AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 10 బతుకు పుస్తకం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 10th Lesson బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ఏ విషయాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఈ పేరా పుస్తకపఠనం, దాని ప్రయోజనాలను గూర్చి తెలుపుతుంది.

ప్రశ్న 2.
పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
పుస్తకాలు చదివితే రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి.

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది?
జవాబు:
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశం, ఆ పుస్తకానికి సంబంధించిన ముందుమాట, పరిచయ వాక్యాలు, అభిప్రాయాలు, పుస్తక పరిచయాలు అనేవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 4.
మీరు ఏ పుస్తకాన్ని ఐనా చదవడానికి ముందు ఏం చేస్తారు?
జవాబు:
నేను పుస్తకాన్ని చదవడానికి ముందు, ఆ పుస్తకం గురించి రచయిత రాసిన తొలిపలుకు, ఆ రచనను గురించి ఇతరుల అభిప్రాయాల్ని చదువుతాను.

ప్రశ్న 5.
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక మీకు ఎలా కలుగుతుంది?
జవాబు:
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక, ఆ పుస్తక పరిచయ వాక్యాల ద్వారా కలుగుతుంది. ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో ఆ పుస్తక పరిచయ వాక్యాలు మనకు దారిని చూపిస్తాయి. ఆ పుస్తకాన్ని చదివిన పుస్తక పరిచయ రచయితల వాక్యాల ద్వారా, ఆ పుస్తకాన్ని చదవాలనే కోరిక కలుగుతుంది.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
ఉప్పల లక్ష్మణరావుగారు రాసిన మరో పుస్తకం ఏది? ఆ పుస్తకంపై సమీక్షకురాలి స్పందన ఏమిటి?
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన మరో పుస్తకం, “అతడు – ఆమె” అనే నవల. “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాల తరబడి తనలో పేరుకుపోయిన నీరసం, పటాపంచలైపోయిందనీ, ఎక్కడలేని ఉత్సాహమూ పుట్టుకొచ్చిందనీ రచయిత్రి రాసింది. తనతో సమంగా ప్రతి ఒక్కడూ జీవించాలనే మంచి ఆశయం గల వ్యక్తి తప్పించి, మరొకరు ఆ గ్రంథం రాయలేరని తనకు అనిపించిందని రచయిత్రి రాసింది.

ప్రశ్న 2.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారో చెప్పండి.
జవాబు:
పుస్తకావిష్కరణ సభకు ఒకరు అధ్యక్షులుగా ఉంటారు. కొత్త పుస్తకాన్ని పేపరులో చుట్టి ఉంచుతారు. ఒకరు ఆ పేపరు విప్పి, సభలోని వారికి ఆ పుస్తకాన్ని చూపిస్తారు. దాన్నే “ఆవిష్కరణ” అంటారు. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని గూర్చి ఒకరు సమీక్ష చేస్తారు. దానిని “కావ్య సమీక్ష” అంటారు. సభలో ఉన్నవారికి ఆ పుస్తకంలోని విషయాలను సమీక్షకులు వివరించి చెపుతారు. రచయిత తన గ్రంథాన్ని గూర్చి చెపుతాడు. రచయితకు సన్మానం చేస్తారు. అధ్యక్షులు ప్రారంభంలోను, చివరలోనూ తమ అభిప్రాయాన్ని చెప్పి, రచయితను అభినందిస్తారు. పుస్తకాలను సభలో అందరికీ ఉచితంగా కానీ, తక్కువ ధరకు కానీ ఇస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) పాఠ్యాంశం ఆధారంగా కింది మాటలను ఏ సందర్భంలో ఎవరు అన్నారో రాయండి.

ప్రశ్న 1.
“అదీ శిశువుముందు శిరసొగ్గే నిరహంకారమంటే!”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారి తాతగార్ని గూర్చి, ఈ పాఠ్యరచయిత్రి సావిత్రి గారు చెప్పిన మాట ఇది. లక్ష్మణరావు గారి తాతగార్ని వారి మనుమడు “తాతగారూ ! మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగాడట. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన తాతగారు, తాను దేవుణ్ణి చూడలేదనీ, ఉన్నాడో లేడో తాను చెప్పలేననీ, కష్టాలు పంచుకొనేవాడు ఒకడున్నాడంటే బావుంటుంది కదా ! అందుకే ప్రార్థిస్తున్నాననీ జవాబు చెప్పారట.

లక్ష్మణరావుగారి తాతగారి ఆ నిజాయితీని రచయిత్రి మెచ్చుకొని, ఆ తాతగారిది, శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమని ప్రశంసించిన సందర్భంలోనిది.

ప్రశ్న 2.
“దేశపు తిండి గింజల సమస్య తీర్చని పరిశోధనలెందుకు ?”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు, గ్రిప్సువాలు యూనివర్సిటీలో ఆయనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొంతకాలం అయ్యాక, లక్ష్మణరావుగారికి, తన పరిశోధనలు మనదేశంలోని తిండిగింజల సమస్యను తీర్చలేవనీ, ఒకవేళ ఉపయోగించినా, ఆ ఫలితాలను వినియోగించుకొనేందుకు విస్తీర్ణమైన పొలాలు మనదేశంలో లభించవనీ, అనిపించింది. దానితో తాను చేసే పరిశోధనలు మానివేసి, మన దేశానికి తిరిగివచ్చి అనువాదక వృత్తిని చేపట్టారు. దేశం తిండిగింజల సమస్య తీర్చని పరిశోధనలు ఎందుకని లక్ష్మణరావుగారు తనలో తాను తర్కించుకొన్న సందర్భంలోని మాట ఇది.

ప్రశ్న 3.
“ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త!”
జవాబు:
లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖానును, ఈ విధంగా బెదిరించింది. మెల్లీ ఖాదీ ప్రదర్శనలో పాల్గొంటోంది. అలా పాల్గొనడం నిషిద్ధమని జి.వో. లేదు. ఆలీఖాను మెల్లీని ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని బెదిరించాడు. అలా నిషిద్ధం కాని పనిని, వద్దని నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని ఆ దేశపు రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ, మెల్లీ ఆలీఖానను బెదిరించిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం 1

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రచయిత్రి ఈ పాఠం ద్వారా ఏ పుస్తకం గురించి పరిచయం చేసింది?
జవాబు:
రచయిత్రి సావిత్రిగారు, ఈ పాఠం ద్వారా, ఉప్పల లక్ష్మణరావుగారు రచించిన “బతుకు పుస్తకం” అనే, వారి జీవిత చరిత్రను గూర్చి పరిచయం చేసింది.

ప్రశ్న 2.
మెల్లీ దుందుడుకు స్వభావానికి చెందిన సంఘటనలు తెలపండి.
జవాబు:
1) మెల్లీ సాహసానికి మరో పేరు. ఈమె తనవంటి వారికి అవమానము జరిగినా, ఒక మంచిపనికి అవరోధం జరిగినా, సహించేది కాదు. ఒకసారి రాజోలు నుండి నర్సాపురం వెళ్ళే లాంచి ఎవరో పెద్ద అధికారి కోసం ఆపేశారట. వెంటనే మెల్లీ ఆ చీకట్లో ఈత దుస్తులు వేసుకొని, గోదావరిలోకి దూకి, ఐదు గంటలలో ఆ 16 మైళ్ళ దూరాన్ని, దుస్సాహసంతో ఈదింది.

2) ఒకసారి తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖాన్ మెల్లీని, ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని హెచ్చరించాడు. అయితే అటువంటి ప్రదర్శన చేయడం నిషిద్ధమనే జి.వో. ఏమీలేదు. అప్పుడు మెల్లీ తనను ప్రదర్శనలో పాల్గొనకుండా నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని వారి రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ ఆలీఖానను బెదిరించింది.

3) గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో స్త్రీలకు గస్తీని నిషేధించగా, ఈమె సత్యాగ్రహం చేసి, స్త్రీలు కూడా గస్తీకి అర్హులేనని అంగీకరించేలా చేసింది.

ప్రశ్న 3.
గ్రంథాలు, పుస్తకాలు ఎలా ఉండాలని రచయిత్రి తెలియజేసింది?
జవాబు:
గ్రంథాలు నిరుత్యాహికి ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనూ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్నీ, తగిన ఆర్ధతనూ తప్పక అందించగలగాలి. అదేదో మహాగ్రంథమని, తమకు అర్థం కాదనీ అనిపించకూడదు. ఆ గ్రంథం ఒక డైరీలా, స్నేహితుని లేఖలా, దగ్గరగా ఉండాలి. పాఠకుడు ఓపిక తెచ్చుకొని చదవాలి అనిపించాలి. రచయిత తన మనస్సులోని బాధను కప్పి పుచ్చకుండా తెలపాలి. ఇతని బాధను విందాం, అనిపించేటట్లు నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపూ హాయి కలగాలి. ఇన్నాళ్ళకైనా ఇంత మంచిపుస్తకం చదవగలిగాను కదా అని అనిపించాలి. వివరణ స్పష్టంగా ఉండాలి. ఏదో కొత్త విషయం చెప్పాలి. ఎంతో కొంత కార్యశీలత రేపాలి. కదపాలి. కుదపాలి. మంచిదారిని చూపించి, మనశ్శాంతిని కలిగించాలి.

ప్రశ్న 4.
లక్ష్మణరావుగారు పరిశోధనరంగం నుంచి రచనారంగం వైపు ఎందుకు మారారు?
జవాబు:
లక్ష్మణరావుగారు, చెప్సువాలు యూనివర్సిటీలో తనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొన్నివేలు ఖర్చుచేసి జరిపిన తన పరిశోధన, దేశానికి ఉపయోగంగా ఉంటుందని లక్ష్మణరావుగారికి నమ్మకం కలుగలేదు. దేశం తిండిగింజల సమస్యను తీర్చని ఆ పరిశోధనలు ఎందుకు ? అని ఆయనకు అనిపించింది. ఒకవేళ ఆ పరిశోధనలు ఉపయోగపడినా, ఆ ఫలితాల్ని వినియోగించేందుకు విస్తీర్ణమైన పొలాలు మనకు లభించవని ఆయన గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ పరిశోధనలు, ధనిక రైతులకే గాని, సామాన్యునికి ఉపకరించవని ఆయన గ్రహించారు. అందువల్ల తనలో తాను బాగా తర్కించుకొని, తనకు బాగా ప్రాణప్రదమైన బోటనీ పరిశోధనలు మానివేసి, ప్రగతి ప్రచురణాలయంలో అనువాదక వృత్తిని వారు చేపట్టారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉంది?
జవాబు:
సమాజానికి లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం, ఒక చారిత్రక అవసరం. నిరుత్సాహికి, ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనీ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని తగుమాత్రపు ఆర్ధతనూ అందించగలిగిన పుస్తకాలను రచించే రచయిత అవసరం. రచయిత ఎంతో కొంత కార్యశీలత రేపాలి. పాఠకుని కదపాలి, కుదపాలి, మంచిదారిని చూపాలి. మనశ్శాంతిని కలిగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 2.
“లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత ఎప్పటికీ విస్మరింపరానిది” అని సావిత్రిగారు అనడం సరైందేనని మీరు భావిస్తున్నారా ? ఎందుకు?
జవాబు:
లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత, మరువరానిదని సావిత్రిగారు చెప్పిన మాట, సరయినదే అని చెప్పాలి. మనం చేసే పనులు మనకే కాక, ప్రపంచానికి కూడా మేలు చేయాలన్న లక్ష్మణరావు గారి సంకల్పం, ఉత్తమమైనది. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు చేస్తుండేవారు. కొన్ని వేలు ఖర్చుపెట్టి జరిపిన ఆ పరిశోధన, మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందనే నమ్మకం ఆయనకు కలుగలేదు. మన దేశానికి తిండి గింజల సమస్య తీర్చని ఆ పరిశోధనలు, ఎందుకని లక్ష్మణరావు గారు జర్మనీలో పరిశోధనకు స్వస్తిచెప్పి, భారతదేశానికి వచ్చి ఒక ప్రచురణాలయంలో అనువాదకుడిగా చేరారు. దీనిని బట్టి లక్ష్మణరావు గారి విజ్ఞత, ఆయన ప్రపంచం పట్ల చూపిన బాధ్యత, ఎప్పటికీ మరువరానిది అన్నది సత్యం.

ప్రశ్న 3.
హేతువాదులు ప్రశ్నించే విషయాలు ఎలాంటివై ఉంటాయి?
జవాబు:
హేతువాదులు దేవుణ్ణి చూశారా ? అని అడుగుతారు. దేవుడు కనబడడు కాబట్టి, దేవుడు లేడని వారు వాదిస్తారు. ప్రతిదాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే, దాన్ని వారు నమ్ముతారు. సాధువులు, సన్యాసులు, బాబాలను వారు నమ్మరు. వారు చూపించే మహిమలు అన్నీ, గారడీలు అని హేతువాదులంటారు. విగ్రహారాధన పనికిరాదని వారు వాదిస్తారు. రాళ్ళను, రప్పలను పూజించరాదంటారు. హేతువు అంటే కారణము. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుందంటారు.

ప్రశ్న 4.
కరుణ గల విజ్ఞానం అంటే ఏమిటి? కరుణ కలిగిన వారు చేసే పనులు ఏమై ఉంటాయి?
జవాబు:
‘విజ్ఞానం’ అంటే విశేషమైన జ్ఞానం. అంటే నేటి సైన్సు, ఇంజనీరింగు, డాక్టరు మొదలయిన వృత్తుల వారు ఎంత జ్ఞానం కలవారైనా, తోటి మానవులపై వారికి ‘కరుణ’ అంటే జాలి లేక దయ ఉండాలి. లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ కరుణ గల విజ్ఞాని. ఆమె డాక్టరుగా ఎంతో విజ్ఞానం గడించింది. ఒకసారి పెంటబండిని ఈడ్వలేకపోతున్న ముసలివాడి కష్టాలు సహింపలేక తాను ఆ బండిని వెనుక నుంచి తోసి, అతనికి సహాయపడింది. అపుడు మెల్లి తెల్లని ఫ్రాక్ వేసుకొని, ఒక విందుకు వెడుతూ ఉంది. మెల్లీ ఆ పెంటబండిని తోసి, తన బట్టలపై పడ్డ నల్లని మరకలతోనే ఆ విందుకు వెళ్ళింది. కరుణ గల విజ్ఞానులు పైన చెప్పినటువంటి పనులు చేస్తారు.

ప్రశ్న 5.
పరిశోధనలు ఎందుకు చేస్తారు ? దీనివల్ల ఎవరికి మేలు జరగాలి? ఏఏ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి?
జవాబు:
పరిశోధనలు దేశానికి ఉపయోగకరంగా ఉండాలి. పరిశోధనా ఫలితాలు వినియోగించుకొనేందుకు వీలుగా ఉండాలి. పరిశోధనలు సామాన్యునికి ఉపయోగించాలి. సాంకేతిక పరిశోధనల వల్ల కలిగే లాభం, సమాజానికీ, పేద ప్రజలకీ ఉపకరించాలి. వ్యవసాయంలో చేసే పరిశోధనలు, రైతులు పంటలు ఎక్కువగా పండించడానికి ఉపయోగించాలి. అణుశాస్త్రంలో పరిశోధనలు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఉపయోగించాలి. వస్తువులను చౌకగా, విరివిగా తయారు చేసేందుకు పరిశోధనలు ఉపయోగించాలి. సమ సమాజ స్థాపనలో, సమాజానికి పరిశోధనలు ఉపయోగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ పాఠం ఆధారంగా “బతుకు పుస్తకం”లోని అంశాలను పదివాక్యాల్లో రాయండి.
జవాబు:
ఉప్పల లక్ష్మణరావుగారి తాతగారు కాలేజీ కమిటీతో పోరాడి, మనవరాలిని బడిలో చేర్పించారు. లక్ష్మణరావుగారి తాతగారిని, వారి మనవడు “దేవుణ్ణి చూశారా? తాతగారూ?” అని అడిగాడట. తాను దేవుణ్ణి చూడలేదని లక్ష్మణరావు గారి తాత, నిజాయితీగా ఒప్పుకున్నారట.

లక్ష్మణరావుగారి భార్య మెల్లీ, తెల్లని ఫ్రాకు ధరించి విందుకు వెడుతూ, దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని బండిని తోసి సాయంచేసిందట. మెల్లీ, లక్ష్మణరావుగారులు షరతులు విధించుకొని, వివాహం చేసికొన్నారట. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు మానివేసి, మనదేశంలో అనువాదకుడిగా చేరారట.

మెల్లీ రాజోలు నుండి నర్సాపురం వరకూ స్విమ్మింగ్ డ్రెస్ లో 15 మైళ్ళు ఈదిందట. సబర్మతి ఆశ్రమంలో మెల్లీ తాను కూడా గస్తీ తిరగడానికి అనుమతినిమ్మని సత్యాగ్రహం చేసిందట. మెల్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో, తనను ఖాదీ ప్రదర్శనలో పాల్గొనడానికి ఆయన నిరోధిస్తే, దానిని అంతర్జాతీయ సమస్యగా తాను మారుస్తానందట. లక్ష్మణరావుగారు తెచ్చి ఇచ్చిన కాగితాన్ని సిమెంటు కంపెనీ డైరెక్టరు క్రిందపడవేస్తే, దాన్ని బల్లమీద డైరక్టరు తిరిగి పెట్టకపోతే, తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని డైరక్టర్నీ బెదిరించారట.

ప్రశ్న 2.
“బతుకు పుస్తకంలో కరుణ గల విజ్ఞానానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయి కదా !” వాటిలోంచి ఏదైనా ఒక సంఘటనను విశ్లేషించండి.
జవాబు:
లక్ష్మణరావుగారు ప్రేమించిన అమ్మాయి స్విట్జర్లాండు దేశస్థురాలు ‘మెల్లీ’. లక్ష్మణరావుగారు మెల్లీని కరుణ గల విజ్ఞానిగానే ఈ చూసి ప్రేమించారు. ఒకసారి మెల్లీ పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకు ధరించి, విందుకు వెడుతోంది. అప్పుడు ఆమెకు 24 ఏళ్ళు. దారిలో ఒక ముసలివాడు వెంటబండిని ఈడ్చుకు వెడుతున్నాడు. అతడు ఆ బండిని లాగలేక అవస్థపడుతున్నాడు. అప్పుడు మెల్లి దృష్టి ఆ వృద్ధుని మీద పడింది. ఆమెకు ఆ వృద్ధుని పై జాలి వేసింది. మెల్లీ తాను తెల్లని బట్టలు వేసుకున్నానని కానీ, విందుకు వెడుతున్నానని కానీ చూడలేదు. వెంటనే ఆ వృద్ధుని బండిని వెనక నుండి తోసి సాయం చేసింది. ఈ విధంగా మెల్లీ ఆ ముసలివాడికి సాయపడింది. ఆ సంఘటనను చూసిన లక్ష్మణరావు గారి మనస్సు ద్రవించింది. మెల్లీ కరుణగల విజ్ఞాని అని గ్రహించారు. మెల్లీని లక్ష్మణరావుగారు పెండ్లాడారు.

మెల్లీ, ఆ మురికి బట్టలతోనే విందుకు వెళ్ళింది. ప్రక్కవారు ఏమనుకుంటారో అని, మెల్లీ అనుకోలేదు. ఒక వృద్ధునికి సాయం చేశాననే సంతృప్తితో ఆమె గుండెలు నిండాయి.

దీనిని బట్టి మెల్లీ కరుణ గల విజ్ఞాని అని తెలుస్తోంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 3.
సావిత్రి గారి ‘బతుకు పుస్తకం’ గురించి పరిచయం చేసిన విధానం ఏ విధంగా ఉంది?
జవాబు:
‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని. రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావుగారు రచించిన ‘అతడు – ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది. లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.

మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠశాల గ్రంథాలయంలోని రెండు మూడు పుస్తకాల్లోని ముందుమాటలు చదవండి. ఆ పుస్తకాల గురించి మీరు తెలుసుకున్న విషయాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
ముందుమాట

ప్రశ్న 1.
అల్లసాని పెద్దనామత్యుని ‘మనుచరిత్రము’ – కవి సమ్రాట్ కమనీయ పీఠిక
ఈ పీఠిక ద్వారా అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజ కవులలో ప్రథముడిగా ప్రధానమైనవాడని తెలిసింది. మనుచరిత్రను రాయలకే అంకితమిచ్చాడు పెద్దన. తెలుగువారి తొలి స్వతంత్ర్య కావ్యం మనుచరిత్ర. తెలుగు పంచ కావ్యాలలో మొదటిది మనుచరిత్ర. ఈ గ్రంథానికే స్వారోచిషమనుసంభవం అను నామాతరం కలదు. స్వారోచిష మనువు యొక్క కథే ఈ మనుచరిత్ర. అరుణాస్పదపురం – ప్రవరుడు కథతో ప్రారంభమై, హిమాలయ వర్ణన, వరూధిని, గంధర్వుని ఎత్తుగడ – స్వరోచి పుట్టుక – మనోరమ వృత్తాంతం – ఇందీవరాక్షుని వేడుకోలు – స్వరోచి పెండ్లి – దశావతరా స్తోత్రము – ఇంత వివరణగా పీఠిక రాసి, కావ్యమంతా తేలికగా అర్థము చేసుకొనుటకు వీలు కల్పించారు విశ్వనాథవారు.

ప్రశ్న 2.
పప్పురి రామాచార్యుల ‘వదరుబోతు’ – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక.
ఈ పీఠిక ద్వారా 1932లో ప్రచురితమైన ‘వదరుబోతు’ గ్రంథ రచయితలెవరో స్పష్టంగా తెలియదు కాని పప్పురి రామాచార్యుల పేరొకటి మాత్రం వినబడుతోందని తెలిసింది. వదరుబోతు వ్యాసాలు సంఘ సంస్కరణకి ఉద్దేశించినవి. రాజకీయ స్వాతంత్ర్యం కన్న ప్రజల్లో నీతి, మత ధర్మాల పట్ల ఆసక్తిని కలిగించి, వారిని నిస్వార్థ పరులుగా చేయటమే ఈ వ్యాసాల ఆదర్శమని తెలుసుకున్నాను. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అనంతపుర పట్టణంలో కొందరిలో కలిగిన నూతన ఆలోచన ఫలితమే వదరుబోతు వ్యాసాలు వెలువడ్డాయి. ఎడిసన్ – స్పెక్టేటర్, స్టీల్ టాటర్ ఇంగ్లీషులోని ఉపన్యాస వ్యాసాలు. స్పెక్టేటర్ ఆధారంగా తెలుగులో సాక్షి వ్యాసాలు పానుగంటివారు రాశారు. సాక్షి వ్యాసాల కన్నా వదరుబోతు వ్యాసాలు మృదు స్వభావం కలవి. సుమారు 50 వ్యాసాలు రాసినా, దొరికనా 22 వ్యాసాలతో ‘వదరుబోతు’ ముద్రించారు. ఈ విషయాలన్నీ ఈ పీఠిక ద్వారా తెలుసుకున్నాను.
(లేదా)
సావిత్రి ‘బందిపోట్లు’ కవితను సేకరించండి. దీనిపై మీ అభిప్రాయం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పుస్తకం లభ్యమైన తరువాత చదివి నా అభిప్రాయాన్ని రాస్తాను.

III. భాషాంశాలు

పదజాలం

అ) పాఠం ఆధారంగా ఈ కింది ఖాళీలను పూరించండి.

1. ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం కంటే ముందుగా సావిత్రి చదివిన పుస్తకం ‘అతడు – ఆమె’.
2. లక్ష్మణరావు తల్లిగారి విమర్శను దృష్టిలో వుంచుకొని నవల తిరిగి రాశారట.
3. ఆనాటి స్త్రీల పత్రికలు నిజంగా పాటుపడేవారి చేతులు మీదుగా వెలువడేవి.
4. మెల్లీ సబర్మతిలో సత్యాగ్రహం ప్రారంభించిందట.
5. లక్ష్మణరావుగారు జర్మనీ నుంచి తన పరిశోధనావకాశాలు శాశ్వతంగా వదలి వేసుకొని రచనారంగం వైపు మారారు.

ఆ) గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి. ఆ అర్థంతో మరొక కొత్త వాక్యం రాయండి.

1. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది.
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) చెల్లాచెదరు
డి) ముక్కలు ముక్కలు
అర్థం : పటాపంచలు = చెల్లాచెదరు
వాక్యప్రయోగం : నేను కళాశాలలో చేరగానే, నాకున్న సిగ్గు పటాపంచలు అయ్యింది.

2. మనదేశ చరిత్రకు అద్దం పట్టిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి.
ఎ) పొగిడిన
బి) గొప్పదనాన్ని
సి) ప్రతిబింబించిన
డి) సంక్షిప్తం చేసిన
అర్థం : అద్దం పట్టిన = ప్రతిబింబించిన
వాక్యప్రయోగం : అద్దంపట్టిన – నీలోని సద్గుణాలు, మా నాన్నగార్కి అద్దం పట్టినట్టున్నాయి.

3. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి పుస్తకం
ఎ) చురుకైన
బి) పనిలేనివాడు
సి) తెలివైనవాడు
డి) అజ్ఞాని
అర్థం : రికానికి = పనిలేనివాడు
వాక్యప్రయోగం : రికామీగా తిరిగే గోపాల్ కు, ఒక మంచిపని అప్పగించబడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) కింది పదాలను వివరించండి. సొంతవాక్యాలు రాయండి.
1) పఠించతగిన = __చదువదగిన
వాక్య ప్రయోగం : భగవద్గీత అందరూ పఠించతగిన గ్రంథము.

2) గొప్ప నిదర్శనం = గొప్ప ఉదాహరణ
వాక్య ప్రయోగం : రాముడు పితృవాక్య పరిపాలనకు గొప్ప నిదర్శనము.

3) అకుంఠితమైన దీక్ష = మొక్కవోని పట్టుదల
వాక్య ప్రయోగం : హనుమంతుడు అకుంఠిత దీక్షతో లంకను గాలించి సీతమ్మ జాడను తెలిసికొన్నాడు.

వ్యాకరణం

అ) కింది వాటిని జతపరచండి.
1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి (ఈ) అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో (ఆ) ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే (అ) ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? (ఇ) ఈ) క్వార్థకం

ఆ) పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త !” అని అతన్నే బెదిరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని, జాగ్రత్త అని మెల్లీ అతడినే బెదిరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు. (పరోక్ష కథనం)

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం రచయిత్రి పరిచయం

సావిత్రి గారు రాజమండ్రి దగ్గర ఉండేశ్వరపురంలో 18.05. 1949 లో జన్మించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువు అర్ధాంతరంగా ఆగిపోయినా సాహిత్య పఠనాభిలాషను కొనసాగించి అనేక కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాసి స్త్రీవాద సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1991లో వీరి మరణానంతరం ఆమె రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో “సావిత్రి” పేరుతో వెలువడ్డాయి. వీరి “బందిపోట్లు” కవిత ప్రసిద్ధమైంది. ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాటమనస్తత్వం పదునైన భావావేశం ఈ రచయిత్రి ప్రత్యేకత.

కఠిన పదాలకు అర్థాలు

విశిష్ట, వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన, వ్యక్తితత్వము
సమాజము = సంఘము
సాహితీమూర్తి = సాహిత్యము రూపుదాల్చిన వ్యక్తి
ఆవిర్భావం = పుట్టుక
చారిత్రక అవసరం = చరిత్రకు అవసరం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
పటాపంచలు = చెల్లాచెదరు
సదాశయం (సత్ + ఆశయం ) = మంచిమనస్సు
వ్యక్తి = జాతికి వేటై, ఆ జాతికి
హుందా = దర్జా
మహిళ = స్త్రీ
జీవిత భాగస్వామి = జీవితంలో పాలు పంచుకొనే స్త్రీ (భార్య)
ఇల్లాలు = భార్య
దాస్య శృంఖలాలు = బానిసత్వం అనే సంకెళ్ళు
స్వాతంత్రోద్యమకారిణి (స్వాతంత్ర + ఉద్యమకారిణి) = స్వాతంత్ర్యం కోసం ప్రయత్నం చేసిన స్త్రీ
చిత్రించింది = వ్రాసింది (వర్ణించింది)
నిర్నిబంధం = బంధములు లేనిది
పఠిత = పాఠకుడు (చదివేవాడు)
జడము = తెలివిలేనిది
హాస్యము = నవ్వు
ఉన్మాదపు ఉత్సాహము = పిచ్చి ఉత్సాహము
చిర్రెత్తించే = కోపం కలిగించే
(చిఱ్ఱ + ఎత్తించు)
(చిఱ్ఱు + ఎత్తించు)
రీడబులిటీ (Readability) = చదువదగినది ఆశ్రయమైన రూపము
రికామీ = పనిలేనివాడు
అజ్ఞాని = తెలివిలేనివాడు
జిజ్ఞాసువు = తెలిసికొనగోరువాడు
ఆర్థత = మెత్తదనము
డైరీ (Diary) = దినచర్య
నేస్తం = స్నేహితుడు
సన్నిహితం = చేరువ, సమీపం

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

నిరహంకారం = అహంకారం లేకుండుట
ఆత్మీయం = ఆత్మవంటిది (కావలసినది)
నయం = మేలు
క్లిష్టము = కఠినము
కార్యశీలత = పనిచేసే స్వభావమును కలిగి
కుదుపాలి = కదల్చా లి
విమర్శకురాలు = విమర్శ చేయు స్త్రీ
పెదవి విరిచేయు = నిరాశను సూచించు తర్కించుకొని
కీచులాట = కలహము
మహాసంగ్రామం = గొప్ప యుద్ధం
పూర్వరంగం = ముందు విషయం
మలచి = వంచి
ఏకీభవించు = ఒక్కటియగు; కలిసిపోవు
నిష్పక్షపాతం = పక్షపాతం లేనిది
సహృదయుడు = మంచిమనస్సు కలవాడు (విద్వాంసుడు)
హోరా హోరీ = ఎడతెగకుండా (నిర్విరామంగా)
అభ్యంతరం = అడ్డు
ఆస్తికులు = భగవంతుడున్నాడని నమ్మువారు
హేతువాదము = ప్రత్యక్ష ప్రమాణము చూపిస్తేనే నమ్ముతాను అనే మాట
ఫేషన్ (Fashion) = సొగసుకాడు; సొగసుదనం
విరివిగా = అధికంగా
సౌజన్యాన్ని = మంచితనాన్ని
కసరకుండా = కోప్పడకుండా
శిరసొగ్గే = తలవంచే
కరుణ = దయ, జాలి
వెల్లివిరుస్తుంది = ప్రవహిస్తుంది
ఫ్రాకు ‘(Frock) = వదులుగా ఉండే పెద్ద గౌను
వృద్ధుడు = ముసలివాడు
అగచాట్లు = ఆపదలు
నిదర్శనం = దృష్టాంతము; ఉదాహరణ
పరిశోధనావకాశాలు = పరిశోధన చేసే అవకాశాలు
క్షుణ్ణంగా = సంపూర్తిగా యుండుట
పఠించదగ్గవి = చదువదగినవి
వినియోగించుకొను = ఉపయోగించుకొను
సోషలిస్టు సమాజస్థాపన = సమ సమాజమును స్థాపించుట
తర్కించుకొని = ఊహించుకొని
స్వస్తిచెప్పి = చాలించి; ముగించి
నిశ్శబ్దం = ధ్వనిలేమి
అనువాదకవృత్తి = అనువాదం చేసేపని (Translation)
ఆవేదన = బాధ
ఆవేశపడిపోవు = కోపము వహించు
అకుంఠితమైన = అడ్డులేనట్టి
విస్మరింపరానిది = మరువరానిది
అవరోధము = అడ్డగింత
క్షణం = అత్యల్పకాలము
ఓర్వదు = సహింపదు
మంకుపట్టు = మొండి పట్టు
స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ (Swimming costumes) = ఈత దుస్తులు
గస్తీ = కావలి (కాపలా)
స్టాకిస్టు (Stockist) = స్టాకు చేసేవాడు
దుందుడుకు = మిక్కిలి తొందర
నిదానం = తొందరపడకుండా విచారించడం
పురోగమం = ముందు నడవడం
తాదాత్మం = ఒకదానిలో కలసిపోవడం
నిరాహారదీక్ష = ఆహారం తినకుండా దీక్ష
నిషిద్ధము = నిషేధింపబడినది
జి.వో. (Government order) = ప్రభుత్వ ఆదేశం
అంతర్జాతీయ సమస్య = దేశాల మధ్య సమస్య

Leave a Comment