AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

SCERT AP Board 6th Class Telugu Solutions 5th Lesson మన మహనీయులు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 5th Lesson మన మహనీయులు

6th Class Telugu 5th Lesson మన మహనీయులు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
పింగళి వెంకయ్యగారిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
పింగళి వెంకయ్యగారు మన జాతీయ జెండాను తయారుచేశారు. అందుకే ఆయనను జెండా వెంకయ్య అంటారు.

ఆయన కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ 2.8.1878. ఆయన దేశభక్తితో 19వ ఏట సైన్యంలో చేరారు.

1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలలో ఎగరేసిన బ్రిటిష్ జెండా చూసి, మన దేశానికి ‘జెండా తయారుచేయాలని సంకల్పించారు. 1921లో విజయవాడలో 3 గంటలలో జెండాను రూపొందించారు. త్రివర్ణ పతాకం, మధ్యలో రాట్నంతో తయారుచేశారు. ఆయన 4.7.1963న స్వర్గస్థులయ్యారు.

ప్రశ్న 2.
శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది?
జవాబు:
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 3.
ప్రతిజ్ఞ విద్యార్థులలో ఎటువంటి భావాలను కలిగిస్తుంది?
జవాబు:
బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో “భారతదేశం నా మాతృభూమి” అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలుగుభాష, సంస్కృతులపై ‘శంకరంబాడి సుందరాచారి’ సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి.
జవాబు:
బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు శంకరంబాడి వారి ఉపన్యాసం ఉంది. ఆయన 6 గంటలకు వచ్చారు. అప్పటికే ఎదురుచూసి చూసి పిల్లలు విసిగిపోయారు. “ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి వదుల్తాడో” అని బరంపురం కుర్రాడు అన్నాడు. ఆయన విన్నారు. తన ఉపన్యాసం మొదలుపెట్టి, ముగించేలోగా లేచి వెళ్లమని ఆ అబ్బాయిని శంకరంబాడి వారు సవాల్ చేశారు.

తెలుగుభాష గురించి చక్కగా చెప్పారు. కోడికూతతో ప్రారంభమయ్యే తెలుగువారి జీవితం గురించి, పల్లె పడుచుల కూనిరాగాలు, పశువుల అరుపులూ, పిట్టలకూతలూ, జానపద గీతాలు, పల్లెసుద్దులు, అమ్మ పాడే భక్తి గీతాలు, పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. గంగిరెద్దులు, హరిదాసులు, రచ్చబండ కబుర్లు మొత్తం తెలుగు సంస్కృతిని, భాషను ఆడుతూ, పాడుతూ గంటన్నరపాటు చెప్పారు. ఆయన సాధికారతకు అందరూ మంత్రముగ్ధులై విన్నారు. ఇంకా ఇంకా చెప్పమన్నారు. అక్కడే ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాడారు. మరో అరగంట మాట్లాడారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 2.
ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19. 10. 1952న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. 15. 12. 1952 వరకు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆ రోజు రాత్రి 11.30 కి ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. మూడు రోజుల పాటు ఆంధ్ర అగ్నిగుండమయింది. ఆంధ్ర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రరాష్ట్రం గురించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆ అమరజీవి త్యాగాన్ని ఆంధ్రజాతి ఉన్నంతవరకు మరచిపోదు.

పాఠ్యభాగ సారాంశం

తెలుగు ప్రజలకు మేలు చేయడానికి శ్రమించిన కొందరు మహానుభావులున్నారు. వారు తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయిలో నిలిపినవారు. వారిలో పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి ముఖ్యులు. అమూల్యమైన వారి త్యాగాలను, కృషిని స్మరించుకుందాం.

1. అమరజీవి పొట్టి శ్రీరాములు :
కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

2. జాతీయ జెండా రూపశిల్పి – పింగళి వెంకయ్య :
– భారతీయుల ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అయిన జాతీయ జెండాను రూపొందించిన వారు పింగళి వెంకయ్య. కృష్ణాజిల్లాలో జన్మించిన వెంకయ్య గాంధీగారి ఆదేశంతో మూడుగంటల్లో జాతీయ జెండాను రూపొందించారు. అందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయి. మొదట మధ్యలో రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక చక్రం చేరింది. భారతీయులలో ఉద్యమస్ఫూర్తిని కలిగించి, భారతీయులందరిని ఏకతాటిపై నడిపిన జాతీయ జెండా రూపశిల్పి ఆంధ్రుడవడం మనకు గర్వకారణం.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

3. “జాతీయ ప్రతిజ్ఞ” నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు :
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

4. సుందరకవి – శంకరంబాడి సుందరాచారి :
నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.

Leave a Comment