుడు కూడా కోపంతో రావణుని కిరీటములన్నియు ఖంగుమని శబ్దం వచ్చునట్లు పెద్ద గదతో కొట్టాడు .
ప్రశ్న 9.
కడుఁ గోపించి దశాననుం డతని వక్షః పీఠమున్ జొచ్చి పో
యెడునట్లుగ శరంబు వేయుటయు యక్షేశుండు ధీరత్వ మే
ర్పడఁ గోదండ గుణారవంబఖిల దిగ్భాగంబులన్ నిండ న
ప్పుడు వహ్న్యస్తము వైవ వా ఁ డడంచెనంభోబాణ.వేగంబునన్.
జవాబు:
ప్రతిపదార్ధం :
దశాననుండు = పదితలల రావణాసురుడు
కడున్ = మిక్కిలి
కోపించి = కోపంతో
అతని = ఆ కుబేరుని
వక్షః పీఠమున్ = వక్షస్థలమున
చొచ్చి = ప్రవేశించి, చీలి
పోయెడునట్లు = పోయే విధముగ
ఉగ్రశరంబు = భయంకరమైన బాణము
వేయుటయు = వేయగా
యక్షేశుండు = కుబేరుడు
ధీరత్వము = ధైర్యము
ఏర్పడగ = చూపెట్టెడి
కోదండ = వింటి
గుణారవంబు = నారిధ్వని
అఖిల దిగ్భాగంబులన్ = అన్ని దిక్కుల భాగములందు
నిండన్ = ప్రతిధ్వనించగా
అప్పుడు = ఆ సమయంలో
వహ్ని + అస్త్రము = ఆగ్నేయాస్త్రము
వైవ = ప్రయోగించగా
అంభోబాణ = వారుణాస్త్రముతో
వేగంబునన్ = వెనువెంటనే
వాడన్ = రావణుడు దానిని
అడచెన్ = అణచెను
తాత్పర్యము :
రావణాసురుడు మిక్కిలి కోపముతో కుబేరుని వక్షస్థలము చీలి పోవునట్లుగ వాడియైన బాణములు వేయగా కుబేరుడు ధీరత్వముతో వింటినారి ధ్వని అన్ని దిక్కులా ప్రతిధ్వనింపచేయుచూ ఆగ్నేయాస్త్రము వేసెను. దానిని రావణుడు వారుణాస్త్రముతో వెంటనే అణచివేసెను.
ప్రశ్న 10.
శర సంధాన దృథాపకర్షణకృతుల్ జ్యా ఘోషణంబుల్ పర
స్పర ధిక్కారములొక్క చందమున మించన్ విశ్రవఃపుత్రు లి
ర్వురుఁ గొన్నెత్తుటఁ దోఁగుచున్ గెరలుచున్ రోషించుచున్ డాయుచున్
హరియుగ్మం బన నిద్దిద్దబయి శౌర్యస్ఫూర్తిఁ బోరాడఁగన్
జవాబు:
ప్రతిపదార్థం :
విశ్రవః పుత్రులు + ఇర్వురున్ = విశ్రవసుని పుత్రులు ఇద్దరూ
క్రొత్త + నెత్తుటన్ = క్రొత్త రక్తముతో
తోగుచున్ = మునుగుచూ
కెరలుచున్ = అతిశయించుచు
రోషించుచున్ = కోపించుచు
డాయుచున్ = సమీపిస్తూ
హరి = సింహముల
యుగ్మంబు = జంటయో
అనన్ = అన్నట్లు
ఇద్దఱు = ఇరువురు
ఇద్దలయి = ఇరువురే సమానమై
శౌర్యస్ఫూర్తి = పరాక్రమం ఇనుమడించగా
పోరాడగన్ = యుద్ధము చేయగా
శర సంధాన = వారు ఎక్కుపెట్టి
దృఢ = గట్టిగా
అపకర్షణకృతుల్ = వెనుకకు లాగి వదలబడిన
జ్యాఘోషణంబుల్ = వింటినారి ధ్వనులు
పరస్పర = ఒకరిపై మరియొకరు
ధిక్కారములు = చేయు ధిక్కారములు
ఒక్కచందంబున = ఒకే విధముగా
మించన్ = మించిపోయినవి.
తాత్పర్యము :
విశ్రవసుని కుమారులైన రావణ, కుబేరులు ఒకరితో నొకరు యుద్ధము చేయుచు రక్తములో మునుగుతూ కోపముతో ఒకరినొకరు సమీపించి సింహముల జంటయో అనునట్లు ఇరువురికి ఇరువురు తీసిపోని విధముగా యుద్ధము చేయుచుండిరి. ఆ యుద్ధములో వారు ఎక్కుపెట్టిన బాణముల వింటి అల్లె త్రాటి ధ్వనులు వారిద్దరి ధిక్కారములను మించిపోయెను.
ప్రశ్న 11.
రణమున వివిధాయుధ ధా
రణమున సరి పోరు యక్ష రాక్షసవరులన్
బ్రణుతించిరమరుల సురా
గ్రణియున్ మాయఁగొని న్యాయ్యరణవిముఖుండై.
జవాబు:
ప్రతిపదార్ధం :
రణమునన్ = యుద్ధమునందు
వివిధ = అనేక విధములైన
ఆయుధ = ఆయుధముల యొక్క
ధారణమున = యుద్ధమును
సరిపోరు = సమాన పోరును
యక్ష = కుబేరుని
రాక్షసవరులన్ = రావణుని
అమరులు = దేవతలు
ప్రణుతించిరి = ప్రస్తుతించారు
అసురాగ్రణియున్ = రావణుడు
న్యాయ్య = న్యాయముగా చేయు
రణ = యుద్ధమునందు
విముఖుండై = విముఖుడై
మాయన్ + కొని = మాయా యుద్ధమునకు దిగెను
తాత్పర్యము :
యుద్ధము నందు అనేక ఆయుధములతో ఇరువురు యుద్ధము చేయు చుండిరి. వారి యుద్ధమును చూచి దేవతలు ప్రశంసించారు. కుబేరుడు ఎప్పటికి బలహీనుడు అవకపోవుట చూచి రావణుడు న్యాయముగా చేయు యుద్ధము వదిలి మాయా విద్యతో యుద్ధమునకు దిగేను.
ప్రశ్న 12.
ఒకసారి మేఘమై యుడువీథిఁ గనుపించుఁ
గనుషించి పిడుగు లుగ్రముగఁ గురియు
నొక తేప సింహమై ‘యుద్వృత్తిఁబఱతెంచుఁ
బఱతెంచి కహకహార్భటి వహించు
నొక తూరి కొండయై యురులీల నెదిరించు
నెదిరించి యెగసి బిట్టదరఁ జేయు
నొక మాటు వార్ధియై యూర్ములతో మించు
మించి రోదసి యెల్ల ముంచి వైచు.
నొక్క పరి వ్యాఘ్రమైవచ్చు నొక్క సారి
దంష్ట్రీయైతోఁచు నొక మరి దారుణాహి
కరణి గనిపించు నొక మాఱు గానిషి ప
కడఁగు మాయా నిరూడినయ్యుసురవనుడు.
జవాబు:
ప్రతిపదార్థం :
ఉడువీధిన్ = ఆకాశమార్గమున
మేఘమై = మేఘము వలె
ఒకసారి = ఒకసారి
కనిపించు = కనిపించి
పిడుగులు = పిడుగులు
ఉగ్రముగ = భయంకరముగా
కురియు = పడే విధముగా
ఒకతేప = ఒకసారి
సింహమై = సింహము వలె
ఉత్ + వృత్తిన్ = గర్వముతో
కహక హార్బటి = కహ కహ ధ్వనిచేత
ఒకతూరి = ఒకమారు
వార్ధి = సముద్రము యొక్క
ఊర్ములు = అలలు
మించు = అతిశయించినవై
రోదసి = ఆకాశమును
ముంచివైచున్ = ముంచివేయును
ఒక్కపరి = ఒకసారి
వ్యాఘ్రమైవచ్చు = పులిలా వచ్చును
ఒక్కసారి = ఒకసారి
దంష్ట్రీయై తోచు = అడవి పందివలె కనిపించును
ఒకమరి = ఒకసారి
దారుణ + అహి కరణిన్ = భయంకరమైన పామువలె
ఒకమాటు = మరి ఒకసారి
కనిపించు = కనిపించి
కానిపింపక = కనిపించకుండా
ఆ + అసురవరుడు = రాక్షస రాజైన రావణుడు
మాయానిరూఢిన్ = మాయా యుద్ధమున ప్రసిద్ధి గలవాడై
అడగు = దాక్కొనును
తాత్పర్యము :
ఆకాశమార్గమున ఒకసారి గర్వముతో కహ కహ ధ్వనితో ఒకసారి సముద్రపు అలల వలె ఒకసారి పులి, అడవిపందియై భయంకర సర్పము వలె కనిపించి, కనిపించకుండా ఆ రావణుడు దాక్కొని మాయా యుద్ధము చేసెను.
ప్రశ్న 13.
ఇటువలెఁ బెక్కుమాయల ధనేశ్వరునిన్ భ్రమియించి విక్రమో
ద్భటగతి మించి నిష్ఠురగదన్ దల మోఁదినం క్రొత్త నెత్తురుల్
జొటడౌటఁ గాఱఁ బూచిన యశోకము గాలికిఁ గూలు చాడ్పునన్
దటుకున వ్రాలెఁ దేరిపయి దానవ సైన్యములుల్లసిల్లఁగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇటువలెన్ = ఈ విధముగా
పెక్కు = అనేక
మాయల = మాయలతో
ధనేశ్వరునిన్ = కుబేరుని
భ్రమియించి = భ్రమింపజేసి
విక్రమ = గొప్ప పరాక్రమముతో
ఉద్భటగతి = అధికమైన
మించి = అతిశయముతో
నిష్ఠుర = కఠినమైన, గట్టిదైన
గదన్ = గదతో
తలన్ = తలపై
మోదినన్ = కొట్టగా
క్రొత్తనెత్తురుల్ = రక్తము
చొటబొటన్ = బొటబొట
కాఱున్ = కారుచుండగా
పూచిన + అశోకము = ఎర్రని పూలు గల అశోకవృక్షము
గాలికిన్ = గాలికి
కూలు = కూలిపోవు
చాడ్పునన్ = విధముగా
దానవసైన్యము = రాక్షస సేన
ఉల్లసిల్లగన్ = సంతోషించగా
తటుకున = వెంటనే
తేరిపయి = రథముపై వ్రాలె
వ్రాలె = ఒరిగిపోయెను
తాత్పర్యము :
ఈ విధముగా అనేక మాయలతో కుబేరుని భ్రమింపజేసి గొప్ప పరాక్రమంతో గట్టి గదతో తలపై కొట్టగా రక్తము బొటబొట కారుతూ ఎర్రని పూలు పూచిన అశోకవృక్షము గాలికి కూలిపోయే విధముగా తన రథముపై కుబేరుడు మూర్చ పోయాడు. అది చూసి రావణ సైన్యము సంతోషించింది.
ప్రశ్న 14.
ధనదుండీగతి మూర్ఛఁ జెంది పడ వంతన్ సూతుఁ దత్తేరు గ్ర
క్కున నందాతటినీ సమీపమునకున్ గొంపోయె యక్షుల్ భయం
జున వృక్షంబులు వ్రాయున్ గిరి బిలంబుల్ సొచ్చియున్ విచ్చి కా
ననముల్ దూఱియుఁ గోనలన్ ఐడియు దైన్యం బొంది రెంతేనియున్.
జవాబు:
ప్రతిపదార్థము :
ధనదుండు = కుబేరుడు
ఈ గతిన్ = ఈ విధముగా
మూర్ఛన్చెంది = మూర్ఛపోయి
పడన్ = పడిపోగా
అంతన్ = అప్పుడు
సూతుడు = రథసారధి
ఆ + తేరు = ఆ రథమును
గ్రక్కున = వెంటనే
నందాతటినీ = కొండచరియ
సమీపమునకున్ = దగ్గరకు
గొంపోయె = తీసుకొని వెళ్ళెను
యక్షుల్ = కుబేరుని సైన్యము
భయంబున = భయముతో
వృక్షంబులు = చెట్లలోకి
వ్రాకియున్ = ఎగబ్రాకి
గిరిబిలంబుల్ = కొండ గుహల్లోకి
చొచ్చియన్ = ప్రవేశించి
విచ్చి = విడిపోయి
కాననముల్ = అడవులందు
దూటియున్ = ప్రవేశించి
కోనలన్ = కొండ ప్రాంతములందు
పడియు = పడి
ఎంతేనియున్ = ఎంతో
దైన్యము = దీనత్వమును
పొందిరి = పొందారు
తాత్పర్యము :
కుబేరుడు ఈ విధముగా మూర్ఛపోయి రథముపై పడిపోగా రథసారధి వెంటనే రథమును దగ్గరగా ఉన్న కొండ చరియల్లోకి తీసుకుని వెళ్ళాడు. కుబేరుని సైన్యం భయంతో చెట్లలోకి పారిపోయి కొండగుహల్లోకి ప్రవేశించి విడిపోయి కొందరు అరణ్య మార్గములు పట్టి, మరికొందరు కొండల్లోకి వెళ్ళి దాక్కున్నారు. వారంతా ఎంతో దీనత్వమును పొందారు.
ప్రశ్న 15.
మూర్ఛ మునిఁగినధనదు సమ్ముఖముఁ జేరి
శంఖ పద్మాది నిధులు విశ్రాంతి మాన్చె
నంత దశ కంధరుఁడు నిట్టులన్నఁ గెలిచి
సొలయకాతని నగరంబుసొచ్చి యచట.
జవాబు:
ప్రతిపదార్థం :
మూర్చమునిగిన = మూర్చపోయిన
ధనదు = కుబేరుని
సమ్ముఖమున్ = ఎదురుగా
చేరి = చేరి
శంఖ పద్మాది నిధులు = శంఖ పద్ముడు మొదలైనవారు
విశ్రాంతి మాన్చె = పరిచర్యలు చేసిరి
అంత = అంతట
దశకంధరుడు = రావణాసురుడు
ఇట్టుల = ఈ విధముగా
అన్నన్ = అన్న అయిన కుబేరుని
గెలిచి = గెలిచి
సొలయక = అలసట లేక
ఆతని = కుబేరుని
నగరంబు + చొచ్చి = నగరమైన అలకాపురి ప్రవేశించి
అచట = అచట (తరువాతి పద్యంతో అన్వయము)
తాత్పర్యము :
మూర్ఛపోయిన కుబేరుని శంఖ పద్మాదులు సేదదీర్చి పరిచర్యలు చేసారు. రావణుడు అన్నయైన కుబేరుని గెలిచి అలకాపురి పట్టణములో ప్రవేశించి అచట.
ప్రశ్న 16.
శాంతకుంభ స్తంభ సాహస్రములు గల్గి
వైడూర్య తోరణావళులు గల్గి
నవ్య మౌక్తిక వితానవితాన ములు గల్గి
శశికాంత వేదికాచయము గల్గి
సొగసైన మగజాల సోపానములు గల్గి
కప్పులలోవల యొప్పు గల్గి
కామితార్థము లిచ్చు ఘన వృక్షములు గల్గి
వికచకలార దీర్ఘకలు గల్గి
మానస జవంబు గల్గి కామగతి గల్గి
కామ రూపంబులు వహించు గరిమ గల్గి
ప్రజలు పరమేష్ఠిరణత పుష్పకముఁ గాంచి
యందు పైనెక్కి యతఁడు తారాద్రి కరిగి.
జవాబు:
ప్రతిపదార్థము :
శాతకుంభ స్తంభ సాహస్రములు = వేలకొలది బంగారు స్తంభములు
వైడూర్య తోరణ + ఆవళులు = వైడూర్యములతో కూడిన దండల సమూహములు
నవ్యమౌక్తిక = నూతనమైన ముత్యములతో కట్టిన
వితానవితానములు = మేలుకట్లు
శశికాంత వేదికాచయము = చంద్రకాంత శిలలతో కూడిన వేదికల సమూహము
మగజాల సోపానములున్ = వజ్రములచే పొదగబడిన మెట్లు
వికచకల్హార దీర్ఘకలున్ = వికసించిన తామర కొలనులు
మానస జవంబున్ = మనోవేగము
కామగతిన్ = యదేచ్ఛగా విహరించుట
కామరూపంబులు = కోరిన రూపములు
వహించు = ధరించు
గరిమ గల్గి = గొప్పదనము కలిగిన
పరమేష్ఠి = బ్రహ్మదేవుని
రజిత = వెండి
పుష్పకము = పుష్పక విమానమును
కాంచి = చూచి
అందుపైన్ = దానిపై
ఎక్కి = అధిరోహించి
అతడు = రావణాసురుడు
తార + అద్రికి = నక్షత్ర పర్వతమునకు
అరిగెన్ = వెళ్ళెను
తాత్పర్యము :
బంగారు స్తంభములతో వజ్ర వైడూర్యాల దండల సమూహముతో ముత్యాలు కూర్చిన మేడలతో చంద్రకాంత శిలలతో తామరకొలనులతో మనోవేగముతో కామరూపులై విహరించు అలకాపుర పట్టణంలో బ్రహ్మదేవునిచే సృష్టించబడిన వెండి పుష్పకమును చూచి రావణుడు దానిని అధిరోహించి నక్షత్ర పర్వతమునకు వెళ్ళెను.
ప్రశ్న 17.
తరళోత్తుంగ తరంగఘుంఘుమరవోద్యద్దివ్యనందార విం
ద రజోబృంద మరంద తుందిల మిళింద ధ్వాన సంబంధ గం
ధ రమాబంధుర మంథరా నిలునిచేతన్ శ్రాంతి వాయన్ ధనే
శ్వరుఁడున్ దెప్పిటి భీతి సేనఁగొని లజ్జన్ జేరె వీ దయ్యెడన్.
జవాబు:
ప్రతిపదార్థము :
తరళ + ఉత్తుంగ = ప్రకాశమై పైకి లేచిన
తరంగ = కెరటములతో
ఘుంఘుమ = ఘుంఘుమయను
రవ = ధ్వ నితో
ఉద్యత్ = వెడలిన
దివ్యనంద = దేవతల ఉద్యానవనము నందలి
అరవింద = పద్మముల యొక్క
రజోబృంద = పుప్పొడి సమూహముచే
మరంద = తేనెలతో
తుందిల = అధికమైన
మిళింద = తుమ్మెదల
ధ్వాన = ఝంకారములకు
సంబంధ = సంబంధించిన
గంధ = సువాసన
రమాబంధుర = సంపదచే దట్టమైన
మంధర = మంధర పర్వతము యొక్క
అనిలునిచేతన్ = గాలి వలన
శ్రాంతి వాయన్ = అలసట తొలగగా
ధన + ఈశ్వరుడున్ = కుబేరుడును
తెప్పటి = తేరుకొని
భీతిన్ = భయముతో
సేనన్ + కొని = తన సైన్యమును తీసుకొని
లజ్జన్ = సిగ్గుతో
వీడు = తన పట్టణమైన అలకాపురమునకు
ఆ + ఎడన్ = ఆ సమయమున
చేరెన్ = చేరెను
తాత్పర్యము :
ప్రకాశమై పైకి లేచిన కెరటములతో ఘుంఘుమను ధ్వనితో దేవతల ‘నందనోద్యానవనము నందలి పుప్పొడి సమూహముచే తేనెలచే అధికమైన తుమ్మెదల ఝంకార ధ్వని సంబంధించిన సువాసన సంపదచే దట్టమైన మంధర పర్వతము యొక్క గాలి వలన అలసట పోగా కుబేరుడు తేరుకొనెను. వెంటనే భయముతో తన సేనను వెంటబెట్టుకొని అలకాపురమునకు వెళ్ళెను.
ప్రశ్న 18.
అజ తమాజ వింటివె దశాననుం చెట్టులఁ బుష్పకంబుతో
నాజి జయంబునున్ బాదసి యావలఁ బోవుచుఁ జూచె ముందటన్
రాజత శైలమున్ దపవరథ్య నిరోధకృదశ్యుదగ్రతాలు
రాజిత సాలమున్ దటచరత్కరిపింహ రక్షుకోలమున్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఆజతనూజ = బ్రహ్మ కుమారుడవైన ఓ నారదా !
వింటివె = విన్నావా !
దశాననుడు = రావణాసురుడు
ఇట్టుల = ఈ విధముగా
పుష్పకంబుతోన్ = పుష్పక విమానముతో
ఆజి = యుద్ధమునందు
జయంబునన్ = విజయమును
పొదసి = పొంది
ఆవలబోవుచు – అవతలకు వెళుతూ
ముందటన్ = ముందుగా
రాజిత శైలము = వెండి కొండను
చూచె = చూశాడు
తపన = తపనుడైన సూర్యుని
రధ్య = రధమును
నిరోధక = అడ్డగింప
కృత్ = చేయబడిన
ఉద్యుత్ + అగ్రతా = ప్రకాశవంతమైన
రాజిత = తెల్లనయిన
సాలమున్ = వృక్షములను
తట = ఒడ్డునందు
చరత్ = సంచరిస్తున్న
సింహ = సింహములను
తరక్షు = సివంగులను
కోలమున్ = అడవి పందులను
చూచె = చూశాడు
తాత్పర్యం :
బ్రహ్మ కుమారుడవైన ఓ నారదా ! ఇది విన్నావా ! రావణాసురుడు కుబేరునితో యుద్ధము చేసి గెలుపొంది పుష్పక విమానమును సంగ్రహించి అక్కడ నుండి బయలుదేరి ముందుగా వెండి పర్వతమును చూశాడు. ‘సూర్యుని కిరణములను కూడా ఆపగల శక్తిగల తెల్లనైన వృక్షములను చూశాడు. అక్కడ తిరుగుతున్న సింహములను, సివంగులను, అడవి పందులను కూడా చూశాడు.
ప్రశ్న 19.
చూచి యచ్చోటి వింతలు చూడవలసి
బలసియిరువంకలను దైత్యభటులు గొలువఁ
జెలువ మొలికెడు నమ్మహా శిఖర మెక్కి
యక్క డఁజరింప మారీచుఁ డతని కనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
బలసి = కలసిమెలసి
ఇరువంకల = ఇరువైపులా
దైత్యభటులు = రాక్షసభటులు
గొలువ = సేవలు చేస్తుండగా
చెలువ = అందము
ఒలికెడు = ఒలికిస్తున్న
ఆ + మహా శిఖరము + ఎక్కి = ఆ మహా శిఖరాన్ని ఎక్కి
అక్కడ చరింప = అక్కడ సంచరిస్తుండగా
అతనికి = ఆ రావణునికి
మారీచుడు = మారీచుడను రావణుని మంత్రి
అనియె = ఇలా అన్నాడు
తాత్పర్యం :
రావణాసురుడు ఆ మహా శిఖరము వద్ద తన భటులు రక్షణగా రాగా అందంగా ఉన్న ఆ మహా శిఖరమున సంచరిస్తుండగా మారీచుడు అను రావణుని మంత్రి రావణుని చూసి ఇలా అన్నాడు.
ప్రశ్న 20.
కలధౌతాచల దీధితి ప్రచయమో గంగా ప్రవాహాంతరో
జ్వల దిండీరనికాయమో శబర యోషాధన్వ ముక్తాస్త్రని
ర్గళిత ప్రాంచిత చామర ప్రజమొ నా రంజిల్లు రెండాఱుచే
తులతేఁ దుండిన తెల్లుటిల్లుఁ గనుమా దోషాచరగ్రామణీ.
జవాబు:
ప్రతిపదార్థం :
దోషా = చీకటియందు
చర = సంచరించు రాక్షసులకు
అగ్రణీ = రాజైన ఓ రావణా !
రెండారు చేతులరేడు = కుమారస్వామి
ఉండిన = ఉన్నటువంటి
తెల్లుటిల్లు = రెల్లిల్లును
కనుమా = చూడుము
కలధౌత + అచలము = వెండికొండ
దీధితి = వెలుగులు
ప్రచయమో = సమూహమో అన్నట్లుగా
గంగ = గంగానది
ప్రవాహాంతర = ప్రవాహమునందున్న
ఉజ్జ్వల = గొప్పదైన
డిండ్రీరనికాయమో = నురగల సమూహమో
శఖర = చెంచు
యోష = స్త్రీల యొక్క
ధన్వ = ధనస్సుల నుండి
ముక్త = విడువబడిన బాణముల యొక్క
నిర్గళిత = జారిపడిన
ప్రాంచిత = అందమైనటువంటి
చామరవ్రజమో = ఉకల సమూహం
నా = అన్నట్లు
రంజిల్లు = వెలుగుచున్న
తాత్పర్యం :
రాత్రులందు సంచరించుచున్న రాక్షసుల సమూహములకు -పైన ఓ . రావణా ! కుమారస్వామి నివాసమైన రెల్లిల్లును చూడుము. అది వెండికొండ వెలుగు సమూహమా అన్నట్లు; గంగానదీ ప్రవాహమునందున్న తెల్లని నురగల సమూహమ అన్నట్లు, చెంచు స్త్రీలు తమ ధనస్సులకు బాణములను ఎక్కుపెట్టి వదలగా దానినుండి రాలిపడిన ఈకల సమూహమా అన్నట్లున్నది కదా !
ప్రశ్న 21.
శైలజా సహచరోజుల రుద్ర కన్యతా
చరణ లాక్షాపంక మొరసి నదియు
యది నగం ఇనుపేర నింపొందుఁ గావున
విపులంబుగాడ్ బల్లవించినదియు
తనగిరీశత్వ మందఱకుఁ దోఁప నభంబు
మించు పెంజడలు, వహించినదియు
సానుభాగ చరద్భుజంగ భోగమణీ స
మంచితప్రభ నాక్రమించినదియొ
లేక ధనవాడు గెలిచి త్రిలోక విజయ
వాంఛ నరుదెంచు, దేవరవారిదో: ప్ర
తాప మిట నుండినదియొ నాఁదరుణతరుణి
కిరణగతి గైరికముల నిగ్గిరి వెలింగె.
జవాబు:
ప్రతిపదార్థం :
శైలజ = పర్వతరాజ పుత్రిక అయిన పార్వతి
సహచర + ఉజ్జ్వల = అందమైన
రుద్ర = ఎర్రనైన
కన్యకా = కన్యల యొక్క
చరణ = పాదముల
లాక్షాపంకము = లత్తుక
నగంబు = చెట్టు
ఇంపు + ఒందు = నిలచు
పల్లలించు = చిగురించు
నభంబు = ఆకాశము
శత్వము = కైలాసనాథుని అంటే శివుని
పెంజెడలు = ఎర్రని జడలు
సానుభాగ = కొండ అంచుల
చరత్ + భుజంగ = కదులుతున్న పామువలే !
భోగమణి = నాగుల శిరస్సుపై నుండే మణి
సమంచిత = తగిన
ప్రభ = కాంతి
ధననాధు = కుబేరుడు
వాంఛ = కోరిక
అరుదెంచు = వచ్చు
దేవరవారి = రావణుని యొక్క
దోః = కాంతి
తరుణ = ఉదయిస్తున్న
తరణి = సూర్యుని యొక్క
కిరణ = కిరణములు
గైరికములు = గైరికాది ధాతువులు
తాత్పర్యం :
కైలాస పర్వతము పార్వతీదేవి అందమైన చెలికత్తెల పాదాలకు పూసిన లత్తుకలను అందించినదా ! ఇది వృక్షముల సమూహములతో నిండియుండుట వలన విశాలంగా పల్లవించినదా ! శివుని యొక్క రూపము అందరకు తెలిసే విధముగా ఎర్రని జడలు ఆకాశమును మించి వ్యాపించినవా ! పర్వత చరియలయందు నాలుగు వైపులా నాగుబాము శిరస్సుపై ఉండే మణుల కాంతులతో నిండియున్నదా ! లేక కుబేరుని గెలిచిన మూడు లోకములను జయించిన రావణుని ప్రతాపము ఇక్కడున్నదా ! ఆ ఉదయిస్తున్న సూర్యుని కిరణములు గైరికాది ధాతువులతో ఈ విధంగా వెలుగుతున్నదా ! అన్నట్లున్నది.
ప్రశ్న 22.
తిరముగ జైత్రయాత్ర’ చనుదెంచిన నిన్ గని యీకుభృత్తు ని
ప్షరములఁబాద్య మిచ్చి రవిసంజ్వలితార్క మణీ విభాపరం
పరల నివాళి సేసి వనభవ్య శుకాది విహంగమోక్తి వై
ఖరి నుతి సల్పెడిన్ రజత కొంతుల నెల్లదనంబుఁ జూపుచున్.
జవాబు:
ప్రతిపదార్థం :
తిరముగ = నిశ్చితమైన
జైత్రయాత్ర = విజయయాత్ర
చనుదెంచి = వచ్చి
నిన్ + కని = నిన్ను
చూసి = ఈ యొక్క
కుభృత్తు = భూమిని భరించు పర్వతము
నిర్జరములబాద్యము + ఇచ్చి = సెలయేరులతో కలిసి
రవి = సూర్యుని యొక్క
సంజ్వలిత + అర్క = మండింపబడుతున్న
మణి = మణుల యొక్క
విభాపరంపరల = కాంతులతో
నివాళి + చేసి = హారతులిచ్చి
వనభవ్య = వనములయందున్న
శుక + ఆది = చిలుకలు మొదలగు
విహంగము + ఉక్తి = పక్షుల యొక్క ఆశీర్వచన
వైఖరి = విధానము
నుతిసర్పిడి = పొగడ్తలతో
రజితకాంతులు = తెల్లని కాంతులు
తాత్పర్యం :
నిశ్చలమైన జైత్రయాత్ర చేసి వచ్చిన నిన్ను చూసి ఈ పర్వతము సెలయేరుల నీటిని అందించి, సూర్యుని చేత మండింపబడిన మణుల యొక్క వింత కాంతులతో హారతులిచ్చి, వనములలో విహరించెడి చిలుకల వంటి పక్షుల వాక్కులతో ఆశీర్వచనములు పలికించి, రజిత కాంతులతో తెల్లదనమును చూపుచున్నది.
ప్రశ్న 23.
చిగురు జొంపముల రంజిల్లెనీ యెలదోఁట
చెలువ పర్ణకు వేడ్క సేయు నేమొ
విరిగల్వ విరులచే వెలసె నిక్కల నిందుఁ
జంద్రజూటుఁడు గేళి సల్పు నేమొ
సంతాన కుసుమవాసన లూనె నిక్కోన
దేవ కన్యకలు వర్తింతు రేమొ
పువ్వుఁబుప్పొడి దుమ్ము పొదలె నిప్పొదలలో
విద్దాడు లెపుడు వసించు నేమొ
తనరె బహు బిల్వ రుద్రాక్ష తరువు లిచ్చటం
బ్రమథవర్యుల కివి రచ్చపట్టు లేమొ
యనుచు మారీచుఁ డెఱిఁగింప నచట నచట
నయ్యసురభర్త విహరించునవసరమున
జవాబు:
ప్రతిపదార్థం :
చిగురు జొంపముల = చిగురులు వేసిన మొక్కల గుబురులు
రంజిల్లు = రంజిల్లుతున్న, ప్రకాశిస్తున్న
ఎలదోట = చిగురుతోట
చెలువపర్ణ = ఆకుల సమూహము
వేడ్క = ఆనందము
విరులచే = పూలతో
కొలను = సరస్సు
చంద్రజూటుడు = శివుడు
సంతాన = సంతాన మనెడి కల్పవృక్షము
కుసుమ వాసనలు = పూల వాసనలు
ఊని = పీల్చి
ఈ + కోన = ఈ అడవిలో
వర్తింతురు + ఏమో = కదులుతారేమో !
పొదలె = వ్యాపించిన
విధాళులు = తుమ్మెదలు
వసించు = నివసించు
తనరు = అమరియుండు
ప్రమథవర్యులు = ప్రమధ గణములకు
రచ్చపట్టులు + ఏమో = నివాసము లేమో !
ఎఱిగింప = తెలుపగా
అసురభర్త = రావణుడు
అయ్యవసరమున = ఆ సమయమున
తాత్పర్యం :
ఈ పర్వత సమూహములలో చిగురులు వీస్తున్న మొక్కల గుబురులు ఆనందమును కలిగిస్తున్నాయి. కలువపూవులతో నిండిన ఇక్కడి కొలనులో చంద్రుని తన జటాఝూటమునందుంచుకున్న శివుడు తాండవం చేస్తాడేమో ! సంతాన మనెడి పేరు గల కల్పవృక్షము యొక్క పూలపరిమళములను పీల్చి దేవతాకన్యలు నాట్యం చేస్తారేమో ! పూల పుప్పొడులతో దుమ్మురేగు ఈ ప్రదేశమున ఎల్లవేళలా తుమ్మెదలు నివసిస్తాయేమో ! ఇచట బిల్వ, రుద్రాక్ష వృక్షము నిండి ఉంటాయి. అవి ప్రమద గణములకు నివాస యోగ్యములేమో ! అని మారీచుడు చెప్తుండగా రావణుడు ఆ ప్రాంతమున విహరిస్తున్నాడు. ఆ సమయమున
ప్రశ్న 24.
చిమ్మచీకటి గ్రమ్ము కొమ్మావిగుమి నల్లి
బిల్లి రుద్రాక్ష పందిళ్ల నడుమ
వడిఁ బాఱువిరి తేనెవాఁకల దరుల వెం
బడి ఘుమ్ముమను మృగమదము తావిఁ
బొలుపొందు విరవారి పొదలలోఁ గుప్పలు
వడు సురపొన్న పుప్పొడి దుమార
మొలసిన లేఁదెమ్మెరలయెమ్మె గనుకమ్మ
బంగరుఁబూఁదోఁటపడ్డ నమరు
మరకత నిబద్ధ భూముల మలయు రేవె
లుంగు జాతిన్నియలఁజెన్నెసంగు పొగడ
మ్రావి నీడలఁ దగునొక్క కోనలోనఁ
బుష్పక విమాన మటు సాగి పోక నిలిచె.
జవాబు:
ప్రతిపదార్ధం :
క్రొత్త + మాలి = లేలేత మామిడి గుబురులతో
అల్లిబిల్లి = అల్లుకున్న
రుద్రాక్ష = రుద్రాక్షల యొక్క
విరి = పూల యొక్క
తేనెవాకలు = తేనె ప్రవాహములు
తరులు = చెట్లు
మృగమదము = కస్తూరి మృగమదపు
తావి = వాసనలు
పొలుపొందు = అమరినటువంటి
విరివార = పూల వరుసల (విరజాజి)
ఒలసిన = వ్యాపించిన
లేతెమ్మెరల = పిల్ల గాలుల యొక్క
ఎమ్మె = వాసనలు
పజ్జి = నడుమ
మరకత = మణిమయమైన
లా తిన్నెయలు = చలువరాతి అరుగులు
పొగడమ్రాలి = పొగడచెట్టు
తాత్పర్యం :
లేత మామిడి చిగురులతో కలసి రుద్రాక్ష తీగలు చిమ్మచీకటిని నింపాయి. అక్కడున్న విరజాజి పూవుల చెట్ల వెంట కస్తూరి మృగపు మదపు వాసనలు వ్యాపించాయి. అక్కడి పొదలలో సురపొన్నాయి పూల పుప్పొడి దుమారము సాగుతున్నది. పిల్లగాలుల యొక్క వాసనలు నడుమ మణులతో నిండిన వెలుగుల మధ్య చలువరాతి తిన్నెల మధ్య ఉన్న ఒక పొగడ చెట్టు వద్ద పుష్పక విమానము కదలక నిలిచిపోయింది.
ప్రశ్న 25.
నిలిచినఁ బంక్తి కంధరుండు నివ్వెఱఁ గంది యిదేల యిచ్చటన్
నిలిచెను శక్తుఁడే యొకఁడు నిల్పఁగ దీనికి దుర్గమ స్థలం
బులు గలవోటు చూడుఁడటఁ బొండని మంత్రులఁ బంప వార ల
క్కెలంకుల సంచరించి పరికించియు హేతువు గాన కయ్యెడన్.
జవాబు:
ప్రతిపదార్థం :
నిలచిన = పుష్పకము నిలచిపోగా
పంక్తి కంధరుండు = వరుస ముఖములు గల రావణుడు
నివ్వెరగంది = ఆశ్చర్యపోయి
శక్తుడే = శక్తిమంతుడే
నిల్పగ = అడ్డుకొనగా
దీనికి = ఈ పుష్పకమునకు
దుర్గమ = చొరబడని
కెలకుల = సమీపముల
పరికించి = చూసి
హేతువు = కారణము
తాత్పర్యం :
పుష్పక విమానము పొగడచెట్టు వద్ద ఆగిపోగా, వరుస ముఖములు గల రావణుడు ఆశ్చర్యము పొంది ఈ పుష్పకమును ముందుకు సాగక ఆపగలవాడు కూడా ఉన్నాడా ? దీనికి చొరబడని చోటులున్నాయా ? చూడండి. కారణమేమిటో తెలుసుకోమని తన మంత్రులను ఆజ్ఞాపించాడు. వారు ఆ ప్రాంతంలో సంచరించి కారణమేమిటో తెలుసుకోలేకపోయారు.
ప్రశ్న 26.
అల మారీచుఁడు దేవ వింటె యిది యక్షాధ్యక్షునిన్ గాని య
న్యులం జైనూని చరింపదో యతఁడు క్రోధోద్రేకి యై నిల్వెనో
తెలియుండం చనునంతలో వికటుండే దీప్తాస్యుండై
కుజ్జుఁడై బల ధుర్యుండగు నంది యందుఁగని యబ్పేలస్త్యుతో నిట్లనున్.
జవాబు:
ప్రతిపదార్థం :
మారీచుడు = రావణుని మంత్రి అయిన మారీచుడు
దేవ = ఓ ప్రభువా ! రావణా !
ఇది = ఈ పుష్పక విమానము
యక్షాధ్యక్షునిన్ = యక్షులకు అధిపతి అయిన కుబేరుని తప్ప
అన్యుల = ఇతరులను
పైన + ఊని = పైనెక్కించుకొనిగాని
చరింపదో = కదలదో
క్రోధోద్రేకియై = కోపముతో
నిల్సెనో = నిలిపివేశాడో
తెలియుండు + అంచు = తెలుసుకొనుడు అనగా
నంది = నందీశ్వరుడు
వికటుడై = వ్యతిరేకించినవాడై
దీప్త + అస్యుడు + ఐ = ప్రకాశించు ముఖము గలవాడై
కుబ్జుడై = పొట్టివాడైన
బలదుర్యుండు + ఐ = బలము కలిగినవాడై
పౌలస్యుతోన్ = పులస్యుని కుమారుడైన రావణునితో
ఇట్లు + అనున్ = ఇలా అన్నాడు
తాత్పర్యం :
అపుడు మారీచుడు ఓ ప్రభువైన రావణా ! ఈ పుష్పకము కుబేరుని ఎక్కించుకొని తప్ప కైలాసమున ప్రవేశింపదేమో ! అతడే కోపముతో దీనిని ఆపేశాడేమో ! అన్నాడు. ఆ సమయమున వికట రూపమున ఉన్న, తేజోవంతమైన ముఖము కలిగిన, పొట్టివాడుగా యున్న, బలవంతుడైన నందీశ్వరుడు ఆ రావణునితో ఇలా అన్నాడు.
ప్రశ్న 27.
నిలిచె విమాన మంచు రజనీచర నివ్వేజఁ గంద నేల యీ
నెలవున దేవితో హరుఁడు నేఁడు విహారము సేయుచున్న వాఁ
డల గరుడోరగామరవియచ్చరు లోదుదు రీడం జూడ నిం
దుల కరుదెంచి నీ బలముతోఁ జెడి పోక తొలంగు నావుడున్.
జవాబు:
ప్రతిపదార్థం :
విమానము = పుష్పక విమానము
నిలచె = ఆగిపోయినదని
రజనీచర = చీకటియందు సంచరించు ఓ రాక్షస రాజా !
నివ్వెల = ఆశ్చర్యం
గందనేల = పడటమెందుకు
ఈ + నెలవున = ఈ ప్రాంతమందు
దేవితో = పార్వతితో
హరుడు = శివుడు
విహారము = విహారము
చేయుచున్నవాడు = చేస్తున్నాడు
గరుడ = గరుడులు
ఉరగ = సర్పములు
అమర = దేవతలూ
వియచ్చరలు = ఆకాశమున విహరించువారు
ఓడుదురు + ఈడ = ఇక్కడకు రావటానికి భయపడతారు
ఇందుల = ఇక్కడకు
అరుదెంచి = వచ్చి
నీ బలము = నీ యొక్క బలము
చెడిపోక = పోగొట్టుకోక
తొలంగు = వెళ్ళిపో
నావుడున్ = అనగా విని
తాత్పర్యం :
ఓ రాక్షసరాజైన రావణా ! పుష్పకము ఇక్కడ నిలచిపోయినదని ఆశ్చర్యము పొందక ఇచట శివుని అర్ధాంగి పార్వతితో కలిసి విహారము చేస్తున్నాడు. గరుడులు, నాగులు, దేవతలు, ఆకాశ సంచరులు ఎవ్వరూ ప్రవేశింప సాహసించరు. నీవు కూడా ఇక్కడి నుండి వెళ్ళి నీ బలములను రక్షించుకో అని నందీశ్వరుడు రావణునితో చెప్పాడు.
ప్రశ్న 28.
పటపట పండ్లు గీటుకొని పంక్తి ముఖాసురభర్త పుష్పకం
బటు డిగి శంభుఁ డెవ్వఁ డహహా నను నిల్పెడునంత వచ్చెనే
యిట నిను నీ శివున్ నిలువ నిచ్చిన నట్టుల కాదె యంచుఁ ద
శటమున నుండి యగ్గిరివతంసము క్రిందికి వచ్చి చెచ్చెరన్.
జవాబు:
ప్రతిపదార్థము :
గీటుకొని = పండ్లు కొరుకుచూ
పంక్తి = వరుసలతో
ముఖ = ముఖములు గలిగిన
అసుర = రాక్షసుల
భర్త = ప్రభువైన రావణుడు
పుష్పకంబు = పుష్పక విమానమును
డిగ్గి = దిగి
శంభుడు + ఎవ్వడు = శివుడెవడు
అహహా = అపహాస్యం చేస్తూ
నిల్పెడునంతవచ్చెనే = నన్ను అడ్డగించేంత వరకు వచ్చాడా !
తత్ + తటమున = ఆ కొండపై నుండి
ఆ + గిరివతంసము = ఆ కొండ దిగువునకు
చెచ్చెరన్ = వేగముగా
వచ్చి = వచ్చి
తాత్పర్యం :
నందీశ్వరుడు అలా అనగా రావణుడు పటపట పండ్లు కొరుకుతూ పుష్పక విమానమును దిగి, శివుడు నన్ను ఆపగలిగిన వాడా అని పరిహాసము చేస్తూ అతనిని ఇక్కడ ఉండనిస్తానా అని ఆ కొండ దిగి క్రిందికి వచ్చి వెంటనే యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
ప్రశ్న 29.
ఉరుశూలముఁ గొని రెండవ
హరునివలెను దీప్త విగ్రహము మీఱఁగ వా
నర ముఖమొందిన నందిని
బరికించి దశాననుండు పకపక నగియెన్.
జవాబు:
ప్రతిపదార్థము :
ఉరు = పెద్దదైన
శూలము = శూలాయుధమును తీసుకొని
రెండవ = రెండవ
హరునివలె = శివుని వలె
దీప్త విగ్రహము = ప్రకాశవంతమైన రూపము కల్గిన
వానరముఖము = కోతివంటి ముఖము కలిగిన
నందిని = నందీశ్వరుని
పరికించి = చూసి
దశాననుండు = పది ముఖములు కలిగిన రావణాసురుడు
పకపక నగియెన్ = పకపకా నవ్వాడు
తాత్పర్యం :
పెద్దదైన శూలమును చేతియందు ధరించి అపర శివుని వలె ఉన్న, ప్రకాశ వంతమైన రూపము గలిగిన, కోతివంటి ముఖము కలిగిన నందీశ్వరుని చూసి రావణుడు పకపకా నవ్వాడు.
ప్రశ్న 30.
ఇవ్విధంబునఁ దనుఁజూచి నవ్వుచున్న
యతి విమూఢుని దశకంఠు నట్టె చూచి
యపర శివుఁడైన నందీశుఁ డాగ్రహము వ
హించి కటతటమదరఁగా నిట్టులనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
ఈ + విధంబున = ఈ విధముగా
తను జూచి = తనను చూచి నవ్వుతున్న
యతి విమూఢుని = మూరుడైన దశకంఠుని
అట్టేచూచి = అట్లాగే చూసి
అపరశివుడైన = శివునికి మరో రూపంగా ఉన్న
నందీశ్వరుడు = నంది
ఆగ్రహమున = కోపము
వహించి = తెచ్చుకొని
కటతటమదరగా = కనుబొమ్మలదరగ
ఇట్టుల + అనియె = ఈ విధముగా అన్నాడు
తాత్పర్యం :
నందీశ్వరుడు తనను చూసి అపహేళన చేసి నవ్వుతున్న రావణుని చూసి కోపముతో ఇలా అన్నాడు.
ప్రశ్న 31.
కపివదనుండనైన ననుఁ గల్గొని నీవ మాన దృష్టితో
నిపుడు హసించినాఁడ విట నీ దృశవక్రముఖుల్ నఖాయుధుల్
కపు లిఁక నీ కులం బడపఁ గల్గిద రంతటఁ గండగర్వమున్
దపమునఁ బుట్టు బెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా
జవాబు:
ప్రతిపదార్థము :
కపి = కోతి
వదనుండు + ఐన = ముఖము కలిగిన వాడినైన
ననున్ = నన్ను
గల్లిని = చూసి
నీవు = నీవు
అవమాన దృష్టితో = అవమానించు రీతిలో
ఇపుడు = ఇపుడు
హసించినాడవు = నవ్వుతున్నావు
ఇట = ఇక్కడ
ఈ దృశ = ఇదే విధమైన
వక్రముల్ = ముఖములు
నఖ + ఆయుధుల్ = గోళ్ళే ఆయుధములుగా కలిగినవారు
కపులు = కోతులు
ఇక = ఇకముందు
నీ = నీ యొక్క
కులంబు = రాక్షస కులమును
అడపగల్లెదరు = నాశనం చేస్తారు
అంతట = అపుడు
కండగర్వముల్ = బలము వలన వచ్చిన గర్వములు
తపమున = తపస్సు వలన
పుట్టు = వచ్చిన
బెట్టిదము = ప్రతాపము
తామె = వాటంతటవే
అడంగు = అణగిపోతాయి
రాక్షస + అధమా ! = అధముడైన ఓ రావణా !
తాత్పర్యము :
ఓ రాక్షసాధమా ! రావణ ! కోతిముఖము కలిగినవాడనైన నన్ను చూసి అవమానించావు. ఇదే విధమైన ముఖములు కలిగిన కోతులు తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ కులమును, కండబలముచే తపఃఫలముచే వచ్చిన గర్వము అణచివేస్తారు.
ప్రశ్న 32.
శాపోకుల్ పచరింప కున్న నెదిరించన్ రాదె యంటేని నిం
దాపారంపరి మున్నుగా మృతుఁడవే నా కిట్టి పీనుంగుపై
నేపున్ జూపఁగ నర్ఘమౌనె యిదిగాకి చేయు పాపంబుచే
నాపద్యార్థి మునింగి పోవం గల వేలా యింక నిన్ నొంచంగన్.
జవాబు:
ప్రతిపదార్థము :
శాప + ఉక్తులు = శపించిన పలుకులు
పచరింపకున్న = చెప్పకుండా
ఎదిరించన్ + రాదె + అంటే = ఎదిరించవచ్చుగా అంటే
నిందాపారపరి = నీవు తిట్టుట వలన
మున్నుగా = ముందుగానే
మృతుడవే = మరణించిన వాడివే !
నాకు + ఇట్టి = నాకు ఈ విధంగా
పీనుంగుపై = మరణించిన వానిపై
ఎపున్ + చూపన్ = పరాక్రమము చూపుట
అర్హమౌనె = అర్హమౌతుందా !
ఇదిగాక = ఇదే కాకుండా
నీ = నీవు
చేయు = చేస్తున్న
పాపంబుచే = పాపము వలన
ఆపదల్ వారి = ఆపదలనే సముద్రమున
మునింగిపోగలవు = మునిగిపోయావు
ఒంచగన్ = ఓడించటం
తాత్పర్యం :
శాపపు పలుకులు చెప్పే కన్నా నన్ను ఎదిరించవచ్చు కదా ! అంటా వేమో ! ఇప్పటి వరకు తిట్టిన తిట్టుల వలన ముందుగానే నువ్వు చచ్చిపోయావు. పీనుగపై పోరాటం ఎందుకు ? అంతేకాక నువ్వు చేస్తున్న పాపములే నిన్ను నాశనం చేస్తాయి అని నందీశ్వరుడు రావణునితో అన్నాడు.
ప్రశ్న 33.
అని యా నంది శపించిన
విని యానందించి సురలు విరులు గురిసి ర
వ్విను వీథి దేవ దుందుభు
లును మొరసెన్ బెరసె సుఖము లోకము లెల్లన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఆనందించి = ఆనందించిన వారైన
సురలు = దేవతలు
విరులు = పుష్పములను
కురిసిరి = కురిపించారు
ఆ + వినువీధి = ఆకాశ మార్గమున
దేవ దుందుభులు = దేవతలు చేసిన వాయిద్య ధ్వనులు
మొరసెన్ = మ్రోగినవి
పెరసెన్ = వెల్లివిరిసినవి
తాత్పర్యం :
నందీశ్వరుడు శపించిన విన్న దేవతలు ఆనందించారు. పుష్ప వర్షమును కురిపించారు. వాయిద్య ధ్వనులు చేశారు. లోకములన్నీ సుఖంగా ఉన్నాయి.
కవి పరిచయం
1. ‘నందీశ్వరుని శాపం’ పాఠ్యభాగ రచయిత కంకంటి పాపరాజు.
2. కంకంటి పాపరాజు 17వ శతాబ్దానికి చెందిన కవి.
3. నరసమాంబ, అప్పయ్యమంత్రి ఈతని తల్లిదండ్రులు.
4. చతుర్విధ కవితా నిపుణుడు పాపరాజు.
5. సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు. యోగ, గణితశాస్త్రాలలో పాండిత్యం గలవాడు.
6. రామాయణం, రామకథ ఎటువంటి హైన్యమునైనా మార్చగలదని విశ్వసించిన కవి పాపరాజు.
7. రామాయణంలో ఉత్తరకాండను గ్రహించి స్వతంత్ర ప్రబంధముగా తీర్చిదిద్దాడు పాపరాజు.
8. సముచిత వర్ణనలతో ఎనిమిది ఆశ్వాసాల కావ్యంగా మలిచాడు పాపరాజు.
9. పద్య ధారణకు అనుకూలమైన సరళశైలితో రూపొందించాడు ఈ కావ్యాన్ని.
10. ‘విష్ణుమాయా విలాసం’ అనే మరో యక్షగానాన్ని కూడా రచించాడు.
11. ఈ రెండు కావ్యాలను మదనగోపాల స్వామికే అంకితం చేసాడు పాపరాజు.
పాఠ్యభాగ సందర్భము
బ్రహ్మ చేత ‘వరాలను పొంది జలగర్వితుడైన రావణుడు జైత్రయాత్రలు చేసాడు. గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు మొదలైన వారిపై దండెత్తి, ఓడించి వారిని బాధించాడు. అతని దురాగతాలను గమనించిన కుబేరుడు తమ్ముడే కదా అని హితోక్తులు దూత చేత తన మాటగా చెప్పి రమ్మని పంపించాడు.
రావణుడు ఆ వచ్చిన దూతను చంపి అలకాపురిపై దండెత్తి వచ్చాడు. కుబేర సైన్యం రావణుని ధాటికి నిలువలేకపోయింది. అపుడు కుబేరుడే స్వయంగా వచ్చి యుద్ధరంగంలో బుద్ధులు చెప్పే సందర్భంలో ఈ పాఠ్యభాగం మొదలవుతుంది.
పాఠ్యభాగ సారాంశం
రావణుడు బ్రహ్మదేవుని చేత వరములు పొంది గర్వముచే అందరిని బాధించు చుండెను. ఇది తెలిసిన కుబేరుడు ఈ విధముగా అందరిని బాధించుట తగదని హిత వాక్యములు చెప్పి రమ్మని దూతను పంపించెను. రావణుడు ఆ దూత మాటలను పెడచెవిని పెట్టి వచ్చిన దూతను చంపెను. ఇది సహించలేని కుబేరుడు రావణునితో మనమిద్దరం అన్నదమ్ములము విశ్రవసుని పుత్రులము. నీవు నా తమ్ముడవు.
చిన్నవాడవైన నీకు మేలు కలిగించు మాటలు నా దూత ద్వారా నీకు చెప్పించవలెనని పంపించినాను. ఆ మాటలను నీవు వినకుండా వ్యర్థముగా నా దూతను చంపితివి. నన్ను జయించడానికి త్రిమ్మరి గుంపుతో ఇచ్చటకు వచ్చితివి. నిన్ను అనుట అనవసరము. నీకు మేలు కలిగించాలని నా మనస్సులో కోరుకోవడం నా దోషము. ఇందుకు నన్ను నేనే నిందించు కోవలెను. రోగముతో ఉన్నవానికి భక్ష్యభోజ్యములు రోగమును వృద్ధి చేయును.
అట్లే నీ వంటి దుర్మార్గునికి నా వంటివారి హితోక్తులు నీలో దుర్మార్గమును అధికం చేస్తాయి తప్ప ఆ దుర్మార్గం నశించదు. మృత్యువు దాపురించినపుడు రౌరవాది నరకములు పొందునప్పుడు నా మాటల విలువ నీకు తెలుస్తుంది. యమపాశ బద్దుడవైనప్పుడు పాపము జేసితినని బాధపడతావు.
అన్నకు, తండ్రికి, గురువుకు ఆపదలు ఎవరు కలుగజేసినా వారికి మహాపాతకములు సంభవిస్తాయి. ధర్మము వహించే జనుడు కృతార్థుడు. కలిమి బలిమి ఇహలోకముననే కలుగును. సుఖము పరలోకములో కలుగును. ధర్మము తెలియక దేవతలందరూ శత్రువులన్నట్లు మహా ఆపదలోనున్న నిన్ను నా తమ్ముడని అనుకోవడం ఒక నరకం. వేగముగా యుద్ధానికి సిద్ధపడు అని కుబేరుడు రావణుని యుద్ధానికి ఆహ్వానించెను.
అనిమిష రిపుమంత్రులు మారీచ ప్రహస్త, ధూమ్రాక్షాదులు కుబేరుని ముందు నిలువలేక పోయిరి. అప్పుడు రావణుడు కుబేరుని వక్షస్థలమున ఒక భయంకర బాణమును వేసెను. కుబేరుడు తిరిగి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. దానిని వారుణాస్త్రముచే అణచివేసెను రావణుడు. విశ్రవసుని పుత్రులిద్దరూ సమాన బలపరాక్రమములు కలవారగుట చేత సింహముల జంటయో అనునట్లు ఇరువురు యుద్ధము చేయుచుండిరి.
ఆయుధముల యుద్ధము నందు న్యాయముగా చేయు యుద్ధము నందు విముఖుడై రావణుడు మాయా యుద్ధము చేయబూనెను. ఆకాశమార్గమున ఒకసారి పిడుగులు కురిపించే విధముగా ఒకసారి గర్వముచే వికటాట్టహాసము చేసి ఒకసారి సముద్రపు అలల హోరు ఆకాశమంతా వినిపించేలా చేసి ఒకసారి పులిలా, మరియొకసారి భయంకర అడవి పందిలా, దారుణమైన పాముల బుసకొట్టుచున్న విధమున కనిపించి, కనిపించక దాక్కొనును. ఆ రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు.
ఈ విధముగా భ్రమింపజేసి పరాక్రమముతో గట్టిదైన పెద్ద గదతో కుబేరుని కొట్టగా బొటబొట నెత్తురు కారగా అశోకవృక్షము (ఎర్రని పూలు గల వృక్షము). గాలికి కూలినట్లు రథముపై వాలిపోయెను. అంతట రాక్షస సైన్యము సంతోషించుచున్నారు. కుబేరుడు ఈ విధముగా మూర్చ పడిపోవడం చూసి రథసారధి అడవుల్లో మరుగునకు తీసుకొని పోయెను. ఒక కొండ గుహలో కుబేరుని దైన్యముతో కాపాడెను. మూర్చపోయిన కుబేరుని విశ్రాంతి కొరకు అందరూ పరిచర్యలు చేసిరి. రావణుడు అలుపు సొలుపు లేక అలకాపురంబు పైకి దాడికి దిగెను.
అలకాపురమునందు వేలకొలది బంగారు స్తంభములు వైఢూర్యములతో కూడిన దండల సమూహములు నూతనమైన ముత్యములతో కూర్చిన మేడలు, చంద్రకాంత శిలలతో కూడిన వేదికలు, వజ్రాలచే పొదగబడిన సోపానములు వికసించిన తామర కొలనులు, మనోవేగముతో యదేచ్ఛగా విహరించు కామరూపములు ధరించు గొప్పదనము గల్గిన బ్రహ్మదేవుని వెండి పుష్పక విమానము చూసి రావణుడు దానిని అధిరోహించి నక్షత్ర పర్వతాగ్రమునకు వెళ్ళెను.
ప్రకాశవంతమై పైకి లేచిన కెరటములతో ఘుంఘుమ యను ధ్వనులతో వెడలిన దేవతల ఉద్యానవనములందలి తుమ్మెదల ఝుంకారములకు సంబంధించిన సువాసన సంపదచే మంధర పర్వతము యొక్క గాలిచే అలసట తొలగగా కుబేరుడు తేరుకొని భయముతో తన సైన్యమును తీసుకొని సిగ్గుతో తన పట్టణమైన అలకాపురమునకు చేరెను.
అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు యక్ష రాక్షస యుద్ధమును వివరించుచూ “ఓ శ్రీరామా ! యుద్ధము నందు గెలుపొంది ఆవలికి పోవుచూ ప్రకాశవంతమైన వెండి కొండను, సూర్య రథమును అడ్డగించు ఎత్తయిన ప్రాకారములను, సమీపమున సంచరించుచున్న ఏనుగులు, సింహములు, శార్దూలములు గల శిఖరములను చూచెను. ఆ సమయమున ఇరుప్రక్కల గల దైత్య భటులైన మారీచాదులు రావణునితో ఓ రావణా ! స్వచ్ఛమైన వెండి కొండ ప్రకాశమో, గంగా ప్రవాహపు నురగల సమూహమో, శబర కాంతల ధనుస్సుల నుండి విడువబడిన బాణములచే ఎగురగొట్టబడిన బెల్లు పూల సమూహమో అన్నట్లు పన్నెండు చేతుల రాజు ఉన్న ఆ తెల్లుటిల్లును చూడుము.
పార్వతీదేవి చెలికత్తెల ప్రకాశవంతమైన రుద్రకన్యల పాదాల లత్తుక రసముచే ప్రకాశించునట్టిదో అన్నట్లు విస్తారంగా చిగుళ్ళతో పర్వత రాజతనము తోచునట్లు ఆకాశము నుండి పెద్ద జడలు వ్రేలాడునట్లు కొండ చరియలలో సంచరించు పాము పడగల మీద మణికాంతులచే ఒప్పెడి కోరికతో భుజ బలపరాక్రమము లేత సూర్యుని కిరణముల వలె గైరికా ధాతువులచే ఆ పర్వతము అలరారుచున్నది.
స్థిరముగ ఈ కొండ సెలయేళ్ళ నుండి కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి సూర్య కిరణ ప్రకాశమనెడి హారతినిచ్చి అరణ్యమునందలి చిలుకలు మొదలైన పక్షి కూతలతో పొగడ్తలను చేయుచు వెండికొండ తెల్లదనంబు కలుగజేయును. చిగురుటాకుల గుత్తులతో ప్రకాశించును. కలువపూలచే కొలనులన్నీ నిండి ఉన్నాయి. పార్వతీదేవి, శివుడు కేళీ వినోదమున విహరించు సమయము ఇది. మారేడు చెట్లతో ప్రథమ గణములు తిరుగుతున్న ప్రదేశము ఇది. ఆ ప్రదేశంలో రావణుడు తన పుష్పకముతో విహరిస్తున్నాడు.
ఆ విధముగా తిరుగాడుతున్న ప్రదేశములో చీకటులావరించినట్లున్న రుద్రాక్ష పందిళ్ళు దాటి నడుమ తేనెలు కురిసే ప్రవాహాలు వాటి ఒడ్డున కస్తూరి కమ్మని వాసనలు సురపొన్నల పుప్పొడితో మరకత భూములలో రాత్రి ప్రకాశించే చంద్రకాంత శిలల తిన్నెలు, గుబురుగా ఉన్న చెట్ల నీడలలో పుష్పక విమానము కదలక నిలిచిపోయెను.
పుష్పక విమానం నిలిచినందుకు ఆశ్చర్యమొంది ఇదేమి ఇచ్చట నిలిచెనని దీనిని ఆపే శక్తి ఎవరిదో పోయి చూడుమని మంత్రులను పంపించాడు రావణుడు. వారికి ఆ ప్రదేశమునందు సరియైన కారణం తెలియలేదు. అప్పుడు మారీచుడు ఈ పుష్పకం యక్ష అధ్యక్షుడైన ధననాధునికి మాత్రమే చరించునేమో ఆ కుబేరుడే క్రోధోద్రేకి అయి దీనిని ఇట నిలెపెనేమోనని అనెను. అంత వికటుడై వెలుగొందు ముఖముతో కుబుడైన మహానంది ఆ పౌలస్త్యునితో నిట్లు పలికెను. విమానము నిలిచిపోయెనని ఆశ్చర్యము ఎందుకు రాక్షస రాజా ! ఈ ప్రదేశమున హరుడు పార్వతీదేవితో విహారము చేయును.
ఇచ్చట గరుడోరగ, అమర వియచ్చరులు సైతం సంకోచముతో తిరుగుతారు. ఇచ్చట నీ బలముతో వ్యర్థముగా వచ్చి చెడిపోవద్దు. వెంటనే తొలగి పొమ్మనెను. అనగా విని రావణుడు పటపట పండ్లు కొరికి పుష్పకము దిగి శంభుడెవ్వడు ? నన్ను నిలువరించ వచ్చెనే నిన్ను నీ శివున్ నిచ్చట ఎలా నిలువరిస్తాను అంటూ ఆ ప్రదేశము నుండి పర్వతముపై గల చెట్టు వద్దకు వెనువెంటనే వచ్చెను.
అంతట నంది పెద్దశూలము పట్టుకొని రెండవ హరుని వలె ప్రకాశింపగ వానర ముఖమొందిన నందిని చూచి రావణుడు పకపక నవ్వెను. ఈ విధంగా తనను చూచి నవ్వుచున్న రావణుని చూచి అపరశివుడైన నందీశ్వరుడు మిక్కిలి కోపముతో కపివదనుండని వన్ను నీవు అవమానించావు. అటువంటి కపి ముఖములు, నఖాయుధములు గల్గిన వారు నీ కులంబును, నీ గర్వమును అణచెదరని హెచ్చరించెను.
శాప విమోచనములెందుకు నన్ను ఎదిరించ వచ్చు కదా అని అనుకుంటున్నావేమో ఇప్పటికే నా మాటల వలన నీవు మృతుడవైనట్లే. అటువంటి వానితో నా బల పరాక్రమములు చూపి పాపం చేయడమెందుకు ? అని శాపోక్తులే నీకు చావుతో సమానమని అనెను. నంది పలుకులు విని దేవతలు పుష్ప వర్షము కురిపించారు.